three-year course
-
పేగు క్యాన్సర్ బాధితులకు వ్యాయామంతో మేలు
వాషింగ్టన్: నిత్యం వ్యాయామంతో పేగు క్యాన్సర్ బాధితులకు ఎంతో మేలు కలుగుతున్నట్లు తాజా అధ్యయనంతో తేలింది. కనీసం మూడేళ్లపాటు వ్యాయామం చేస్తే వారు వారు జీవించే అవకాశాలు చాలావరకు మెరుగవుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా వ్యాయమం చేసేవారికి ఈ క్యాన్సర్ సోకే పరిస్థితి ఉండదని అంటున్నారు. పేగు క్యాన్సర్కు చికిత్స పొందుతున్నవారు కసరత్తులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంగ్ల్లండ్, కెనడా, ఆ్రస్టేలియాలో ఈ అధ్యయనం నిర్వహించారు. 889 మంది బాధితులను పరిశీలించారు. వీరంతా పేగు క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ చికిత్స పొందినవారే. సగం మందికి వ్యాయామాలు చేయాలని సూచించారు. తగిన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. కానీ, వారు పెడచెవిన పెట్టారు. మిగిలిన సగం మందికి అధ్యయనకర్తలు కోచ్లను ఏర్పాటుచేశారు. కచ్చితంగా వ్యాయామాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నడక, ఈత వంటి ఎక్సర్సైజ్లతో శరీరాలను బాగా కదిలించినవారు చురుగ్గా మారడంతోపాటు పేగు క్యాన్సర్ ప్రభావం తగ్గిపోయినట్లు తేలింది. వ్యాయామం చేయనివారితో పోలిస్తే వీరి జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. -
టీవైయూపీలోనే ప్రవేశాలు
న్యూఢిల్లీ: మూడేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ)లోనే విద్యార్థులను చేర్చుకోవాలంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. తన ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలంటూ యూజీసీ ఆదేశించిందని, విద్యార్థులందరినీ మూడేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ) లోనే విద్యార్థులను చేర్చుకోవాలని కోరిందని రాజ్యసభకు లిఖితపూర్వక ంగా ఇచ్చిన జవాబులో ఇరానీ వెల్లడించారు. ఐదుగురు ప్రముఖ విద్యానిపుణులతో కూడిన సలహా కమిటీని యూజీసీ ఇటీవల నియమించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్పీఈ) విధానానికి నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్యూవైపీ) పూర్తిగా విరుద్ధమని సూచించిందన్నారు. దీంతో నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్వైయూపీ)ను ఉపసంహరించుకోవాలని డీయూ నిర్ణయించిందన్నారు. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్పీఈ) విధానానికి ఇబ్బందికరంగా పరిణమించే ఆర్డినెన్సులకు సంబంధిత యంత్రాంగం నుంచి ఎటువంటి ఆమోదమూ లేదని స్పష్టం చేశారు.