breaking news
state elections
-
USA presidential election 2024: తొలి ప్రైమరీలో ట్రంప్దే గెలుపు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్పై దాడికి ఉసిగొల్పాడన్న ఆరోపణలు, నీలిచిత్రాల తారతో అనైతిక ఆర్థిక లావాదేవీ, పదుల కొద్దీ కేసుల ఉదంతాలు వెలుగుచూసినా.. రిపబ్లికన్ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఇంకా డొనాల్డ్ ట్రంప్ వెంటే ఉన్నారని రుజువైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అయోవా రాష్ట్రంలో జరిపిన ప్రైమరీ ఎన్నికల్లో తోటి అభ్యర్థులందరినీ వెనక్కి నెట్టి మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్రాలవారీగా జరిగే ఈ ఎన్నికల్లో తొలి రాష్ట్రంలోనే ట్రంప్ బోణీ కొట్టడం రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్నికల్లో ట్రంప్కు 51 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. గట్టి పోటీదారుగా అందరూ భావించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్కు 21.2 శాతం ఓట్లు పడ్డాయి. ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, సౌత్ కరోలీనా మాజీ మహిళా గవర్నర్ నిక్కీ హేలీకి 19.1 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్త, సంపన్నుడు వివేక్ రామస్వామి ఈ రేసులో ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు పడ్డాయి. సగానికిపైగా ఓట్లు సాధించి నిర్ణయాత్మక రాష్ట్రంలో గెలుపు ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థి తానేనని ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. అయోవా రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థి ఇంతటి భారీ మెజారిటీతో గెలవడం ఇదే తొలిసారి. ఓట్ల పరంగా చూస్తే మరో అభ్యర్థి అసా హుచిన్సన్కు కేవలం 191 ఓట్లు, ఇంకో అభ్యర్థి క్రిస్ క్రిస్టీకి 35 ఓట్లు పడ్డాయి. అత్యల్ప ఓట్లు సాధించడంతో తాను ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అర్కన్సాస్ మాజీ గవర్నర్ అసా హుచిన్సన్ ప్రకటించారు. ఈసారి మొత్తంగా 1,10,000 మంది ఓట్లు వేశారు. ఈ రాష్ట్రంలో ఇంత తక్కువగా ఓటింగ్ జరగడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక ట్రంప్కే నా మద్దతు: వివేక్ రామస్వామి అయోవా ప్రైమరీ ఎన్నికల్లో తక్కువ ఓట్లలో నాలుగో స్థానానికి పరిమితమైన భారతీయవ్యాపారి వివేక్ రామస్వామి ఇక ఈ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ రాష్ట్ర ప్రైమరీలో ఆశ్చర్యకర ఫలితాలను ఆశించి భంగపడ్డా. ఇక ప్రచారానికి స్వస్తి పలుకుతున్నా. అధ్యక్షుడినయ్యే మార్గమే లేదు. ఇక నా మద్దతు ట్రంప్కే’’ అని తన మద్దతుదారుల సమక్షంలో వివేక్ మాట్లాడారు. -
వరాలు కురిపిస్తారా!
.. వీటన్నింటికీ కొద్దిగంటల్లోనే జవాబు లభించనుంది. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ టర్మ్లో చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం.. సుమారు ఏడాది వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు, ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం.. నోట్లరద్దు, జీఎస్టీలతో క్షేత్రస్థాయిలో నెలకొన్న వ్యతిరేకతను తొలగించాలన్న లక్ష్యం.. వెరసి మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని, గ్రామీణ ఓటర్లే లక్ష్యంగా పథకాలు ప్రకటించవచ్చని అంచనాలున్నాయి. ఆదాయ, కార్పొరేట్ పన్నుల్లో భారీగా ఊరట కల్పించవచ్చనే ఆశలూ వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కొద్దిగంటల్లోనే అందరి ఆశలు, సందేహాలకు సమాధానాలు లభించనున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోసారి బడ్జెట్ ఇన్నింగ్స్కు సిద్ధమైంది. ఎనిమిది కీలక రాష్ట్రాల ఎన్నికలకుతోడు సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో.. ఈ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో అటు ప్రజాకర్షక మంత్రాన్ని జపిస్తూనే, ఇటు ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీపై పడింది. మంద గమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, ఉద్యోగాల సృష్టి, వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వంటి అంశాలు ఈ బడ్జెట్లో కీలకమవుతాయని భావిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక తొలి బడ్జెట్ ఇదే. ఈ బడ్జెట్ వస్తువుల ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా మధ్య తరగతి, వేతన జీవులతో పాటు కార్పొరేట్ వర్గాలు మాత్రం పన్నుల ఊరట కోసం ఆశగా చూస్తున్నాయి. తాయిలాలు ఉంటాయా? అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్ మాత్రమే. దీనికితోడు త్వరలో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏవైనా తాయిలాలు ఇవ్వాలంటే.. ఈ బడ్జెట్లోనే సాధ్యం. ఈ నేపథ్యంలో జైట్లీ గ్రామీణ భారతావనిపై దృష్టి పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త గ్రామీణ పథకాలతోపాటు ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ), పల్లెల్లో ఇళ్ల నిర్మాణం, వ్యవసాయానికి భారీ నిధులను కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ బీమాకు కూడా నిధులను కుమ్మరించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయ పన్ను ఊరట ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కనుక ఎన్నికల్లో మధ్య తరగతి, వేతన జీవులను తమవైపు తిప్పుకోవటానికి ఆదాయ పన్ను ఊరట అస్త్రాన్ని జైట్లీ ప్రయోగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచడం, పన్ను శ్లాబ్లలో మార్పులు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి. కానీ పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్యను పెంచేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వం.. దీనిపై ఏ మేరకు ముందుకెళుతుందనే సందేహం నెలకొంది. మౌలిక రంగానికి చేయూత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2017–18లో నాలుగేళ్ల కనిష్టానికి (6.75) పడిపోవచ్చని తాజాగా ఆర్థిక సర్వే సైతం అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని పెంచేందుకు ఇన్ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి సారించే అవకాశముంది. జాతీయ రహదారులు, రైల్వేల ఆధునీకరణకు భారీ కేటాయింపులు ఉంటాయనే అంచనాలున్నాయి. ద్రవ్యలోటు గుబులు బడ్జెట్ వరాలకు అడ్డం కిగా నిలిచేదేమైనా ఉంటే అది కచ్చితంగా ద్రవ్యలోటే (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటికే ఆ పరిధి దాటిపోయింది. ఒకవేళ అదనంగా రుణాలు తీసుకువచ్చి, ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడకపోతే స్టాక్ మార్కెట్లకు ప్రతికూల సంకేతాలు పంపే ప్రమాదముంది. భారత రేటింగ్పైనా ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇక ముడి చమురు ధరలు పెరిగిపోతుండటంతో ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు పెరిగిపోతాయన్న ఆందోళనలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లకు షాకిస్తారా..? ఈసారి బడ్జెట్పై అత్యంత ఉత్కంఠతో ఉన్నది స్టాక్ మార్కెట్ వర్గాలే. ఎందుకంటే షేర్లపై ఆదాయానికి పన్ను మినహాయింపు వ్యవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచవచ్చన్న భయాలు మార్కెట్ను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం షేర్లు కొని ఏడాది తర్వాత విక్రయిస్తే... తద్వారా వచ్చే లాభాలపై పన్ను లేదు. ఆలోపు విక్రయిస్తే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. అయితే మోదీ ప్రభుత్వం స్టాక్ మార్కెట్ నుంచి మరిన్ని నిధులు రాబట్టాలన్న ఉద్దేశంతో ఉందని.. ఏడాది దాటితే వచ్చే మూలధన లాభాలపై 7 నుంచి 10 శాతం పన్ను విధించవచ్చని అంచనా వేస్తున్నారు. అలాకాకుండా పన్ను మినహాయింపు పరిమితిని మూడేళ్లకు పెంచవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. అంటే షేర్లు కొని మూడేళ్లలోపు విక్రయిస్తే వచ్చే లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఇక విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) ప్రస్తుతం ఎలాంటి మూలధన లాభాల పన్ను లేదు. ఇప్పుడు అమల్లోకి తేవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయాల్లో ఏవైనా గురువారం స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తారా? కార్పొరేట్ సంస్థలపై పన్నును ప్రస్తు తమున్న 30 శా తం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని 2015లో జైట్లీ హామీనిచ్చారు. కానీ గతేడాది బడ్జెట్లో కొన్ని వర్గాలకు మాత్రమే కాస్త ఊరట (29 శాతానికి తగ్గించారు) ఇచ్చారు. మొత్తం అన్ని కంపెనీలకూ ఈసారి కార్పొరేట్ పన్నును తగ్గించాలన్న డిమాండ్ వస్తోంది. ఇక డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) తొలగింపు, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను ఎత్తివేయడం వంటి డిమాండ్లపైనా ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తిగా మారింది. జీఎస్టీ, నోట్ల రద్దు ‘గాయాల’కు చికిత్స! వస్తు సేవల పన్ను (జీఎస్టీ), నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయ ని ఇటీవలి ఎన్నికల్లో బయటపడింది. దీంతో బీజేపీకి సంప్రదాయ మద్దతు దారులైన చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా.. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం నుంచి కొంతైనా బయటపడేలా ప్రోత్సాహకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పరోక్ష పన్నుల ప్రస్తావన లేనట్టే! కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవల పన్నులను జీఎస్టీలో కలిపేయడంతో.. ఈసారి బడ్జెట్లో పరోక్ష పన్నుల ప్రస్తావన పెద్దగా ఉండదని భావిస్తున్నారు. దీంతో కస్టమ్స్ సుంకంలో మాత్రమే మార్పుచేర్పులు చేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే జీఎస్టీ రేట్లను సవరించే అధికారం జీఎస్టీ మండలికి మాత్రమే ఉంది. -
ఫిబ్రవరి 19న ఎన్జీఓ రాష్ట్ర సంఘానికి ఎన్నికలు
తాడితోట (రాజమహేంద్రవరం) : ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘానికి ఫిబ్రవరి 19న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు బూరిగ అశీర్వాదం తెలిపారు. స్థానిక ఎన్జీఓ హోమ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారి కె.దాలినాయుడు ఎన్నికల షెడ్యూల్డ్ను విడుదల చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని ఇరవై మంది రాష్ట్ర ఆఫీసు బేరర్లను ఎన్నుకుంటారని చెప్పారు. జిల్లా నుంచి 68 మంది స్టేట్ కౌన్సిలర్లు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు, 20 యూనిట్లు అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిలర్లు ఓటు వేస్తారన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ అసోసియేష¯ŒS భవ¯ŒSలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ప్రస్తుత సంఘ అధ్యక్షుడు పర్చూరి అశోక్బాబు, ప్రధాన కార్యదర్శి ఎ¯ŒS.చంద్రశేఖర్రెడ్డి పానెల్కు మద్దతు ఇవ్వాలని జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. జిల్లా నుంచి పసుపులేటి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నామినేష¯ŒS వేస్తారన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామరాయుడు, ఉపాధ్యక్షులు పి. రాజబాబు, నేతలు పసుపులేటి శ్రీనివాస్, రాజమహేంద్రవరం యూనిట్ అధ్యక్షుడు జి.హరిబాబు, ధవళేశ్వరం యూనిట్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, పి.నాగేశ్వరరావు, వైవీ నారాయణ, జి.వంశీ కళ్యాణ్, క్రిష్టాఫర్, ప్రవీణ్ కుమార్, పీవై శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.