-
‘యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు’
సాక్షి, తిరుమల: తమ ప్రభుత్వం శ్రీమహాలక్ష్మీ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించిందని,యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు వచ్చాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సీఎం జగన్ ప్రయత్నం సఫలం కావడంతో పెండింగ్ నిధులు వచ్చాయన్నారు. ‘ పీఠాధిపతులు సూచనల మేరకు కార్తీకమాసంలోశ్రీశైలంలో కుంభాభిషేకం. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను సంబంధిత ట్రస్ట్ బోర్డు నిర్వహించేలా కేబినెట్లో నిర్ణయం. ఆయా దేవాలయాలపై పర్యవేక్షణ దేవాదాయశాఖకు ఉంటుంది. లీజు ముగిసినా కోర్టును ఆశ్రయిస్తూ స్టేలు పొందే వారిపై 15 రోజుల నోటీసుతో చర్యలు తీసుకునేలా చట్ట సవరణను ఆమోదించాం. దేవాదాయ ఆస్తుల కాపాడుకోవడానికి చట్టసవరణ. చట్ట సవరణ ద్వారా గడువు ముగిసిన లీజు భూములను మార్కెట్ రేటు ప్రకారం మళ్లీ లీజుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికలు సమీపిస్తున్నందున కొన్ని రాబంధులు వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు చేసిన మేలు చెప్పి ఓట్లు అడుగుతామని, ఇది పేదలకి, పెత్తందార్లకి మధ్య జరిగే ఎన్నికలన్నారు. ‘సత్యానికి, అసత్యానికి జరుగుతున్న పోరాటం ఇది. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న పోరాటం ఇది. చంద్రబాబు, పచ్చ మీడియా అంతా ఒక వైపు ఉన్నారు. చంద్రబాబు తెలంగాణ నివాసి. రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అప్పులు పాలు చేశారని చంద్రబాబు, పవన్లు విమర్శించారు. చంద్రబాబు,దత్తపుత్రుడు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మహానాడు అంటూ దండలు వేస్తున్నారు. వ్యవసాయం అంటే నీకు గిట్టదు.. విద్యపై ఒక్క రోజు ఫోకస్ చేయలేదు.నీకు, సీఎం జగన్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. పవన్ గతంలో కాపు సామాజికి వర్గాన్ని ముంచేశారు’ అని మండిపడ్డారు. -
ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞుడను: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: శ్రీలక్ష్మీ మహాయజ్ఞంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. యజ్ఞంలో భాగంగా.. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన ఇవాళ ఉదయం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆ సందర్భంపై ట్వీట్ చేస్తూ.. ‘‘ఆరు రోజులపాటు చండీ, రుద్ర, రాజ శ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగం జరిగింది. వేలాది మంది ఆ యజ్ఞంలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రార్ధించారు. ..ప్రజలు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నేను కృతజ్ఞుడను. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకు కృషి చేద్దాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాల్లని కోరుకుంటున్నా’’ అని ట్వీట్లో పేర్కొన్నారాయన. Today saw the culmination of the Chandi, Rudra, Raja Syamala, and Sudarshana Sahita Sri Lakshmi Maha Yagam after six days where thousands joined hands in prayer for the progress and prosperity of Andhra Pradesh. I am grateful for the unwavering faith that people have bestowed… pic.twitter.com/Dron2nRzSI — YS Jagan Mohan Reddy (@ysjagan) May 17, 2023 -
‘శ్రీమహాలక్ష్మీ యజ్ఞం.. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం’
సాక్షి, విజయవాడ: శ్రీమహాలక్ష్మీ యజ్ఞం ఏ ఇబ్బందులు లేకుండా ఐదు రోజులు నిర్విఘ్నంగా జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందన్నారు మంత్రి. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ‘ఎండను లెక్కజేయకుండా భక్తులు వచ్చారు. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. నాలుగు ప్రధాన యాగశాలల్లో జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ రేపు పాల్గొంటారు. ఉదయం గం.10:45కి సీఎం అభిషేక మండపానికి చేరుకుంటారు. కంచి నుంచీ తెచ్చిన వస్త్రాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం అందజేస్తారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల జీయర్ స్వామి రేపు వస్తున్నారు.. చిన్నజీయర్ స్వామి కూడా వస్తారని ఆశిస్తున్నాం. యజ్ఞదీక్ష తీసుకున్న దంపతులుగా మేము కృష్ణానదిలో స్నానం చేసి, వేదాశీర్వచనం తీసుకుంటాం. రేపు పూర్ణాహుతి అనంతరం వేలాదిమందిగా వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందిస్తాం. ప్రతీ ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రకృతి సహకారంతో యజ్ఙం ఐదు రోజులు విజయవంతంగా జరిగింది..ఇలాంటి యజ్ఙం భారత దేశంలో ఎక్కడా జరుగలేదు.ఎనిమిది ఆగమాలు సంపుటీకరించుకొని ఒకేసారి ఎప్పుడూ చేయలేదు. ఎండను లెక్కచేయకుండా భక్తులు వచ్చి ప్రదక్షణ చేసి ప్రసాదం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యజ్ఙం గురించి చర్చించుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు. -
‘లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గొప్ప కార్యక్రమమిది’
సాక్షి, విజయవాడ: శ్రీమహాలక్ష్మి యజ్ఞం.. లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గొప్ప కార్యక్రమం అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. నాలుగు యాగశాలల్లో 600పైగా రుత్వికులు హోమాలు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర చరిత్రలో ఇటువంటి యజ్ఞం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు మంత్రి. ‘శ్రీమహాలక్ష్మీ యజ్ఞం మూడో రోజుకి చేరింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాం. హనుమాన్ జయంతి రోజు కావడంతో హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధలతో నిర్వఁహించాం. ఈ మహాయజ్ణంలో క్రతువు నిర్వహించడంలో భాగస్వాములైనందుకు రుత్వికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు యాగశాలల్లో వేదపండితులు నాలుగు వేధాలని పఠించారు. యాగ శాలలలో జరిగే యజ్ణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాం. రాజస్ధాన్ నుంచి ఈ యాగానికి దేశీయ ఆవు నెయ్యిని తెప్పించాం. రాష్ట్ర ప్రజల అభివృద్దికి...ప్రజలు సుఖసంతోషాలకోసం, పాడిపంటలతో రైతులు ఆనందంగా ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ యజ్ణాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. -
‘మహాయజ్ఞం’లో ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: సనాతన ధర్మాలను గౌరవిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైంది. ‘సమస్త ప్రజానాం క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య అభివృద్ధ్యర్థం...’ అంటూ సీఎం వైఎస్ జగన్ వేద పండితుల ఉచ్చారణల మధ్య సంకల్పం చేపట్టడంతో యజ్ఞ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి దంపతులతో పాటు వారి పిల్లల గోత్ర నామాలతో వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞశాలలో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ మహాలక్ష్మీ దేవి విగ్రహం ముందు స్వర్ణలక్ష్మీ అమ్మవారి ప్రతిమకు సీఎం జగన్ పంచామృతాలతో అభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహానికి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రికి కుర్తాళం శ్రీసిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆశీర్వచనం అందజేశారు. కపిల గోవుకు పూజలు యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వివిధ ఆగమాలకు అనుగుణంగా యజ్ఞశాల చుట్టూ కలియ తిరిగిన సీఎం జగన్ వేద పండితులు, రుత్వికులకు అభివాదం చేశారు. గోశాలలో కపిల గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో భక్తులను పలుకరించి మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దంపతులు యజ్ఞ దీక్షాధారణ స్వీకరించారు. మంత్రులు తానేటి వనిత, ఉషశ్రీచరణ్, జోగి రమేష్, అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement