-
టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్ ఈఏపీ సెట్తో పాటు ఐసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్ చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4, 5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు చేశారు. -
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2024–2025)లో ప్రవేశాలకుగాను ప్రవేశ పరీక్ష (టీ ఎస్ఐసెట్) నోటిఫికేషన్ను కాకతీయ యూనివర్సిటీ వీసీ, టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్, కన్వినర్ ఆచార్య నర్సింహాచారి మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు హనుమకొండలోని యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో తొలుత సెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీనుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో మే 17వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చునని, మే 20వ తేదీనుంచి అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. టీఎస్ ఐసెట్ను జూన్ 4, 5వ తేదీల్లో నిర్వహిస్తారని చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టుగానే నిర్వహిస్తారని పేర్కొన్నారు. జూన్ 4న రెండు సెషన్లలో, 5న ఒక సెషన్లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. కాగా, జూన్ 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంత రాలు స్వీకరిస్తారు. ఫలితాలను జూన్ 28న విడుదల చేస్తారు. కార్యక్రమంలో కేయూ రిజి్రస్టార్ పి.మల్లారెడ్డి, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, డీన్ పి.అమరవేణి, బీఓఎస్ చైర్మన్ కట్ల రాజేందర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సదానందం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ రాధిక పాల్గొన్నారు. -
TS: విడుదలైన ఐసెట్ ఫలితాలు.. తొలి పది ర్యాంకులు అబ్బాయిలవే
తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ టీఎస్ ఐసెట్ 2023 ఫలితాలను జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో విడుదల చేశారు. ఈ ఫలితాలలో పాటు ఫైనల్ 'కీ' ని కూడా విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఫలితాల విడుదల ఆలస్యంగా గురువారం (జూన్ 29)న విడుదల చే అయింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023 పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. 70,900 మంది హాజరయ్యారు. ఈ సారి ఐసెట్లో తొలి 10 ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. వీరిలో మొదటి ర్యాంకు నూకల శరణ్కుమార్ కైవసం చేసుకోగా.. నాగులపల్లి సాయి నవీన్ రెండు, రవితేజ సజ్జ మూడో ర్యాంకులో సాధించారు. టాప్ 10లో ఆ తర్వాతి ర్యాంకుల్లో ఎస్.సాయి ఫణి ధనుష్, గోపి మల్లికంటి, తిరుగుడు సుమంత్ కుమార్ రెడ్డి, ఆయాచితుల నితీశ్కుమార్, వి. సాయి వెంకట కార్తిక్, ఎస్.నాగసాయి కృష్ణవంశీ, బి.సాయిగణేష్ నిలిచారు. చదవండి: Hyderabad: అమ్మో ఫాస్ట్ఫుడ్! పంది కొవ్వు కొని నూనెగా మార్చి తక్కువ ధరకు విక్రయం -
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఈ విద్యాసంవత్సరం (2023–2024) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్తో కలిసి వివరాలు వెల్లడించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 6 నుంచి మే 6వ వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550, ఇతరులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఇలా... టీఎస్ ఐసెట్ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. ►26న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెషన్ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, నాలుగో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ►14 ప్రాంతీయ కేంద్రాలు, సుమారు 75 పరీక్షకేంద్రాలను కూడా గుర్తించారు. ►ప్రాథమిక కీని జూన్ 5న విడుదల చేస్తారు. ►ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది. ►ఫలితాలు జూన్ 20న విడుదల చేస్తారు. 25 శాతం అర్హత మార్కులు టీఎస్ ఐసెట్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు లేవని, మిగతా కేటగిరీలవారికి అర్హత మార్కులు 25%గా నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. సిలబస్, మోడల్ పేపర్, సూచనలు, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ విధాన, ఆన్లైన్ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్ టెస్టుల సమాచారం జ్టి్టpట//జీఛ్ఛ్టి.్టటజ్ఛి.్చఛి.జీn లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ పి.వరలక్ష్మి తెలిపారు. -
ఐసెట్కు 90% హాజరు
సాక్షి, హైదరాబాద్/ కేయూ క్యాంపస్ (వరంగల్): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూని వర్సిటీ రెండ్రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఐసెట్)కు 90.56% హాజరైనట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి తెలి పారు. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్లో 4 కేంద్రాల్లో 27, 28 తేదీల్లో ఐసెట్ జరిగింది. మొత్తం 75,952 మంది ఐసెట్కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 68,781 (90.56%) హాజర య్యారని, 7171 (9.44 శాతం) గైర్హాజరైనట్లు అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. ఐసెట్ ప్రాథమిక కీ ఆగస్టు 4న విడు దల చేస్తారని, అభ్యంతరాలు 8వ తేదీ వరకు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు. ఫైనల్ కీ, ఫలితాలు ఆగస్టు 22న విడుదల చేస్తారని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement