breaking news
Telangana Maharashtra
-
సరిహద్దుపై డేగ కన్ను
వేమనపల్లి: దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేపై మావోలు దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. దీం తో తెలంగాణ మహారాష్ట్ర, ఛతీస్గఢ్ సరిహద్దు ప్రాణహిత, గోదావరి నదీ తీరం వెంటా డేగకళ్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా గ్రా మాలు అప్పటికే పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లి పోయాయి. ప్రాణహితానది అవతలి వైపున్న గడిచిరోలి జిల్లా అభయారణ్యం మావోయిస్టులకు షెల్టర్జోన్. ఎతైనా.. గుట్టలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఎన్నికల స మయంలో మావోలు తమ ఉనికి చాటుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాలు నిఘా తీవ్రతరం చేశాయి. ఎన్నికల ప్రక్రియకు మాత్రం ఆటంకం కలగకుండా అన్ని పీఎస్లపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంట రామగుండం పోలీస్కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షితా కే. మూర్తి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చో టులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గ్రామాల్లో ఓటింగ్ సరళి పెంచేందుకు గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మా ర్చి 26న తీరం వెంట భారీ కూబింగ్ నిర్వహించారు. అదే రోజు ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రా మస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుహక్కు ప్రాధాన్యత, మావోల ప్రజావ్యతిరేక విధానాలపై వివరించారు. ప్రాణహిత ఫెర్రీపాయింట్ల వద్దకు డ్రోన్ కెమెరాల సహాయంతో తీరం వెంట గస్తీ నిర్వహిస్తున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర నిఘా.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రాణాహిత తీరం వెంట నిరంతర నిఘా కొనసాగుతోంది. జిల్లాలో 53 ఒకప్పటి మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో 98 పోలింగ్స్టేషన్లున్నాయి. సుమారు 88 మంది మావోయిస్ట్ మాజీ సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లు ఉన్నారు. వీరందరితో సమావేశాలు నిర్వహించి, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని వారిని బైండోవర్ చేశారు. నది వెంట 16 ఫెర్రీ పాయింట్లుండగా వచ్చి పోయే ప్రయాణికుల మీద దృష్టి సారించారు. పడవలు నడిపే బోట్రైడర్లు, జాలరులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు అనుమానిత వ్య క్తుల సమాచారం తెలుసుకుంటున్నారు. యాక్షన్టీంలాంటి వాటి సంచారాన్ని తిప్పికొట్టేందుకు కౌంటర్ యాక్షన్ టీం, క్యూఆర్టీ, టాస్క్ఫోర్స్ టీం లను ఏర్పాటు చేశారు. యాక్షన్టీం సభ్యుల ఫొటోలను గ్రామాల్లో గోడలపై అంటించి వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేయిస్తున్నారు. సరిహద్దు వెంట ఉన్న సుమారు 284 కల్వర్టులను ప్రత్యేకపోలీస్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలను నిర్వహించారు. -
‘మైకు’కు ‘లాఠీ’అండ
వేమనపల్లి(బెల్లంపల్లి): మూడు రోజుల క్రితం బెల్లంపల్లిలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలియడం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు పెంచారు. శనివారం బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 7గంటలకే తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత తీరం వెంటనున్న కల్లంపల్లి, ముక్కిడిగూడెం, జాజులపల్లి గ్రామాల్లో ప్రచార కార్యక్రమం ఆరంభమైంది. డీసీపీ వేణుగోపాల్రావు ఆదేశాలతో చెన్నూర్ రూరల్ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయా గ్రామాల్లో పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. అనుమానిత, అపరిచిత వ్యక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. 12 కిలోమీటర్ల దారి పొడవునా కల్వర్టులు, రోడ్డును క్షణ్ణంగా పరిశీలించారు. కూతవేటు దూరంలో ఉన్న ప్రాణహిత ఫెర్రీ పాయింట్ (ఘాట్)లపై దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణకు పడవల ద్వారా రాకపోకలు సాగించేవారిపై నిఘా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మహారాష్ట్ర తెలంగాణ మంచ్ ఆధ్వర్యంలో ‘వారధి’
ముంబై సెంట్రల్: మహారాష్ట్ర తెలంగాణ మంచ్, ఎంటిఎం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వారధి అనే పేరుతో హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. జూలై నాలుగున జరగనున్న కార్యక్రమం కోసం శుక్రవారం వర్లి (ముంబై) నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావ్ పాల్గొననున్నారు. మహారాష్ట్ర మరాఠీ, తెలుగు తెలంగాణ ప్రజలకు ఈ కార్యక్రమం వారధిగా నిలుస్తుందని ఎంటిఎం అధ్యక్షుడు గంజి జగన్బాబు, ప్రధాన కార్యదర్శి కంటే అశోక్లు ఒక ప్రకటనలో తెలిపారు.