breaking news
Universal
-
అపహరణ్తో అన్నీ మారిపోయే!
హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారం వివిధ ప్రాంతాల నుంచి సాగిన చైల్డ్ ట్రాఫికింగ్ను బయటపెట్టింది. నిరుపేద తల్లిదండ్రుల నుంచి చిన్నారులను కొన్నివేల రూపాయలకు కొనుగోలు చేసి, సరోగసీ పేరుతో వారిని రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంది డాక్టర్ నమ్రత గ్యాంగ్. ఈ కారణంగా ఓ వర్గం, ప్రాంతం, రాష్ట్రానికి చెందిన పసిమొగ్గలు మరో చోటుకు తరలివెళ్లిపోయారు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా సాగిన చైల్డ్ కిడ్నాపింగ్స్లోనూ ఇలాంటి ఆసక్తికర కోణం ఉంది. అప్పట్లో అపహరణకు గురైన వారి పేరు, వర్గం, భాష.. అన్నీ మారిపోయాయి. సంతోష్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎంబీ హట్స్కు చెందిన నాలుగున్నరేళ్ల బాలుడు మహ్మద్ షరీఫ్ మిస్సింగ్కు సంబంధించి 2011 మార్చి 4న అతడి తల్లి రెహానా బేగం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పట్లో పాతబస్తీలో చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పోలీసులు ఈ కేసుల ఛేదన కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. షరీఫ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానికులను విచారించిన ఈ స్పెషల్ టీమ్కు మాదన్నపేట ప్రాంతంలో నివసించే రేష్మా సుల్తానా కదలికలు తెలిశాయి. బాలుడి కిడ్నాప్కు నాలుగు రోజుల ముందు నుంచి ఆమె ఎంబీ హట్స్ ప్రాంతంలో సంచరించిందని, చిన్నారులకు బిస్కట్లు, చాక్లెట్లు ఇస్తూ మచ్చిక చేసుకుందని వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడంతో కీలక విషయాలు బయటపడ్డాయి. కరీంనగర్ నుంచి వచ్చి మాదన్నపేటలో స్థిరపడిన మహబూబ్ ఖాన్ భార్యే ఈ సుల్తానా. వీరిద్దరితో పాటు కమలా అలియాస్ పర్వీన్, నిజామాబాద్కు చెందిన డి.మల్లయ్య యాదవ్, డబీర్పుర వాసి సజీద్, మాదన్నపేటకే చెందిన షరీఫ్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చిన్నారులను కిడ్నాప్ చేసి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో విక్రయించడం మొదలెట్టారు. సంతానలేమితో బాధపడుతున్న భార్యాభర్తలను మల్లయ్య సంప్రదించేవాడు. అక్కడ వారి నుంచి ‘ఆర్డర్’ తీసుకున్న తరవాత ఆ విషయాన్ని నగరంలో ఉన్న ముఠా సభ్యులకు చెప్పేవాడు. సుల్తానా, పర్వీన్, సజీద్, షరీఫ్లు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారులను గుర్తించారు. వారికి చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అదును చూసుకుని కిడ్నాప్ చేశారు. వీరిని సజీద్ తన ఆటోలో వేములవాడలోని రుద్రంగికి తీసుకువెళ్లి డి.