-
చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు యాంకర్స్గా మారిన స్టార్ హీరోలు
ఇంత కాలం కేవలం సినిమా హీరోలుగానే ఉన్న మన స్టార్స్ ఈ మధ్య కాలంలో టీవీ చానల్ యాంకర్స్గా మారిపోయి తమ సత్తా చూపిస్తున్నారు. టెలివిజన్లో కూడా తమ అభిమానులను అలరిస్తూ వారి మనసులు గెలుచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న సినిమా హీరోల వరకు అందరూ ఇప్పుడు హోస్ట్ అవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పైగా సినిమాలకు ఏ స్థాయి రెమ్యునిరేషన్ తీసుకుంటారో అంతే పారితోషికం తీసుకుని యాంకరింగ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే చాలా మంది హీరోలు టీవీ చానల్ హోస్టులు అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా నటరత్న నందమూరి బాలకృష్ణ కూడా ఈ జాబితాలో చేరాడు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్స్టాపబుల్ NBK అనే టాక్ షోను బాలకృష్ణ చేయబోతున్నారు. అయితే మరి ఈయన కంటే ముందు హోస్టులుగా మారిన హీరోలెవరో ఓ సారి చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా చానల్కు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ (స్టార్ మా), మీలో ఎవరు కోటీశ్వరుడు (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 (స్టార్ మా), ఎవరు మీలో కోటీశ్వరులు (జెమినీ)తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారీ (జెమినీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2 (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. సాయికుమార్ వావ్, మనం (ఈటీవీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జగపతిబాబు హోస్టుగా మారి కో అంటే కోటి టీవీ షోతో ప్రేక్షకులను అలరించారు. -
సంసద్ టీవీ హోస్ట్లుగా శశిథరూర్, ప్రియాంక
న్యూఢిల్లీ: రాజకీయ రంగంలో వాళ్లిద్దరికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అభిప్రాయాలను చెప్పడంలో, ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టేలా సమాధానం ఇవ్వడంలోనూ వారికి వారే సాటి. అయితే ఇప్పుడు వారు తమ స్థానాన్ని మార్చుకొని ప్రశ్నించే స్థానంలోకి వస్తున్నారు. లోక్సభ, రాజ్యసభల టీవీలను కలిపేస్తూ కొత్తగా వచి్చన సంసద్ టీవీలో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా దర్శనమివ్వబోతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘టు ది పాయింట్’ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతుండగా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థరూర్ నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులతో వివిధ అంశాలపై లోతైన చర్చలు ఉంటే, చతుర్వేది మహిళా ఎంపీల రాజకీయ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. -
మరోసారి వైరల్గా మారిన బ్రెజిల్ యాంకర్ వీడియో
-
భార్య చేసిన పనికి యాంకర్ షాక్!
బ్రెసీలియా : వర్క్ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఓ టీవీ యాంకర్కు భార్య షాక్ ఇచ్చింది. అతడు లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో నగ్నంగా కెమెరాలో కనిపించి అతడ్ని నవ్వుల పాలు చేసింది. గత జులై నెలలో చోటుచేసుకున్న ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్కు చెందిన టీవీ యాంకర్ ఫాబియో పోర్చాట్ జులై 3వ తేదీన ప్రముఖ రాజకీయ నేత గుల్హెర్మీ బౌలోస్తో ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో ఫాబియో భార్య నటాలి నగ్నంగా కెమెరా ఎడమ వైపునుంచి కుడివైపునకు దాక్కుని వెళ్లింది. ( వైరల్: శునకాలకు ఐపీఎల్ ఫీవర్!) ఈ దృశ్యాన్ని చూసిన బౌలోస్ గట్టిగా నవ్వుతూ అదేంటని ప్రశ్నించాడు. దీంతో కంగుతిన్న ఫాబియో భార్య వైపునకు తిరిగి మందలించాడు. ఇక చేసేదేంలేక బౌలోస్తో కలిసి నవ్వటం ప్రారంభించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావటంతో.. అదికాస్తా సోషల్మీడియాలో వైరల్గా మారింది. ( ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం ) -
ప్రముఖ షో వ్యాఖ్యాత కన్నుమూత
లాస్ ఏంజిల్స్: బ్రిటీష్ గేమ్ షో "హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్" కార్యక్రమం సరిహద్దులు దాటుతూ మిగతా దేశాలకు వ్యాప్తి చెందింది. అమెరికాలో ఈ షో వ్యాఖ్యాతగా వ్యవహరించే రెజిస్ ఫిల్బిన్(88) శుక్రవారం రాత్రి కన్ను మూశారు. కాగా ఆయన గత నెలలోనే పుట్టినరోజు జరుపుకున్నారు. ఇక లాస్ ఏంజిల్స్లో తన బుల్లితెర ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన 'హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్' కార్యక్రమానికి కొన్ని దశాబ్దాలుగా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ప్రోగ్రామ్ వారంలో ఐదు రోజుల పాటు ప్రసారమయ్యేది. ఇది టీవీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం గడించిన టెలివిజన్ షోగా కీర్తి గడించింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తొలి రెండు సంవత్సరాల్లో 1 బిలియన్ డాలర్లు ఆర్జించింది. (డాడీ బాండ్) ఈ షో వల్ల ఫిల్బిన్ పాపులారిటీతో పాటు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అతని డైలాగ్ "ఈజ్ దట్ యువర్ ఫైనల్ ఆన్సర్?(ఇదే మీ ఆఖరి సమాధానమా)" ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంటుంది. అలాగే ఆయన వస్త్ర ధారణ భిన్నంగా ఉండి ట్రెండ్ సెట్టర్గా నిలిచేది. డేటైమ్ ఎమ్మీస్ నుంచి ఆయన లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 'లైవ్ విత్ కెల్లీ అండ్ రియాన్', 'ద రెజిస్ ఫిల్బిన్' కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదిలా వుండగా 'హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్' కార్యక్రమం భారత్లో 'కౌన్ బనేగా కరోడ్పతి', 'మీలో ఎవరు కోటీశ్వరుడు?' వంటి పలు పేర్లతో అత్యంత ఆదరణ సంపాదించుకుంది. (హాలీవుడ్ కంపోజర్ మోరికోన్ మృతి )
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement