-
4 సెకన్లకో ఆకలి చావు..
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధతో తనువు చాలిస్తున్నారని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్(ఎన్జీవోలు) పేర్కొన్నాయి. రోజుకు 19,700 మంది వంతున ప్రతి సెకనుకు నలుగురు చొప్పున ఆకలితో చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నాయి. 2019తో పోలిస్తే ఆకలి చావులు రెట్టింపయ్యాయని తెలిపాయి. 75 దేశాలకు చెందిన ఆక్స్ఫామ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 ఎన్జీవోలు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ దేశాల నేతల నుద్దేశించి లేఖ రాశాయి. ‘‘21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వబోమంటూ ప్రపంచ నేతలు ప్రతినబూనినప్పటికీ సొమాలియాలో మరోసారి తీవ్ర కరువు తాండవిస్తోంది. 45 దేశాల్లోని మరో 5 కోట్ల మంది ప్రజలు కరువుకు చేరువులో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో తెలిపాయి. ‘కేవలం ఒక దేశం లేదా ఖండానికి సంబంధించింది కాదు. మొత్తం మానవాళికే జరుగుతున్న అన్యాయమిది’’ అని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్త ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. ‘‘21వ శతాబ్దంలో కూడా కరువు గురించి మాట్లాడుకోవాల్సి రావడం దారుణం. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణమే ఆహారంతోపాటు దీర్ఘకాలం పాటు వారికి సాయం కొనసాగించడంలో ఏమాత్రం ఆలస్యం తగదు’’ అని పేర్కొన్నాయి. -
ఆకలి చావులు లేని భారత్ కోసం..
మోపిదేవి (అవనిగడ్డ): భారత్ను ఆకలి చావులు లేని దేశంగా చూడాలన్నది ఆ యువకుడి కల. దానికోసం తనవంతు ప్రయత్నంగా దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వ్యవసాయానికి దూరమవుతున్న వారిని తిరిగి సాగు వైపు మళ్లించటమే లక్ష్యంగా దేశవ్యాప్త యాత్ర చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈడిగ ప్రదీప్కుమార్.. అనంతపురానికి చెందిన యువకుడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రదీప్ ఫిబ్రవరి 23న ఈ యాత్రను చేపట్టాడు. తొలుత పాదయాత్రగా ప్రారంభించినప్పటికీ, యాత్ర నెల్లూరుకు చేరిన సమయంలో అక్కడి స్థానికులు ఆదరించి అతను వద్దని చెప్పినా సైకిల్ కొనిచ్చారు. అప్పటి నుంచి సైకిల్పై యాత్ర కొనసాగిస్తున్నాడు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అతని తల్లిదండ్రులు తొలుత ప్రదీప్ యాత్రను వ్యతిరేకించినా, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూశాక ప్రోత్సహించటం మొదలుపెట్టారు. జాతీయ జెండా చేబూని, ఆదరించిన వారి నుంచి భోజనం స్వీకరిస్తూ, భోజనం దొరకని రోజున మంచి నీళ్లే ఆహారంగా చేసుకుని ప్రదీప్ తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు. వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులను గమనించి, అందుకు గల కారణాలను అన్వేషిస్తూ, సాగు పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రదీప్ యాత్ర గురువారం కృష్ణా జిల్లాలోని మోపిదేవికి చేరింది. స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రదీప్ను దివిసీమ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు అభినందించారు. -
ఆహారభద్రతే... ఆకలిచావులకు మందు!
కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేద రిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్ ఫామ్’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఆ సంస్థ ‘ది హంగర్ ముల్టిప్లయిస్’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాది నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమవ్వడం వంటి విషయాలు ఈ నివేదిక వెల్లడించింది.. మన దేశంలో 2021–22లో 315 మిలియన్ టన్నుల రికార్డ్ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా... 2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. కొనుగోలు సామర్థ్యం కొరవడింది. పోషకాహారం లోపం వల్ల ఆకలి చావులు పెరుగుతున్నాయి. భారత్లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకా హార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతు న్నారని అంచనాలు తెలుపుతున్నాయి. 2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశా లను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది. శ్రీలంక 65, బంగ్లాదేశ్ 76, పాకిస్తాన్ 92 స్థానాల్లో ఉండటం ఈ సందర్భంగా గమ నించాలి. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందించాలనీ, ఆకలితో ఎవ్వరూ చని పోకూడదనీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలైనా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొలుపు తాయేమో చూడాలి. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చెయ్యాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోదుమలు ఇవ్వడం కాదు. దారిద్య్రరేఖకు కింద వున్నవారికి పౌష్టికాహారం అందించడం. అప్పుడే పేద వర్గాలలో ఆహార భద్రత కలుగుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రజలు ఆరోగ్య దాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సుర క్షిత పౌష్టికాహారం ప్రజలందరికీ అందించాలి. ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలి. అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. అణగారిన వర్గాలకు, గిరిజనులకు, మురికి వాడల్లో నివసించే వారికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందజేయాలి. అప్పుడే ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరుతుంది. నేదునూరి కనకయ్య వ్యాసకర్త తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు మొబైల్: 94402 45771 -
అన్నం పెట్టలేక... బిడ్డలనే అమ్మేస్తున్నారు!
డొక్కలీడ్చుకుపోయి.. ఎముకలపై చర్మం మాత్రమే ఉన్న చిన్నారులు... కుటుంబాన్ని బతికించుకునేందుకు శరీర అవయవాలను అమ్ముకుంటున్న పెద్దలు.. మిగిలిన బిడ్డలను బతికించుకోవడానికి ఓ బిడ్డను అమ్ముకుంటున్న కుటుంబాలు... పుట్టెడు దు:ఖాన్ని దాచేసి ఏ భావమూ కనిపించకుండా నిర్విరాకరంగా నఖాబ్ మాటున కళ్లు... ఇది ప్రస్తుత ఆఫ్గన్ ముఖ చిత్రం. తినేందుకు తిండి లేదు. చేసేందుకు పనిలేదు. ఎక్కడ చూసినా కరువు. ఆకలి చావులు. మానవతా దృక్పథంతో ప్రపంచం ఆఫ్గనిస్తాన్ ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. కాబూల్: ప్రపంచానికి కరోనా ఒక్కటే బాధ. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన అఫ్గానిస్తాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక... ఆర్థిక సంక్షోభం, కరువు వేధిస్తోంది. అమెరికా తమ ఫెడరల్ బ్యాంకు నుంచి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ల నుంచి అఫ్గాన్ అందాల్సిన నిధులను స్తంభింపజేయడంతో... ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆహార సంక్షోభంతో ఆకలిచావులు పెరిగిపోయాయని.. ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ డేవిడ్ బేస్లీ మళ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల వశమవ్వడానికి ముందు కూడా అఫ్తానిస్తాన్లో కరువు ఉంది. కానీ... ఆ తరువాత మరింత పెరిగింది. వేలాది మంది ఉపాధ్యాయులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు.. వారు వీరనే తేడా లేదు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. దేశంలో ప్రధాన ఆధారం వ్యవసాయం. ఈ ఏడు వ్యవసాయమే లేదు. దీంతో రెండున్నర కోట్లకు కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కూరగాయలు, మాంసం, పాలు ఏవీ లేవు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీల్లో పోషకాహార లోపం పెరిగిపోతోంది. కుటుంబానికి పిడికెడన్నం పెట్టడం కోసం కడుపున పుట్టిన పిల్లలను, ఇంట్లో ఉన్న వస్తువులను సైతం అమ్ముకుంటున్నారు. పదిలక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు. సగం పైగా జనాభాకు కేవలం నీళ్లు, బ్రెడ్ మాత్రమే దొరుకుతోంది. ఒక్కోసారి అది కూడా ఉండటం లేదు. పనిలేదు, ఆదాయం లేదు. ఇంట్లో పిల్లల కడుపునింపే పరిస్థితి లేదు. ఆకలితో అలమటిస్తున్న పిల్లల ముఖాలు చూసే ధైర్యం చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ‘ఆఫ్ఘన్ ప్రజలు మనుగడ కోసం తమ పిల్లలను, వారి శరీర భాగాలను విక్రయిస్తున్నారు. దేశంలో సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గానిస్తాన్కు సహాయాన్ని వేగవంతం చేయాలి’ అని ఆయన కోరారు. మనవాతా హృదయంతో యావత్ ప్రపంచం స్పందించాలని బేస్లీ కోరారు. ఆఫ్గానిస్తాన్లో కరువు, మహమ్మారి, ఆర్థిక పతనం, సంవత్సరాల సంఘర్షణ ప్రభావాలతో పోరాడుతోంది. నాలుగు కోట్ల మందిలో దాదాపు రెండున్నర కోట్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ శీతాకాలంలో సగానికి పైగా జనాభా కరువు బారినపడ్డారు. ఈ సంవత్సరం జనాభాలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని బేస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో అమెరికా, మిత్రదేశాలు దేశం వదిలి వెళ్లినప్పటికీ అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నాయి. కొంత ఆహార సంక్షోభం, మానవతా సంక్షోభాన్ని కొంత తగ్గించగలిగాయి. అయినా పరిస్థితుల్లో రావాల్సినంత మార్పు రాలేదు. అందుకే ప్రస్తుత ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి అఫ్గాన్కు సహాయం చేయాలని ప్రపంచంలోని సంపన్నులకు బేస్లీ పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాలు సాయం అందిస్తున్నాయని.. మానవాతా వాదులంతా ఇంకా సాయం చేయాలని బేస్లీ కోరారు. ‘ప్రపంచంలోని బిలియనీర్లు తరగని ఆస్తులు సంపాదించారు. ఆ సంపద పెరుగుదల నికర విలువ రోజుకు నాలుగువేల కోట్లు. ఇలాంటి స్వల్పకాలిక సంక్షోభాలను పరిష్కరించడానికి మీ ఒకరోజు నికర విలువ పెరుగుదల సరిపోతుంది. కాబట్టి మంచి మనసుతో సహాయం చేయడానికి ముందుకు రండి’ అని బిలియనీర్లకు పిలుపునిచ్చారు. యురోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నార్వే, యూకే, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు, ప్రత్యేక రాయబారులతో జనవరి 24న ఓస్లోలో సమావేశమై ఆఫ్గన్ పరిస్థితులపై చర్చించారు. ఆఫ్గన్ల ఆకలి తీర్చాలంటే ఆహార భద్రతా కార్యక్రమానికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కావాలని తెలిపింది. -
20 రోజుల పసికందుకి పెళ్లి. అఫ్గాన్లో ఇలాంటి పూర్ణమ్మలు ఇంటికొకరు
పొత్తిళ్లలో పసిపాప... ఓ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ. అవును 20 రోజుల ఈ పసికందుకు పెళ్లి చేసేశారు. అఫ్గాన్లో ఇలాంటి పూర్ణమ్మలు ఇంటికొకరు. తాలిబన్ల వశమయ్యాక అఫ్గాన్ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. చేయడానికి పనిలేదు. తినడానికి తిండి లేదు. పసిపిల్లల కడుపు నింపలేని పరిస్థితి. ఆకలి పేగుబంధాన్ని సైతం జయించేసింది. చేసేదేం లేక చిన్నారులను, పసికందులను తల్లిదండ్రులు పెళ్లి పేరుతో విక్రయిస్తున్నారు. తమ దగ్గర ఉండి ఆకలితో చచ్చేకంటే... ఏదో ఒకచోట వాళ్లు బతికుంటే చాలంటున్నారు. ఈ బాలిక ఏడేళ్ల జోహ్రా. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే ఉంటోంది. కానీ తనను కొనుక్కున్న వ్యక్తి వచ్చి ఎప్పుడు పట్టుకెళ్తాడోనన్న భయంతో బతుకుతోంది. తండ్రి రోజూవారి కూలీ. అంతకుముందు తినడానికి తిండైనా ఉండేది. కానీ అఫ్గాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. ఒక్క జోహ్రానే కాదు.. ఐదేళ్ల మరో కూతురినీ అమ్మేశాడు తండ్రి ఖాదిర్. చదవండఙ: మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక ఈమె పేరు నోరా. 8 ఏళ్లు. తండ్రి పేరు హలీమ్. మరో నెల రోజుల్లో నోరాను అమ్మేస్తానని హలీమ్ తన చుట్టుపక్కల వాళ్లతో చెప్పి ఉంచాడు. ఓ రూ. 80 వేలైనా వస్తాయని, కొన్ని రోజులకు తిండికి సరిపోతాయని చెబుతున్నాడు. ఆకలితో అల్లాడి చనిపోయేలా ఉన్నామని, ఇంకో దారి కనిపించట్లేదని బోరుమంటున్నాడు. అల్లాడుతున్న అఫ్గాన్.. అఫ్గనిస్తాన్లో ఇది ప్రతి పేదింటి కథ. ఆగస్టులో తాలిబాన్లు చేజిక్కించుకున్నాక అక్కడి పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో ఉన్న అఫ్గాన్ సర్కారు ఆస్తులు, డబ్బులను ఆ దేశాలు ఫ్రీజ్ చేశాయి. ఆ దేశానికి అందే సాయమూ ఆగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పనులు లేకుండా పోయాయి. చాలా మందికి ఉద్యోగాలూ పోయాయి. ఎంతో మందికి జీతాలు కూడా ఆగిపోయాయి. పేదరికం పెరిగిపోయింది. తిండి దొరకడమూ కష్టమైంది. దీనికితోడు ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పని కోసం, తిండి కోసం పేద ప్రజలు అల్లాడుతున్నారు. చదవండి: టైటానిక్ ఓడను చూడలనుకుంటున్నారా.. టికెట్ రూ.కోటి 87 లక్షలే చిన్నారి పెళ్లికూతుళ్లు.. పేదరికం పెరగడం, పనుల్లేకపోవడంతో ఆకలికి అల్లాడుతున్న తమ కుటుంబాలను చూడలేక చాలా మంది అఫ్గానీలు తమ చిన్నారి కూతుళ్లను అమ్ముతున్నారు. 20 రోజుల పిల్లల నుంచి 18 ఏళ్ల అమ్మాయిల వరకు ఎదురుకట్నం తీసుకొని పెళ్లి చేసుకునేందుకు ఇచ్చేస్తున్నారు. కొందరు ముందస్తుగానే చిన్నారులను ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. మరికొందరు అప్పు కింద పిల్లల్ని అప్పజెప్పేస్తున్నారు. అద్దె కట్టలేదని ఓ వ్యక్తి 9 ఏళ్ల కూతురును ఇంటి యజమాని తీసుకెళ్లాడని మానవ హక్కుల కార్యకర్తలు చెప్పారు. వాయవ్య అఫ్గాన్లో ఓ వ్యక్తి తన ఐదుగురు పిల్లలకు తిండి పెట్టలేక మసీదు దగ్గర వదిలేశాడని తెలిపారు. మున్ముందు 97% మంది పేదరికంలోకి.. తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోకముందు అఫ్గాన్లో అధికారికంగా పెళ్లి వయసు 16 ఏళ్లు. తాలిబన్లు రాకముందు కూడా దేశంలో బాల్య వివాహాలున్నాయి. కానీ గత కొన్ని నెలలుగా ఇవి పెరిగిపోయాయి. మున్ముందు ఇవి రెండింతలయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 20 రోజుల పిల్లలను కూడా మున్ముందు పెళ్లి చేసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిసిందని యునిసెఫ్ వెల్లడించింది. ప్రపంచంలో అతిదారుణమైన మానవ సంక్షోభాన్ని అఫ్గాన్ ఎదుర్కుంటోందని యునిసెఫ్ తెలిపింది. 2022 మధ్య కల్లా దేశంలోని 97 శాతం కుటుంబాలు పేదరికంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మేమున్నామంటున్న యునిసెఫ్.. స్వేచ్ఛగా ఎదగాల్సిన బాల్యం పంజరంలో బందీ అయిపోతోంది. పెళ్లి చేసుకున్న ఆ చిన్నారి బాలికలను పని వాళ్లుగా, బానిసలుగా చూస్తారు. ఆ పిల్లల, మహిళల కన్నీటి బాధలు చూసిన యునిసెఫ్ సాయానికి ముందుకొచ్చింది. అక్కడి ప్రజల కోసం ఇప్పటికే నగదు సాయం కార్యక్రమం మొదలు పెట్టామని వెల్లడించింది. ఇతర దేశాలూ సాయం చేయాలని కోరుతోంది. చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయొద్దని మత పెద్దలకు చెబుతోంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement