breaking news
the suspect
-
'ద సస్పెక్ట్' రివ్యూ.. ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ ఉంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో మిస్టరీ థ్రిల్లర్ను తెరకెక్కించారు. రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్పై కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఇన్స్పెక్టర్ అర్జున్(రుషి కిరణ్) విచారిస్తాడు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూ ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్జున్కు ఎదురయ్యే ప్రతి వ్యక్తి సస్పెక్ట్గానే కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన ప్రేయసి మీరా (శ్వేత)ను కూడా అనుమానించాల్సి వస్తుంది. అలాగే పోలీసు ఉన్నతాధికారిని, తన స్నేహితులను ఇలా ప్రతి ఒక్కరినీ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మరి అసలైన హంతకుడిని అర్జున్ పట్టుకుంటాడా? ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ప్రత్యూషను ఎందుకు చంపారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!విశ్లేషణఈ మధ్య కాలంలో థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఒక చిన్న లైన్ తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకుంటున్నారు. ఆ కథనం మెప్పిస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడుతుంది. తాజాగా ‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్ను థ్రిల్కు గురి చేసేందుకు ప్రయత్నించింది. చివరి వరకూ హంతకులెవరన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. తీరా వారు కాదని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్లో అసలు హంతకులు ఎవరనేది తెలిసినప్పుడు షాకవుతారు. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరిచి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదన్న మెసేజ్ ఇచ్చారు.ముఖ్యంగా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే... వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి... ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది చక్కగా చూపించారు. ఓపక్క మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్.. వారి లవ్ బ్రేకప్, మళ్లీ కలుసుకోవడం చూపిస్తారు. ఇదంతా చూసే జనాలకు కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. సెకెండాఫ్లో సినిమా ఊపందుకుంటుంది. అక్కడక్కడా సన్నివేశాలు బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. కొత్తవారైన హీరో రుషి కిరణ్... ఇన్స్పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల మాత్రం అతడి నటన సహజంగా అనిపించదు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత గ్లామరస్గా కనిపించింది. ప్రత్యూష పాత్రలో రూప కూడా పర్వాలేదనిపించింది. లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. మిగతా అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. కొన్ని సీన్లు బోరింగ్గా అనిపించినా సెకండాఫ్లో ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ పర్వాలేదనిపించాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. పాటలు బాగోలేవు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.చదవండి: ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
సస్పెన్స్... థ్రిల్
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెఎన్ ప్రసాద్, మృణాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ది సస్పెక్ట్’. రాధాకృష్ణ దర్శకత్వంలో కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఎస్కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవీ ఉన్నాయి. అద్భుతంగా ఆదరణ పొందిన చిన్న చిత్రాలూ ఉన్నాయి. ‘ది సస్పెక్ట్’ చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి. కిరణ్గారు ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఓ మంచి పాత్ర కూడా చేశారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో జరిగే వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం’’ అని తెలిపారు రాధాకృష్ణ. ‘‘సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న నా కల ‘ది సస్పెక్ట్’తో నెరవేరింది’’ అన్నారు కిరణ్ కుమార్. -
మన్మోహన్సింగ్ నిందితుడే!
