breaking news
stab injuries
-
ఊహించని సంఘటన; అంతా షాక్..!
లూబెక్/బెర్లిన్: బస్సు ప్రయాణంలో అంతా ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉండగా ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. సహ ప్రయాణికుడు విచక్షణా రహితంగా కత్తితో తోటి వారిపై దాడి చేసి 14 మందిని గాయపరిచాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటన ఉత్తర జర్మనీలోని లూబెక్ పోర్టు వద్ద శుక్రవారం సాయంత్ర చోటుచేసుకుంది. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాలు.. అప్పుడే బయల్దేరిన బస్సు నిర్ధిష్ట వేగంలో ప్రయాణిస్తోంది. సీట్లు నిండుకోవడంతో కాస్త సర్దుకుని ఒక ముసలావిడకి సీటు ఇచ్చాను. అంతలోనే పక్కసీట్లో ఉన్న ఓ వ్యక్తి నా ఛాతీలోకి కత్తి దింపాడని బాధితుడు ఘటనను గుర్తు చేసుకుని వణికిపోయాడు. ఉన్మాదంతో రెచ్చిపోయిన దుండగుడు చూస్తుండగానే చుట్టూ ఉన్నవాళ్లపై కత్తితో విరుచుకు పడ్డాడని వెల్లడించాడు. దాడికి పాల్పడిన వ్యక్తికి ముప్పయేళ్లుంటాయని తెలిపాడు. కాగా, వెంటనే స్పందించిన పోలీసులు దుండగున్నిఅరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
నిట్లో కత్తిపోట్ల కలకలం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఆదివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. వసంత్సోవం ప్రో షో ముగింపు సందర్భంగా స్టేడియంలో ఇంజనీరింగ్ విద్యార్థిపై ఎమ్మెస్సీ విద్యార్థి తన స్నేహితులతో కత్తులతో దాడి చేశాడు. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిట్ వరంగల్లో గతేడాది ఆగస్టు మాసంలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. కన్నూరి హర్ష, అఖిల్ పాపినేని అధ్యక్షులుగా, సార్థక్శర్మ, రవికాంత్ ఉపాధ్యక్షులుగా పోటీ చేశారు. సార్థక్శర్మకు జైప్రీత్సింగ్, రవికాంత్కు అమిత్యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో సార్థక్శర్మ ఓటమి పాలయ్యాడు. నాటి నుంచి జైప్రీత్, అమిత్యాదవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అమిత్యాదవ్ ఎదురుపడిన ప్రతిసారి జైప్రీత్సింగ్ అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేవాడు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్కు సైతం అమిత్యాదవ్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు. కారుపెట్టిన చిచ్చు.. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల సందర్భంగా జైప్రీత్సింగ్ కారులో షికారు చేస్తూ అమిత్యాదవ్కు వింత సైగలు చేయడం ప్రారంభించాడు. అసలు కారుకు అనుమతి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అని అమిత్యాదవ్ ఆరా తీశాడు. ఆదివారం రాత్రి కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నారనే అమిత్యాదవ్కు అనుమానం వచ్చింది. నిట్ ప్రధాన గేట్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా జైప్రీత్సింగ్ తన మిత్రులతో క్యాంపస్లోకి వెళ్లాడు. అతిథుల కోసం డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కారును అనుమతిచ్చినట్లు సమాచారం. కారు పెట్టిన చిచ్చు కత్తుల స్వైర విహారానికి దారితీసింది. పరస్పర దాడులు .. అమిత్యాదవ్పై వారం రోజుల క్రితం జైప్రీత్సింగ్ తన మిత్రులతో నిట్ క్యాంపస్ ఎదుట దాడి చేశాడు. సరైన సమయం కోసం వేచిచూస్తున్న అమిత్యాదవ్ స్ప్రింగ్ స్ప్రీ ముగింపు వేడుకలను అనుకూలంగా మలుచుకున్నాడు. తన మిత్రులతో కలిసి నిట్ స్టేడియంలో కత్తులు, ఇనుప రాడ్లతో జైప్రీత్సింగ్పై అమిత్యాదవ్ దాడి చేశాడు. దాడిలో జైప్రీత్సింగ్కు కుడి తొడ, నుదిటిపై గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ.. కాజీపేట ఏసీపీ సత్యనారాయణ సోమవారం నిట్కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు జైప్రీత్సింగ్ వద్దకు చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిలో గాయపడిన జైప్రీత్సింగ్ను డీన్ రమణారెడ్డి, విద్యార్థులు పరామర్శించారు. చోద్యం చూస్తున్న సెక్యూరిటీ సిబ్బంది.. కారులో నిట్ విద్యార్థులు మద్యం బాటిళ్లు, కత్తులు, ఇనుపరాడ్లను తీసుకువెళ్తున్నా సెక్యూరిటీ సిబ్బంది చోద్యం చూస్తున్నారు. గతంలో గంజాయి, డ్రగ్స్ను సైతం విద్యార్థులు తీసుకువెళ్లారు. నిట్ సెక్యూరిటీ సిబ్బంది పరోక్షంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీడియాకు మాత్రం అనుమతి ఇవ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు పెడుతున్నారు. పాత క్షక్షలతోనే దాడి జైప్రీత్సింగ్ తనను అసభ్యకర పదజాలంతో మానసికంగా హింసిస్తున్నాడని, తన సహనం కోల్పోయి ఏం చేస్తానో నాకే తెలియదని అమిత్యాదవ్ ఈనెల 7వ తేదీన హెచ్చరించాడు. జైప్రీత్సింగ్ను సివిల్ హెడ్ రాజేష్ సమక్షంలో మందలించాం. ఇలాంటి పొరపాట్లు మరల జరగకుండా చూసుకోమని తెలిపాం. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో దాడులకు దిగడం బాధాకరం. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పరస్పరం చోటు చేసుకున్న విభేదాలను పాతకక్షలుగా మార్చుకుని అమిత్యాదవ్ తన మిత్రులతో జైప్రీత్సింగ్పై దాడి చేశాడు. –రాంగోపాల్రెడ్డి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ సెక్షన్ 307 కింద కేసు నమోదు నిట్లోని సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి జైప్రీత్సింగ్పై ఎమ్మెస్సీ చదువుతున్న అమిత్యాదవ్, ధీరజ్, సతీష్, రోహిత్, పంకజ్, అలీఖాన్, రవికాంత్ కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇందులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించాం. రోహిత్ పరారీలో ఉన్నాడు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశాం. జైప్రీత్సింగ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. –సీహెచ్.అజయ్, కాజీపేట ఇన్స్పెక్టర్ -
మామా కోడళ్ల దారుణ హత్య
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని తూర్పు పటేల్ నగర్లో మామా కోడళ్ల దారుణ హత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం మామ, కోడలిపై దాడి చేసిన దుండగులు పలుసార్లు కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. అయితే ఇంటి లోపల వేసిన గడియ వేసినట్టే వుంది. కానీ సాయంత్రానికి ఇద్దరూ శవాలు అయ్యారు. వివరాల్లోకి వెళితే... మృతుడు సీపీడబ్ల్యూడీలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్డ్ అయిన సేవారాం కటారియా (90) తన కొడుకు సుధీర్, కోడలు శశితో కలిసి జీవిస్తున్నారు. రోజూలాగానే సుధీర్ మధ్యాహం ఒకటిన్నరకు ఉద్యోగానికి వెళ్లారు. దాదాపు అయిదు సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో పని చేస్తున్న ఆమె వచ్చి తన పని తను చేసుకొని వెళ్లిపోయింది. విధుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సుధీర్, ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఎంతకూ భార్య తలుపు తలుపు తీయకపోవడంతో, మొబైల్కు కాల్ చేశాడు. అయినా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన తన కుమార్తె వద్ద ఉన్న మారు తాళంతో తలుపు తీసి చూశాడు. ఒకవైపు గుమ్మం దగ్గర తండ్రి శవం, మరోవైపు మంచంపై భార్య విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి షాకైయ్యాడు. తండ్రి గొంతు కోసిన ఆనవాళ్లు, పలుమార్లు కత్తితో దాడి చేసిన గుర్తులు చూసి బెంబేలెత్తిన సుధీర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలం నుంచి రక్తపు మరకలతో ఉన్నరెండు కత్తెరలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి ఒంటిపై నగలు, ఇంట్లోని విలువైన వస్తువులు ఎక్కడివక్కడే అలాగే వుండడంతో, ఇది దొంగల పనికాదని, బాగా తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో అందరూ కలసి టీ తాగిన గుర్తుగా పడి ఉన్న ఖాళీ కప్పులు పోలీసుల అనుమానానికి మరింత బలపరుస్తున్నాయి. తెలిసినవారే తాపీగా టీ తాగి, నమ్మించి, సేవారాం కటారియా, శశిలపై దాడి చేసి, హత్య చేసిన అనంతరం వెనకనుంచి పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసామని, పనిమనిషిని ప్రశ్నిస్తున్నట్లు డీసీపీ పరమాదిత్య తెలిపారు.