breaking news
sriram navami
-
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్ఫోన్ టార్చ్లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్ఫోన్లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
ఏ దేవుడూ హర్షించడు!
ఉత్సాహంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉద్రిక్తతలకు దారి తీస్తే? ఎవరూ హర్షించరు. కానీ, ఇలాంటి పరిణామాలు ఎక్కువవుతున్నాయి. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా గత వారం రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణలే అందుకు సాక్ష్యం. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన పండుగ,శాంతియుతంగా సాగాల్సిన శోభాయాత్రలు కొన్నేళ్ళుగా శత్రుత్వానికీ, అరెస్టులకూ, అభాగ్యుల మర ణాలకూ దారితీయడం శోచనీయం. ఈసారీ బిహార్, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీల్లో రెండు మతాల ఘర్షణగా నవమి ఉత్సవం మారిపోయింది. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఇటు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ హింసాకాండ చెలరేగింది. ప్రధానంగా ప్రతిపక్షాల హయాంలోని పశ్చిమ బెంగాల్, బిహార్లలో భారీ విధ్వంసం రేగిన తీరు ఆందోళనకరం. నిరుటి లాగే ఈసారీ రాళ్ళు రువ్వడం, నినాదాలు చేయడం, గృహదహనాలు, లూటీలు! సోకాల్డ్ భక్తుల చేతుల్లో కత్తులు, తుపాకీలు. వెరసి, పవిత్ర రామనవమి, రంజాన్ మాసం కలిసొచ్చే సమయం దేశంలో కొత్త తరహా హింసాత్మక ధోరణికి అనువైన సందర్భంగా మారిపోవడం ఓ విషాదం. బెంగాల్లో హౌరా జిల్లాలో వరుసగా రెండురోజులు, సోమవారం రాత్రి హుగ్లీ దగ్గర రిష్రాలో మరోసారి ఘర్షణలు రేగాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. బిహార్లో సాసారామ్, నలందా జిల్లాల్లో హింసకు పలువురు గాయపడ్డారు. నలందా వద్ద 110 ఏళ్ళ చరిత్ర కలిగిన మదరసాలో వేలకొద్దీ అరుదైన పుస్తకాలకు నిలయమైన గ్రంథాలయం దుండగుల చేతిలో బూడిదైన ఘటన కదిలించేస్తుంది. రెచ్చగొట్టే ధోరణి వల్ల సామరస్యం దెబ్బతింటుందే తప్ప సమాజానికి మేలు చేకూరదు. ఇప్పుడు జరుగుతున్నదదే. వార్తల్ని గమనిస్తే – మథురలో జామా మసీదు పక్కనే కాషాయ జెండాలు కట్టారు. మరో రాష్ట్రంలో మసీదులో ప్రార్థనల వేళ పెద్దగా నినాదాలు చేస్తూ, లౌడ్ స్పీకర్లు హోరెత్తించారు. బెంగాల్లో అనుమతించిన మార్గంలో కాక రెండు వర్గాలూ ఉండే సున్నితమైన ప్రాంతం మీదుగా కత్తులతో ఊరేగింపు జరిపారు. నిరుటి ఉద్రిక్తతల రీత్యా ఢిల్లీలో ఓ పార్కులో నవమి యాత్ర, నమాజు – రెంటినీ పోలీసులు నిషేధించారు. అయినా కొన్ని మతవాద సంస్థలు అక్కడే యాత్ర, పూజ చేయడాన్ని ఏమనాలి? అదే సమయంలో రెండు చేతులూ కలవనిదే చప్పుడు రాదంటూ రెండోవర్గపు తప్పులు చెబుతున్నవారినీ కొట్టిపారేయలేం. ఈ హింసాకాండ రాజకీయ నిందలకు దారి తీస్తోంది. ఈ ఘర్షణలకు తమ పాలనలోని లోపాలు, ఉదాసీనతలు కారణమని అంగీకరించడానికి మమత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహజంగానే సిద్ధంగా లేరు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గూండాలతో బీజేపీ ఈ ఘర్షణలకు పాల్పడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. బెంగాల్ పోలీసులు ఒక వర్గానికే కొమ్ముకాస్తూ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని బెంగాల్ బీజేపీ ఛీఫ్ నింద. ఇక, ఆ రాష్ట్ర గవర్నర్ సైతం బాధితప్రాంతాల్లో పర్యటించి గట్టిగానే గళం విప్పారు. ఘర్షణలపై కేంద్ర హోమ్శాఖ నివేదిక కోరే పరిస్థితి వచ్చింది. శ్రీరామనవమి ఘర్షణలతో గురువారం నాటి హనుమాన్ జయంతికి అప్రమత్తత అవసరమైంది. ఈసారి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాల్సిందిగా వివిధ రాష్ట్రాలకు హోమ్ శాఖ బుధవారం సలహా ఇవ్వాల్సి వచ్చింది. కలకత్తా హైకోర్ట్ ఆదేశంతో హనుమాన్ జయంతికి బెంగాల్ సర్కార్ 3 జిల్లాల్లో పారా మిలటరీ దళాలను బరిలోకి దింపాల్సొచ్చింది. ఈ ఘటనలన్నీ ధార్మిక ఉత్సవాలు అతి సున్నితంగా మారిన పరిస్థితులకు దర్పణం. నిజానికి, ఇలాంటివన్నీ నివారించదగ్గ విపరిణామాలు. ధార్మిక ఉత్సవాలు భారత సమాజంలో ఒక అంతర్భాగం. కానీ, వాటిని ఆసరాగా చేసుకొని, వివిధ మతాల మధ్య విషబీజాలను నాటాలనీ, రాజకీయ లబ్ధి పొందాలనీ చూస్తే అంతకన్నా నేరం, ఘోరం ఉండవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్ప టికీ ప్రజలు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను అనుసరించేలా రక్షణ కల్పించాలి. వారి ధార్మిక యాత్రలకు భద్రతనివ్వాలి. అది ఆయా ప్రభుత్వాల, అధికార యంత్రాంగాల బాధ్యత. అదే సమయంలో రెచ్చగొట్టే చర్యలు, నినాదాలు, పుకార్ల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లక్ష్మణరేఖ దాటిన దోషులపై కఠినంగా వ్యవహరించాలి. ప్రతి ఎన్నికలో అధికారపీఠంపై పార్టీలు మారవచ్చేమో కానీ, మారకుండా ప్రజాసేవలోనే ఉండేది పోలీసు యంత్రాంగం. కాబట్టి, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు ఏర్పాట్లలో లోపాలను సవరించాలి. విభిన్న వర్గాల మధ్య అపనమ్మకం పెంచే దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి. కలసిమెలసి బతకాల్సిన సమాజంలో విషబీజాలను విత్తితే అది యావత్ దేశానికే నష్టం. రాజ కీయ లబ్ధి కోసం అంగలారుస్తున్నవారు అది గ్రహించాలి. మరో ఏడాదిలో లోక్సభ ఎన్నికలు ఉన్నందున మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓటర్లను వర్గాలుగా చీల్చాలనే ప్రయత్నాలు పెరిగితే ఆశ్చర్యం లేదు. ఇలాంటి నీచ రాజకీయ వ్యూహాల ఉచ్చులో పడకుండా, జనం అప్రమత్తంగా ఉండాలి. రాజ కీయ వర్గాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజ్యాంగ విహితంగా వ్యవహరిస్తూ, మారణకాండకూ, మనుషుల్లో చీలికకూ చెక్ పెట్టాలి. ఒక్కమాటలో – సహనం, శాంతి, క్షమ పాటించిన ఆ రాముడైనా, అల్లా అయినా పొరుగువాడిని ద్వేషించమనలేదు. తమ ధర్మం గొప్పదని చాటుకోవడా నికి పరధర్మాన్ని తక్కువ చేయమని ఏ సమాజమూ, ఏ దేవుడూ చెప్పలేదు. అంతర్యామి సైతం హర్షించని ఘర్షణలతో మానవతా ధర్మాన్ని సైతం మర్చిపోతే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ ధర్మంలోనూ లేదు. పాపఫలం మాత్రం ఇక్కడే, ఇప్పుడే మనమందరం అనుభవించాల్సి వస్తుంది. -
హైదరాబాద్ : జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన శోభాయాత్ర (ఫొటోలు)
-
శ్రీరామ నవమి సర్ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ టీం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. ఇదిలా ఉంటే నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ నుంచి ఆసక్తికర అప్డేట్ వదిలారు మేకర్స్. సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ తాజా పోస్టర్ని డిజైన్ చేశారు మేకర్స్. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’ అనే క్యాప్షన్తో సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడికి హనుమాన్ దండం పెడుతున్న ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. కాగా టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కానుంది. Mantron se badhke tera naam Jai Shri Ram मंत्रों से बढ़के तेरा नाम जय श्री राम మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi pic.twitter.com/YjmncsvqwG — UV Creations (@UV_Creations) March 30, 2023 -
రామాయణం
-
ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలి
-
మమతా బెనర్జీ తలపై రివార్డు ఎందుకు?
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముమ్మరంగా వదంతులు విహరిస్తున్నాయి. వీటికి సోషల్ మీడియా వేదిక అవుతోంది. ‘మెటియాబ్రజ్లో అల్లర్లు చెలరేగుతున్నట్లు ఇప్పుడే అందిన వార్త. సైన్యాన్ని పిలిపించారు.. కిడ్డెర్పోర్లో కూడా అల్లర్లు మొదలయ్యాయి.. పార్క్ సర్కస్ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా తిరుగుతున్నారు. ఘోరాలు జరగక ముందే ఇళ్లకు తరలిపోండి’ అంటూ గురువారం సోషల్ మీడియాలో వదంతులు ఊపందుకున్నాయి. నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం గమనార్హం. అసలు ఏమైనా ఉన్నా లేకపోయినా వదంతులకు మాత్రం కొదవ ఉండట్లేదు. సకాలంలో పోలీసుల స్పందన సకాలంలో పోలీసు అధికారులు స్పందించడంతో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ‘నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నట్లు దురుద్దేశంతో కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారు. వాటిని నమ్మకండి. నగరంలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా, ఎలాంటి అశాంతి పరిస్థితులు లేవు. ఉన్నాయంటూ ఎవరైనా వదంతులు వ్యాప్తిచేస్తే వారి గురించి వెంటనే మాకు తెలియజేయండి’ అంటూ పోలీసులు అదే సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో ప్రశాంత పరిస్థితులకు భంగం వాటిల్లలేదు. మధ్యాహ్నం ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా, అల్లరి మూక గొడవ చేసింది. రోడ్డును దిగ్భంధించింది. అక్కడ కూడా పోలీసులు సకాలంలో స్పందించడంతో ఏ గొడవ జరగలేదు. ముస్లింలు, హిందూ నాయకులు కూడా జోక్యం చేసుకొని ప్రశాంత పరిస్థితులకు భంగం వాటిల్లకుండా అడ్డుకున్నారు. ఎందుకీ ఉద్రిక్తతలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలనరికి తెచ్చినవారికి రూ. 11 లక్షల రివార్డు ఇస్తామని రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడు యోగేశ్ వివాదాస్పద ప్రకటన చేసిన నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో తీస్తా నది ఒప్పందం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనను మమతా బెనర్జీ తిరస్కరించడం, రాష్ట్రానికి రావాల్సిన 10,459 కోట్ల రూపాయలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదంటూ ఆమె విమర్శించడం, రాష్ట్రపతి పదవికి మోదీకి ఇష్టంలేని ఎల్కే అద్వానీ పేరును ఆమె ప్రతిపాదించడం కూడా ఉద్రిక్త పరిస్థితులకు తోడయ్యాయి. శ్రీనవమి ఉత్సవాలు మున్నెన్నడూ లేవు కనకదుర్గ పూజకు ప్రాధాన్యమిచ్చే బెంగాల్ రాష్ట్రంలో, ముఖ్యంగా కోల్కతాలో గత 300 ఏళ్లలో శ్రీరామనవమి ఉత్సవాలను కోలాహలంగా జరిపిన సందర్భాలు లేవు. ఈసారి కోలాహలంగానే కాదు, కత్తులు, కటార్లు పట్టుకొని నగరంలో ప్రదర్శనలు జరిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీజేపీ ఆధ్వర్యంలో మొదటిసారి ఇక్కడ నవమి వేడుకలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తాయి. అందుకే మమతా బెనర్జీ తలపై 11 లక్షల రివార్డును ప్రకటించిన యోగేశ్పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. జాతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి తల తీయాలంటూ గతంలో పిలుపునిచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్పై కూడా రాష్ట్ర పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రధానంగా ముస్లిం ఓట్లతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మమతా బెనర్జీ ముస్లిం మత గురువులకు ప్రభుత్వ వేతనాలు కల్పించడం పట్ల కూడా బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.