-
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు). నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయన్లుగా నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్రాజ్, నటి రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదలై హిట్టాక్ అందుకుంది. ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్ల క్లబ్లోకి చేరింది. చదవండి: కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తారక్ భార్య, ఫొటోలు వైరల్ కేవలం తమిళంలోనే కాదు తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో పాటు సన్నెక్ట్స్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న తరుణంలో ఓటీటీలోకి నెల రోజుల్లోనే రాబోతుందని వినికిడి. అంటే ఈ తాజా బజ్ ప్రకారం.. తిరుచిట్రంపళం(తిరు) సెప్టెంబర్ 17 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: ‘జల్సా’ రీ-రిలీజ్, థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్ Box Office Alert!#Dhanush, #NithyaMenen's film #Thiruchitrabalam zooms past Rs 100 crore mark Worldwide 🌐 🔥🔥 pic.twitter.com/McOAWvxxRJ — Hello South (@Hellosouth_in) September 1, 2022 -
Thiru Review: ‘తిరు’మూవీ రివ్యూ
టైటిల్ : తిరు నటీనటులు : ధనుష్, నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీఖన్నా, ప్రకాశ్ రాజ్, భారతీ రాజా తదితరులు నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్ నిర్మాతలు: కళానిధి మారన్ దర్శకత్వం: మిత్రన్ ఆర్. జవహర్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్ విడుదల తేది: ఆగస్ట్ 18, 2022 తమిళ స్టార్ హీరో ధనుష్కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ధనుష్ లేటెస్ట్ తమిళ్ మూవీ ‘తిరు చిత్రాంబళం’ కూడా తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదలైంది. ఎలాంటి ప్రచారం లేకుండా ఈ గురువారం(ఆగస్ట్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తిరు’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరు ఏకాంబరం అలియాస్ పండు(ధనుష్) ఓ మధ్య తరగతి యువకుడు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ తండ్రి(ప్రకాశ్ రాజ్), తాత సినియర్ తిరు(భారతీ రాజా)లతో కలిసి జీవిస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తండ్రిపై ద్వేషం పెంచుకొని, అతనితో మాట్లాడడమే మానేస్తాడు. అంతేకాదు ఆ సంఘటన కారణంగానే చదువుని మధ్యలో ఆపేసి, భయస్తుడిగా మారిపోతాడు. అతని క్లోజ్ ఫ్రెండ్ శోభన(నిత్యామీనన్). తిరు ఉండే అపార్ట్మెంట్ కిందే శోభన ఫ్యామిలీ ఉంటుంది. ఆమెతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. శోభన కూడా అని విషయాల్లోనూ తిరుకు తోడుగా ఉంటుంది. తిరు మనసుపడ్డ అమ్మాయిలు అనూష(రాశీఖన్నా), రంజని(ప్రియా భవానీ శంకర్) విషయంలోనూ శోభన సాయం చేస్తుంది. చివరకు తిరు ప్రేమని ఎవరు అంగీకరించారు? ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? ఎందుకు తండ్రితో మాట్లాడకుండా ఉన్నాడు? తిరులో ఉన్న భయాన్ని ఎలా అధిగమిస్తాడు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్లో ‘తిరు’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... కుటుంబ అనుభంధాలు, స్నేహం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తిరు’. ఈ తరహా కథలు తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ కథనాన్నే నేచురల్ సీన్స్తో ఆసక్తికరంగా నడిపించడం ‘తిరు’ స్పెషల్. కథ ప్రారంభం, తిరు నేపథ్యం ధనుష్ గతంలో నటించిన ‘రఘువరన్ బి.టెక్’సినిమాను గుర్తు చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా అలానే ఉంటుంది. ఇక తిరు, శోభన మధ్య సాగే స్నేహం, ప్రేమ తదితర సీన్స్ ‘నువ్వే కావాలి’సినిమా తరహాలో ఉంటాయి. పండు, శోభన పాత్రలు మాత్రం మనలో ఒకరిగా వ్యవహరిస్తాయి. అంత సహజంగా ఆ పాత్రలను తీర్చి దిద్దాడు దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్. తిరు, శోభనల మధ్య వచ్చే కొన్ని సీన్స్ నవ్వులు పూయిస్తాయి. తిరు అనూషని ప్రేమించడం, ఆ విషయంలో శోభన సాయం చేడయం తదితర రొటీన్ సీన్స్తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఆ సన్నివేశాలు మాత్రం సెకండాఫ్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేవు. అంతేకాదు సెకండాఫ్లో కథ ఎలా సాగుతుందనేది కూడా ప్రేక్షకుడు ఊహించవచ్చు. అయితే పల్లెటూరి నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ కామెడీని పండిస్తాయి. ఇక హీరో తండ్రిని ఎందుకు ద్వేషిస్తున్నాడో చెప్పే ఫ్లాష్బ్యాక్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ కూడా సింపుల్ ఉంటుంది. మనం చేసే ఒక చిన్న తప్పు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెరపై చూపించిన తీరు బాగుంది. తెలుగులో ధనుష్కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ.. ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ చేయపోవడం పెద్ద మైనస్. చాలా మందికి తెలుగులో ‘తిరు’సినిమా విడుదలైన విషయమే తెలియదు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం ధనుష్, నితామీనన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాకు వారే ప్రధాన బలం. తమదైన సహజ నటనతో ఇద్దరు ఆకట్టుకున్నారు. ప్రతి సీన్లో ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఒకనొక దశలో ధనుష్ని డామినేట్ చేసేలా నిత్యా యాక్టింగ్ ఉంటుంది. ఇద్దరు కూడా తమ తమ పాత్రల్లో నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ ఆయన పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడం పెద్ద మైనస్. ఇక ఇక్కడ భారతీ రాజా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీనయర్ పండు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా,ప్రియా భవానీ శంకర్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనిరుధ్ సంగీతం జస్ట్ ఓకే. గత సినిమాలో పోలిస్తే..ఇందులో పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సింపుల్గా ఉంటుంది. ఓంప్రకాశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం
‘‘చాణక్య’ సినిమా చాలా బాగా వచ్చింది. తొలిసారి గూఢచారి పాత్ర చేశా. ఈ సినిమాలో వినోదం, భావోద్వేగాలు, యాక్షన్.. అన్నీ సమపాళ్లలో ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటాం’’ అన్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ చెప్పిన విశేషాలు. ► తిరు చెప్పిన ‘చాణక్య’ స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందనే ఎగై్జట్మెంట్తో పాటు టెన్షన్ ఉంటుంది. ఇందులో ఎంటర్టైనింగ్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. మాస్, క్లాస్.. ఏ జోనర్ అయినా యాక్షన్ కామనే. ఇందులో మంచి యాక్షన్ ఉంది. మంచి సినిమా తీశామని యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ► ఈ సినిమాలో నా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామేన్ వెట్రి పళనిస్వామి నన్ను చాలా అందంగా చూపించారు. మంచి విజువల్స్ ఇచ్చారు. ‘గౌతమ్ నంద’లో గెడ్డంతో కనిపించినా, ‘చాణక్య’లో మాత్రం వేరే స్టైల్ గెడ్డంతో ఉంటా. సరదాగా నేను గెడ్డం పెంచాను. ఈ లుక్ చాలా బాగుందని తిరు చెప్పడంతో అదే కంటిన్యూ చేశాను. స్పై ఏజెంట్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో కథ ఉంటుంది. గతంలో వచ్చిన గూఢచారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు అర్జున్. రెండు షేడ్స్ ఉంటాయి. ► మాకు బాగా దగ్గరైన వారికి ‘చాణక్య’ ప్రివ్యూ వేశాం. వారంతా సినిమా చాలా బాగుందన్నారు. సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి కూడా ఇదే మాట వస్తుందనే నమ్మకం ఉంది. విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాని నా ఫ్రెండ్ ప్రభాస్ చూడలేదు. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ► ‘చాణక్య’ సినిమాని మేలో విడుదల చేయాలనుకున్నాం. అయితే చివరి రోజు షూటింగ్లో బైక్ స్కిట్ అవడంతో నాకు బాగా గాయాలయ్యాయి. దాంతో షూటింగ్ ఆగిపోయి, విడుదలకు మూడు నెలలు ఆలస్యం అయింది. ‘సైరా’ ప్యాన్ ఇండియన్ సినిమానే. అయితే దసరా పండగ సమయం కావడంతో రెండు మూడు సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మా చిత్రం కూడా విడుదల చేస్తున్నాం. ► నాకు కొంచెం సిగ్గెక్కువ. అందుకే సెట్స్లో త్వరగా ఎవరితోనూ మాట్లాడను. అది హీరోయిన్ అయినా? ఎవరైనా సరే. మన కెరీర్లో ఏ సినిమా ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. మా వరకూ కష్టపడి మంచి సినిమా చేస్తాం. విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. అయితే నా కెరీర్కి ‘చాణక్య’ సినిమా ప్లస్ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అందులో ఎటువంటి అనుమానం లేదు. ► మా సినిమాకి నేపథ్య సంగీతం వెన్నెముకలాంటిది. చక్కగా కుదిరింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్లోని డైలాగులకు మంచి స్పందన వస్తోంది. సినిమాలోనూ చాలా మంచి డైలాగులున్నాయి. నా కెరీర్లో చాలా మంది తమిళ డైరెక్టర్స్తో సినిమాలు చేశా. నాకు కథ ముఖ్యం.. భాష కాదు. డైరెక్టర్ తిరు మంచి ప్రతిభావంతుడు. తెలుగు నుంచి వెళ్లి తమిళ్లో సెటిల్ అయ్యాడు. తనతో పని చేయడం సౌకర్యంగానే అనిపించింది. అనిల్ సుంకరగారు ప్యాషనేట్ నిర్మాత. ప్రేక్షకులకు ఇంకా బాగా ఏం ఇవ్వగలం? అని ప్రతిరోజూ ఆలోచిస్తుంటారాయన. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ► మీరు ప్యాన్ ఇండియన్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్నకు గోపీచంద్ బదులిస్తూ.. ‘తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాలకు ఈ మధ్యే గేట్లు తెరుచుకున్నాయి. నిజంగా ఇది చాలా సంతోషం. సమయం వచ్చినప్పుడు చేద్దాం (నవ్వుతూ)’ అన్నారు. ప్రస్తుతం బిను సుబ్ర మణ్యం దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్గారి బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాకే సంపత్ నంది సినిమా మొదలవుతుంది. ఈ రెండూ మంచి కథలే. -
ఆ సినిమాతో పోలిక లేదు
‘‘మాది ఆంధ్ర–తమిళనాడు బోర్డర్లోని ఓ గ్రామం. మాకు చిత్తూరు కేవలం 29 కిలోమీటర్లు. దీంతో చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవిగారి సినిమాలు చాలా చూశాను’’ అని దర్శకుడు తిరు అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరు మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ శివ, నేను ఓ తమిళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేశాం. శివ దర్శకత్వం వహించిన ‘శౌర్యం’ చిత్రం నుంచి గోపీగారితో నాకు పరిచయం ఉంది. ‘శౌర్యం’ టైమ్లోనే గోపీగారితో ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలనుకున్నాను. ‘చాణక్య’ కథ ఆయనకు నచ్చడంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం స్క్రీన్ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైన ‘ఐ ఎస్ఐ, సీఐఏ, రా’ వంటి వాటి గురించి బాగా చదివాను. స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు? వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఇలాంటి చాలా విషయాలపై పరిశోధన చేసి కథ రాసుకున్నా. ఓ రకంగా ఈ సినిమా చేయడానికి రవీంద్ర అనే ఒక స్పై నాకు స్ఫూర్తి. వాస్తవికతకు దగ్గరగా, వాణిజ్య అంశాలు మిస్ కాకుండా తెరకెక్కించాను. రా ఏజెంట్ చూసినా సంతప్తి పడేలా ఈ చిత్రం ఉంటుంది. మా సినిమాని సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్’ చిత్రంతో పోల్చుతున్నారు. నిజానికి ఇది కొత్త కథ, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా చివరి రోజు ఫైట్ సన్నివేశంలో గోపీగారికి పెద్ద గాయం అయినా చాలా ధైర్యంగా ఉన్నారు. నిర్మాతలు, నేను ఈ చిత్రం విజయం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కానీ, ‘చాణక్య’ రిలీజ్ తర్వాత వాటి గురించి ఆలోచిస్తా’ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement