breaking news
summer camp
-
అమెరికా మునిగిపోనుందా?
-
సమ్మర్ క్యాంప్స్లోనూ ఏఐ
చెస్, డ్యాన్స్, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డ్రాయింగ్, పెయింటింగ్.. ఇవీ సమ్మర్ క్యాంప్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి. అవి కూడా వేసవి సెలవుల్లోనే నేర్చుకునేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అర్థమే మారిపోయింది. ఇప్పుడు ఏడాది పొడవునా ఈ క్యాంప్స్ కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో పాఠశాలలు, కో–కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలు.. ఏడాదంతా పిల్లలను వివిధ అంశాల్లో సానబెడుతున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సమ్మర్ క్యాంప్స్లో ప్రాధాన్యతగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిలిచి ఔరా అనిపిస్తోంది. కోవిడ్ సమయంలో.. ముఖ్యంగా లాక్డౌన్లో విద్యార్థులు ఇంటిపట్టునే ఉన్నారు. ఆ సమయంలో పాఠశాలలూ ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాయి. దీంతో పిల్లలు మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్లకు అలవాటుపడ్డారు. నాటి నుంచి పిల్లలకు చదువుతోపాటు.. కంప్యూటర్ పరిజ్ఞానమూ పెరిగింది. ఆన్లైన్ వేదికగా పిల్లలు పలు బోధనాంశాలను నేర్చుకుంటున్నారు. చాలామంది పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్కు బదులు ఆన్లైన్ గేమ్స్ అలవాటయ్యాయి. అలా పిల్లల కార్యకలాపాలన్నీ ఫిజికల్ టు డిజిటల్ అయిపోయాయి. మరోపక్క తల్లిదండ్రులు కూడా సాంకేతికంగా తమ పిల్లల భవిష్యత్తుకు తగ్గ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ పరిణామాల కారణంగానే.. సమ్మర్ క్యాంప్స్ కూడా చాలావరకు మారిపోయాయి. అందుకే పంపుతున్నారుసమ్మర్ క్యాంప్స్కు వస్తున్న పిల్లల్లో.. ఎక్కువమంది చిన్నారుల తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసేవారే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పిల్లలను ఇంట్లో ఉంచలేక, క్యాంప్లకు పంపించి ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచుతున్నారు. ఇంట్లో అల్లరి భరించలేక లేదా మొబైల్ ఫోన్లకు అలవాటు పడ్డారన్న కారణంతో మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను సమ్మర్ క్యాంప్లో చేరి్పస్తున్నారు. చాలాకొద్ది మంది మాత్రమే తమ పిల్లలు కెరీర్లో క్రీడలను భాగం చేసుకోవాలని భావించి క్యాంప్లకు పంపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త అంశాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమ్మర్ క్యాంప్స్ ఇప్పుడు టెక్నాలజీ, అడ్వెంచర్, లైఫ్ స్కిల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ, కోడింగ్, ఆస్ట్రానమీ, స్పేస్ టెక్నాలజీ వంటి సాంకేతిక అంశాలు వచ్చి చేరాయి. అడ్వెంచర్లో హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. లైఫ్ స్కిల్స్లో వంటలు, వ్యవసాయం, పశు సంపద గురించి తరగతులు మొదలయ్యాయి. ఆర్చరీ, చెస్లతోపాటు ఫొటోగ్రఫీ, సాల్సా, బెల్లీ వంటి డ్యాన్సులు.. మ్యూజిక్ కూడా సమ్మర్ క్యాంప్స్లో నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్, స్కేటింగ్ వంటి వాటిలోనూ కొన్నిచోట్ల శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, ఎంఎల్, కోడింగ్.. పాఠ్యాంశాలతోపాటు కో–కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇప్పుడు ఏఐ, మెషీన్ లెరి్నంగ్, కోడింగ్ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఈ తరగతులు సమ్మర్ క్యాంప్స్నకే పరిమితం కాకుండా ఏడాదంతా ఒక సబ్జెక్ట్గా జరుగుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ పాఠశాలల్లో చదివే ఎంతోమంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటున్నట్టు చెబుతున్నారు. దాంతో పాఠశాలలు కూడా ఈ సబ్జెక్టులను చెప్పిస్తున్నాయి. ఆసక్తికర అంశం ఏంటంటే.. వారంలో ఒక రోజు.. అది కూడా 1–2 గంటలు క్లాస్ చెప్పే ఏఐ నిపుణుడికి పాఠశాలలు నెలకు రూ.70,000 వరకు చెల్లిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో కొందరు వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు. -
summer camps ఆటపాటలతో సమ్మర్ సందడి
వెంకటేశ్వరకాలనీ వేసవి సెలవుల్లో విద్యార్థులకు తెలియని విషయాలను తెలిసేలా... ఆహ్లాదంగా గడిపి వేసవి సెలవులను మరింత ఆనంద జ్ఞాపకాలుగా మిగిల్చుకునేందుకు ప్రభుత్వం బడుల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 80 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్లో అటు కంప్యూటర్ నేర్చుకోవడంతో పాటు ఇటు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. లిటిల్స్టార్ హైస్కూల్, గతి హైసూ్కల్, సెయింట్ ఆల్ఫాన్సెస్ హైసూ్కల్, ప్రాక్టీసింగ్ హైసూ్కల్, పంజగుట్ట పడవ స్కూల్ తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్థానికులు ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్! ఈనెల 15వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు.. ఈ సమ్మర్ క్యాంప్ ఉదయం 8నుంచి 11గంటల వరకు ఉంటుందన్నారు. ఈ క్యాంపు ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కంప్యూటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, మెడిటేషన్, ఇంగ్లిష్, సైన్స్లో శిక్షణ ఇస్తున్నారు. గణితం ట్రిక్స్ ఇందులో నేర్పిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో ఆటల్లో కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్బాబు ఈ సమ్మర్ క్యాంప్ కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొనేలా చేసి విద్యార్థులకు వివిధ అంశాల్లో మెలకువలు స్తున్నారు. సమ్మర్ క్యాంప్ తమకెంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వచ్చే నెలా 10వ తేదీ వరకు పొడిగిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. -
కలర్ఫుల్.. సిబ్లింగ్స్ వాక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్పల్లి అశోక వన్ మాల్ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్. అశోక డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ భాగస్వామి అయిన రిలయన్స్ ట్రెండ్స్.. ఫ్యాషన్ వాక్లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్ మై హోమ్, డెకథ్లాన్ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్ మాల్ సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్చార్మినార్: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్ వరకూ నెహ్రూ జూలజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్కూ ప్రతి రోజూ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన కిట్ అందిస్తారన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఇన్స్టా, ఫేస్బుక్తో పాటు అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్ నెంబర్లో గానీ సంప్రదించాలన్నారు. -
శిక్షణే వినూత్న లక్షణం..! వేసవి సెలవులను ఉపయోగించుకోండిలా..!
విద్యార్థుల చదువులు, యువత కాలేజీల పోటీ వాతావరణానికి, ఒత్తిడికి వేసవి ఒక విరామం, వినోదం. అయితే హైదరాబాద్ నగరం వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకునేందుకు అనేక సమ్మర్ క్యాంపులకు వేదికగా మారింది. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం నుంచి సృజనాత్మక రంగాల వరకూ, శారీరక దృఢత్వం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకూ విస్తరించి ఉన్న ఈ క్యాంపులు, విద్యా జీవితానికి వెలకట్టలేని అనుభవాలను అందిస్తున్నాయి. ఈ రెండు నెలల కాలాన్ని ఇంటి పట్టునే ఉండి వృథా చేయకుండా ఇటు విజ్ఞానం, అటు వినోదం సమ్మిళితంగా ఈ వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోడానికి ఈ తరం ఎక్కువ ఆసక్తి చూపిస్తోందనేది నిపుణుల మాట. ఇందులో భాగంగా వైట్ హాట్ జేఆర్, కోడింగ్ నింజాస్, హ్యాకర్ కిడ్, ఎస్పీ రోబోటిక్స్ మేకర్ ల్యాబ్ వంటి సంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్డ్స్ లెవెల్ వరకూ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ అందిస్తున్నాయి. స్పెషల్ ఇంటర్న్షిప్ మాడ్యూల్స్ సహా ప్రాజెక్టు ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థులకు రియల్–వరల్డ్ పరిజ్ఞానం అందిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ సంస్థల శిక్షణా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ తరం కళాత్మకం వైపే.. విద్య, వృత్తి పరమైన నైపుణ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక కళలో ప్రావీణ్యముండటం ఈ తరంలో సెలబ్రిటీ హోదాగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా వైరల్స్ పుణ్యమా అని వినూత్న వ్యక్తిత్వానికి కళలు ఒక ప్రామాణికంగా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నగరవాసుల దృష్టి కళల వైపు మళ్లిందనే చెప్పాలి. నగరంలోని రవీంద్ర భారతి అకాడమీ, శిల్పా రామం ఆర్ట్ క్యాంప్, కల్పతరు వంటి విభిన్న కళా వేదికలు, సంస్థలు.. పెయింటింగ్, సంగీతం, నృత్యం, థియేటర్ ఆర్ట్స్ వంటి రంగాల్లో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా శిల్పారామం ప్రాంగణంలో నిర్వహించే కళాకారుల వర్క్షాపులు, విద్యార్థులకు దేశీయ కళల పట్ల అవగాహన పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తున్నాయి. ఫిట్ అండ్ స్పోర్ట్స్.. నగర వాసుల సక్సెస్ మంత్ర ఏదైనా ఉందంటే.. అది ఆరోగ్యం, ఫిట్నెస్ అని ఠక్కున చెప్పేస్తారు. ఆరోగ్య శిక్షణ, క్రీడలు, ఫిట్నెస్ రంగాలకు నగరంలో మంచి డిమాండ్, ఆదరణ ఉంది. అంతే కాకుండా ఈ రంగాల్లోని శిక్షణా అంశాలపై హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు ఉండటం విశేషం. డెకథ్లాన్ అకాడమీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఫిట్ కిడ్స్ హైదరాబాద్ వంటి సంస్థలు స్విమ్మింగ్, యోగా, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ శిక్షణల ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, క్రమశిక్షణ, టీం వర్క్, ఫోకస్ వంటి విలువలు పెంపొందుతున్నాయి. అంతేకాకుండా కేవలం చదువులు మాత్రమే కాదు.. క్రీడలతోనూ అంతర్జాతీయ గుర్తింపు, ఉన్నత స్థాయి జీవితానికి నాంది పలకవచ్చని చెప్పడానికి పలువురు నగర క్రీడాకారులే నిదర్శనం. చేయూతనిస్తే అద్భుతాలే.. సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులు, యువత కొత్త ప్రపంచాన్ని అన్వేíÙంచే అవకాశం పొందుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ఆసక్తులను గుర్తించి, అనుగుణమైన శిక్షణలకు ప్రోత్సహించగలిగితే, వారు భవిష్యత్తులో విశ్వాసంతో ముందుకు సాగుతారని నిర్వాహకులు, నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసానికీ పెద్దపీట.. అదనపు నైపుణ్యాలను కోరుకునే నగర వాసులు ఎవరైనా సరే.. వ్యక్తిత్వ వికాస శిక్షణలో ప్రవేశించడానికే మొగ్గు చూపుతున్నారు. వీరి ఆసక్తికి అనుగుణంగా ది పర్సనాలిటీ స్కూల్, టైమ్ కిడ్స్, ఉద్భవ్ అకాడమీ వంటి ప్రత్యేక సంస్థలు కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇవి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, యువత భవిష్యత్తుకు మార్గం చూపడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగాలను పొందడంలోనూ, ఉపాధి రంగాల్లో రాణించడంలోనూ ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎంతో ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంపొందిస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న మాట. (చదవండి: సమ్మర్లో కాటన్ డ్రెస్లతో స్టైలిష్గా ఉండొచ్చు ఇలా..!) -
జీడీ గోయెంకా స్కూల్ సమ్మర్ క్యాంప్ విజయవంతం (ఫొటోలు)
-
ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట!
ఇడహొ: ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ఒకరు. ఆయన ఆస్తి 115 బిలియన్ డాలర్లకు పైమాటే. అటువంటి వ్యక్తి భార్య కాఫీ ధర ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. సన్ వ్యాలీలో ఇటీవల బిలియనీర్ల సమ్మర్ క్యాంప్ జరిగింది. ఓ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో వారెన్ బఫెట్ భార్య ఆస్ట్రిడ్ బఫెట్ కప్పు కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడంపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారట. ఇతర ప్రాంతాల్లోని కాఫీ ధరతో పోలిస్తే ఇది ఎక్కువేనంటూ అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్ బఫెట్ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు. -
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రానా సందడి (ఫొటోలు)
-
కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!
Muskmelon Juice Recipe- Health Benefits In Telugu: వేసవిలో విరివిగా దొరికే పండ్లలో కర్బూజ ఒకటి. దోసజాతికి చెందిన ఈ పండును ఈ సీజన్లో తింటే చలవచేస్తుంది అంటారు. సహజంగా ఇది మరీ అంతగా తియ్యగా ఉండదు. కాబట్టి కాస్త పంచదార వేసి జ్యూస్ రూపంలో తీసుకుంటే రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలు ఉన్నందున వీలు చిక్కినప్పుడల్లా తీసుకోవడం మంచిది. కర్బూజా జ్యూస్ తయారీ ►అరకేజీ మస్క్మిలాన్ (కర్బూజ) ముక్కలను మిక్సీజార్ లో వేసుకోవాలి. ►దీనిలో రెండు అంగుళాల అల్లం ముక్కను తురుముకుని వేయాలి. ►రుచికి సరిపడా పంచదార, చిటికెడు ఉప్పు, టీస్పూను మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాసులో తీసుకుని నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఆరోగ్య ప్రయోజనాలు ►మస్క్మిలన్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ►రక్త పీడనం ఎక్కువగా ఉన్న వారు ఈ జ్యూస్ తాగడం వల్ల పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని క్రమబద్ధీకరించి, బీపీని నియంత్రణలో ఉంచుతాయి. ►జ్యూస్లో ఉన్న విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు కంటిలో శుక్లం ఏర్పడకుండా నిరోధిస్తాయి. ►దీనిలోని పోషకాలతో కూడిన కార్బోహైడ్రేట్స్ బరువుని నియంత్రణలో ఉంచుతాయి. ►ఆకలి లేమితో బాధపడేవారికి ఇది స్వాభావికమైన ఔషధంగా పనిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. ► అసిడిటీని , అల్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ► ఇందులో విటమిన్ సి పుష్కలం. వ్యాధినిరోధకతను సమకూరుస్తుంది. ► కర్బూజలో ఐరన్ పాళ్లు ఎక్కువ. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం మేలు. చదవండి: Pineapple Cake: ఈ పదార్థాలు ఉంటే చాలు.. పైనాపిల్ కేక్ రెడీ! -
‘అందుకు మానసిక ధైర్యం చాలా అవసరం’
జీవితంలో ఏదో అవ్వాలనుకుని ఇంకేదో అవుతుంటాము. కొన్నిసార్లు మనం ఏది అనుకున్నా డెస్టినేషన్ లో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. అచ్చం ఇలానే నేత్రా కుమనన్ జీవితంలో జరిగింది. నేత్ర మరెవరో కాదు మన దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొనే తొలి మహిళా సెయిలర్. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేత్ర సెయిలర్ అవ్వాలనుకోలేదు. అందరిలాగే స్కూలుకెళ్లి చదువుకుంటోన్న నేత్ర పన్నెండేళ్ల వయసులో మొదట టెన్నిస్ నేర్చుకుందామని బ్యాట్ పట్టుకుంది. కానీ అది కుదరలేదు. తర్వాత సైక్లింగ్ చేద్దామనుకుంది ఇది కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఇలా కాదు భారతీయ సంప్రదాయాలకు తగ్గట్టుగా భరతనాట్యం నేర్చుకుందామనుకుంది. అది కూడా పూర్తి చేయలేదు. అనుకోకుండా వేసవిసెలవుల్లో నేత్ర వాళ్ల అమ్మ ‘‘సమ్మర్ క్యాంప్లో భాగంగా సెయిలింగ్ నేర్పుతున్నారు వెళ్లు’’ అని చెప్పడంతో నేత్ర అక్కడికి వెళ్లింది. అప్పుడు తనకు తెలియదు. భవిష్యత్తులో దేశంలోనే తొలి మహిళా సెయిలర్ని అవుతానని. ఇటీవల ఒమన్లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్కు సంబంధించిన లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్ లో నేత్ర టాప్లో నిలిచి ఒలింపిక్స్ బెర్త్ కొట్టేసింది. 21 పాయింట్ల తేడాతో భారత్కు చెందిన రమ్య, శరవణపై పైచేయి సాధించి క్వాలిఫై అయింది. మరోరేసు మిగిలి ఉండగానే నేత్ర టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. సమీప ప్రత్యర్థిపై నేత్ర 21 పాయింట్ల ఆధిక్యంలో ఉండడంతో ఒకరోజు ముందుగానే ఆమె ఒలింపిక్స్కు అర్హత సాధించడం విశేషం. ఇప్పటిదాకా తొమ్మిది మంది సెయిలర్లు భారత్ తరపున ఒలింపిక్స్లో పాల్గొనగా తొలిసారి మహిళా విభాగంలో నేత్ర అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. చెన్నైలోని ఎస్ఆర్ఎం కాలేజీలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతోన్న నేత్ర రెండుసార్లు జాతీయ ఛాంపియన్ షిప్లు గెలుచుకుంది. మరో రెండు సందర్భాల్లో రన్నరప్గా నిలిచింది. 2018లో జకార్తాలో జరిగిన ఏíషియన్ గేమ్స్లో లేజర్ రేడియల్లో ఐదోస్థానం లో నిలిచింది. గతేడాది జనవరిలో జరిగిన హెంపల్ వరల్డ్ కప్ సిరీస్లో కాంస్యపతకం గెలుచుకుంది. సెయిలింగ్ వరల్డ్ కప్ మెడల్ గెలుచున్న తొలి భారతీయ మహిళగా నేత్ర చరిత్ర సృష్టించింది. గత కొన్నేళ్లుగా జాతీయ చాంపియన్గా నిలుస్తోన్న నేత్ర ఏషియన్ గేమ్స్లో కొద్దిలో మిస్ అయినప్పటికీ నిరంతర కృషితో ఆమె టోక్యో ఒలింపిక్స్కు చేరుకుంది. నేత్ర మాట్లాడుతూ..‘‘నేను చెన్నైలో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఒకసారి సమ్మర్ క్యాంప్లో భాగంగా తొలిసారి సెయిలింగ్లో పాల్గొన్నాను. ఇతర రకాల క్రీడలతో పోలిస్తే ఇది విభిన్నంగా ఉంటుంది. సెయిలింగ్ చేయడానికి మానసిక ధైర్యం చాలా అవసరం. ఒకసారి చూద్దాం అని వెళ్లిన నేను సెయిలింగ్ బాగా నచ్చడంతో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నాను. గతేడాది లాక్డౌన్ సమయంలో స్పెయిన్లో చిక్కుకుపోయాను. అప్పుడు రెండుసార్లు ఒలింపియన్గా నిలిచిన హంగేరియాకు చెందిన థామస్ ఇస్జ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. రేసింగ్లో ఒత్తిడిని ఎలా జయించాలో ఆయన చక్కగా వివరించారు. ఒకటిన్నర ఏడాదిపాటు ఇంటికి దూరంగా ఉండి కఠోర దీక్షతో కష్టపడడంతో ఈరోజు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించాను’’అని నేత్ర చెప్పింది. ‘‘ఇవి నా తొలి ఒలింపిక్ గేమ్స్. సాయశక్తులా ప్రయత్నించి ఈ పోటీలో గెలవడానికి ప్రయత్నిస్తాను. తరువాతి ఒలింపిక్స్లో కూడా పోటీపడతా’’ అని నేత్ర ధీమా వ్యక్తం చేసింది. ఇక ఆన్లైన్ క్లాస్లు జరుగుతుండడం వల్ల ఇటు నా బీటెక్ ను అటు సెయిలింగ్ను బ్యాలెన్స్ చేస్తున్నాను. మా నాన్న గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనవల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న.. నా వెనుక ఉండి ఆయన నన్ను ముందుకు నడిపించారు.’’ అని నేత్ర చెప్పింది. -
నేటి నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
శ్రీకాకుళం న్యూకాలనీ : వేసవి క్రీడా శిక్షణా శిబిరాల (సమ్మర్ కోచింగ్ క్యాంప్)కు వేళయింది. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల వేదికలుగా శిక్షణా శిబిరాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏటా ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు 30 రోజులపాటు సమ్మర్ కోచింగ్ క్యాంప్ల పేరిట క్రీడాకారులు, ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. సాక్షి ముందుగా చెప్పినట్టుగానే ఈ ఏడాది 50 కేంద్రాల్లో శిక్షణకు చర్యలు తీసుకున్నారు. అయితే ప్రతికూల వాతావరణంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, శిక్షకులు ఆందోళన చెందుతున్నారు. 14 ఏళ్లలోపు వారికే చాన్స్.. ఈ క్యాంప్లకు హాజరయ్యే క్రీడాకారులు, విద్యార్థులు 14 ఏళ్లు లోపు వారికే అధికారులు అవకాశం కల్పించడంపై క్రీడాసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కనీసం 17 ఏళ్ల వరకు అవకాశం కల్పించాల్సిందని పీఈటీ సంఘ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రానికి రూ.10 వేల చొప్పున కేటాయించనున్నారు. ఈ నిధులతో క్యాంప్ నిర్వహణకు అవసరమయ్యే క్రీడా పరికరాలు, సామగ్రి, మౌలిక సదుపాయాలు, తాగునీరు, శిక్షకునికి గౌరవ వేతనం చెల్లించనున్నారు. పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులను కోచ్గా నియమించారు. వాలీబాల్కే పెద్దపీట.. ఈ ఏడాది క్రీడాధికారులు దాదాపుగా అన్ని క్రీడాంశాలకు అవకాశం కల్పించారు. అత్యధికంగా ఆదరణ కలిగిన వాలీబాల్, ఇతర గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. వాలీబాల్ 6, అథ్లెటిక్స్ 5, కబడ్డీ 4, హ్యాండ్బాల్ 4, ఖోఖో 3, షటిల్ బ్యాడ్మింటన్ 3, తైక్వాండో 3, సాఫ్ట్బాల్ 3, వెయిట్లిఫ్టింగ్ 2, ఫుట్బాల్ 2, హాకీ 2 కేటాయించారు. బాస్కెట్బాల్, బాక్సింగ్, సప్కతక్ర, ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నీకాయిట్, లాన్టెన్నిస్, చెస్, స్కేటింగ్, జూడో, ఉషూ, రైఫిల్షూటింగ్ క్రీడాంశాలకు చెరో శిక్షణా శిబిరాన్ని కేటాయించారు. సక్సెస్ చేయాలని పిలుపు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను విజయవంతం చేయాలని సెర్ఫ్ సీఈఓ బి.ప్రసాదరావు, చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్కుమార్ పిలుపునిస్తున్నారు. శిక్షకులు తమ బాధ్యతగా గుర్తించి క్రీడాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని, సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. వివరాలకు 98660 98642 నంబర్ను సంప్రదించాలని చెబుతున్నారు. -
భారతీయ సంస్కృతి గొప్పది
విజయనగరం రూరల్ : భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో గొప్పదని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి అన్నారు. ఓం మందిరంలో భగవాన్ శ్రీసత్యసాయి ఆరాధన సందర్భంగా వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. శిక్షణ తరగతుల సమన్వయకర్త, ఉపాధ్యాయుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే తరగతుల్లో వేదం, యోగా, ఆధ్యాత్మిక భజన, జ్యోతి ధ్యానం, ఆరోగ్యం పరిశుభ్రత, భగవద్గీత, మానవత విలువలు, భారతం కథలు, కలియుగ వైకుంఠం, పంచయజ్ఞాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస్ కో–ఆర్డినేటర్ బి.రమేష్కుమార్, కన్వీనర్ సన్యాసినాయుడు, 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇస్కాన్ ఆధ్వర్యంలో వేసవి శిబిరం
కవాడిగూడ (హైదరాబాద్) : ఇస్కాన్ కూకట్పల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గీతా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు డెరైక్టర్ మహా శృంగదాస గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదిరోజులపాటు 8 నుండి 20 ఏళ్ల వయసు వారి కోసం భగవద్గీతపై వేసవి శిక్షణ శిబిరం ఉంటుందన్నారు. శిబిరం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కొనసాగుతుందన్నారు. పిల్లలకు వ్యక్తిత్వ వికాసంతో పాటు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తోబుట్టువులతో ఎలా ప్రవర్తించాలి, విద్యా విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సంస్కృత శ్లోక పఠనం, వైధిక కథలు, డ్రామాలు, డ్యాన్స్, ఆటలు, భగవద్గీత యధాతథం తదితర విషయాలను అత్యంత సరళంగా నేర్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8008924201, 9866340588 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. -
‘సాక్షి’ గ్రూప్, భాష్యం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్
హైదరాబాద్: పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడం కోసం, మరింత మెరుగుపెట్టడం కోసం సాక్షి మీడియా గ్రూప్, భాష్యం విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం కాబోతోంది. యోగా, చెస్, పెయింటింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కలినరీ, పియానో, గిటార్ తదితర అంశాల్లో ఈ శిక్షణ జరగనుంది. భాష్యం పబ్లిక్ స్కూల్స్లో మే 3వ తేదీ వరకు రెండు పాస్పోర్టు ఫొటోలు, వివరాలతో వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 4 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ శిక్షణ ఉంటుంది. వివరాలకు 04023256138లో సంప్రదించవచ్చు. -
ఇక లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ..
మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో హైదరాబాదీ, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సందడి చేశారు. అజీజ్నగర్ కు బుధవారం విచ్చేసిన సొగసరి బ్యాట్స్మన్ లక్ష్మణ్ 50 ఎకరాల స్థలంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. శ్రీనిధి స్కూల్ క్యాంపస్లో అకాడమీని ప్రారంభించి, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేసవిలో క్రికెట్ కోసం సమ్మర్ క్యాంప్ కూడా ఆయన ఏర్పాటు చేయనున్నారు. మణికట్టు ఆటగాడిగా పేరున్న వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్మన్ తమ ప్రాంతానికి రావడంతో అజీజ్నగర్ వాసులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆయనను చూడటానికి శ్రీనిధి క్యాంపస్ కు తరలివచ్చారు. అభిమానులను పలకరించి, క్రికెట్ పై ప్రేమ పెంచుకుంటే ఆటలో రాణించడం సులభమవుతుందని ఈ సందర్భంగా లక్ష్మణ్ అన్నారు. ఆయన పదేళ్లకు పైగా భారత జట్టుకు విశేషసేవలందించారు. వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెప్పగానే 2001లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కోల్కతా టెస్ట్ లో ఆయన చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఇప్పటికీ మనకు గుర్తుకువస్తుంది. -
ఈ సమ్మర్ మీదే!
టీనేజ్ టీనేజ్ లైఫ్లో వేసవి సెలవులు అమూల్యమైనవి. ఈ కాలంలో ప్రపంచం మీ సొంతం అవుతుంది. వేసవి అనేది రిలాక్స్ అవడం కోసం మాత్రమే కాదు. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి తగిన సమయం.. అందుకే మీ కోసం కొన్ని సూచనలు... స్నేహితులతో కలిసి ఔట్డోర్లో సమ్మర్ క్యాంప్ ప్లాన్ చేయండి.కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఈ వేసవిలో కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సాధించదలచిన లక్ష్యాల జాబితా ఒకటి తయారు చేసుకోండి. ఆ లక్ష్యాల సాధనకు అవసరమైన ప్రణాళికను పక్కాగా తయారుచేసుకోండి.బరువు ఎక్కువగా ఉంటే తగ్గడానికి తగిన వ్యాయమాలు చేయండి. బరువు మరీ తక్కువగా ఉంటే పెరిగే ప్రయత్నం చేయండి. వెళ్లి మంచి పుస్తకాలను ఎంపిక చేసుకోండి. సెలవులు పూర్తయ్యేలోపు వాటిని చదవడం పూర్తి చేయండి.సామాజిక సేవా కార్యమ్రాల్లో పాల్గొనండి.