breaking news
succcess
-
ఆర్ఎస్ఎస్ అంటే విజయం: శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తన వందేళ్ల ఘన చరిత్రతో ఎన్నో మైలు రాళ్లను చూసిందని, ఆర్ఎస్ఎస్ అంటే విజయం అని, నేషన్ ఫస్ట్ అనేది సంఘ్ విధానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. దేశానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో భారతమాత చిత్రాన్ని నాణెంపై రూపొందించడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ నాణెంపై ఆర్ఎస్ఎస్ నినాదం రాష్ట్రే స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ అని ఉందని, దీని అర్థం ప్రతిదీ దేశానికి అంకితం.. ప్రతిదీ దేశానికే.. ఏదీ నాది కాదని ప్రధాని వివరించారు. రేపు విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయం. అన్యాయంపై న్యాయానికి దక్కిన విజయం. అబద్ధాలపై సత్యం సాధించిన విజయం. చీకటిపై వెలుగు సాధించిన విజయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. राष्ट्रीय स्वयंसेवक संघ की 100 वर्षों की गौरवशाली यात्रा त्याग, निःस्वार्थ सेवा, राष्ट्र निर्माण और अनुशासन की अद्भुत मिसाल है। RSS के शताब्दी समारोह का हिस्सा बनकर अत्यंत गौरवान्वित अनुभव कर रहा हूं।https://t.co/S4gxc0X3IE— Narendra Modi (@narendramodi) October 1, 2025వందేళ్ల క్రితం దసరా నాడు జరిగిన ఆర్ఎస్ఎస్ స్థాపన అనేది వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ పునరుత్థానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలను చూసే అదృష్టం మనకు దక్కిందన్నారు. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న పలు సంస్థలు సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను తీరుస్తున్నాయని ప్రధాని అన్నారు. ఆర్ఎస్ఎస్లో విభిన్న విభాగాలు ఉన్నప్పటికీ అవి ఎప్పుడూ ఘర్షణ పడలేదని, ఎందుకంటే సంస్థ లక్ష్యం కోసం అవన్నీ పనిచేస్తున్నాయని, ‘దేశం మొదట’ అనే దిశగా ఆర్ఎస్ఎస్ ముందుకు నడుస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానం1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. పౌరులలో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థగా ఇది ప్రారంభమైంది. గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక-సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. వరదలు, భూకంపాలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. -
CSK సక్సెస్ ఫార్మలా చెప్పిన ధో ని
-
జనగామ బంద్ సక్సెస్
అధికార పార్టీతో సహా ప్రతిపక్షాల నిరసనలు డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు నిర్మానుష్యంగా రహదారులు జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని మంగళవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. హన్మకొండ వద్దు... జనగామ జిల్లా చేయాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలు రహదారులపైకి వచ్చి గర్జించారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజే పీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బహుజన సమాజ్వాది, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ప్రాంగణం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సైతం జనగామ బంద్కు మద్దతు పలికారు. యువత బైక్ర్యాలీలతో వాడవాడలా తిరుగుతూ జనగామ జిల్లా నినాదాలతో హోరెత్తించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సీఐలు ముసికె శ్రీనివాస్, చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని జనగామ, వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ సబ్ డివిజన్లోని ఎస్సైలు, పోలీసు సిబ్బందితోపాటు పారామిలటరీ బలగాలు, మహిళా కానిస్టేబుళ్లతో బందోబస్తు చర్యలు చేపట్టారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. బంద్లో వ్యాపార, వాణి జ్య సంస్థలతోపాటు ప్రైవేటు పాఠశాలు స్వచ్ఛందం గా పాల్గొన్నాయి. జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడివక్కడే నిలిచి ప్రయాణీలు చాలా ఇబ్బందులు పడ్డారు. జనగామ పట్టణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. సంపూర్ణ బంద్తో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. జనగామ జిల్లా చేయకపోతే అగ్నిగుండా మారుస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో అన్ని పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, బండ యాదగిరిరెడ్డి, నెల్లుట్ల నర్సిం హారావు, నాగారపు వెంకట్, చెంచారపు శ్రీనివాస్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా, వజ్జ పర్శరాములు, బొట్ల శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, మామిడాల రాజు, పెద్దోజు జగదీష్, ఆలేటి సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, పసుల ఏబేలు, ఉల్లెంగుల క్రిష్ణ, తిప్పారపు ఆనంద్, రావెల రవి ఉన్నారు.