మల్లయ్య యాదవ్కు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేవాడు. అతడు వీళ్లని సంతానలేమితో ఉన్న దంపతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించేవాడు. ఈ గ్యాంగ్ను అరెస్టు చేసిన పోలీసులు తొమ్మిదిమంది చిన్నారులను రెస్క్యూ చేశారు. అప్పుడే ఓ ఆసక్తికర, కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాపింగ్ గ్యాంగ్ ఎక్కువగా పాతబస్తీలోని ఓ వర్గం బాలలను ఎత్తుకుపోయి జిల్లాల్లో ఉన్న మరో వర్గం దంపతులకు విక్రయించేది. ఫలితంగా వారి పేర్లు, భాష, ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా మారిపోయాయి. 2008లో మాదన్నపేట సలార్నగర్ నుంచి కిడ్నాప్ అయిన మహ్మద్ ఫర్దీన్ ఖాన్ దాదాపు మూడేళ్ల తరవాత ప్రశాంత్గా తన తండ్రి సర్వర్ ఖాన్ వద్దకు వచ్చాడు. అలాగే సంతోష్నగర్ పరిధి నుంచి 2009లో అపహరణకు గురైన మహ్మద్ మజీద్, షేక్ నవీద్లు... వినయ్, రాహుల్గా వారి ఇళ్లకు తిరిగి వచ్చారు. 2011 మార్చి 4న అపహరణకు గురైన షరీఫ్ మాత్రం ఏమార్పు లేకుండా అతడిలానే తన ఇంటికి చేరాడు. ఇలా వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన కథగా మారాయి. ఆ తొమ్మిదిమంది చిన్నారులు పుట్టింది ఎక్కడైనా, చాలాకాలం పాటు పెరిగింది మాత్రం ‘కొన్న తల్లిదండ్రుల’ దగ్గరే. ఈ నేపథ్యంలోనే తమ మాతృభాషను సైతం వాళ్లు మరచిపోయి, తమను పెంచుకుంటున్న వారి భాషనే అలవాటు చేసుకున్నారు. వినయ్గా తిరిగి వచ్చిన మజీద్, రాహుల్గా మారిన నవీద్ ఉర్దూ, హిందీ భాషలను పూర్తిగా మర్చిపోయి ‘తెలుగుబిడ్డ’లుగా ఇళ్లకు చేరారు. ఇలా రెస్క్యూ అయిన తొమ్మిదిమందీ హైదరాబాద్ వచ్చిన వెంటనే అసలు తల్లిదండ్రుల వద్దకు రాలేకపోయారు. తొలుత పోలీసులు ఆ బాలలను న్యాయస్థానం ద్వారా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఆపై వీరిని కన్న తల్లిదండ్రులు రెండు నెలల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తామే కన్నవారమని నిరూపించుకుని, తమ బిడ్డల్ని తమతో తీసుకువెళ్లారు. అప్పటి వరకు ఈ చిన్నారులకు స్టేట్ హోమ్ ఇల్లు అయింది.అప్పట్లో ఇలా అపహరణలకు గురైన బాలల్లో ఎక్కువమంది పుట్టింది నిరు పేద కుటుంబాల్లో. వీరిలో చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల్ని చదివించే స్తోమత కూడా లేదు. అయితే కిడ్నాపర్ల కారణంగా ఆర్థికంగా కాస్త స్థిరపడినవారి చెంతకు చేరి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి స్కూళ్లల్లో చేరారు. పోలీసులు రెస్క్యూ చేయడంతో మళ్లీ అసలు తల్లిదండ్రుల వద్దకు చేరి, అప్పటి వరకు ఉన్న సౌకర్యాలు, అలవాట్లు, కట్టుబాట్లను పూర్తిగా మరచిపోవాల్సి వచ్చింది. ఒక రకంగా చూస్తే ఈ ఎపిసోడ్లో చిన్నారులు కోల్పోయిందే ఎక్కువ. పిల్లలపై మమకారంతో వీరిని ఖరీదు చేసిన చాలామంది దంపతులు కేసులను ఎదుర్కొన్నారు. -
సింగపూర్లో కూడా ఉంది యూనివర్సల్ స్టూడియోస్...
అమెరికాలో యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) అందరూ చూస్తారు. అయితే సింగపూర్లో ఉన్న యూనివర్సల్ స్టూడియో ఇంకా ఇంటెరెస్టింగ్గా ఉంటుంది. ఇది సింగపూర్లోని సెంటోసా వద్ద ఉన్న థీమ్ పార్క్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్కులలో ఇదీ ఒకటి. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడి వచ్చి వెళ్తుంటారు. 2007 ఏప్రిల్ 19న ఈ థీమ్ పార్క్ నిర్మాణం ప్రారంభించి 2011లో పూర్తి చేశారు. మొత్తం 62 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘యూనివర్సల్ స్టూడియోస్’ ఆసియా ఖండంలో విశిష్టమైనది. మొదటి సంవత్సరంలోనే ఈ పార్క్కు సమారు 30 లక్షలమంది సందర్శించారు. అప్పటి నుండి ఏటా సుమారు 40 లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ పార్క్లో సందర్శకుల్ని ఆకర్షించేందుకు 17 రకాల జోన్స్ ఏర్పాటు చేశారు. అందులో ‘హాలీవుడ్’, ‘న్యూయార్క్’, ‘స్కైఫై సిటీ’, ‘పురాతన ఈజిప్టు’, ‘జురాసిక్ పార్క్’.. ఇలా రకరకాల జోన్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్తే నిజంగానే అక్కడే ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆయా జోన్స్లోకి వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో కొన్ని సీజనల్ కాగా, మరికొన్ని రోజూ ఉంటాయి. ఈ కారణంగా ప్రపంచంలో అనేక దేశాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. వాటిని కూడా చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు.ఇదీ చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? -
బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనా
జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఊపందుకుంది. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి చేరారు. తమ యూజర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించడానికి.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4G, 5G రెడీ సిమ్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి రీవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల వెల్లడించింది.ఈ విషయాన్ని డాట్ ఇండియా తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 4G, 5G సర్వీస్ అనేది భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్ఫారమ్ను త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్లను ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు.గత సంవత్సరం.. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ. 89,047 కోట్లతో బీఎస్ఎన్ఎల్ కోసం మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపులు కూడా ఉన్నాయి.BSNL ready. Bharat ready.#ComingSoon pic.twitter.com/BpWz0gW4by— DoT India (@DoT_India) August 10, 2024 -
హుషారుగా బ్రదర్ హుడ్ డే...
నగరానికి చెందిన ఫ్రీమేసన్స్ సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్ హుడ్ డే ఆదివారం సందడిగా జరిగింది. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా వాక్థాన్ను నిర్వహించారు. హానికారక డ్రగ్స్కు దూరంగా ఉండాలని విన్నవిస్తూ నిర్వహించిన ఈ వాక్థాన్ అబిడ్స్ నుంచి మొజంజాహీ మార్కెట్ వరకూ కొనసాగింది. ఫ్రీమేసన్స్కు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
క్రికెట్ను జాగ్రత్తగా విస్తరిస్తాం: రిచర్డ్సన్
సిడ్నీ: క్రికెట్ను విశ్వవ్యాప్తం చేయాలనే ఆలోచన ఉన్నా మరీ బలహీన స్థితిలో ఈ ఆటను చూడలేమని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. వచ్చే ప్రపంచకప్లో కేవలం 10 జట్లతోనే టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత టోర్నీ 14 జట్లతో జరుగుతోంది. అయితే ఈ ఆలోచనను అసోసియేట్ సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే జరిగితే తమ దేశాల్లో క్రికెట్ అంతరించిపోతుందని ఆ జట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఇప్పుడు మేం ఓ నిర్ణయానికి వచ్చాం. క్రికెట్ను మరింత పటిష్టపర్చుకోవాలనుకుంటున్నామే తప్ప క్రేజ్ తగ్గించాలనుకోవడం లేదు. మాకు శాశ్వత సభ్య దేశాలున్నాయి. మేం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది’ అని రిచర్డ్సన్ అన్నారు. అమెరికాలో క్రికెట్ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యూఏఈ ప్రపంచకప్కు అర్హత సాధించినప్పుడు అమెరికా ఎందుకు సాధించకూడదని ఆయన ప్రశ్నించారు. -
అంతరిక్ష పరిశోధనలకు.. ఆస్ట్రానమీ
అప్కమింగ్ కెరీర్: విశ్వం ఎలా ఏర్పడింది? దీనికి ఆది, అంతం ఎక్కడ? గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా ఉద్భవించాయి? రాత్రిపూట మిణుకుమిణుకుమనే నక్షత్రాలు, పాలపుంతలు, తోక చుక్కల మర్మమేంటి? మరో గ్రహంపై మానవ నివాసం సాధ్యం కావాలంటే ఏం చేయాలి?... తదితర విషయాలపై ఎవరికైనా ఆసక్తి ఉండడం సహజం. అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతున్న అనంతమైన విశ్వ రహస్యాలను తెలుసుకోవాలని మనిషి అనాదిగా కృషి చేస్తూనే ఉన్నాడు. కొంతవరకు సఫలీకృతుడయ్యాడు. అంతరిక్షంపై నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు ఈ పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ అధికంగా నిధులను ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి ఆస్ట్రానమీని కెరీర్గా మలచుకుంటే.. బంగారు భవిష్యత్తు సొంతమవడం ఖాయం. ఆస్ట్రానమీలో రెండు విభాగాలుంటాయి. అవి.. థియారెటికల్ ఆస్ట్రానమీ, అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ. అభ్యర్థులు తమకు ఆసక్తి కలిగిన రంగాన్ని ఎంచుకోవచ్చు. ఆస్ట్రానమర్లకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో తగిన పరిజ్ఞానం సంపాదిస్తే.. అబ్జర్వేటరీల్లో పరిశోధకులుగా, యూనివర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), స్పేస్ ఫిజిక్స్ ల్యాబోరేటరీస్ వంటి అత్యున్నత సంస్థల్లో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా మంచి అవకాశాలున్నాయి. ఆస్ట్రానమర్గా గుర్తింపు సాధించాలంటే.. ఫిజిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ను సొంతం చేసుకోవాలి. డేటా అనాలిసిస్పై గట్టి పట్టు ఉండాలి. నూతన శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలి. వేతనాలు: పరిశోధనా కేంద్రాల్లో రీసెర్చ్ వర్క్, కాలేజీ/యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ఆస్ట్రానమర్లకు ప్రారంభంలో నెలకు రూ.50 వేల దాకా వేతనం లభిస్తుంది. తర్వాత ఎక్స్పీరియెన్స్, సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్, బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత ఫిజిక్స్/ఆస్ట్రానమీ/ఆస్ట్రోఫిజిక్స్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదవాలి. అనంతరం పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే పరిశోధనా రంగంలో స్థిరపడొచ్చు. వర్సిటీలు/కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. అస్ట్రానమీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్-పుణె వెబ్సైట్: http://www.iucaa.ernet.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-బెంగళూరు వెబ్సైట్: http://www.iiap.res.in/ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు వెబ్సైట్: http://www.rri.res.in/ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: http://www.du.ac.in/ యూనివర్సిటీ ఆఫ్ ముంబై వెబ్సైట్: http://www.mu.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-త్రివేండ్రం వెబ్సైట్: http://www.iist.ac.in/ పరిశోధనలకు సరైన ఎంపిక ‘‘విశ్వ రహస్యాల ఛేదనలో ఖగోళ శాస్త్రవేత్తలది కీలకపాత్ర. ఆస్ట్రానమీ అనగానే పాత సబ్జెక్టు అనే భావన రాదు. అది ఎప్పటికీ నిత్యనూతనం. అంతరిక్షంలో మానవాళి నివాసానికి అనువుగా ఉండే గ్రహాల అన్వేషణ. నక్షత్రాలు, గ్రహాల గమనం వంటి అంశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో గమనిస్తూనే ఉన్నారు. దీనికి తగినట్లుగానే ప్రభుత్వాలు పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాయి. అస్ట్రో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి భిన్నమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి పలు యూనివర్సిటీల్లో ఫెలోషిప్లు అందజేసేందుకు యూజీసీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. అయితే పరిశోధనలతో కొత్త అంశాలను వెలికితీయాలనే ఉత్సుకత ఉన్న యువతకు ఆర్అండ్డీ విభాగంలో అవకాశాలు అపారం. బోధన రంగంలో స్థిరపడే వీలుంది. కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆస్ట్రానమీతో అవకాశాలు పుష్కలం’’ - డాక్టర్ ఎస్.ఎన్.హసన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ హెడ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం