breaking news
sri mukhalingam
-
సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం
ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలిగమని, ఇక్కడ కొలువైన శివుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలెం ఉన్నది. అది ఎంత పెద్ద గోలెమంటే గర్భాలయ ద్వారం పట్టనంత. స్థల పురాణం ప్రకారం ఆ కథ ఇలా ఉంది...శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్నకు వివాహమై ఎంతో కాలం గడిచినా సంతానం లేదు. దాంతో సంతానం కోసం స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకు పోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భ గుడి ద్వారం పట్టనంత పెద్ద గోలెం అవడంతో గర్భాలయంలోనికి తీసుకవెళ్లలేక పోయాడు. దీంతో ఆ గోలేన్ని ఆలయ ముఖమంటపంలోనే విడిచి పెట్టి ఎంతో దుఃఖిస్తూ గోలెంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా అక్కడే వదిలి ఇంటికి వెల్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలెం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని వేనోళ్ల సుత్తించారు.న్యాయమైన కోర్కెలు తీర్చే నాగాభరణుడుఈ గోలెంలో పాలతోపాటు బియ్యం, వడ్లు (ధాన్యం) మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోలేం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఫలితంగా సంతాన యోగం, గ్రహాదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు తీరుతాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్ది కాలంలో తీరుతాయన్నది భక్తుల నమ్మకం.కార్తీక మాసం ప్రత్యేక పూజలుమన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల వారికి కార్తీక మాసంలో ఎక్కువగా దైవచింతన, గుడులు, తీర్ధయాత్రలు చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగంలో ఈ నెల రోజులపాటు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ మాసంలో శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుని మొక్కులు మొక్కుకుని వెళుతుంటారు. కోర్కెలు తీరిన భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు విచ్చేస్తుంటారు. – సుంకరి శాంత భాస్కర్,సాక్షి, జలుమూరు, శ్రీకాకుళం జిల్లా (చదవండి: సర్వదోషాల నివారణకు నాగుల చవితి పూజ) -
కార్తీకం: కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీముఖలింగ క్షేత్రం!
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖందాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుడిని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్లో కార్తీకమాసం పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీముఖలింగేశ్వరున్ని దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చే గోలెం..స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టు వెనుక కనిపించే పెద్ద మట్టి గోలెం ఎంతో శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం. ఇందులో పాలు, బియ్యం, ధాన్యం, మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం.. ఇలా భక్తులు గోలెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీని ఫలితంగా సంతాన యోగం, గ్రహదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు సిద్ధిస్తాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. గోలెం పట్టుకుని పరమేశ్వరుని నిండు మనుసుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం.ఆ భక్తులకు ప్రత్యేకం..మన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల భక్తులు గురువారం నుంచే కార్తీకమాసం పాటిస్తారు. ఇదే నెలలో దైవ చింతన, తీర్ధయాత్రలు చేయడం వారి సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగం క్షేత్రానికి నెల రోజులపాటు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు.చదవండి: సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా?ఇదీ చదవండి: Mounjaro వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు! -
మన్యం ఎప్పుడూ తలుపులు తెరిచే..
ఆరేడు నెలలు ఇంట్లోనే గడిచిపోయాయి. కాళ్లు కాస్త కదలిక కోరుకుంటున్న సమయమిది. కార్తీకం కూడా కలిసి వచ్చింది. కరోనాపై కొంచెమైనా అవగాహన కలిగింది. ఇంకెందుకు ఆలస్యం.. కుటుంబంతో సహా విహరించాల్సిందే కదా. ప్రకృతి అందాలకు సిక్కోలు పెట్టింది పేరు. సాహస యాత్ర చేయాలనుకునే వారికి మన మన్యం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. అడవుల్లోకి వెళ్లి అంతెత్తున దూకే జలపాతం వద్ద శిరస్సు వాల్చి సేద తీరవచ్చు. రహస్యాలను తెలుసు కోవాలనుకుంటే శాలిహుండం శతాబ్దాలుగా సవాల్ విసురుతూనే ఉంది. వచ్చి అశోకుడి కాలం నుంచి ఇప్పటివరకు కొండ గుండెలో దాగిన విషయాలను తెలు సుకోవచ్చు. ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలనుకుంటే.. శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస ఆలయాలు మన కోసమే సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కా దు.. బీచ్లో సేద తీరాలి అనుకుంటే బారువ నుంచి భావనపాడు మీదుగా మొగదలపాడు వరకు ఊరూరా సముద్ర తీరాలు ఊరిస్తున్నాయి. రండి మరి.. 576 మెగా పిక్సెళ్ల కళ్ల కెమెరాలతో క్లిక్ చేసి ఇన్ఫినిటీ జీబీ గల మనసు మెమొరీలో నిక్షిప్తం చేద్దాం. కొండనెక్కగలవా.. ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర కొండ పిక్నిక్లకు కేరాఫ్గా మారింది. ఏటా వందలాది మంది ఇక్కడకు వస్తున్నారు. సంగమేశ్వర కొండ ప్రాచీనకాలం నాటిది. ఈ కొండ చరిత్ర 12వ శతాబ్దానికి చెందినదని 1982లో సర్వే చేసిన పురావస్తు అధికారులు తేల్చి చెప్పారు. జైన, బౌద్ధ, శైవ ధర్మాలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ చూడవచ్చు. స్వామిని దర్శించుకోవాలంటే 164 మెట్లు ఎక్కాలి. కొండ ఫైబాగం నుంచి ఈ కష్టాన్ని మర్చిపోయేంత సౌందర్యం కనిపిస్తుంది. సంగమేశ్వరకొండకు దగ్గరలోనే చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. కొండకు సమీపంలో ఆసియా ఖండంలోనే పేరుపొందిన వ యోడెక్ట్, పాండవుల మెట్ట ఉన్నాయి. సంగమేశ్వర కొండపై నుంచి కనిపిస్తున్న ఆహ్లాదకరమైన ప్రకృతి విహంగ వీక్షణం టెక్కలి: అంతర్జాతీయ స్థాయిలో ఎంతో విశిష్టత కలిగిన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షి జాతికి చెందిన విదేశీ పక్షుల విడిది కేంద్రం టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో ఉంది. వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చే పక్షులను చూడడానికి సందర్శకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా కార్తీకంలో వన విహారం చేయాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ఇదో మంచి విడిది. ఈ పక్షుల విడిది కేంద్రంలో వాచ్టవర్ పక్షుల విన్యాసాలను తిలకించేందుకు ఎంతో అనుకూలం. శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుని అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రానికి చేరుకునేందుకు బస్సులు, ఆటోల సదుపాయం ఉంది. దీనికి సమీపంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఏటా కార్తీకంలో వేలాది మంది స్వామిని దర్శించుకుంటారు. వీటికి సమీపంలోనే భావనపాడు సముద్ర తీరం కూడా ఉంది. ఈ మూడు ప్రాంతాలను కవర్ చేస్తే కార్తీక వన విహారం సంపూర్ణమవుతుంది. టెక్కలి మండలం తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రంలో గల చెట్లు పై విదేశీ పక్షులు సాగర తీరాన.. సోంపేట: ఉండడానికి మంచి రిసార్ట్లు, దర్శించుకోవడానికి పురాతన ఆలయాలు, తిరగడానికి తోటలు, సేద తీరడానికి సముద్ర తీరం.. పిక్నిక్కు ఇంత కంటే మంచి ప్లేస్ ఏముంటుంది..? ఇవన్నీ గుంపగుత్తగా అందించే ప్రదేశం బారువ. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఈ పురాతన గ్రామం ఎప్ప టి నుంచో జిల్లా వాసులకు హాట్ ఫేవరిట్ స్పాట్. ఇక్కడి సముద్ర తీరంలో కనిపించే ఓడ శిథిలాలు, కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి దేవాలయం అన్నీ ప్రత్యేక అనుభూతినిస్తాయి. ఇక్కడి లైట్హౌస్ ఆనాటి వైభవానికి గుర్తుగా కనిపిస్తుంది. దానిపైకి ఎక్కి సముద్రాన్ని చూసి తీరాల్సిందే. శ్రీకాకుళం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో బా రువ ఉంది. శ్రీకాకుళం నుంచి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి. రైల్వే మార్గం గుండా రావాలంటే సోంపేట(కంచిలి) రైల్వేస్టేషన్లో దిగి, కంచిలి నుంచి బస్సులు, ఆటోల ద్వారా రావచ్చు. ప్రస్తుతం ఈ బీచ్లోని రిసార్ట్లో ఆరు గదులు అందుబాటులో ఉన్నాయి. జనవరికి మొత్తం 14 గదులు సిద్ధమవుతాయి. గదులు కావలసిన వారు 72784 58888, 72784 68888 నంబర్లను సంప్రదించవచ్చని రిసార్ట్ ప్రతినిధులు తెలిపారు. సాహసం చేయాలి మరి.. భామిని: కొండలను తాకే మేఘాలు, జలజల పారే జలపాతాలు, పచ్చని తివాచీ పరిచినట్టుంటే కొండ చరియలు, వంపులు తిరిగే ఘాట్ రోడ్లు.. ఇలా సకల అందాల నిలయం తివ్వాకొండల పరిసరస ప్రాంతాలు. పెద్దగా జనం దృష్టి పడని అందాలు ఇవి. పిక్నిక్కు సాహస యాత్రకు వెళ్లాలనుకుంటే భామిని మండలంలోని అడవులపై ఓ లుక్కేయవచ్చు. భామిని మండలం భూర్జిగూడ సమీపంలో జలపాతాలు, మణి గ రోడ్డులో వాటర్ ఫాల్స్, నూతనంగా ఆవిష్కృతమైన నులకజోడు సమీపంలో జలపాతాలు అలరిస్తున్నాయి. ఇవన్నీ ఏబీ రోడ్డుకు మూడు కిలోమీటర్లు దూరంలోనే ఉన్నాయి. తివ్వాకొండలను ఆనుకొని ఉన్న చాపరాయిగూడ వద్ద పులిహొండా గృహానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. దీన్ని ప్రస్తుతం యంగ్మేరీ కేవ్గా తీర్చిదిద్దారు. సందర్శకులను ఆకట్టుకుంటోంది. భామిని మండలంలో ఏబీ రోడ్డు నుంచి మణిగ, బండ్రసింగి, రేగిడి, కారిగూడల ఘాట్ రోడ్లు ప్రయాణాన్ని మధురం చేస్తాయి. సొలికిరి వద్ద చాపరాయి పులిహొండ(ఫైల్) ఎన్నెన్నో అందాలు వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు ప్రకృతి అందాలతో అలరారుతోంది. ప్రాజెక్టులో నిండుగా ఉన్న నీరు, నీటిని ఆనుకొని చుట్టూ కొండలు చూపరులను కార్తీకంలో ఆహా్వనిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద బకెట్ పోర్షన్, నీటిమట్టాన్ని సూచించే ప్రదేశం, ప్రాజెక్టు ఆవరణలో ఉన్న డైక్, కొండపై నిర్మించిన సాయినాథుని ఆలయం, పాండవు ల పంచ సందర్శకులకు అద్భు త అనుభూతిని ఇస్తాయి. అయితే ప్రాజెక్టు వద్ద నీటిలో దిగే సాహసాలు చేయకుండా ఎంజాయ్ చేయగలిగితే కుటుంబంతో పిక్నిక్కు రావడానికి మడ్డువలస ప్రా జెక్టు సరైన స్థలం. ప్రాజెక్టుతో పాటు ఇక్కడి నుంచి సంగాం గ్రామం 6 కిలోమీటర్లు దూ రం. ఇక్కడ నెలకొన్న సంగమేశ్వరస్వామి ఆలయంలో ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించిన శివలింగం ప్రతిష్టాత్మకమైనది. ఇదే ప్రాంగణంలో వేగావతి, సువర్ణముఖి, నాగావళి నదులు కలిసే కూడలి (త్రివేణి సంగమం) అందరికీ నచ్చుతుంది. ఎం.సీతారాంపురంలో 108 స్తంభాల శివాలయం చూడదగ్గ ఆలయం. మడ్డువలస జలాశయం అడవి ఒడిలో.. సీతంపేట: కార్తీక మాసం ఆరంభం కావడంతో మన్యం పర్యాటకులతో కళకళలాడనుంది. సీతంపేటలోని అ డ్వంచర్ పార్కు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెట్టుగూడ జల పాతం రెండేళ్లుగా ప్రాచుర్యం పొందింది. సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారి మధ్య సీ తంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలో మీటర్ల దూరంలో ఉన్న సున్నపుగెడ్డ, పొల్ల–దోనుబాయి మా ర్గంలో ఉంది. ఈ అందమైన జలపాతం కొండలోయ దిగువ నుంచి చూస్తే ఇంద్ర ధనస్సు సైతం కనిపిస్తుందని సందర్శకులు అంటుంటారు. చంద్రమ్మ గుడి, ఆ డలి, పొల్ల, జగతపల్లి వ్యూపాయింట్లు సాహస యాత్ర చేయాలనుకునే వారిని ఆకట్టుకోగల ప్రాంతాలు. మెట్టుగూడ వద్ద స్నానాలు ప్రకృతి అందాల సింగారం గార: గార మండలం వన విహారం చేయాలనుకునే వారికి పర్ఫెక్టు ప్లేసు. సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, సువిశాలమైన తోటలతో ఈ మండలం కార్తీకానికి సై అంటోంది. మండలంలో దశావతారాల్లో ఒకటైన శ్రీకూర్మనాథాలయం, కళింగ తీరంలో లైట్హౌస్, బౌద్ధ ఆరామాల్లో ఒకటైన శాలిహుండం, పక్కనే మరో కొండపై వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. వీటిలో ప్ర ముఖమైనది శాలిహుండం. ప్రశాంతమైన కొండపై శతాబ్దాల నాటి రహస్యాలను తరచి తరచి చూస్తే ఆ మ జానే వేరు. ఇక శ్రీకూర్మనాథుని దర్శనం, ఆలయ ప్రాశస్త్యం తెలుసుకోవడం ఎవరికైనా మర్చిపోలేని అనుభూతి. అటుపై నుంచి తీరానికి రూటు మారిస్తే పిక్నిక్ పరిపూర్ణమవుతుంది. ఈ స్థలాలకు శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ సరీ్వసులతో పాటు, ప్రైవేటు రవాణా సదుపాయాలూ విరివిగా ఉన్నాయి. శాలిహుండం బౌద్ధారామం -
శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో రష్యా దేశస్తులు
శ్రీముఖలింగం (జలుమూరు) : ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని రష్యా దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ దేవాలయాలు, కట్టడాలు పరిశీలించి భారత ప్రభుత్వ అనుమతితో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించనున్నట్లు రష్యా బృందం ప్రతినిధులు ఆంద్రీ, అరని, ఇరానీ, కిరే.పుతిన్ తెలిపారు. అనంతరం శ్రీముఖలింగం పరిధిలోని అన్ని దేవాలయాలను పరిశీలించారు. అలాగే ఆలయ అవరణలో ఉన్న శిల్పసంపదపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు వీరితో సెల్ఫీలు దిగారు. అర్చకులు శ్రీకృష్ణ ఆలయ చరిత్ర, కట్టడాలపై వివరించారు.


