breaking news
Times Group
-
టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: ఇటీవల మరణించిన టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొని ఇందూ జైన్కు నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్(84) కరోనా మహమ్మరి బారినపడి ఈ నెల 13న కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్జీవోగా తీర్చిదిద్దారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన భారతీయ జ్ఞాన్పీఠ ట్రస్ట్కు 1999 నుంచి చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. చదవండి: Cyclone Yaas: ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్ -
సీనియర్ జర్నలిస్ట్పై క్రిమినల్ కేసులు
ముంబై: సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ నౌ ఛానల్ మాజీ సంపాదకుడు, న్యూస్ అవర్ యాంకర్ ఆర్నబ్ గోస్వామి మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న ఆర్నబ్ పై టైమ్స్ నౌ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది. తమ చానల్ కు సంబంధించిన సమాచార కాపీలను రిపబ్లిక్ టీవీలో మే 6, 8 తేదీలలలో అక్రమంగా వాడుకున్నారని మండిపడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అని పిలిచే బెన్నెట్, కోల్మన్ అండ్ కో లిమిటెడ్ గ్రూప్ ఆర్నాబ్ గోస్వామిపై దొంగతనం, క్రిమినల్ ఉల్లంఘన, ఆస్తి దుర్వినియోగం, బిసిసిఎల్ మేధోసంపత్తి హక్కుల వినియోగం కింద ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రిపబ్లిక్ టీవీ లాంచ్ అయిన మొదటి రోజు, ఆ తర్వాత లో తమకు సంబంధించిన కొన్ని ఫుటేజీ వాడుకున్నట్టు ఆరోపించారు. వారిద్దరూ తమ చానల్ ఉద్యోగులుగాఉన్నప్పటి సమాచారిన్నఅక్రమంగా వాడుకున్నారన్నారు. లాలు ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు షాబాబుద్దీన్ మధ్య ఉన్న ఫోన్ సంభాషణల ఆడియో టేపులను మే 6న , సునందా పుష్కర్ తో (కాంగ్రెస్ నాయకుడు శశి తారూర్ భార్య) అప్పటి తమ రిపోర్టర్గా ఉన్న ప్రేమా శ్రీదేవి ఫోన్ సంభాషణలను టేపులను రిపబ్లిక్ టీవీలో మే 8న వాడుకున్నారని పిర్యాదు చేసింది. ఈ రెండు ఫోన్ సంభాషణల ఆడియో టేపులను వారు ఉద్యోగం లో ఉన్నప్పటివని బీసీసీఎల్ ఆరోపించింది. గోస్వామి, శ్రీదేవి ఉద్దేశపూర్వకంగా టైమ్స్ నౌ మేధో సంపదను వాడుకోవడంపై భారత శిక్షాస్మృతిసెక్షన్ 403, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని కోరింది. కాగా గత నవంబర్లో టైమ్స్ కు రాజీనామా అనంతరం పేరుతో కొత్త చానల్ను రిపబ్లిక్ పేరుతో మే 6న లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.