‘బొగ్గు’ కేసులో మాజీ ప్రధానికి సమన్లు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను ‘బొగ్గు’ భూతం వెంటాడుతోంది. యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం వల్ల 83 ఏళ్ల మన్మోహన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్కామ్కు సంబంధించిన ఒక కేసులో మన్మోహన్ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఒడిశాలోని తలబిర-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించడం ద్వారా కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి భారీ స్థాయిలో అనుచిత లబ్ధి చేకూరేలా మన్మోహన్ వ్యవహరించారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ మాజీ ప్రధానిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 120బీ(నేరపూరిత కుట్ర), 409(నేరపూరిత విశ్వాస ఘాతుకం) సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు నిబంధనల కింద శిక్షకు అవకాశమున్న నేరారోపణలు నమోదు చేశారు. ఇవి రుజువైతే పదేళ్ల పాటు భారత ప్రధానిగా ఉన్న మన్మోహన్కు యావజ్జీవ శిక్ష కూడా పడే అవకాశముంది. ఒక క్రిమినల్ కేసులో కోర్టు సమన్లు అందుకున్న రెండో ప్రధానిగా మన్మోహన్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అంతకుముందు, జేఎంఎం ఎంపీలకు ముడుపుల కేసు సహా మూడు వేర్వేరు కేసుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కోర్టు సమన్లు అందుకున్నారు. సమన్లు జారీ కావడంపై ఆవేదన వ్యక్తం చేసిన మన్మోహన్.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తన నిర్దోషిత్వం రుజువవుతుందన్న విశ్వాసముందని అన్నారు. పరేఖ్, కేఎం బిర్లాలకు కూడా: 2005లో తలబిర-2ను హిందాల్కోకు అక్రమంగా కేటాయించడానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి భరత్ పరాశర్ పై ఆదేశాలిచ్చారు. ఆ సమయంలో బొగ్గు శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న మన్మోహన్తో పాటు హిందాల్కో, ఆ కంపెనీ యజమాని కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, ఆ కంపెనీలోని ఇద్దరు ఉన్నతాధికారులు శుభేందు అమితాబ్, డీ భట్టాచార్యలను కూడా కోర్టు నిందితులుగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. వీరిపైనా ఐపీసీ 120బీ, 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసును మూసేయాలన్న సీబీఐ.. మొదట, తన ఎఫ్ఐఆర్లో హిందాల్కో, పరేఖ్, కేఎం బిర్లా, మరి కొందరి పేర్లను చేర్చిన సీబీఐ.. అనంతరం పలు కారణాలు చూపుతూ ఈ కేసును మూసేయాలని క్లోజర్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించింది. అయితే, ఆ అభ్యర్థనపై ఆగ్రహించిన కోర్టు ఈ కేసులో మన్మోహన్, అప్పటి పీఎంఓలోని ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాల్సిందిగా గత డిసెంబర్ 16న సీబీఐని ఆదేశించింది. తప్పేం చేయలేదు: హిందాల్కో కేఎం బిర్లా సహా తమ అధికారులెవరూ అక్రమంగా బొగ్గు క్షేత్రాన్ని పొందేందుకు ప్రయత్నించలేదని హిందాల్కో పేర్కొంది. సమన్లపై ఆశ్చర్యపోయానని పరేఖ్ అన్నారు. కోర్టు ఉత్తర్వులు న్యాయ ప్రక్రియలో భాగమేనని, మన్మోహన్ నిజాయితీ, నిష్పక్షపాతం, పారదర్శకతలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరని కాంగ్రెస్ పేర్కొంది. భూ సేకరణ బిల్లు నుంచి దృష్టిని మళ్లించేందుకు బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. కాంగ్రెస్ పాపాల మూల్యం మన్మోహన్ చెల్లిస్తున్నారని బీజేపీ పేర్కొంది. కోర్టు ఏమంది..! 73 పేజీల ఉత్తర్వుల్లో కోర్టు ఏమందంటే..‘హిందాల్కో, కేఎం బిర్లా, శుభేందు అమితాబ్, భట్టాచార్యలు మొదట ప్రారంభించిన ఈ నేరపూరిత కుట్రలో తరువాత నాటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్, నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ కూడా భాగస్వాములయ్యారనడానికి ప్రాథమిక సాక్ష్యాలున్నాయి. తలబిర 2ను హిందాల్కోకు కేటాయించేందుకు మన్మోహన్, పరేఖ్లు కలసికట్టుగా ప్రయత్నించారనడానికీ ఆధారాలున్నాయి. తనకున్న రాజ కీయ, అధికార మార్గాలతో తలబిరను అక్రమంగా పొందేం దుకు బిర్లా ప్రయత్నించారనేందుకు సాక్ష్యాలున్నాయి. అందువల్ల నిందితులపై ఐపీసీలోని 120బీ, 409, అవినీతి నిరోధక చట్టం కింద నేరారోపణలకు అనుమతిస్తున్నాం. 2జీ స్కామ్ విచారణలో మన్మోహన్ పాత్రపై సుప్రీంకోర్టు అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించాం. అయితే, ఈ కేసు విచారణలో వాటిని పరిగణనలోకి తీసుకోలేం.. తలబిరను హిందాల్కోకు కేటాయించేలా బొగ్గు శాఖకు పదేపదే లేఖలు రాస్తూ, ఫోన్లు చేస్తూ మన్మోహన్ఒత్తిడి తెచ్చారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘అనవసర అదనపు ఆసక్తి’ చూపింది. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ)కు తలబిర 2ను కేటాయించాలన్న స్క్రీనింగ్ కమిటీ సిఫారసుకు ఆమోదం తెలిపిన మన్మోహన్ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, నిబంధనలను ఉల్లంఘించి, కావాలనే హిందాల్కోను తెరపైకి తెచ్చారు. దీంతో ఎన్ఎల్సీ భారీగా నష్టపోయింది. హిందాల్కో భారీ లాభాలార్జించింది. అప్పుడు బొగ్గు శాఖనూ ఆయనే నిర్వహిస్తున్నందున ప్రధానిగా ప్రతీదాన్నీ అధ్యయనం చేయలేను అనడానికి ఆయనకవకాశం లేదు. మన్మోహన్ ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అయినా ఈ నేరం జరిగిన(2005) నాటికి ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో ఆయనపై విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో ఆయన పాత్ర ఉందనడానికి అవకాశముందని నమ్ముతున్నాం. దీనివల్ల దేశ నైతిక స్థైర్యంపై పడే ప్రభావం గురించి పూర్తి అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.