-
బీసీలను పెద్దల సభకు పంపింది సీఎం జగన్: మంత్రి సీదిరి
సాక్షి, గాజువాక : చంద్రబాబుకు బానిసత్వం చేసే వారే టీడీపీలో మిగిలారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం విశాఖపట్నం గాజువాకలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర బహిరంగ సభలో అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు ఏనాడైనా చంద్రబాబు మేలు చేశారా అని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు తోలు తీస్తానని, తాట తీస్తానని బెదిరించారని గుర్తుచేశారు. ఒక మత్స్యకారుడు పార్లమెంట్ లో అడుగు పెట్టారంటే అందుకు సీఎం జగన్ కారణమని చెప్పారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్య సభకు పంపింది సీఎం జగనేనన్నారు. బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారని మండిపడ్డారు. దళితులను అవమానించిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. పీకే అంటే ప్యాకేజీ స్టార్ అని, జనసైనికుల కష్టాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్మేస్తున్నారని అప్పలరాజు ఫైర్ అయ్యారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. సీఎం పాలనను ఇతర రాష్ట్రాలు అచరిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వంపై త్పపుడు ప్రచారం చేస్తున్నాయి. అవినీతి రహిత పాలనను సీఎం జగన్ అందిస్తున్నారు. లంచాలు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. రాజధాని వైజాగ్కు వస్తె ఇక్కడ ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి’ అని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేత అంజాద్ బాషా మాట్లాడుతూ..‘ సీఎం జగన్ చెప్పిందే చేస్తారు. లోకేష్ కార్పొరేటర్గా కూడా గెలవడు. పవన్ను రెండు చోట్ల ఓడించిన మగాడు సీఎం జగన్’ అని కొనియాడారు. -
చిన్న మాటలే.. ఛిన్నాభిన్నం చేసేస్తాయి
శ్రీరామాయణంలో... దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికీ వివాహాలు చేయాలని సంకల్పించాడు. సభతీర్చి వారికి తగిన వధువులను వెతకవలసిందిగా కోరుతూ మంత్రులతో, పురోహితులతో సమాలోచనలు జరుపుతున్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు వచ్చాడు. సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చేసరికి మహారాజు కంగారు పడిపోయి గబాగబా వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదు లిచ్చి ఆహ్వానించాడు. బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు కోపధారి కనుక తొందరపాటులో ఏ శాపమిస్తాడో అని భయపడిపోయి... ఒకటికి పదిమార్లు ... ఆయన ఏమీ అడగకపోయినా... మీరు రావడం వల్ల మా వంశం తరించింది, నేను తరించాను, నా ఇల్లు పావనమయింది, మీకు ఏం కావాలో చెప్పండి, ఏవయినా చేసేస్తాను, ఏదయినా ఇచ్చేస్తాను.. అని అదేపనిగా చెప్పాడు. అన్నీ విన్న మహర్షి చివరన మాట్లాడుతూ.. ‘‘రాజా! నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. మారీచ సుబాహులనే రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞ సంరక్షణ కొరకు మీ కుమారులయిన రామలక్ష్మణులను ఇద్దరినీ నాతో పంపించండి’’ అన్నాడు. అది విని దశరథుడు హతాశుడయ్యాడు. తన కుమారులకు రాక్షసుల చేతిలో ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అనేక సాకులు చూపిస్తూ నేను పంపను... నేను పంపను... అనడం మొదలు పెట్టాడు. దానికి విశ్వామిత్రుడు ..‘‘ఒకసారి మాటిచ్చి తప్పే లక్షణం ఉన్నవాడా! దీర్ఘకాలంలో శోకించెదవుగాక!’’ అన్నాడు. విశ్వామిత్రుడు అడగకముందే తొందరపడిపోయి చేసేస్తాను అనడం వల్ల .. తీరా అడిగేసరికి చేయలేని పరిస్థితి కొనితెచ్చుకున్నందువల్ల దశరథ మహారాజు అంతటివాడు సంకటపరిస్థితిలో పడ్డాడు. ఏదయినా ఒకమాట ఇచ్చేముందు మనకున్న పరిమితుల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇది నేను చేయగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నాకు సాధ్యమవుతుందా? ఆలోచించి... చెయ్యగలిగితే చేయగలను.. అని చెప్పాలి. చేయలేనప్పుడు అదే చెప్పాలి. గణిత శాస్త్ర మేథావి, సంగీత శాస్త్రంలో, రాజకీయంలో, మతవిశ్వాసాలను సిద్ధాంతీకరించడంలో దిట్ట అయిన పైథాగరస్ ఒక మాట అంటాడు.. ‘‘అత్యంత ప్రాచీనమైన మాటలు, చాలా చిన్న చిన్న మాటలు ఏవి! అంటే... ‘‘యస్’’, ‘‘నో’’. అని – వీటిని వాడేటప్పుడు ఎంతో విచక్షణతో, సంయమనంతో వాడాలనేది ఆయన ఉద్దేశం. అలాగే గొప్ప అవకాశం వచ్చినప్పుడు... ముందూ వెనకలు ఆలోచించకుండా తిరస్కరించడం, తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని, జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని. అపరిపక్వ అపోహలతో, లేనిపోని భయాలతో చేజేతులా వదులుకోవడం తరువాత మెలికలు తిరిగిపోవడం కంటే.. అవును అని కానీ, కాదు అని కానీ చెప్పేముందు తొందరపడకుండా, ఆవేశాలకు లోను కాకుండా పదిసార్లు విజ్ఞతతో ఆలోచించి ఆ పదాలను వాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి గౌరవం, మర్యాద, అభ్యున్నతి, ప్రతిష్ఠ, విశ్వసనీయత... వంటివన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. యస్ లేదా నో... అవును లేదా కాదు... చిన్న పదాలే కానీ జీవితాలను మలుపు తిప్పేస్తాయి... జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించడం ఉత్తమం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పవన్కు ఆ టెక్నిక్ చంద్రబాబే నేర్పి ఉంటాడు!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ఇలా రెచ్చిపోయినట్లు పిచ్చితనంగా మాట్లాడుతున్నారు?. తనను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారని ఎందుకు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను,ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎందుకు అంతలా దూషిస్తున్నారు. తాను అదికారంలోకి వస్తే ఎమ్మెల్యేని భీమ్లానాయక్ సినిమాలో మాదిరి లాక్కువెళతామని, వైఎస్సార్సీపీ వాళ్లను కొడతామని ఇలా.. ఏవేవో క్రిమినల్ భాషలో ఎందుకు మాట్లాడుతున్నారు. ఇదంతా కాకతాళీయంగా చేస్తున్నారా? కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా?.. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రసంగిస్తున్న విషయాలలో పెక్కు వివాదాస్పదం అవుతున్నాయి. ఒక రాజకీయ నేత ప్రవర్తించవలసిన పద్దతిలో ఆయన లేరన్న అభిప్రాయం కలుగుతుంది. విధానపరమైన అంశాలు,ప్రభుత్వ పధకాల జోలికి వెళ్లకుండా రాష్ట్రంలో ఏదో అశాంతి ప్రబలిపోయిందన్న అపోహ కల్పించాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. సరిగ్గా ఇది టీడీపీ అధినేత చంద్రబాబు శైలి. ✍️ తాను అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లు, శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నట్లు.. అదే ఎదుటివారు అధికారంలో ఉంటే అంతా అరాచకమే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5 వంటివి ఆయనకు తందానా అంటాయి. ఇప్పుడు అదే స్టైల్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉపన్యాసాలు సాగిస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఇది జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. దానిని నిజమని ధృవీకరించేలా పవన్ కల్యాణ్ ఎక్కడా గత టీడీపీ పాలన గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా ఎంతసేపు జగన్ ప్రభుత్వంపైనే చేస్తున్న ఆరోపణలు గమనిస్తే పిచ్చితనం పీక్కు చేరినట్లు అనిపిస్తుంది. ✍️ పవన్ ప్రసంగంలో.. తనను ప్రజలు ఓడించి వైఎస్సార్సీపీని గెలిపించారన్న దుగ్ద కనిపిస్తుంది. అందుకే తనను కనీసం ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన బతిమాలుతున్నారు. అది కూడా అనుమానంగా ఉండబట్టే తనను చంపడానికి సుపారీ ఇచ్చారని మరో ఆరోపణ చేశారు. దీనివల్ల కొంతైనా సానుభూతి రాకపోతుందా అన్నది ఆయన ఆశ కావచ్చు. అది నిజమే అయితే ఆయన స్వయంగా లేదా, ఆయన పార్టీ నేతల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా!. అదేమీ చేయలేదంటే ఏమిటి దాని అర్ధం. కేవలం ప్రచారం కోసం ఇలాంటివి చెప్పి ప్రభుత్వంపై బురద చల్లడమే కదా! ✍️ సినిమా నటుడు కనుక ఆయనకు కొంత అభిమాన బలగం ఉంది. సామాజికపరంగా కొంతమంది ఆయనను అనుసరించవచ్చు. వారిలో ఉద్రేకం రెచ్చగొట్టం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యేలను, వైస్సార్సీపీవాళ్లను దారుణంగా తిట్టడం ద్వారా ఆ వర్గాలలో కోపం తెప్పించాలని, వారిలో ఎవరైనా ఆవేశపరులు ఉంటే వారు రియాక్ట్ అయితే.. మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలన్నది ఆయన దురుద్దేశం కావచ్చు. ఇలాంటి టెక్నిక్స్ లో చంద్రబాబు దిట్ట. వాటిలోకొన్నిటిని పవన్ కల్యాణ్ కు నేర్పి పంపినట్లుగా ఉంది. ✍️ పవన్ కల్యాణ్, చంద్రబాబులతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నట్లుగా భ్రమ కల్పించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి అందులోనూ కాకినాడ వంటి ప్రశాంతమైన నగరంలో పవన్ రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటిని ప్రస్తావించి