breaking news
Sudhakar Reddy ponguleti
-
విభజన అంశాలపై కేంద్రం నిర్లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్: విభజన అంశాల అమలుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని కాం గ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయం మీడి యా పాయింట్లో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే 100 గ్రామాలకు ప్రమాదం ఉందని ఎస్కే జోషి గతంలోనే చెప్పారని, కేంద్రం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఉద్యమ పార్టీ ఎందుకు స్పందించదు?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టాన్ని రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయనందు వల్లే కోర్టుకు వెళ్లామన్నారు. ప్రతిపక్షం బాధ్యతగా తాము చేయాల్సిందింతా చేస్తున్నామని.. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసమే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఇందుకు ప్రతిగా కేంద్రం వివిధ శాఖల ద్వారా కౌంటర్ దాఖలు చేయిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం తన సొంత ఖర్చుతో కేసుకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తున్నానన్న ఆయన.. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్, పర్సనల్ అజెండాతోనే అధికార పార్టీ వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందని విమర్శించారు. శ్వేతపత్రం విడుదల చేయాలి.. ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు ఎంత మేలు జరిగిందనే విషయాలపై శ్వేతప్రతం విడుదల చేయాలని సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధన కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి లక్ష పోస్టు కార్డులు రాసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోంటే తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులు వేరంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. -
రేవంత్.. ఉచిత సలహాలొద్దు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఉచిత సలహాలేమీ తమకు అవసరం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్పై రేవంత్ విమర్శలు సరికాదన్నారు. రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం అంశంలో ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి, ఎత్తును తగ్గించాలన్నారు.