Sun TV Network
-
IPL 2026: సీఎస్కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్!
ఐపీఎల్-2026 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)- సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల మధ్య సోషల్ మీడియా యుద్ధం మొదలైపోయింది. మైదానంలో ఎస్ఆర్హెచ్కు చెన్నై కచ్చితంగా ‘సినిమా’ చూపిస్తుందంటూ సీఎస్కే ఫ్యాన్స్ సవాలు విసరుతుండగా.. తమ జట్టు సత్తా ఏమిటో మైదానంలోనే చూస్తారంటూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.అసలేం జరిగిందంటే.. సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంఛైజీలు తమ కొత్త జెర్సీల ఆవిష్కరణ, కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు ఆహ్వానం పలికే క్రమంలో వినూత్న రీతిలో వీడియోలు రూపొందించడం పరిపాటి. సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసేందుకు, అభిమానులను అలరించేందుకు ఇలాంటి వీడియోలు ఉపయోగపడతాయి.హుకుమ్, అల్తోప్పా, డిస్కో రీమిక్స్సీఎస్కే సైతం దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రాజస్తాన్ నుంచి సీఎస్కేలోకి వచ్చిన సంజూ శాంసన్ సహా కీలక ఆటగాళ్లపై వీడియోలు రూపొందించింది. అయితే, ఇందులో సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన జైలర్, కూలీ, జైలర్-2ల మ్యూజిక్ వాడుకుంది.ముఖ్యంగా హుకుమ్, అల్తోప్పా, డిస్కో రీమిక్స్ వంటి ట్రాక్స్ను తమ ఆటగాళ్లకు హైప్ ఇచ్చే క్రమంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్గా వాడుకుంది. ఈ పాటలు, సంగీతానికి అనిరుద్ రవిచంద్రన్ రూపకర్త. ఈ నేపథ్యంలో సీఎస్కే తమ ఆటగాళ్ల హీరో ఎడిట్స్కు ఈ సంగీతం వాడుకోవడంపై సన్ టీవీ గ్రూపు ఆగ్రహం వ్యక్తం చేసింది.అనుమతి లేకుండానేఈ పాటలు తమకు చెందేలా అనిరుద్ రవిచంద్రన్ రాత పూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారని.. అయితే, సీఎస్కే మాత్రం తమ వాణిజ్య లాభం కోసం అనుమతి లేకుండానే మ్యూజిక్ను వాడుకుంటోందని కోర్టుకెక్కింది. ఇందుకు సంబంధించి మార్చి 13న సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉల్లంఘన కింద సీఎస్కేపై పిటిషన్ దాఖలు చేసింది.లైసెన్స్ వచ్చేదాకాఈ విషయంపై సీఎస్కే న్యాయవాది పీఎస్ రామన్ వాధిస్తూ.. గత మూడేళ్లుగా చెన్నై జట్టు ఈ మ్యూజిక్ను వాడుకుంటోందని.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకని ప్రశ్నించారు. సన్ టీవీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాము అస్సలు ఊహించలేదన్నారు. ఏదైమైనా సన్ పిక్సర్చ్ లేదంటే ఫొనోగ్రాఫిక్ పెర్ఫామెన్స్ లిమిటెడ్ నుంచి లైసెన్స్ వచ్చేదాకా తాము జైలర్, కూలీ, జైలర్ 2 మ్యూజిక్ను వాడబోమని స్పష్టం చేశారు. అదే విధంగా.. ఇప్పటికే ఈ మ్యూజిక్తో కూడిన వీడియోలను డిలీట్ చేసిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.కావ్యా మారన్పై నెట్టింట ట్రోలింగ్ఈ క్రమంలో జస్టిస్ సెంథిల్కుమార్ రామమూర్తి ఈ కేసును మార్చి 16కు వాయిదా వేశారు. పిటిషన్దారుకు సంబంధించిన ఆడియో మెటీరియల్ను తాము వాడటం లేదన్న విషయాన్ని ధ్రువీకరిస్తూ సీఎస్కే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.కాగా ‘ది హండ్రెడ్ లీగ్’- 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసినందుకు సన్రైజర్స్ లీడ్స్ యజమాని, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్యా మారన్పై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేను కోర్టుకు ఈడ్చటంపై కూడా దుమారం రేగుతోంది. చదవండి: IPL 2026: తొలి విడతలో సన్రైజర్స్ షెడ్యూల్ ఇదే..! -
సన్రైజర్స్ టీమ్ ఓనర్ వద్ద ప్రీమియం కార్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యజమానిగా, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కావ్య మారన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బిజినెస్తోపాటు ఆమెకు కార్లంటే మక్కువ ఎక్కువే. ఆమె గ్యారేజీని ప్రీమియం కార్లతో నింపేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం తన వద్ద ఉన్న హై-ఎండ్ కార్ల వివరాలు కింద తెలుసుకుందాం.రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీదీని ధర భారతదేశంలో సుమారు రూ.12.2 కోట్లు.బెంట్లీ బెంటాయ్గా ఈడబ్ల్యూబీఈ బ్రాండ్ తయారు చేసిన మొదటి ఎస్యూవీ ఇది. దీని ధర సుమారు రూ.6 కోట్లు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్తో వస్తుంది.బీఎమ్డబ్ల్యూ ఐ7ఆమె వద్ద బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్తో కూడిన బీఎమ్డబ్ల్యూ ఐ7 కారు ఉంది. దీని ధర రూ.2.5 కోట్లుగా ఉంది.ఫెరారీ రోమాఇటాలియన్ ఫెరారీ గ్రాండ్ టూరింగ్ కారు ధర సుమారు రూ.3.76 కోట్లు.కావ్య మారన్ 1999 నవంబర్ 3న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ చేశారు. ఎస్ఆర్హెచ్, సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ సహా సన్ గ్రూప్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల నిర్వహణలో కావ్య మారన్ కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండిఆమె సారథ్యంలో 2016లో ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ 2018, 2024లో రన్నరప్గా నిలిచింది. సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2023, 2024లో ఎస్ఏ20 లీగ్ టైటిల్ గెలుచుకుంది. 2024లో దేవి అవార్డ్స్లో ‘ఫేస్ అండ్ ఫోర్స్ బిహైండ్ సన్రైజర్స్ హైదరాబాద్’ అవార్డు అందుకున్నారు. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు (రూ.409 కోట్లు) ఉంటుందని అంచనా. -
ఎన్టీపీసీ- సన్ టీవీ.. వెలుగులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించడంతో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ కౌంటర్కు డిమాండ్ పెరిగిది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎంటర్టైన్మెంట్, మీడియా రంగ సంస్థ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కట్టడికి లాక్డవున్ల అమలు నేపథ్యంలోనూ ఈ రెండు కంపెనీలూ పటిష్ట ఫలితాలు సాధించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్టీపీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఎన్టీపీసీ లిమిటెడ్ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 2,949 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 3 శాతం నీరసించి రూ. 26,195 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 16 శాతం పెరిగి రూ. 4,280 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. సన్ టీవీ నెట్వర్క్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సన్ టీవీ నెట్వర్క్ నికర లాభం దాదాపు 34 శాతం క్షీణించి రూ. 257 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 37 శాతం నీరసించి రూ. 715 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 40 శాతం వెనకడుగుతో రూ. 352 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. అయితే సబ్స్క్రిప్షన్ ఆదాయం 18 శాతం పెరిగి రూ. 442 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో సన్ టీవీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్చేసి రూ. 424 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
సన్టీవీకి ఐపీఎల్ జోష్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లోని మీడియా సెక్టార్కు ఐపీఎల్ బూస్ట్ లభించింది. ముఖ్యంగా ఐపీఎల్ టెలికాస్టింగ్( టెలివిజన్, డిజిటల్ మీడియా) హక్కులను స్టార్ గ్రూప్ దక్కించుకోవడంతో మంగళవారం నాటి మార్కెట్లలో మీడియా షేర్లు మరింత వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో వరుసగా అయిదో రోజు కూడా మీడియా స్టాక్స్ అన్నీ లాభాల్లో జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నసన్టీవీ నెటవర్క్ లిమిటెడ్ 3.3శాతం లాభంతో దూసుకుపోతోంది. బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు పాజిటివ్ ధోరణిని వ్యక్తం చేయడంతో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. క్రెడిట్ సూస్, సీఎల్ఎస్ఏ బై కాల్ పిలుపునిచ్చాయి. కాగా ఐసీఎల్ లంలో.. స్టార్ గ్రూప్ రూ.15 వేల కోట్లకు మించిన భారీ మొత్తాన్ని చెల్లించి.. రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అధిక ఆదాయంలో సన్ రైజర్స్ హైద్రాబాద్ వాటాలు పొందనుండంతో.. సన్ టీవీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. -
సన్ టీవీకి రూ.233 కోట్ల లాభం
న్యూఢిల్లీ: సన్ టీవీ నెట్వర్క్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.233 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.233 కోట్లు) తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని సన్ టీవీ నెట్వర్క్ తెలిపింది. గత క్యూ1లో రూ.690 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 10 శాతం వృద్ధితో రూ.781 కోట్లకు ఎగసిందని పేర్కొంది. ఈ క్యూ1లో చందా ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.232కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ టీవీ నెట్వర్క్ షేర్ 0.4 శాతం క్షీణించి రూ.482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.491ను తాకింది. -
సన్ టీవీ లాభం 19 శాతం అప్
4 రోజుల్లో 23 శాతం ఎగసిన షేర్ న్యూఢిల్లీ : సన్ టీవీ నెట్వర్క్ సంస్థ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 19 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.197 కోట్లకు ఎగసిందని సంస్థ తెలియజేసింది. ఆదాయం రూ.634 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.691కు వృద్ధి చెందింది. కాగా ఈ షేర్ నాలుగు రోజుల్లో 23 శాతం ఎగసింది. ఈ నెల 28న రూ.274గా ఉన్న ఈ షేర్ శుక్రవారం నాటికిరూ.337కు ఎగసింది. సన్ గ్రూప్కు చెందిన రెడ్ ఎఫ్ఎంను మూడో దశ ఎఫ్ఎం స్టేషన్ల వేలంలో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించడంతో గత మూడు రోజుల్లో(గురువారం వరకూ) ఈ షేర్ 14 శాతం పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే షేర్ ధర 9 శాతం పెరిగింది. -
సమష్టి నిర్ణయంతో సన్టీవీకి అనుమతులు
న్యూఢిల్లీ: కళానిధి మారన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 33 టీవీ చానళ్ల సన్ టీవీ నెట్వర్క్ ప్రసారాలకు అనుమతులు మంజూరు చేయాలంటే కేంద్రంలోని సంబంధిత శాఖలు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సోమవారం కేంద్రం తెలిపింది. ఈ అంశంపై కీలకమైన కేంద్ర హోం , కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కళానిధి, అతడి సోదరుడు కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్లపై ఉన్న పెండింగ్ కేసులను సన్టీవీ చానళ్లను నిర్వహిస్తున్న ఆయా కంపెనీలు ప్రభావితం చేసే అవకాశముందని హోం శాఖ భావిస్తోంది. దీంతో సన్టీవీ నెట్వర్క్కు భద్రతాపరమైన అనుమతులను నిరాకరిస్తోంది. -
సన్ టీవీ చానళ్ల భవిష్యత్ ఏంటి?
భద్రత అనుమతి నిరాకరణతో సందేహాలు న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన సన్ టీవీ నెట్వర్క్లోని 33 చానళ్లకు కేంద్ర హోం శాఖ భద్రతాపరమైన అనుమతి నిరాకరించడంతో వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీటికి ఢోకా లేదని సన్ టీవీ చెబుతోంది. అనుమతి నిరాకరణకు సంబంధించి కేంద్రం నుంచి తమకు ఎలాంటి లేఖా రాలేదని గ్రూప్ సీఎఫ్ఓ సీఎల్ నారాయణన్ చెప్పారు. అనుమతుల నిరాకరణకు ఎలాంటి ప్రాతిపదికా లేదని, తమ లెసైన్సులను రద్దు చేస్తే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. తమ నెట్వర్క్లోని చాలా చానళ్లకు 2021 వరకు అనుమతులు ఉన్నాయన్నారు. సన్ టీవీపై, దాని ప్రమోటర్ అయిన కళానిధి మారన్, ఆయన సోదరుడైన కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్లపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో హోం శాఖ ఈ చానళ్లకు భద్రతాపర అనుమతి నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి. వీరు ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు, అక్రమ టెలిఫోన్ లైన్ల ఏర్పాటు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, సన్ టీవీ యాజమాన్యాన్ని వేరే వారికి అప్పగించడమో, లేకపోతే డెరైక్టర్లను మార్చడమో చేస్తే ఆ చానళ్లకు అనుమతుల నిరాకరణపై పునస్సమీక్షిస్తామని హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు. టీవీ చానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్లకు పదేళ్ల వ్యవధితో హోం శాఖ అనుమతిస్తుంటుంది. ప్రధానంగా దక్షిణ భారతంలో విస్తరించిన సన్ టీవీ నెట్వర్క్లో జెమినీ టీవీ, జెమినీ మూవీస్ తదితర తెలుగు చానళ్లు ఉన్నాయి. మొత్తం 9. 5 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు.


