breaking news
TRS MP Jitender Reddy
-
బీజేపీలోకి జితేందర్రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మోదీ పాల్గొనే బహిరంగసభలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గత కొద్ది నెలలుగా జితేందర్రెడ్డి పార్టీ మారుతారన్న చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు జాతీయ నేతలతో సంబంధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లాలో మంత్రులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి జితేందర్రెడ్డి కారణమన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు ఉండటంతో పాటు మంత్రుల ఓటమికి జితేందర్రెడ్డి కారణమన్న ఉద్దేశంతో లోక్సభ ఎన్నికల్లో ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ సమయంలోనే డీకే అరుణ బీజేపీలో చేరడం, ఆమెకు మహబూబ్నగర్ టికెట్ ప్రకటించారు. అయితే బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపి రాజకీయ భవిష్యత్పై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా విముఖత వ్యక్తం చేసినా.. తర్వాత పార్టీలో చేరడానికి అంగీకరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులో మహబూబ్నగర్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అదే రోజు జితేందర్రెడ్డి బీజేపీలో చేరుతారని సమాచారం. -
సమయ నిర్ధారణ సాధ్యం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడానికి సమయ నిర్ధారణ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈమేరకు రాతపూర్వక జవాబిచ్చారు. 2011-12లోనే రెల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీని కేంద్రం మంజూరు చేసిందని, అయితే రవాణా అవసరాలను బట్టే ఈ కర్మాగారం ప్రారంభించడానికి సమయ నిర్ధారణ జరుగుతుందన్నారు. ప్రస్తుత అవసరాల మేరకు తగినన్ని వ్యాగన్లను ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని కర్మాగారాలు తయారు చేస్తున్నందు వల్ల కాజీపేట కర్మాగారం పనులను ప్రారంభించలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.152.26 కోట్లు గతంలో కేటాయించినప్పటికీ, 2014 మార్చి వరకూ వ్యయం కాలేదని, అయితే భవిష్యత్తులో రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు రద్దు కాకుండా 2015-16లో నామమాత్రపు కేటాయింపు జరిగినట్లు తెలిపారు. యూపీఎస్సీ నిపుణుల కమిటీ యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అర్హత, సిలబస్, పరీక్ష విధానం తదితర అంశాలను పరీక్షించడానికి బీఎస్ బాస్వాన్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, కమిటీ ఆరు నెలల వ్యవధిలో నివేదిక ఇస్తుందని చెప్పారు. మైనారిటీల స్థితిగతులపై... దేశంలోని మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఓబీసీలకు చెందిన 27 శాతం రిజర్వేషన్లలో సబ్కోటాగా మైనారిటీలకు 4.5 శాతాన్ని కేంద్రం కేటాయించిందని, అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిందన్నారు. ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉందని చెప్పారు. ఏపీ రాజధానికి విదేశీ సాయం కోరలేదు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధి కోసం రైల్వే నెట్వర్క్ను విస్తరించడానికి ఏ దేశంతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఏపీలో ప్రస్తుతం 17 నూతన రైల్వే లైన్లు, 14 డబ్లింగ్ పనులు సాగుతున్నాయని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని, 2014-15లో రూ.1,027 కోట్లు కేటాయించగా, 2015-16లో రూ.2,554 కోట్లు కేటాయించారన్నారు. నూతన రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవా ణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ-నర్సాపూర్ డబ్లింగ్ పనులు, విజయవాడ- కాజీపేట మూడోలైను, విజయవాడ బైపాస్, విజయవాడ-గూడూర్ మూడో లైనును చేపట్టామని చెప్పారు.