breaking news
The transport company
-
మనోళ్లు ముంబైకి... బీహారీయులు హైదరాబాద్కు
సిటీ బస్సుల నిర్వహణపై అధ్యయనం పేరిట పర్యటనలు ఇటీవలే ముంబై వెళ్లొచ్చిన తెలంగాణ బృందం హైదరాబాద్లో పరిశీలన కోసం నేడు బీహార్ బృందం రాక హైదరాబాద్: హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సుల తీరు అస్తవ్యస్తంగా ఉందని, ట్రాఫిక్ గందరగోళంగా ఉందని కొద్దిరోజుల క్రితం ఇక్కడి మంత్రులు, అధికారుల బృందం ముంబైలో అధ్యయనం చేయడానికి వెళితే... హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సుల నిర్వహణ బాగుందంటూ బీహార్ మంత్రి, అధికారుల బృందం బుధవారం ఇక్కడకు వస్తోంది. దేశంలోనే మంచి రోడ్డు రవాణా సంస్థగా పేరొందిన ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు వసతులు, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, జీపీఎస్ వంటి ఆధునిక వ్యవస్థల సేవలు పొందే విషయాల్లో ముంబై ఆదర్శంగా ఉందంటూ దాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డిల ఆధ్వర్యంలో ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీసు విభాగాల ఉన్నతాధికారులు ఈనెల 21, 22 తేదీల్లో ముంబైలో పర్యటించి వచ్చారు. అక్కడి వ్యవస్థ బాగా ఉందని గుర్తించి వాటిని హైదరాబాద్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పనుల్లో వారు బిజీగా ఉండగా హైదరాబాద్లో సిటీ బస్సుల నిర్వహణను పరిశీలించేందుకు బుధవారం తన ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి బృందం వస్తుందంటూ బీహార్ రవాణాశాఖ మంత్రి రామై రామ్ నుంచి సోమవారం ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డితో బీహార్ బృందం భేటీ ఏర్పాటుచేశారు. -
ఏకీకృత వ్యవస్థ అత్యవసరం
రవాణా విధానంపై డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అన్ని రవాణా సంస్థలను నియంత్రించగల ఏకీకృత రవాణా ప్రాధికార సంస్థ లేకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఎండీ మంగూసింగ్ అన్నారు. సమర్థంగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే పర్యావరణ, ఆర్థిక సంబంధిత సమస్యల పరిష్కారం సులువవుతుందని చెప్పా రు. ‘ఢిల్లీ రోడ్లపై సగటు వేగం ఒకే అంకెకు మిం చడం లేదు. మనం ఎడ్లబళ్ల కాలంవైపు వెళ్తున్నాం. అసమర్థ రవాణా వ్యవస్థే ఈ పరిస్థితికి కారణం. ఇందుకు ఏకీకృత రవాణా సంస్థ ఏర్పా టు అత్యవసరం’ అని డీఎం ఆర్సీ ఎండీ అన్నా రు. పట్టణ సామూహిక రవాణా, మెట్రో, లైట్రైల్పై చర్చ కోసం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో మంగూసింగ్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. చాలా దేశాల్లో నగర, మున్సిపల్ రవాణా సంస్థల నిర్వహణ బాధ్యత స్థానిక మేయర్ల చేతుల్లో ఉంటుందని తెలిపారు. ‘ఢిల్లీ నగరాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. అన్నింటి కంటే పెద్ద సమస్య ఇది. సమర్థంగా పనిచేసే ఏకీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటే దీనికి పరిష్కారం’ అని మంగూసింగ్ అన్నారు. తమ సంస్థ డీఎంఆర్సీ ప్రతినిత్యం 26 లక్షల మందికి సమర్థంగా సేవలు అందిస్తోందని ప్రశంసించారు. అందుకే జైపూర్, కొచ్చి, హైదరాబాద్, లక్నో, పుణే వంటి నగరాలు తమ సంస్థను ఆదర్శంగా తీసుకొని మెట్రో మార్గాలను నిర్మిస్తున్నాయని అన్నారు.