మరోసారి ప్రచారం చేయడం ఇష్టం లేదు. ఈ సందర్భంగా కాకినాడ నుంచి పోటీచేసి తనను ఓడించాలని ద్వారంపూడి సవాల్ చేశారు. ఎటూ తను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసేది ఇంకా తేల్చుకోలేదు కనుక ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాకినాడ సిటీలో పోటీచేయవచ్చు కదా!. ఆ ధైర్యం పవన్కు ఉందా? అన్నది సందేహమే. ✍️ పవన్ ఇప్పటిదాకా యాత్రలో ఎక్కడా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ స్కీముల గురించి తన అభిప్రాయాలు చెప్పలేదు. అమ్మ ఒడి కింద విద్యార్ధుల తల్లిదండ్రులకు పదిహేనువేల రూపాయలు చొప్పున ఇవ్వడాన్ని ఆయన అంగీకరిస్తారా?లేదా?.. చేయూత కింద 18,500 రూపాయల చొప్పున మహిళలకు ఇవ్వడం కరెక్టా ?కాదా?.. కాపునేస్తం కింద కాపు మహిళలకు ఆర్ధిక సాయం చేయడాన్ని సమర్దిస్తారా?లేదా?.. చేనేత నేస్తం కింద చేనేత కుటుంబాలకు సాయం చేయాలా?వద్దా ?.. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇళ్లు నిర్మించడాన్ని ఒప్పుకుంటారా?లేదా?.. వలంటీర్ల వ్యవస్థపై ఆయన అభిప్రాయం ఏమిటి? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల ముంగిటికి పాలన వెళ్ళిందా?లేదా?.. రైతు భరోసా కేంద్రాలకు రైతులకు ఉపయోగపడుతున్నాయా?లేదా?.. ఇలాంటివాటిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ✍️ ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ అబద్దపు ప్రచారం చేయడమే కాకుండా, బీహారులా మారిందని పవన్ అనడం ద్వారా ఏపీపై ఆయనకు ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వాన్ని చెత్తపాలనతో పోల్చుతూ జపాన్కు చెందిన మాకీ సంస్థ దేశ ప్రధానికి లేఖ రాసినప్పుడు మాత్రం.. పవన్ కల్యాణ్ నోట్లోవేలేసుకుని కూర్చున్నారు. చంద్రబాబు కాని, లోకేష్ కాని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాని ఒకే వ్యూహంతో వెళుతున్నారు. అదేమిటంటే.. ప్రజలు ఈ సంక్షేమ స్కీముల గురించి మర్చిపోవాలి. ఆ పిమ్మట రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న భయాన్ని కల్పించాలి. సంక్షేమ స్కీముల ద్వారా ప్రజల ఆదరణను జగన్ బాగా పొందారని గమనించిన ఈ ప్రతిపక్షం వాటి జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా కుట్ర ధోరణికి వెళుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే పచ్చిగా ఇలాంటివాటిని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా మొదటి పేజీలలో ప్రచురిస్తూ ప్రజలలో కంపరం కలిగిస్తున్నాయి. అదే తెలంగాణకాని, ఇతర రాష్ట్రాలలో కాని ఎన్ని ఘటనలు జరిగినా, ఎంత పెద్ద నేరం జరిగినా, దానిని కప్పిపుచ్చేలా వార్తలు ఇస్తున్నారు. అందుకే ఈ ఎల్లో మీడియాను జనం నమ్మవద్దని పదే,పదే చెప్పాల్సి వస్తోంది. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం పవన్ వల్ల కాదు..!
-
అమెరికా న్యూజెర్సీలో తెలుగు కుర్రాడి ఘనత
హైదరాబాద్ నుంచి వలస వెళ్లి అమెరికా న్యూజెర్సీలో స్థిరపడిన ఓ కుటుంబం నుంచి వచ్చిన సాహిత్ మంగు ప్రసంగాలతో అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. సాహిత్ మంగు, ఏడో తరగతి అబ్బాయి. భారత్ నుంచి వచ్చిన హైదరాబాదీ కుటుంబం తనది. న్యూజెర్సీ సోమర్సెట్లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా డిబెట్ లీగ్ టోర్నమెంట్లు జరుగుతాయి. ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్లో పోటీ పడగా.. సాహిత్ మంగు గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు. సాహిత్ చేసిన పరిశోధన, లోతైన విషయ అవగాహనకు తోడు ధాటిగా చేసిన ప్రసంగం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. సాహిత్ను విజేతగా ప్రకటించిన జడ్జిలు... అతడు ఎంచుకున్న అంశాలను, వాటికి మద్ధతుగా సేకరించిన విషయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. డిబేట్లో సాహిత్ ఎంచుకున్న అంశాలు ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించాలి ►అమెరికాలో అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలి ►ఫేసియల్ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ ►శాఖాహారమే మంచిది, మాంసాహారం సరి కాదు మరో ఫ్రెండ్తో కలిపి డిబేట్లో పాల్గొన్న సాహిత్.. నాలుగు అంశాల్లోనూ ధాటిగా తన వాదనను వినిపించి జడ్జిలను మెప్పించాడు. మొత్తమ్మీద విజేతగా నిలిచి గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు అందుకున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement