breaking news
traffic CI Srinivas
-
పిల్లలకు బైకిస్తే పెద్దలు జైలుకే..
సిద్దిపేటటౌన్ : మైనర్లు వాహనాలు నడుపుతూ వారి ప్రమాదాలకు గురవడమే కాకుండా, ఇతరులకు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు ఇటీవల అనేకం జరుగుతున్నారు. పిల్లలు ముచ్చట పడుతున్నారని, వారి సరదా తీర్చటం వారికి వాహనాలు ఇస్తే మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం పెద్దలను జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నడుపుతున్న మైనర్లను పట్టుకుని వారితో పాటు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మొదటి సారి పట్టుబడిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నారు. మరో సారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరంగా పరిగణించి వారి తల్లిదండ్రులను జైలుకు పంపించే అవకాశం ఉంది. కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు.. ఈ మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో వాహనాలు నడుపుతున్న మైనర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వాహనాలు నడుతుపూ పట్టుబడిన సుమారు 60 మంది మైనర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు పట్టుబడితే వారి చేత డ్రైవింగ్ లైసెన్స్కోసం స్లాట్ బుకింగ్ చేయించి, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. మైనర్లతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీరు ఉద్ధ్యేశ పూర్వంగానే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని రుజువైతే వారికి 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పిల్లల సరదా తీర్చడం కోసం వారికి వాహనాలు ఇస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని పోలీలసులు సూచిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులకు గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా వారి క్షేమం కోసం సరదాలను పక్కన పెట్టాలని పోలీసులు కోరుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు.. పిల్లలు మారాం చేసారని, ఇక్కడికి వరకే కదా అని వారికి వాహనాలు ఇస్తూ, అజాగ్రత్తగా వ్యవహరించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదు. డ్రైవింగ్ ఫర్ఫెక్ట్గా నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికే వాహనాలు ఇవ్వాలి. దీని వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎంవీ యాక్టు ప్రకారం మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడపడం చట్టప్రకారం నేరం. ఇలా నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్, సిద్దిపేట ట్రాఫిక్ సీఐ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రామగుండం : రామగుండం సమీపంలో.. మల్యాలపల్లి స్టేజీ వద్ద రాజీవ్హ్రదారి బైపాస్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఇద్దరు తాపీమేస్త్రీలు దుర్మరణం పాలయ్యారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లచ్చగూడెం గ్రామానికి చెందిన తోకచచ్చు రవీందర్రాజు ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీలో నివాసముంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా మద్దెరపాలెం మండలం చేకూర్తికి చెందిన తన్నీరు బాల కోటయ్య రామగుండంలోని అయోధ్యనగర్లో ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై బసంత్నగర్ నుంచి రామగుండం వస్తున్నారు. రాజీ వ్హ్రదారి విస్తరణ పనుల్లో భాగంగా మల్యాలపల్లి సబ్స్టేషన్ వద్ద వన్వే చేశారు. మల్యాలపల్లి స్టేజీవద్దకు రా గానే గోదావరిఖని నుంచి బసంత్నగర్ వైపు వస్తున్న కారును వేగంగా ఢీకొట్టారు. ఈ సంఘటనలో రవీందర్రా జు(40) అక్కడికక్కడే చనిపోయాడు. బాలకోటయ్య(42)ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనలో కారు, ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యాయి. తోక చచ్చు రవీందర్కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు దివ్యజ్యోతి, నాగజ్యోతి ఉన్నారు. బాలకోటయ్యకు భార్య రాధ, ముగ్గురు కూతుళ్లు అఖిల, సంధ్య, పూజ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రహదారి విస్తరణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొనడం గమనార్హం.