breaking news
Statue of BR Ambedkar
-
దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదాన్లో అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహాన్ని దీర్ఘకాలం నాణ్యంగా ఉండేలా రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. స్ట్రక్చర్లో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ స్వరాజ్ మైదాన్లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు భారీ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనానికి సంబంధించిన రెండు రకాల ప్లాన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు చూపించారు. క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాగపూర్లోని అంబేడ్కర్ దీక్ష భూమి, ముంబైలోని చైత్యభూమి, లఖ్నవూలోని అంబేడ్కర్ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్లను ఆయనకు చూపారు. గ్యాలరీ, ఆడిటోరియం ఎలా ఉంటుందన్న దానిపైనా ప్రజెంటేషన్ ఇచ్చారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహం తయారీకి 14 నెలలు పడుతుందని, ఈ నేపథ్యంలో విగ్రహం, స్మృతివనం పనులను డిసెంబర్లో మొదలుపెట్టి 14 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2022 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ, స్మృతివనం ప్రారంభించాలని నిర్ణయించారు. స్మృతివనం వద్ద కన్వెన్షన్ సెంటర్, పబ్లిక్ గార్డెన్, ధ్యాన స్థూపం, బౌద్ధ శిల్పాల ఏర్పాటుతోపాటు రెస్టారెంట్, లాబీ, ధ్యాన కేంద్రం, చి్రల్డన్ ప్లే ఏరియా, వాకర్స్ ట్రాక్, ఫౌంటెయిన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ‘‘ల్యాండ్స్కేప్లో గ్రీనరీ బాగా ఉండాలి. అది ఏమాత్రం చెడిపోకుండా చూడాలి. అంబేడ్కర్ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటుతోపాటు ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలి. అలాగే అంబేడ్కర్ సూక్తులను కూడా ప్రదర్శించాలి. పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్పాత్ను అభివృద్ధి చేయాలి. రెండింటినీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి’’ అని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి మేకపాటి, సీఎస్ నీలం సాహ్ని, అధికారులు పాల్గొన్నారు. -
సచివాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే ఎత్తయిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని జయంతి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇందుకు ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ వెనుకనున్న 36 ఎకరాల స్థలాన్ని పరిశీలించించింది. అందులోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన ఆదివారం బుద్ధపూర్ణిమ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 14న కేసీఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులకు ఉత్సవ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు లోయర్ ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్ నిర్మాణాలకూ అదే రోజున శంకుస్థాపన చేయించాలని తీర్మానించారు. అలాగే బోరబండ వద్ద నిర్మించతలపెట్టిన దళిత్ స్డడీస్ సెంటర్కు శంకుస్థాపన చేసిన అనంతరం అదే రోజు సాయంత్రం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జగదీష్రెడ్డి, డిప్యూటీ సీఎం, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి వెల్లడించారు. ఘనంగా జయంతి ఉత్సవాలు అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలను ఏడాది పొడవునా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి చందూలాల్తో పాటు టీఎస్పీఎస్సీసీ చైర్మన్ గంటా చక్రపాణి, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.