breaking news
Tuggali
-
తుగ్గలిలో రైతు కూలీకి ఖరీదైన వజ్రం లభ్యం
-
12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం
-
సీఎం జగన్ కు తుగ్గలి ప్రజల నీరాజనాలు...
-
బాబు పాలనలో లంచాలు..మన పాలనలో సంక్షేమం..
-
ఓటుతోనే ప్రజల తలరాత మారుతుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో మార్పును కొనసాగించేందుకు ఓటు వేయాలని పిలుపు.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, రాతనలో ప్రజలతో ముఖాముఖి...ఇంకా ఇతర అప్డేట్స్
-
మీ ఓటుతోనే మీ రాత మార్పు: సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో ఊరూరా స్పష్టంగా కనిపిస్తోంది. విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో ఓటు వేసేది కేవలం ఎంపీ, ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. జరుగుతున్న మార్పును కొనసాగించేందుకే అన్నది ప్రధానం. ఈ మార్పులు కొనసాగితేనే పేదవాడి బతుకులు మారతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనుకుంటేనే మీ బిడ్డకు అండగా నిలిచి ఓటు వేయాలని కోరుతున్నా. జరిగిన మేలును ఇంటింటా చెప్పాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర నాలుగో రోజు శనివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లాలోనూ కొనసాగింది. తుగ్గలిలో తుగ్గలి, రాతన గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమాభివృద్ధిపై రెండు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ఆశీస్సులు తెలిపారు. ‘మళ్లీ ముఖ్యమంత్రిగా నువ్వే రావాలన్నా.. మళ్లీ సీఎంగా ఇక్కడికి రావాలి’ అంటూ మహిళలు, రైతులు, విద్యార్థులు హర్షధ్వానాల మధ్య మూకుమ్మడిగా నినదించారు. ‘రెండు గ్రామాల పరిధిలో 10 వేల జనాభా ఉన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఏకమయ్యారు. అందరినీ ఒకటే కోరుతున్నా. ఇంతకు ముందు ప్రభుత్వాలను చూశారు. ఇవాళ మన ప్రభుత్వాన్నీ చూస్తున్నారు. మీరు ఇంతకు ముందు చూడని విధంగా మన ప్రభుత్వ హయాంలోని 58 నెలల్లో ప్రస్ఫుటమైన మార్పులు కన్పింస్తున్నాయి. ఇలాంటి విప్లవాత్మక మార్పులు గత ప్రభుత్వాల్లో ఎందుకు కన్పింంచలేదు? తుగ్గలి, రాతన సచివాలయ పరిధిలోని గ్రామాల్లో కూడా గొప్ప మార్పు కన్పింస్తుండటం పట్ల ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని సీఎం కోరారు. ఈ ముఖాముఖిలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండు గ్రామాల అక్క చెల్లెమ్మలకు రూ.56.24 కోట్లు ► తుగ్గలి సచివాలయ పరిధిలో 1,748, రాతన సచివాలయ పరిధిలో 1,569 ఇళ్లు ఉన్నాయి. తుగ్గలిలో 1,666 ఇళ్లకు, రాతనలో 1,486 ఇళ్లకు అంటే 95 శాతం ఇళ్లకు మీ బిడ్డ బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపారు. ఎక్కడా లంచాలు, వివక్ష, కులం, రాజకీయం, చివరకు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదనుకుని.. అర్హత ఉన్న వారందరికీ మేలు చేశాం. రెండు గ్రామాల అక్క చెల్లెమ్మలకు రూ.56.24 కోట్లు లబ్ధి కలిగించాం. ► గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు అడిగే పరిస్థితి. చివరకు పింఛన్, సబ్సిడీ రుణాలు కావాలన్నా లంచాలే. ఆ రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి లంచాలు లేకుండా మీకు అందిందని ఎవరైనా చెబుతారా? (లేదు...లేదు అని జనాలు చేతులు అడ్డంగా ఊపారు) తుగ్గలిలో 5,200 జనాభా ఉన్న సచివాలయ పరిధిలో ఈ 58 నెలల్లో రూ.29.65 కోట్లు ఇచ్చాం. ఈ సంఖ్యలు చెబుతుంటే ఆశ్చర్యంగా లేదా.. అని అడుగుతున్నా. రాతనలో 4,888 జనాభా ఉంటే రూ. 26.59 కోట్లు ఇచ్చాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నా ఆడబిడ్డల ఖాతాల్లో నగదు జమ చేశాం. ► అమ్మఒడి పథకం ద్వారా తుగ్గలిలో రూ.2.91 కోట్లు, రాతనలో రూ.2.50 కోట్లు.. రెండింటికీ కలిపి రూ.5.41 కోట్లు ఇచ్చాం. చేయూత ద్వారా తుగ్గలిలో రూ.2.30 కోట్లు, రాతనలో రూ.2.19 కోట్లు.. రెండు గ్రామాల్లో కలిపి రూ.4.49 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. విద్యాదీవెన ద్వారా తుగ్గలిలో రూ.1.16 కోట్లు, రాతనలో రూ.1.26 కోట్లు.. మొత్తంగా రూ.2.42 కోట్లు జమ చేసి, పిల్లలు మంచి చదువులు చదవాలని, తల్లిదండ్రులపై భారం పడకుండా చూశాం. ► జగనన్న వసతి దీవెన ద్వారా తుగ్గలిలో రూ.51 లక్షలు, రాతనలో రూ.54 లక్షలు.. ఆసరా ద్వారా తుగ్గలిలో రూ.1.95 కోట్లు, రాతనలో రూ.65 లక్షలు ఇచ్చాం. మన ప్రభుత్వం రాక ముందు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి దారుణం. అప్పట్లో 18 శాతం నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ లోన్లు ఉండి అక్క చెల్లెమ్మల బతుకులు కుదేలైన పరిస్థితుల్లో ఆసరా ద్వారా అదుకున్నాం. ఈ ఒక్క పథకం ద్వారానే ఈ గ్రామాలకు రూ.2.60 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీ ద్వారా రాతనలో రూ.15 లక్షలు, తుగ్గలిలో రూ.60 లక్షలు ఇచ్చి మంచి చేశాం. ఇళ్ల విషయానికొస్తే తుగ్గలిలో 66, రాతనలో 122 ఇళ్లు ఇచ్చాం. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా తుగ్గలిలో రూ.3 లక్షలు, రాతనలో రూ.4.8 లక్షలు ఇచ్చాం. ► అవ్వాతాతలకు రాతనలో రూ.7.54 కోట్లు, తుగ్గలిలో రూ.7.58 కోట్లు పింఛన్ల ద్వారా అందించాం. రైతులకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా తుగ్గలిలో రూ.6.15 కోట్లు, రాతనలో రూ.5.49 కోట్లు ఇచ్చాం. ఇలా అన్ని పథకాల ద్వారా మేలు చేశాం. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ప్రతీ గ్రామంలో చూపిస్తామని, ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ను పెట్టాం. వారు ప్రతి పథకాన్ని నేరుగా మీ చేతుల్లో పెట్టి వెళుతున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గతానికి భిన్నంగా మార్పు జరుగుతోంది. తుగ్గలిలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా రూ.98 లక్షలు ఇచ్చాం. ఉచితంగా వైద్యం అందించాం. రాతనలో రూ.84 లక్షలు ఇచ్చాం. ఈ మార్పులను అందరూ గమనించాలి. మన వద్దే రూ.3 వేల పింఛన్ మన ప్రభుత్వం రాక ముందు చంద్రబాబు పాలనలో పింఛన్ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చాడు. మీ బిడ్డ హయాంలో పింఛన్ రూ.3 వేలు. ఇంత పింఛన్ ఇచ్చే రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. పింఛన్ల కు ఏడాదికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మన తర్వాత తెలంగాణ రూ.12 వేల కోట్లు ఇస్తోంది. ఆపై 3, 4 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఏడాదికి పింఛన్ కోసం రూ.8 వేల కోట్లు, రూ.6 వేల కోట్లు ఇస్తున్నారు. ఒడిశా, యూపీలో రూ.500 పింఛన్ ఇస్తున్నారు. మీ బిడ్డ ప్రభుత్వానికి అవ్వాతాతలు, వితంతువులపై ఎంత ప్రేమ ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ మాత్రమే. మనం రాకముందు రాష్ట్రంలో పింఛన్లు 39 లక్షలు ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక 66 లక్షలకు తీసుకెళ్లాం. ఇందులో ఏకంగా 45 లక్షల పింఛన్లు నా అక్కచెల్లెమ్మలు, అవ్వలకే ఇస్తున్నాం. ఇంకా లోటుపాట్లు సవరించుకుని మంచి పాలన అందించేందుకు సలహాల కోసం మీ వద్దకు వచ్చాను. ఆరోగ్యశ్రీతో పేదవాడికి పెద్ద వైద్యం రెండేళ్ల కిందట మా నాన్న రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ చేయాలని చెప్పారు. కర్నూలులోని గౌరీగోపాల్ హాస్పిటల్కు వెళ్లండని చెప్పారు. ఎంతో డబ్బు ఉంటేనే అక్కడ వైద్యం చేయించుకోగలరు. అలాంటి ఆస్పత్రిలో మా నాన్నకు ఉచితంగా డయాలసిస్ జరిగింది. అది ఆరోగ్యశ్రీ వల్లే సాధ్యమైంది. ఆ తర్వాత మా నాన్నకు కిడ్నీ మార్పిడి చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయించుకోగలిగాం. ఆరోగ్యశ్రీ తరఫున అధికారులు మాకు వెన్నంటి ఉండి ఎంతో సాయం చేశారు. మీరు మా ఇంటి పెద్దగా మాకు అన్నీ చేశారు. అందుకే మిమ్మల్ని మా పెద్దన్నగా భావిస్తున్నాం. – జనార్ధన్రెడ్డి, చెన్నంపల్లి, అవుకు, నంద్యాల జిల్లా పాలనలో తేడాను గుర్తించాలి మా నాన్నకు రెండు లంగ్స్ దెబ్బతిన్నాయి. పెద్ద ఆస్పత్రికి వెళ్తే రూ.4 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మా నాన్నకు ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు మా నాన్న ఆరోగ్యంగా ఉన్నాడు. మీ పాలనలో అందరికీ అన్ని పథకాలూ అందుతున్నాయి. బాబు పాలనకు, జగనన్న పాలనకు తేడా గమనించాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. – నరేష్, రాతన గ్రామం రెండు గ్రామాల అభివృద్ధి ఇలా.. ► గ్రామంలో అడుగు పెడుతూనే సచివాలయం కన్పింంచింది. గతంలో ఇది లేదు. ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఆర్బీకే ఉంది. ఓ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉంటున్నారు. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ప్రతి దశలో రైతన్నకు అండగా నిలుస్తున్నారు. ఇంతకు ముందు రైతన్నలు బ్యాంకుకు వెళ్లి క్రాప్లోన్ తీసుకుంటేనే పంటలకు ఇన్సూ్యరెన్స్ చేసేవారు. లోన్లో రూ.లక్షకు రూ.5వేలు కట్ చేసి ఇచ్చేవారు. ► ఇవాళ ప్రతి ఎకరా ఈ క్రాప్ చేశాం. ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నాం. పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇస్తూ రైతన్నకు సాయంగా ఉంటున్నాం. ఇక్కడే ప్రభుత్వ బడి కన్పింస్తోంది. తొలిసారి నాడు–నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లిష్ మీడియం వచ్చింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాం. 6వ తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానల్ ద్వారా డిజిటల్ బోధన కల్పించాం. కార్పొరేట్ స్కూళ్లు కూడా ప్రభుత్వంతో పోటీ పడాల్సిన పరిస్థితులు గ్రామంలో కన్పింస్తున్నాయి. ► ప్రజలు ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని మార్పులు తెచ్చాం. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టతో అనుసంధానం చేశాం. 15 రోజులకు ఒకసారి వచ్చి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య సురక్ష ప్రతి ఆర్నెళ్లకు ఓసారి జరుగుతోంది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యి రోగాల నుంచి 3,330 దాకా పెంచాం. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఈ మార్పులన్నింటికీ మనందరి ప్రభుత్వమే కారణం అని గమనించాలి. పింఛన్ కోసం పడిగాపులు లేవు పింఛన్ కోసం రెండు, మూడు రోజులు బయట ఉండేవాళ్లం. గతంలో మా వికలాంగుల్లోనే వైకల్యానికి పర్సెంటేజీ ప్రకారం తేడా చూపించేవాళ్లు. జగనన్న వచ్చాక ఆ తేడా లేకుండా రూ.3 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఇంటికే పింఛన్ అందిస్తున్నారు. పడిగాపులు అసలే లేవు. అందుకు జగనన్నకు ధన్యవాదాలు. జై జగన్. – రంగమ్మ, రాతన, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా మీ సాయం మరువలేం అన్నా.. నేను ట్రాన్స్కోలో పనిచేసేవాడిని. ప్రమాదంలో పైనుంచి పడి నడుం విరిగింది. డోన్ సభలో నన్ను పిలిచి మీరు రూ.5 లక్షలు సాయం చేశారు. మా నాన్నకు రూ.3 వేలు పింఛన్ అందిస్తున్నారు. మీ మేలు మరచిపోలేను. మిమ్మల్ని చూసేందుకే నా కుటుంబం అంతా ఉదయం 6 గంటలకే ఇక్కడకు వచ్చి ఎదురు చూస్తున్నాం. మీతో ఒక్క ఫొటో తీసుకుని మా ఇంట్లో పెట్టుకోవాలన్నా. – బలరాం నాయక్, దివ్యాంగుడు, తుగ్గలి మా స్కూల్ భలే బావుంది జగన్ మామా.. నాడు–నేడు ద్వారా మా స్కూల్ను మీరు ఎంతో బాగా తయారు చేయించారు. మధ్యాహ్నం భోజనంలో కోడిగుడ్డు, చిక్కీ బాగా పెడుతున్నారు. (బాబు తండ్రి లాల్బాషా మాట్లాడుతూ..) ‘నాకు హార్ట్స్ట్రోక్ వచ్చిందన్నా.. మా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకుని బయటపడ్డాను. – జుబేర్, 7వ తరగతి విద్యార్థి, హోసూరు, పత్తికొండ మండలం మా ఊళ్లో జెండా ఎగరేస్తాం అన్నా.. నీ ఓదార్పు యాత్ర మొదలు నేటి ‘మేమంతా సిద్ధం’ యాత్ర వరకు 100 కార్యక్రమాల్లో నేను పాల్గొన్నా. పోలీసులు అడ్డుపడినా ఆగలేదు. నాకు కళ్లు లేవు. ఒక్కసారి నీ చేయి తాకాలని ఆశ పడుతున్నా. మా శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులు అనే ఓ టిప్పర్ డ్రైవర్ను పెట్టారని చంద్రబాబు అంటున్నాడు. టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా.. చంద్రబాబూ! శింగనమలలో జూన్ 4వ తేదీన గెలిచి,మా జెండా ఎగరేస్తాం. – వినోద్ కుమార్, అమ్మవారి పేట, అనంతపురం జిల్లా మీరు నా సోదరుడు అన్నా.. నా భర్త ఆరోగ్యమిత్రలో ఉద్యోగిగా చేస్తూ మరణించాడు. నాకు మీ పాలనలో అన్ని పథకాలు వచ్చాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా పథకాలు అన్నీ అందాయి. డిగ్రీ చదివిన నాకు ఓ చిన్న ఉద్యోగం ఇప్పిస్తే మీ కెంతో రుణ పడి ఉంటానన్నా. మిమ్మల్ని నా అన్నగా అనుకొని ఈ సాయం అర్థిస్తున్నాను. – సరస్వతి, తుగ్గలి ఎప్పటికీ మీరే సీఎం జగన్ సార్.. నేను పేదరాలిని. నాకు రైతు భరోసా, చేయూత, ఆసరా, ఇంటి పట్టా అన్ని పథకాలు వచ్చాయి. జగనన్న తోడు కూడా వచ్చింది. మా కలలన్నీ నిజమయ్యాయి. మాకు ఎవరూ వద్దు.. మీరే మళ్లీ సీఎంగా రావాలి. అందరికీ ఎంతో మేలు చేసిన మీరే సీఎంగా ఉండాలి. – శ్యామల, రాతన, కర్నూలు జిల్లా -
జన జాతరలా బస్సు యాత్ర.. ప్రతి గుండె ఉప్పొంగి.. (ఫొటోలు)
-
అవ్వా, తాతల కోసం..
-
టిప్పర్ గుద్దితే సైకిల్ ఉంటుందా ?..అంధుడి మాటలకు జగన్ ఫిదా
-
నమస్కారం జగన్ మామయ్య..బుడ్డోడి మాటలకి జగన్ ఫిదా
-
మీ ఫోటో మా ఇంట్లో..మీ సంతకం మా గుండెల్లో ఉంటుంది అన్న
-
మిమ్మల్ని గెలిపించడానికి మేమంతా సిద్ధం అన్నా...ఎమ్మెల్యే శ్రీదేవి
-
గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి
-
Watch Live: తుగ్గలిలో సీఎం జగన్ ముఖాముఖి
-
మేకల కాపరి దారుణహత్య
సాక్షి, తుగ్గలి(కర్నూలు) : మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్ రామునాయక్(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట వద్ద భార్య దేవమ్మ తెచ్చిన భోజనాన్ని తిని, తిరిగి మేకలను తోలుకుని వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భార్య, కుమారులు, తండా వాసులు బోడబండ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనపడలేదు. చీకటి కావడంతో చేసేదేమీ లేదక రాత్రి జొన్నగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారు జామునే మళ్లీ వెతికేందుకు వెళ్లిన తండావాసులకు ఓ గుట్టలో రాళ్ల మధ్య తలపై తీవ్రగాయాలతో విగత జీవిగా పడిఉన్న రామునాయక్ మృతదేహం కంట పడింది. మేకలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించక పోవడంతో దొంగల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి చేరే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కట్టెతో తలపై కొట్టి చంపి మేకలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. రూ.2 లక్షలు కూడా చేయని వాటి కోసం ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, తండావాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్నిపరిశీలించిన డోన్ డీఎస్పీ.. మేకల కాపరి హత్య విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ ఖాదర్బాషా, పత్తికొండ సీఐ సోమశేఖరరెడ్డి, జొన్నగిరి ఎస్ఐ విజయకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్స్క్వాడ్ను రప్పించి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మేకల కోసం దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఇది రెండో ఘటన.. ఆరేళ్ల క్రితం మండలంలోని పి.కొత్తూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ ఎనుముల పుల్లన్న కుమారుడు సురేంద్ర(12) దారుణ హత్యకు గురయ్యారు. సురేంద్ర పక్క గ్రామంలోని హుసేనాపురానికి గొర్రెల యజమాని వద్ద గొర్రెలు మేపేందుకు జీతం ఉన్నాడు.రోళ్లపాడు అటవీ ప్రాంతంలో కొండపై గొర్రెలు మేపుతుండగా దొంగలు కాపరి తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసి గొర్రెలు ఎత్తుకెళ్లారు. మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. -
పేలిన సెల్ఫోన్ ; బాలుడికి తీవ్ర గాయాలు
సాక్షి, కర్నూలు : ఇటీవలి కాలంలో సెల్ఫోన్లు చేతుల్లో పేలుతుండటంతో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సెల్ఫోన్లో పాటలు వింటున్న బాలుడి చేతిలో ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటన జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భాస్కర్ ఆచారి అనే బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుడిచేతి వేళ్లు కూడా తెగిపడినట్టు సమాచారం. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నిధి కోసం ఆగని వేట
సాక్షి, తుగ్గలి: ప్రభుత్వ, పురావస్తు శాఖ అధికారుల సాక్షిగా పురాతన కోట ధ్వంసమవుతోంది. గుప్త నిధుల కోసం కోట బురుజులు సైతం తవ్వేస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధులున్నాయన్న ప్రచారంతో ఈనెల 13న అధికారుల పర్యవేక్షణలో ప్రారంభమైన తవ్వకాలు ఆగడం లేదు. 16 రోజుల పాటు పెద్ద బండరాయి కింద తవ్వకాలు చేపట్టినా నిధి ఆనవాళ్లు బయట పడకపోవడంతో చివరకు దానికెదురుగా 30 అడుగుల దూరంలో ఉన్న కోట బురుజులో తవ్వకాలు మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితం రెసెస్టివిటీ మీటరుతో జియలాజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘురాం కోట ప్రాంగణంలో సర్వే చేశారు. ఆయన సూచన మేరకు గురువారం ప్రత్యేక పూజలు చేసి.. కోట బురుజులో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ పురావస్తు శాఖ అధికారులు లేకుండానే తవ్వకాలు జరపగా.. ప్రస్తుతం ఆ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మహీంద్ర నాయుడు సమక్షంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. అధికారులు, పోలీసులు, సిబ్బంది రోజూ కోటపైకి ఎక్కి దిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 16 రోజులుగా అధికారులు కోటలోనే తిష్టవేసి తవ్వకాలను పర్య వేక్షిస్తున్నారంటే వీరిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోంది. నిధి బయట పడే వరకు తవ్వకాలు వదిలిపెట్టేలా లేరని స్థానికులు చర్చించుకుంటున్నారు. తవ్వకాల ప్రాంతంలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి, జొన్నగిరి ఎస్ఐ నజీర్ అహ్మద్, పోలీసులు ఉన్నారు. -
చెన్నంపల్లి కోటలో నిలిచిన తవ్వకాలు
సాక్షి, కర్నూలు: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలు నిలిచిపోయాయి. అక్కడ గుప్త నిధులున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించింది. వారం రోజులుగా తవ్వకాలు జరుగుతుండగా శుక్రవారం బండ రావడంతో తవ్వకాలకు బ్రేకులు పడ్డాయి. బండను పేల్చివేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం స్థానిక అధికారులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో గుప్త నిధులని పేర్కొన్న అధికారులు చివరకు ఖనిజాల కోసమంటూ మాటమార్చారు. -
కర్నూలు జిల్లాలో బంగారం, వజ్రాలు
సాక్షి, కర్నూలు: శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో వజ్రాలు, రత్నాలు రాసులు పోసి అమ్మారని ప్రతీతి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని, శ్రీకృష్ణదేవరాయుల కాలంలో కోటలో వాటిని దాచిఉంచారని పలువురు నమ్ముతున్నారు. చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నాయన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినిచ్చింది. వారం రోజులక్రితం తవ్వకాలు ప్రారంభమయ్యయి. ఈ నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినివ్వడంతో గ్రామ అభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కోటలో పెద్దపెద్ద బండరాళ్లు ఉండడంతో వాటిని తొలగిస్తున్నారు. తవ్వకాల వద్ద పెద్దఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటుచేశారు. అంతేగాక కోట పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. -
మదనంతపురం వద్ద ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 24వరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఆయన ఇవాళ మొత్తం 15.6 కిలోమీటర్లు నడిచారు. శనివారం ఉదయం పత్తికొండ మండల కేంద్ర శివారులో ప్రారంభమైన పాదయాత్ర.....భోజన విరామ సమయానికి తుగ్గలి మండలం రాతల గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత తుగ్గలి, గిరిగిట్ల గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర.. మదనంతపురం వద్ద ముగిసింది. కాగా పత్తికొండ నియోజకవర్గంలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేతకు ప్రతిచోట ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ గ్రామాలకు వస్తున్న జగన్కు పలుచోట్ల ప్రజలు కష్టాలు, బాధలను చెప్పుకున్నారు. తుగ్గలివద్ద మాదాసి , మాదారి కురువలు జగన్ను కలిసి తమను ఎస్సీల్లో చేర్చాలని వినతిపత్రం సమర్పించారు. పత్తిరైతులు, రైతు కూలీలు, నర్సరీల కూలీలు, వికలాంగులు, వృద్ధులు ఇలా ప్రతిఒక్కరూ జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి కష్టాలు ఒపికగా విన్న జగన్.. వచ్చేది రాజన్న రాజ్యమేనని...అందరి కష్టాలు తొలిగిపోతాయంటూ భరోసా నిచ్చారు. 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ వైఎస్ జగన్ 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగిరి, ఎర్రగుడి మీద తుగ్గలి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం తుగ్గలి నుంచి యాత్రను పున: ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చెరువు తొండకు చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. -
కర్నూలు జిల్లాలో విషాదం
కర్నూలు: కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తుగ్గలి మండలం రామలింగయ్యపల్లె గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గంగరాజు, తిమ్మక్క దంపతులు తమ కుమారుడితో కలిసి గురువారం వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులంటున్నారు. -
పీఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తుగ్గలి (కర్నూలు) : దొంగతనం కేసులో విచారించడానికి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బొండిమాదుగుల గ్రామానికి చెందిన హరి(28)ని వారం రోజుల క్రితం ఓ దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.