సాక్షి, కర్నూలు: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలు నిలిచిపోయాయి. అక్కడ గుప్త నిధులున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించింది. వారం రోజులుగా తవ్వకాలు జరుగుతుండగా శుక్రవారం బండ రావడంతో తవ్వకాలకు బ్రేకులు పడ్డాయి. బండను పేల్చివేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం స్థానిక అధికారులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో గుప్త నిధులని పేర్కొన్న అధికారులు చివరకు ఖనిజాల కోసమంటూ మాటమార్చారు.
Dec 22 2017 2:33 PM | Updated on Dec 22 2017 2:33 PM
Advertisement


