-
స్వామి వివేకానంద బాటలో నడవాలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తి బాటలో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్లు వివేకానంద చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చిన్నతనంలోనే అనేక విషయాలపై పట్టు సాధించిన వ్యక్తి అని అన్నారు. పొన్నంకు క్రిబ్కో చైర్మన్ సన్మానం.. ఢిల్లీ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రపాల్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి
నాసిక్: దేశంలో వారసత్వ రాజకీయాల ప్రభావాన్ని తగ్గించాల్సిన బాధ్యత యువతరంపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం వారంతా వెంటనే ఓటర్లుగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మన దేశపు 21వ శతాబ్దపు యువత అత్యంత అదృష్టవంతులని పేర్కొన్నారు. అమృత కాలంలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే అద్భుత అవకాశం వారికి లభించింది’’ అన్నారు. మహారాష్ట్రలో నాసిక్లోని తపోవన్ మైదానంలో శుక్రవారం 27వ ‘నేషనల్ యూత్ ఫెస్టివల్’ను మోదీ ప్రారంభించారు. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ తల్లి జిజాబాయి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. మాదక ద్రవ్యాలకు, అసభ్య పదజాలానికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. యువతకు కర్తవ్య కాలం రాబోయే 25 ఏళ్ల అమృత కాలం యువతకు ‘కర్తవ్య కాలం’ అని మోదీ ఉద్ఘాటించారు. యువత ఓటు ద్వారా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు ఎంతగా పాల్గొంటే దేశ భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుందన్నారు. వారసత్వ రాజకీయాల ప్రభావమూ అంతగా తగ్గిపోతుందన్నారు. అరబిందో, వివేకానంద గొప్పతనాన్ని, వారు అందించిన సేవలను ప్రస్తావించారు. నాసిక్ రామకుండ్లో పూజలు మోదీ శుక్రవారం మహారాష్ట్రలో నాసిక్లోని శ్రీ కాలారామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. రామ్కుండ్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు నగరంలో రోడ్ షోలో పాల్గొన్నారు. తర్వాత గోదావరి తీరంలోని రామ్కుండ్ వద్ద సంప్రదాయ తలపాగా ధరించి పూజలు చేశారు. జల పూజ, హారతిలో పాలుపంచుకున్నారు. అఖిల భారతీయ స్వామి సమర్థ్ గురుకుల పీఠం అధినేత అన్నాసాహెబ్ మోరే, కైలాస్ మఠాధిపతి స్వామి సంవిదానంద సరస్వతి, తుషార్ బోసలేను కలుసుకున్నారు. తర్వాత పంచవటిలోని ప్రఖ్యాత కాలారామ్ మందిరంలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మోదీ శ్రమదానం చేశారు. చీపురు చేతపట్టి పరిసరాలను చెత్తాచెదారం ఊడ్చేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ 1930 మార్చి 2న ఇదే మందిరంలో అంబేడ్కర్ తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం రూ.30,000 కోట్ల పై చిలుకు విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధాని మోదీ 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట శుక్రవారం నుంచి 11 రోజుల అనుష్ఠానం ప్రారంభించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘నాకు చాలా ఉద్వేగంగా ఉంది. జీవితంలో తొలిసారిగా ఇలాంటి భావాలు నా మదిలో వెల్లువెత్తుతున్నాయి. వాటిని అనుభూతి చెందగలను తప్ప మాటల్లో వ్యక్తీకరించలేను. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరికీ, రామ భక్తులకు పవిత్ర సందర్భం. గొప్ప వేడుక. ఈ అరుదైన సందర్భానికి ప్రత్యక్ష సాక్షిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. బాలరాముడి ప్రాణప్రతిష్టకు భారతీయులందరి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి భగవంతుడు నన్ను సాధనంగా ఎంచుకున్నాడు. నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. అనుష్ఠానంలో భాగంగా మోదీ నిత్యం సూర్యోదయానికి ముందే మేల్కొంటారు. యోగా, ధ్యానం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాతి్వకాహారమే స్వీకరిస్తారు. ‘అటల్ సేతు’ ప్రారంభం ముంబై: 21.8 కిలోమీటర్లతో అత్యంత పొడవైన సముద్ర వారధి ‘అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ–నవా షివా అటల్ సేతు’ను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ‘వికసిత్ భారత్’కు ఈ సేతు ఒక ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ఈ ఆరు లేన్ల బ్రిడ్జి మహారాష్ట్రలో దక్షిణ ముంబై–నవీ ముంబైని అనుసంధానిస్తుంది. -
వికసిత భారత్ లక్ష్య సాధనకు యువతే కీలకం
స్వామి వివేకానంద, 19వ శతా బ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యా త్మిక నాయకుడు, గొప్ప ఆలోచనా పరుడు, వక్త, కవి, యువతకు మార్గనిర్దేశకుడు. ప్రపంచ పునరు త్పాదకతకు యువతను చోదక శక్తిగా ఆయన భావించారు. యువ తలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన శక్తిని ఉదాత్తమైన ఆదర్శాల వైపు మళ్లించడం ద్వారా సమాజంలో గొప్ప పరివర్తన తీసుకు రావచ్చని ఆయన నమ్మారు. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం వంటివి యువత అభివృద్ధికి అవసరం అని నొక్కి వక్కాణించారు. ఆధునిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాల చక్కటి సమ్మేళనాన్ని పెంపొందించు కోవాలని ఆయన యువతను ప్రోత్సహించారు. విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతోపాటూ సామాజిక బాధ్య తనూ, స్వావలంబననూ పెంపొందించాలని వాదించారు. స్వామి వివేకానందుని జయంతిని ప్రతి ఏడాదీ జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. నిర్భయులూ, నిస్వార్థపరులూ, మానవ సేవకు కట్టుబడి ఉండేవారుగా యువతరాన్ని స్వామి అభివర్ణించారు. నిర్భాగ్యులకు సేవ చేయడం అంటే దేవునికి నిజ మైన సేవ చేసినట్లని ఆయన బలంగా నమ్మారు. మాతృభూమికి, ప్రజానీకానికి సేవ చేసేందుకు దేశంలోని యువత దృఢ సంకల్ప శక్తిని కలిగి ఉండాలన్నారు. ‘మీరందరూ, ఎక్కడ ప్లేగు లేదా కరువు వ్యాప్తి చెందినా, లేదా ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారో అక్కడికి వెళ్లి, వారి బాధలను తగ్గించండి’ అని యువతకు పిలుపునిచ్చారు. స్వామి 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ‘వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్’(ప్రపంచ మతాల సమ్మేళనం)లో చేసిన ఉపన్యాసం వివిధ మతాలకు చెందిన వారిపై చెరగని ముద్ర వేసింది. తన హృదయాంతరాళం నుంచి పెల్లుబికిన భాతృభావంతో ‘అమెరికా సోదరీ, సోద రులారా’ అని సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతే... ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్లు ప్రేక్షకుల నుంచి చప్పట్ల మోత! ‘మీరు మాకు అందించిన సాద రమైన అపురూప స్వాగతానికి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సన్యాసుల తరఫునా, మతాలకే మాత అయిన మతం తరఫునా, హిందూ మతానికి చెందిన అన్ని వర్గాలూ, తెగలకు చెందిన లక్షలాదిమంది ప్రజల తరఫునా పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు. అలాగే ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ బోధించిన మతానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడంతోపాటూ అన్ని మతా లనూ నిజమైనవిగా అంగీకరిస్తాం... భూమిపై ఉన్న అన్ని మతాలకూ, దేశాలకూ చెందిన బాధితులకూ, శరణార్థు లకూ ఆశ్రయం కల్పించిన దేశానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను’ అని ఎలుగెత్తి చాటారు. ‘ఎరైజ్, ఎవేక్, అండ్ స్టాప్ నాట్ అంటిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్’ (లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి) అని స్వామి ఇచ్చిన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ‘మీరు లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించరు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చరు. మీ సొంత ఆత్మ తప్ప మరొక గురువు లేడు’ అని బోధించారు. ఒక దేశ బలం, శక్తి దాని యువత చేతుల్లోనే ఉందని నొక్కి చెప్పారు. ఆయన దృష్టిలో యువత సానుకూల మార్పుకు దీపధారులు. మంచి భవిష్యత్తును రూపొందించడానికి అవ సరమైన శక్తి, ఉత్సాహం, సృజనాత్మకతను కలిగి ఉండే వారు. ‘మీరు బలహీనులని భావించడం మహాపాపం... విశ్వంలోని అన్ని శక్తులూ ఇప్పటికే మనవి. కళ్లకు అడ్డుగా చేతులు పెట్టుకొని అంతా చీకటి అని ఏడ్చేదీ మనమే. మీ జీవితంలో రిస్క్ తీసుకోండి. మీరు గెలిస్తే, మీరే నాయకత్వం వహించవచ్చు; మీరు ఓడిపోతే, మీరు మార్గనిర్దేశం చేయవచ్చు’ అంటూ స్వామి ఇచ్చిన అద్భుత మైన సందేశాలు యువతకు అనుసరణీయాలు. యువత శారీరకంగానూ, మానసికంగానూ దారు ఢ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు స్వామి. వారు క్రీడా మైదానాలకు వెళ్లాలన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, విశాల హృదయాలు కలిగిన యువతను ఆయన కోరుకున్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 21వ శతాబ్దం భారత్ శతాబ్దం కావడానికి మోదీ కృషి చేస్తు న్నారు. ఐఎమ్ఎఫ్ అంచనా ప్రకారం భారత్ జీడీపీ 5 ట్రిలి యన్ డాలర్లు దాటినందున, మనది నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే 2027 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 2047 నాటికి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశానికి సంబంధించిన అన్ని లక్షణాలతో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడా నికి సిద్ధంగా ఉంది. ఇలా ‘వికసిత్ భారత్’ సాకారం కావా లంటే యువత కీలక పాత్ర పోషించవలసి ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అనేక మైలు రాళ్లను చేరుకుంది. ‘చంద్రయాన్’ అంతరిక్ష రంగంలో సాధించిన ప్రగతికి ఒక ఉదాహరణ. డిజిటల్ ఆవిష్కరణ పట్ల దేశం నిబద్ధతను చాటిచెప్పే ఆధార్, యూపీఐ, ఏఏ స్టాక్, కొవిన్ ప్లాట్ ఫారమ్ వంటి వాటి వల్ల భారతదేశ డిజి టల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. భారత్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మారే దిశగా అడుగులు వేస్తోంది. మన సేవల రంగం, ముఖ్యంగా ఐటీ, ఐటీయేతర డొమైన్లలో ప్రపంచ ప్రాముఖ్యం కలిగి ఉంది. 300 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విలువ కలిగిన 100 యునికార్న్లను భారత్ కలిగి ఉండి, ప్రపంచంలోని మూడవ–అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యా వరణ వ్యవస్థగా నిలిచింది. ఈ ‘అమృత్ కాల్’ సందర్భంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ను రూపొందించడానికి స్వామి వివేకా నంద బోధనలను ఉపయోగించుకుందాం! - వ్యాసకర్త హరియాణా గవర్నర్ -
నారీ యువ శక్తి గెలుస్తుంది
‘లే.. మేలుకో... లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించకు’ అన్నారు స్వామి వివేకానంద. ‘వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్నాడాయన. మన దేశంలో 15–25 ఏళ్ల మధ్య యువత 20 కోట్లు. వీరిలో 10 కోట్ల మంది యువతులు. ఇంటర్ వయసు నుంచి ఉద్యోగ వయసు మీదుగా వివాహ వయసు వరకు అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు. వివక్షలు. ప్రతికూలతలు. కాని నారీ యువశక్తి వీటిని ఛేదించి ముందుకు సాగుతోంది. జనవరి 12– స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే ‘జాతీయ యువజన దినోత్సవం’ యువతులకు స్ఫూర్తినివ్వాలి. మార్గం చూపాలి. అంతరిక్షాన్ని చుంబించాలనుకున్న ఒక తెలుగు యువతి ఆ ఘనతను సాధించడం చూశాం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ వెళ్లి కాలేజీ బస్సెక్కడానికి పోకిరీల బెడదను ఎదుర్కొంటున్న యువతి నిస్సహాయతను కూడా చూస్తున్నాం. ఇద్దరూ యువతులే. ఒకరు సాధిస్తున్నారు. మరొకరు సాధించడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు బిందువుల మధ్యే భారతీయ టీనేజ్ అమ్మాయిలు, యువతులు తమ గమనాన్ని కొనసాగిస్తున్నారు. ‘కెరటం నాకు ఆదర్శం లేచినా పడినందుకు కాదు... పడినా లేచినందుకు’ అంటారు స్వామి వివేకానంద. గత మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయ యువతులు పడినా లేచే ఈ సంకల్పాన్నే ప్రదర్శిస్తున్నారు. బాల్య వివాహాలను నిరాకరిస్తున్నారు. చదువు వైపు మొగ్గుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మధ్యతరగతి, ఆ పై తరగతుల్లో ఎక్కువగా ఉంటే దిగువ, పేద వర్గాలలో సంఘర్షణ కొనసాగించాల్సి వస్తోంది. దేశంలో ఇంకా చాలాచోట్ల సరైన టాయిలెట్లు లేని బడులు, సురక్షితం కాని రహదారులు, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో లేని పరిస్థితులు ఆడపిల్లలను స్కూల్ విద్యకు దూరం చేస్తున్నాయి. కాలేజీ వయసులోకి రాగానే తల్లిదండ్రులు తమ అమ్మాయి ‘ఎటువంటి ప్రభావాలకు లోనవుతుందో’ అనే భయంతో పెళ్లి చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేటి యువతులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసైనా సరే ముందు మేము నిలదొక్కుకోవాలి... తర్వాతే వివాహం వైపు రావాలి అని చాలాచోట్ల గట్టిగా గొంతు విప్పగలుగుతున్నారు. ‘నీ వెనుక ఏముంది... ముందు ఏముంది నీకనవసరం... నీలో ఏముంది అనేది ముఖ్యం’ అన్నారు వివేకానంద. ఇవాళ యంగ్ అడల్ట్స్లోగాని, యువతులలోగాని ఉండాల్సింది ఈ భావనే. ముందు తమను తాము తెలుసుకోవాలి. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. దానిని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాని నేటి సమస్య ఏమిటంటే యువతులకు తాము ఏమిటో తెలిసినా తల్లిదండ్రుల ఆకాంక్షలకు తల వొంచాల్సి వస్తోంది. మరోవైపు వారి మీద అటెన్షన్, నిఘా, వేయి కళ్ల కాపలా... ఇవన్నీ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘అదొద్దు ఇది చెయ్’ అని అమ్మాయికి చెప్పినంత సులువుగా అబ్బాయికి చెప్పలేని పరిస్థితి నేటికీ ఉందన్నది వాస్తవం. దాంతో పాటు తల్లిదండ్రులు, చుట్టాలు, సమాజం ఆడపిల్లల విషయంలో వారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలన్న అంచనా వారిని బాధిస్తోంది. కాని వారికి ఇంట్లో, విద్యాలయాల్లో సరైన దిశ దొరికితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఇవాళ టెక్నికల్ విద్యలో, మెడిసిన్లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎంచుకుని మరీ ర్యాంకులు సాధిస్తున్నారు. మరోవైపు మేనేజ్మెంట్ రంగాల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యువతులు రాణిస్తున్నారు. కళారంగాలను ఎంచుకుంటున్నారు. సినిమా రంగ దర్శకత్వ శాఖలో గతంలో యువతులు కనిపించేవారు కాదు. ఇవాళ చాలామంది పని చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వారి దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉంది. మనం చేయవలసిందల్లా వారు కనుగొన్న మార్గంలో వారిని వెళ్లనివ్వడమే. ‘జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు వివేకానంద. ‘ఆడపిల్ల... రిస్క్ ఎందుకు’ అనే మాట గతంలో ఉండేది. ఇవాళ కూడా ఉంది కాని ఎందరో యువతులు ఇవాళ పోలీస్, రక్షణ దళాలలో పని చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఎగరేస్తున్నారు. యుద్ధ ఓడలు నడుపుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగుతూ ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాల్సి ఉంది. పర్వతారోహకులుగా, సోలో ట్రావెలర్సుగా, హెవీ వెహికిల్స్ డ్రైవర్లుగా, ప్రమాదకరమైన అసైన్మెంట్లు చేసే జర్నలిస్టులుగా ఇలా నేటి యువతులు అద్భుతాలు సాధిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు మోగుతున్న చోట నిలబడి వారు రిపోర్టింగ్ చేసే సన్నివేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆశించిన యువత ఇదే. ఇలాంటి యువతకు సమాజం, కుటుంబం దన్నుగా నిలవడమే చేయాల్సింది. ‘మనం ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు’ అన్నారు వివేకానంద. స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నిర్మాణం అవుతుంది. తద్వారా సమాజ నిర్మాణం అవుతుంది. ఆపై దేశ నిర్మాణం అవుతుంది. నేటి యువతులు కేవలం విద్య, ఉపాధి రంగాలలో రాణించడం కాకుండా ప్రపంచ పరిజ్ఞానం కలిగి, సామాజిక పరిణామాలు గమనిస్తూ, పాటించవలసిన విలువలను సాధన చేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలలో కూచునే శక్తి సామర్థ్యాలు పుణికి పుచ్చుకోవాలి. యువశక్తి దేశాన్ని నడిపించాలి. కాని నేటి సోషల్ మీడియా వారిని విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ‘హ్యాపెనింగ్’గా ఉండమని ఛోటోమోటా సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలినవారిని ఇమిటేట్ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువతులు డిప్రెషన్లోకి వెళ్లాల్సి వస్తోంది. ‘మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అన్నారు వివేకానంద. నేటి యువ మహిళా శక్తి ఈ మాటను తప్పక గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. మరిన్ని విజయాలు సాధించాలి. మొదటి అడుగులోనే... సక్సెస్ అయ్యాక సొసైటీ నుంచి పొగడ్తలు వస్తాయి. అదే, ముందే ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నేను, నా బిజినెస్ పార్టనర్ శ్రుతి బీటెక్లో స్నేహితులం. ఇద్దరం కలిసి ‘మాయాబజార్’ అని ఫొటోషూట్ స్టూడియోను ప్రారంభించాం. మేం ప్రారంభించినప్పుడు ఈ బిజినెస్లో పెద్దగా పోటీ లేదు. ఇప్పుడు మేం సక్సెస్ అయ్యాం. అందరూ వచ్చి అమ్మాయిలు ఇంత బాగా చేశారు. ఎంత కష్టపడ్డారు... అని అంటుంటారు. కానీ, దీని ప్రారంభంలో మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ఇద్దరి అమ్మానాన్నలు నమ్మారు. డబ్బుల విషయం ఒక్కటే కాదు. అమ్మాయిలు సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటే అందుకు చుట్టుపక్కల అంతా మంచి మద్దతు లభించాలి. మా టెక్నిషియన్స్, వర్కర్స్.. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, మొదట్లో లేదు.‘వీళ్లు అమ్మాయిలు కదా ఏం చేస్తారు?’ అనే ఆలోచన ఉంది. మమ్మల్నే నేరుగా అనేవారు. డబ్బులు పెట్టినా సరే, దాదాపు పదిమందిని అడిగితే ఒకరు ముందుకు వచ్చేవారు. హార్డ్వర్క్ చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు సమాజం నుంచి ‘మీరు అమ్మాయిలు కదా! ఎందుకు మీకు కష్టం..’ అనే అభిప్రాయం వస్తుంది. మొదటి వ్యక్తి నుంచే సరైన రెస్పాన్స్ వస్తే.. అమ్మాయిలు సొంతంగా ఎదగడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. – అనూష, శ్రుతి ‘అమ్మాయి కదా’ అని... అమ్మాయిలు వర్కర్స్తో పనిచేయించాలన్నా, ఆర్డర్స్ తీసుకునేటప్పుడు, పేమెంట్ తిరిగి రాబట్టుకోవడానికి.. అన్ని విధాల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అమ్మాయి కదా, ఏం కాదులే! అని తేలికగా తీసుకుంటారు. సింగిల్గా ఎదగాలంటే అబ్బాయిలకు ఉన్నంత సపోర్ట్ ఈ సొసైటీలో అమ్మాయిలకు లేదు. అందుకే ప్రతిభ ఆధారంగానే నా పనితనాన్ని చూపుతాను. మార్కెట్ను బట్టి 3–4 ఛాయిస్లు వినియోగదారులకు ఇస్తాను. ఇంటీరియర్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏ వస్తువును ఎలా సర్దుకోవాలో అమ్మాయిలకే బాగా తెలుసు. ఆ విధంగా కూడా నా వర్క్ను చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో మా కుటుంబం నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ద్వారా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ‘నేను అమ్మాయిని’ కాదు, నా పనిని ఒక వృత్తిగా భావించండి అని చెప్పుకోవాల్సి రావడం బాధగా ఉంటుంది.ఈ విధానంలో మార్పు అవసరం. – కాత్యాయని, ఇంటీరియర్ డిజైనర్ -
విశిష్ట శ్రేణి.. వివేక వాణి
స్వామి వివేకానంద జన్మ దినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నాము. ఈ పావన భారత దేశంలో వృత్తి ఏదైనా ధార్మికతే అంతస్సూత్రం. ఈ గడ్డ మీద ఎందరో సాధు సంతులు,సన్న్యాసులు జన్మించి జాతికి మార్గదర్శకం చేస్తూ వచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ సర్వోత్కృష్టమైన అన్వేషణలో కపట వేషధారులు. కూడా, తులసి వనంలో గంజాయి మొక్కల్లా పుట్టుకు వస్తున్నారు. అలాంటి కపట వేషగాళ్ళను గురించి శ్రీ ఆది శంకరాచార్యుల. ప్రముఖ శిష్యుడు తోటకాచార్యులు ఇలాగన్నారు. జటిలో ముణ్డీ లుంచిత కేశః కాషాయంబర బహుకృత వేషః పశ్యనపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః జడలు కట్టిన వెంట్రుకలతో నొకడు, నున్నగా గుండు కొట్టించు కున్నవాడు మరొకడు, కాషాయ వస్త్రాలు కట్టిన వాడు వేరొకడు పొట్ట కోసం వేషాలువేస్తూ అమాయ కులను దోచుకుంటున్నారు. "భగవన్మార్గంలో బూటకము ఎప్పటికీ మంచిది కాదు. బూటకపు వేషధారణ సరి కాదు. మనస్సు వేషానికి తగ్గట్లు లేనట్లయితే అది క్రమేణా పతనం చెందుతుంది" అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. సన్న్యాసుల్లో విశిష్టుడు, శ్రేష్టుడు అయిన పరివ్రాజకుడ్ని భారత మాత మనకు ప్రసాదిం చడం మన మహా భాగ్యం. ఒక పర్యాయం భారతీయ సంతు పురు షుడు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం కళాశాల విద్యార్ధులకు భారతీయ సంస్కృ తిని ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలియ జెప్తున్నాడు. భారతీయ సంస్కృతి, ధర్మాలు వైజ్ఞానిక పరమైన సంబంధం ఉందని అతడు చెప్పాడు. అందువలనసంస్కృతిని,ఆధ్యాత్మ కతను విజ్ఞానంతో మేళవించి చూడటం భారత దేశంలో పరిపాటి అన్నాడు. అంతలో ఒక విద్యార్థి అసహనంగా లేచాడు. ఆ విద్యార్ధి వ్యంగ్యంగా ఇలా ప్రశ్నించాడు "మీరు వైజ్ఞానిక దృక్పథం తోనే మీ లక్షీదేవికి వాహ. నంగా గుడ్లగూబను సమకూర్చారా మహా శయా! గుడ్లగూబ పగలు చూడలేదుఅలాంటి పగలు అంధత్వం గల గుడ్లగూబ సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి వాహనం కావ డంలో ఏ విజ్ఞాన తర్కం దాగివుంది?"అది ఆ విద్యార్ధి ప్రశ్న. వెంటనే ఆ సత్పురుషుడు శాంతంగా ఇలా జవాబిచ్చాడు. "మా బారత దేశవాసులు మీ పశ్చిమ దేశవాసుల్లా ధనమే సర్వ సుఖాలకు మూలం అనుకోరు. అందు వలన ధనం వెంట పడ రాదని మా ఋషి మునులు మా జాతిని హెచ్చరించారు. సంపదలను కొదువ లేకుండా అధర్మంగా సంపాదిస్తే మనిషి గుడ్లగూబలా గుడ్డివాడు అవుతాడు. అంటే కళ్ళు ఉన్నా అతనికి చూపు లోపిస్తుంది.అతడ్నిధనగర్వం అనే అంధకారం ఆవహిస్తుంది. ఆ సంకేతాన్ని ఇవ్వడానికి వైజ్ఞానిక దృక్పదంతో సంపదల అధిదేవత అయిన మా లక్ష్మీ దేవికి గుడ్లగూబ ఉపయుక్తమైన వాహనం అని మా విజ్ఞులు అభిప్రాయ పడ్డారు." ఆ జవాబు విన్న సభా సదుల కరతాళ ధ్వనులతో సభమార్మ్రోగింది. ఆ తరువాత ఆ స్వామి ఇలా అన్నారు. "మా దేవి సరస్వతి జ్ఞాన విజ్ఞానాలకు ప్రతీక. మనుషుల్లో జ్ఞానాన్ని, విజ్నానాన్ని జాగృతం చేస్తుంది సరస్వతి. అందువల్ల సరస్వతీ దేవి వాహనంగా హంసను ఎన్ను కున్నారు. పాల నుంచి నీటిని వేరుచేయగల సామర్ధ్యం ఒక్క హంసకే ఉంది. ఇప్పుడు మీరు బాగా అర్ధం చేసుకుని ఉంటారు. మా సంస్కృతి, ధర్మం పూర్తిగా వైజ్ఞానిక పరమైనది" అతని తర్కయుక్తమైన సమాధానం వారి జిజ్ఞాసను శాంత పరిచింది. ఆ సత్పురుషుడు వేరెవరో కాదు స్వామి వివేకానంద. అతని గురించి తెలియని భారతీయుడు లేడు. అతని గురించి తెలియని విదేశీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఒక మారు జాతిని ప్రభోధిస్తూ వివేకా నంద భావ ప్రచారమే మన కర్తవ్యం అన్నారు. ఆ సందేశాన్ని అతని మాటల్లోనేచెప్పుకోవాలి. "నేనొక నూతన ఆశయాన్ని ఇస్తున్నాను. దాన్ని సాధించగలిగితే మిమ్మల్ని ధీరులు గాను, సేవానిరతులుగాను గుర్తిస్తాను. ఒక సంఘటితమైన ప్రణాళికను తయారు చేయండి. నిరక్షరాస్యులు, నిరుపేదలెందరో ఉన్నారు. సాయంకాలమో, మధ్యాహ్నమో లేక మరి యే ఇతర సమయంలోనో వారి గుడిసె గుడిసకు వెళ్ళి వారికి ఖగోళశాస్త్రము, భూగోళశాస్త్రము మున్నగు వాటికి సంబంధి చిన చిత్రపటాలను చూపి ఆ తరువాత శ్రీ రామకృష్ణుల గురించి బోధించండి. వివిధ దేశాల్లో ఏం జరిగిందో లేక ఏమి జరుగుతోందో ఈ లోకం ఎలా ఉందో మొదలైన విషయాలను తెలిపి వారి కళ్ళు తెరిపించండి. ఈ పని మీరు చేయగలరా? రండి! కార్య సాధనకు కంకణం కట్టుకొండి. కబుర్లు చెప్తూ కార్యకలా పాలు ఆచరించే కాలం గతించింది. ప్రస్తుతం కార్యరంగం లోనికి దిగి పని చేయాలి. యువకులై, ఉత్సాహవంతులై, బుద్ధిమంతులై ధీరులై మృత్యుగహ్వరంలోనికి చొరపడడానికి, సముద్రాన్ని ఎదురీదడానికి సంసిద్ధులై సంచరించండి " జననం 1863 జనవరి 12 న కలకత్తాలో విశ్వనాథ దత్తు, భూవనేశ్వరి దంపతులకు ముద్దు బిడ్డగా నరేంద్రుడు జన్మించాడు. అతని సోదరుడైన భూపేంద్రనాథ్ దత్తు ధైర్య సాహసాలు, ఏకాగ్రత, మేథ, నిర్బయత్వం, వాదనాపటిమ వంటి సద్గుణాలను పుణికి పుచ్చుకున్నాడు.విదేశీ పాలకుల పాలనను ద్వేషించేవాడు. ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి భారత దేశాన్ని విముక్తి చేయాలని వారికి వ్యతిరేకంగా పోరాడే విప్లవ పోరాట యోధులతో చేతులు కలిపాడు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. చిన్న తనంలో తల్లి నుంచి రామాయణ కథ విన్నాడు. మరి ఆ వంశంలోపుట్టిన నరేంద్రుడు వారిని తీసిపోతాడా? దేముడిని చూడాలన్న ఆకాంక్ష, జ్ఞానులు అజ్ఞానులు ఇలా సర్వులూ దేముడున్నాడు అని అంటారు. అసలు దేముడున్నాడా? ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలాగుంటాడు అనే ప్రశ్నలు అతని మస్తిష్కాన్ని దొలిచేవి. "మీరు దేముడ్ని చూసారా? పోని దేముడ్ని చూసిన వ్యక్తిని నాకు చూపగలరా?" అని ఎందరెందరినో అడిగాడు. దేముణ్ణి చూసిన వ్యక్తి ఆ బాలుడికి తారసపడలేదు. ఒక ప్రక్క ఆధ్యాత్మికత వేరొక వంక హేతువాదం. దేముడి ఉనికినే సందే హించేవాడు నరేంద్రుడు. సందేహ నివృత్తి.. 1881లో దక్షిణేశ్వరం కాళికాలయంలో అతను శ్రీ రామకృష్ణ పరమహంసను దర్శించి అతని వద్ద అదే ప్రశ్న వేసాడు. రామకృష్ణ పరమహంస జవాబు విని విస్మయం చెందాడు "మీరు దేముణ్ణి మీ కళ్ళతో స్వయంగా చూసారా!?" అని ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగాడు. "చూసాను, చూస్తున్నాను. నేను నిన్ను ఇప్పుడే ఏ విధంగా చూస్తున్నానో అంతకు వంద రెట్లు స్పష్టంగా నేను జగన్మాతను చూస్తున్నాను" అని రామకృష్ణులు నరేంద్రతో అన్నారు. నీవు సాధన చేస్తే భగవతితో మాట్లాడగలవు అని విశ్వాసంగా చెప్పారు. శ్రీ రామకృష్ణుల శిష్యత్వాన్ని స్వీకరించాడు. నరేంద్రుడు. అతని శిక్షణలో అపార జ్ఞానాన్ని ఆర్జించాడు. ఒకనాడు శ్రీ రామకృష్ణ పరమహంస ఒక ఉపదేశం ఇచ్చారు." జీవుల యెడ దయ చూపడానికి నీ వెంతవాడవు? నీవు చేయ గలిగిన దల్లా ఈశ్వర భావంతో సమస్త జీవులను సేవించడమే! మాధవసేవ అంటూ ప్రత్యేకంగా ఏది లేదు మానవసేవయే మాధవ సేవ." అతని ఉపదేశం ఆదేశంగా తోచింది నరేంద్రునికి. వెనువెంటనే శ్రీ రామకృష్ణ మిషన్ స్థాపించే పనిలో నిమగ్నుడయ్యాడు. అతనుపరివ్రాజకుడిగా 1892 లో దేశ సంచారం మొదలు పెట్టాడు. దేశంలో అల్లుకున్న క్షుద్ర మైన పరిస్థితులను నిశితంగా గమనించాడు. నరేంద్ర దత్తు వివేకానందుడైన తీరు.. పర్యటనలో ఒకనాడు ఖేత్రీ మహరాజును కలిసాడు. అతనే ఈ పేరు మార్పు కోరికను బయటపెట్టాడు. ఆనాటి నుంచి నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. విశ్వమతమహాసభ - వివేకవాణి చికాగో నగరంలో 11-9-1893 నాడు విశ్వమత మహాసభలు ప్రారంభమయ్యాయి. హిందూ ధర్మ ప్రతినిధిగా ఆ సభలో పాల్గొనే అవకాశం స్వామి వివేకానందకు కలిగింది. వేలాది మంది ఉద్దండులైన విద్యావంతుతో సభా ప్రాంగణం నిండిపోయింది. రోమన్ చర్చి అధ్యక్షులు కార్డినల్ గిబ్బల్స్ అధ్యక్షత వహించారు. చికాగో సభ అనంతరం నేను ఒక ప్రసిద్ధ వ్యక్తిని, వక్తను అయ్యాను అని వివేకానంద చెప్తూ పులకితులయ్యారు. ఆ సభలో ప్రవేశించటానికి ముందు ఆ తరువాత విషయాలు ఆయన ఇలా చెప్పేరు. ఆ. సమ యంలో అతనిమనస్సు ఎంతో డోలాయ మానం అయిందో అతని మాటల్లో ఇలా వ్యక్తమైంది. "విశ్వమతమహాసభ ప్రారంభోత్సవం నాడు ఉదయం కళామందిరంఅనే సమావేశ స్థలానికి తీసుకు వెళ్ళారు.అక్కడ ఆ సభల కోసం ఒక పెద్ద హాలు మరి కొన్ని చిన్న చిన్న హాలులను రూపొందించారు అన్నిదేశాలవారు అక్కడకు చేరుకున్నారు. భారతదేశం నుంచి బ్రహ్మసమాజానికి చెందిన మజుందారు, బొంబాయికి చెందిన నాగర్కరు, జైన మతం తరుఫున వీర్ చంద్ర గాంధీ, దివ్యజ్ఞాన సమాజం తరుఫున చక్రవర్తి వచ్చారు. వీరిలో మజుందార్తో పూర్వ పరిచయం ఉంది. మిగతా ముగ్గురు అపరిచితులు. చక్రవర్తితో బాటు శ్రీ మతి అనిబిసెంటు వచ్చింది. ప్రేక్షక గేలరీ కిక్కిరిసి నిండి పోయింది. అదొక జన మహా సముద్రం. ఏనాడు బహిరంగ సభలో ప్రసంగించని నేను మహానీయమైన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడమా! ఉర్రూతలూగించిన ప్రసంగం.. ఒక్కొక్కరు వేదిక మీద కొచ్చి తమ ప్రసంగాలను వినిపిస్తున్నారు. అప్పుడు నా హృదయం దడదడలాడింది. నా నోరు ఎండి పోయింది. ఉదయము సమావేశంలో ప్రసం గించ సాససించలేనంత అధైర్యం నన్ను ఆవహించింది. డాక్టర్ బారోసుగారు. నన్ను పరిచయం చేశారు.సరస్వతీదేవికి ముందుగా మొక్కేను. ఆ తరువాత గురువరేణ్యులు శ్రీ రామకృష్ణులకు మనస్సు లోనే ప్రణమిల్లి నేను క్లుప్తంగానే మాట్లాడేను. ఆ సభ నుద్దేశించి "అమెరికా సోదర సోదరీమణులారా!" అంటూ సంబో ధించాను. రెండు నిమిషాల పాటు హాలు దద్దరిల్లేలా, చెవులు గింగరుమనేలా కరతాళ ధ్వనులు చెలరేగాయి. ఆ తరువాత నేను చెప్పవలసినది ధైర్యంగా చెప్పాను. ఉపన్యా సం ముగిసే సరికి ఉద్వేగంగా, దాదాపు నిస్త్రాణలతో కూర్చుండి పోయాను. పలు వురు ప్రసంగాలు వ్రాసుకువచ్చి చదివేరు. నేను ముందుగా ఏమి వ్రాసి తెచ్చుకోక అశువుగా చెప్పాను.అందువల్ల చాలామంది విచలితులయ్యారు, విభ్రాంతులయ్యారు. మరునాడు అన్ని వార్తాపత్రికలు ఆనాటి ఉపన్యాసాలన్నింటి లోను నాదే అగ్రగణ్య మైనది అని ప్రకటించాయి.అందులోఒక పత్రిక ప్రచురించిన వార్తాంశం ఇలా ఉంది. 'స్త్రీలు పురుషులు ఎక్కడ చూసినా కిక్కిరిసి ఉన్నారు. వివేకానందుడి ఉపన్యాసం ఆసాంతం గంభీరంగా విన్నారు.' చివరకు మత దురభిమానం గల పత్రికలు కూడా "సుందర వదనుడైన అతడు ఆకర్షణీయమైన వైఖరితో అత్యంత వాగ్ధాటితో విశ్వమత మహాసభలో అందరి కన్న మిన్న అయిన వ్యక్తిగా విరాజిల్లేడు" అని వ్రాసి తమ అంగీ కరాన్ని వెల్లడి చేసాయి. వివేకానంద అమెరికా నుంచి స్వదేశం వస్తూనే సముద్రపు ఒడ్డున ఇసుకలో పొర్లాడి నేను భోగభూమి నుంచి మన కర్మ భూమి, పుణ్యభూమికి తిరిగి వచ్చాను. నా శరీరం మనస్సులలోని మలినాన్ని తొలగించుకుంటు న్నాను అన్నాడు. దేశంలో ప్రబలిన బలహీనతలను,మూఢా చారాలను, విదేశీ వ్యామోహాన్ని, కుల దురభి మానానలను వీడనాడాలని ప్రబోధించాడు. స్త్రీలను, పేదలను ఆదుకో వలసి ఉందని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని రూపు మాపేందకు దేశవాసులకు పరిశ్రమించాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల వనిత మార్గరెట్ నోబెల్ ను స్వచ్ఛమైన భారతీయ యువతిగా మలచి సోదరి నివేదిత అన్న పేరునిచ్చాడు. వివేకానందుడి అడుగు జాడల్లో నడుస్తూ ఆమె స్త్రీలను విద్యావంతులుగా చేయటంలో బాగా కృషి చేసింది. అనాధ బాల బాలికల కోసం అనేక అనాధాశ్రమాలను నెలకొల్పింది. శ్రీ రామకృష్ణ సేవా సమాజాన్ని 1897 లో నెలకొల్పారు. మానవసేయే మాధవసేవగా ఆనాటి నుంచి నేటి వరకు ఆ సంస్థలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. హైందవ సంస్కృతి పరంపరలను,ధర్మాన్ని కాపాడడంలోనూ వివేకానందునిది విశిష్టమైన శ్రేణి. అతని వాణి నలు దిక్కులా మ్రోగింది. నిరంతరం పరిశ్రమిచడంవలన అతని ఆరోగ్యం క్షీణించింది. ఆది శంకరాచార్యుల్లా అతను 39 సంవత్సరాల పిన్న వయసులోనే 1902 లో ఈ భౌతిక దేహాన్ని త్యాగించి పరమపధం చేరుకున్నాడు. అయితే వివేకానంద వాణి అమరవాణి.ఇప్పటికీ అది మన మధ్య నుండి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. అతను ఈ పవిత్ర భారత దేశంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి. ఆ క్షితి అపూర్ణీయమైనది. అయితే అతని బాటలో నడుస్తూ అతని సందేశాన్ని ఔదల దాల్చి దరిద్రనారాయుణుల సేవలో నిమగ్నం కావడమే అతనికి మనమిచ్చే మహా నివాళి. ఆ విశిష్ట శ్రేణి ఆ వివేకానంద వాణి అహర్నిశాలు మన మనస్సులో జాగృతమై ఉండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్దించడానికి ఇది తరుణం కాదా? - గుమ్మా ప్రసాద రావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement