-
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం..
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది. పాక్కు చెందిన లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది అబ్ధుల్ రెహ్మన్ మక్కీని యూఎన్ఓ భద్రతా మండలి గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. భద్రతా మండలిలోని 1267 ఐఎస్ఐల్(దయిష్), ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద జనవరి 16న మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాక వారి ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ప్రయాణ, ఆయుధాలపై నిషేధం విధించింది. లష్కరే తోయిబా చీఫ్, ముంబాయి దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయిద్ బావనే రెహ్మాన్ మక్కీ. కాగా గతేడాది జూన్లో యూఎన్ఎస్సీ 1267 ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని ఐరాసలో భారత్ ప్రతిపాదించగా.. భారత్ ప్రతిపాదనకు చైనా అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, అమెరికా తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. జమ్మూ కశ్మీర్లో ఎల్ఈటీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో మక్కీ కీలక పాత్ర పోషించారు. అంతేగాక.. యువతను హింసకు ప్రోత్సహించడం, దాడులకు కుట్ర పన్నుతున్నాడని వెల్లడైంది. ఈ క్రమంలో తాజాగా అబ్దుల్ మక్కీని ఐరాస గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. ఇదిలా ఉండగా 2020వ సంవత్సరంలో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేశాడన్న కేసులో జైలు శిక్ష విధించింది. అయితే గతంలో కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం విధించడంలో చైనా అడ్డంకులు సృష్టించింది. యూఎన్ నిషేధించిన పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ- మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ను నిషేధించాలన్న ప్రతిపాదనలను డ్రాగన్ దేశం పదేపదే అడ్డుకుంది. -
అక్కడ ఉగ్రవాదులకు అపరిమిత స్వేచ్ఛ.. ఐరాస ఆందోళన
ఐరాస: కల్లోలిత అఫ్గానిస్తాన్లో ఉగ్రవాద మూకలు అంతులేని స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని, వాటికి ఎదురే లేకుండా పోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్లోని ఐసిస్ అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవాంట్–ఖోరాసన్’కు సనావుల్లా గఫారీ అలియాస్ సాహ బ్ అల్-ముజాహిర్ నేతృత్వం వహిస్తున్నాడు. గత ఏడాది కాబూల్ ఎయిర్పోర్టుపై దాడికి సంబంధించి గఫారీపై అమెరికా సోమవారం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
ఫేస్బుక్ ‘టెర్రర్’ వార్నింగ్..! పలు డాక్యుమెంట్లు లీక్..!
Facebook Secret List Leaked By Intercept: ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్స్, వ్యక్తులపై ఫేస్బుక్ కఠినమైన ఆంక్షలను విధిస్తోంది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థలను గుర్తించడానకి ఫేస్బుక్ మూడంచెల వ్యవస్థను కల్గి ఉంది. టెర్రరిస్ట్ , ద్వేషపూరిత గ్రూప్స్, క్రిమినల్ ఆర్గనైజేషన్ గ్రూప్లను ఫేస్బుక్ బ్లాక్ లిస్ట్లో పెట్టినట్లు ఇంటర్సెప్ట్ పేర్కొంది. చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే... ఇండియాలో నాలుగువేలకు పైగా... ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్స్, వ్యక్తులపై, తీవ్రవాద సంస్థలపై ఫేస్బుక్ కఠిన చర్యలను తీసుకుంటుంది. సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ సుమారు 4 వేలకు పైగా గ్రూప్స్ను, వ్యక్తుల ఖాతాలను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ తన ప్లాట్ఫారమ్లో అనుమతించని 'ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల(‘Dangerous Individuals and Organizations’)' జాబితా డాక్యుమెంట్లను ఇంటర్సెప్ట్ మంగళవారం రోజున లీక్ చేసింది. వీటిలో ఇండియన్ ముజాహిదీన్, జైషే-ఇ-మహమ్మద్, తాలిబన్లకు, సంబంధించిన గ్రూప్స్ ఇందులో ఉన్నాయి. ఇంటర్సెప్ట్ ద్వారా విడుదల చేయబడిన బ్లాక్లిస్ట్పై ఫేస్బుక్ స్పందించలేదు. సోషల్ మీడియానే ఆయుధంగా...! నేటి టెక్నాలజీ యుగంలో సోషల్మీడియా ఒక పదునైన ఆయుధం. సోషల్ మీడియాను సరైన దారిలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..అదే చెడు దారిలో వాడితే ఊహించలేని పర్యావసనాలు ఎదురవుతయ్యాయి. పలు ఉగ్రవాద సంస్థలు సోషల్మీడియాను ఒక ఆయుధంగా మార్చుకుంటూ తమ భావజాలాన్ని ముందుకు తీసుకేళ్తున్నారు. పలు సోషల్మీడియా సంస్థలు ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్లను, పేజీలను గుర్తించి వాటిని బ్లాక్లిస్ట్లో పెడుతుంటాయి. చదవండి: చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..! -
ఢిల్లీలో ఉగ్ర కలకలం..!
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ఉద్యమంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలక్నొ సంగతి తెలిసిందే. ఇదే అదునుగా ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు విపిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీ పోలీసులకు, ఐదుగురు వ్యక్తులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. వీరిలో కొందరికి టెర్రర్ గ్రూపులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని షాకార్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు పంజాబ్కు చెందిన వారు కాగా.. ముగ్గురు జమ్మూ కశ్మీర్కు చెందిన వారు ఉన్నారు. (చదవండి: రైతుల కోసం రోడ్డెక్కుతాం..) ఈ సందర్భంగా స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రమోద్ సింగ్ కుశ్వాస్ మాట్లాడుతూ.. ‘ఎన్కౌంటర్ తర్వాత ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. వీరి వద్ద నుంచి ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాము. వీరిలో కొందరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధ ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దీని గురించి విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని తెలిపారు -
11 ఉగ్ర సంస్థలపై ఆంక్షలు
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరును అమెరికా ముమ్మరం చేసింది. అల్కాయిదా దాడులు (9/11) జరిగి 18 ఏళ్లు అయిన సందర్భంగా ట్రంప్ ప్రభుత్వం బుధవారం సుమారు 11 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన ముఫ్తీ నూర్ వలీ మెహ్సూద్పై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ముల్లా ఫజల్ మరణం తరువాత గత ఏడాది జూన్ నుంచి నూర్ వలీ టీటీపీకి నేతృత్వం వహిస్తున్నారని, పలు ఉగ్రదాడులకు కారణమైన అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆంక్షల ఉత్తర్వుల కారణంగా ఈ ఉగ్రవాదులను వెతికిపట్టుకోవడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఉగ్రవాద శిక్షణలో పాల్గొన్న వారిని బంధించడం సులువు అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మంచిన్ తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు సాయం అందించే, వారితో ఆర్థిక వ్యవహారాలు జరిపే ఆర్థిక సంస్థ లపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు వీలుగా బుధవారం కొన్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మంచిన్ తెలిపారు. ఇరాన్లోని కుడ్స్ ఫోర్సెస్, హమాస్, ఐసిస్, అల్ఖైదా వాటి అనుబంధ సంస్థలపై ఈ ఉత్తర్వుల ప్రభావం ఉంటుందని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement