breaking news
sparshadarshanam
-
నిన్ను తాక మది కోరే.. టికెట్టు భారమాయె!
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం పునఃప్రారంభించిన మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి దేవస్థానం రోజుకో నిబంధన పెడుతోంది. ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి చేయడంతో పాటు నెలలో ఒకసారి మాత్రమేనంటూ దేవస్థానం వెబ్సైట్లో భక్తుల ఆధార్ లాక్ పెట్టడం గమనార్హం. ఏ క్షేత్రంలో లేని విధంగా శ్రీశైల మహాక్షేత్రంలో పరమశివుడైన మల్లికార్జున స్వామివారిని భక్తులు స్వయంగా తాకి (స్పర్శ) దర్శనం చేసుకోవచ్చు. పరమేశ్వరుడు అభిషిక ప్రియుడు. అభిషిక ప్రియుడికి ఆయనపై కొన్ని స్వచ్ఛమైన నీటిని పోసి, మారేడుదళం, బిల్వదళంతో అర్చిస్తే..సంబరపడి పోయి కోరిన కోర్కెలు తీర్చుతారని భక్తుల నమ్మకం. కాగా సామాన్య భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ నెల 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని పునఃప్రారంభించారు. శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనంలో జవాబుదారీతనం, పారదర్శకతకోసం కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేశారు. కంప్యూటరైజ్డ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్, ఫోన్ నెంబర్ను నమోదు చేసి టోకెన్లను ఇచ్చారు. ఈ టోకెన్లను ఉచిత దర్శనం క్యూలైన్ ప్రవేశద్వారం వద్దనున్న స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శదర్శనానికి అనుమతించారు. రోజుకు 1000 నుంచి 1200 టోకెన్లను జారీ చేశారు. అలాగే స్పర్శదర్శనానికి పురుషులు తెల్ల పంచె, మెడలో తెల్లకండువా.. మహిళలు చీర, రవిక, చున్నీతో కూడిన సల్వార్ కమీజ్లను ధరించాల్సి ఉంటుంది. ఆర్జితసేవా టికెట్ల రుసుం.. ప్రియం జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారి గర్భాలయంలో అభిõÙకం చేయాలంటే రూ.5 వేలు సమరి్పంచాల్సిందే. సామాన్యులు అంత పెద్ద మొత్తం వెచ్చించి అభిõÙకం చేయించుకోలేని పరిస్థితి. సామూహిక అభిõÙకం (రూ.1,500)సేవ ఉంది. ఈ సేవలో ప్రత్యేక మండపంలో భక్తులందరినీ సామూహికంగా కూర్చోపెట్టి అభిõÙకాది పూజలు నిర్వహించిన అనంతరం కలశంలో నీటిని తీసుకుని స్వామివారి మీద పోసి దర్శించుకుంటారు. అయితే గర్భాలయంలో స్వామి చెంత అభిõÙకం చేయలేదనే అసంతృప్తి భక్తుల్లో నెలకొంటుంది. అలాగే మల్లన్న స్పర్శదర్శనం చేసుకునేందుకు భక్తులు (ఒక్కొక్కరికి) దేవస్థానానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది సామాన్య భక్తులు మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోలేక పోతున్నారు. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు ఉన్న చిన్నపాటి కుటుంబం మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోవాలన్నా రూ.2,500 చెల్లించాలి. చాలా మందికి మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోవాలని కుతూహలం ఉన్నప్పటికీ అరి్థక స్థోమత లేక చాలా మంది దూర (దూళి) దర్శనం చేసుకుంటున్నారు. కుంకుమార్చన రూ.1000 అష్టాదశ శక్తిపీఠమైన భ్రమరాంబాదేవి ఆలయంలో అమ్మవారి గర్భాలయం ఎదురుగా శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేయాలంటే రూ.1000 చెల్లించాల్సిందే. అంతేకాకుండా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను (దూళి) దర్శించుకోవాలంటే రూ.150 సేవా రుసుంతో శీఘ్ర దర్శనం, రూ.300 టికెట్లు ధరతో అతిశీఘ్ర దర్శనం పేరుతో దేవస్థానం ఏర్పాటు చేశారు. అలాగే ఉభయ దేవాలయాల్లో అంతేకాకుండా స్వామిమఅమ్మవార్ల కల్యాణం, రుద్రహోమం, చండీహోమం, ఇలా ఏ ఆర్జిత సేవ అయినా రూ.1000 ఆ పైనే ఉంటుంది. ఇప్పటికైన దేవస్థాన అధికారులు స్వామి వారి దర్శనం సామాన్యులకు లభించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నెలలో ఒకసారి మాత్రమే..? దేవస్థానం కలి్పస్తున్న ఉచిత స్పర్శదర్శనం భక్తులు నెలలో ఒకసారి మాత్రమే నిర్వహించుకునేలా దేవస్థానం వెబ్సైట్లో మార్పులు చేస్తున్నారు. ఒక భక్తుడు తన ఆధార్కార్డుపై ఒక రోజు ఉచిత మల్లన్న స్పర్శదర్శనం టికెట్టు బుక్ చేసుకుంటే అతని ఆధార్ కార్డును నెల రోజుల పాటు దేవస్థానం వెబ్సైట్లో లాక్ పెడతారు. నెల తరువాతనే అతని ఆధార్కార్డుపై ఉచిత స్పర్శదర్శనం టికెట్టు బుక్ అవుతుంది. ఉచిత స్పర్శదర్శనానికి ఆన్లైన్లో.. శ్రీశైల దేవస్థానం పునఃప్రారంభించిన మల్లన్న ఉచిత స్పర్శదర్శనానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని దేవస్థానం కొత్త నిబంధన పెట్టింది. శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఇతర ఆర్జిత సేవా టికెట్లు పొందేవిధంగా ఉచిత స్పర్శదర్శనానికి సైతం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. దర్శనానికి ఒకరోజు ముందుగా ఆన్లైన్లో టికెట్టు బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కాపీని, ఆధార్ జిరాక్స్ను తీసుకొస్తేనే ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తున్నారు. -
స్పర్శ దర్శనం.. మహాభారం
సాక్షి, శ్రీశైలం : వారణాసి(కాశీ), శ్రీశైలం మహాక్షేత్రంలో మాత్రమే మల్లికార్జునస్వామిని స్పర్శించి దర్శించుకునే భాగ్యం ఉంటుంది. భోళాశంకరుడైన శ్రీశైల శ్రీమల్లికార్జునస్వామికి శిరస్సు తాకించి కేవలం పిడికెడు విభూది, పాలు, నీళ్లు, పత్రి సమర్పిస్తే చాలు తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ భాగ్యాన్ని కూడా శ్రీశైలానికి వచ్చే సాధారణ భక్తులు నోచుకోలేక పోతున్నారు. మల్లన్న ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో సాధారణ భక్తులు మల్లన్న స్పర్శ దర్శనం శని, ఆది, సోమవారాలలో చేసుకోవడానికి వీలు లేకుండా అప్పటి ఈఓ భరత్గుప్త ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటూ మాత్రమే స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆదాయమే లక్ష్యంగా టికెట్ల పెంపుదల.. మల్లన్న ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో అధికారులు ఇష్టారీతిగా సేవాటిక్కెట్లను పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు గర్భాలయ అభిషేకం రూ.1000, ముందస్తు అభిషేకం రూ.1500గా ఉండేది. ఆ తర్వాత మల్లన్న గర్భాలయంలో అభిషేకానికి రూ.5000గా నిర్ణయించారు. సామూహిక అభిషేక టికెట్ను రూ.1500కు పెంచేశారు. అలాగే అమ్మవారి ఆలయ శ్రీచక్రం ముందు కుంకుమార్చన టికెట్టు ధర రూ.300, అడ్వాన్స్ టికెట్లు రూ.500 ఉండేది. వాటిని కూడా ఏకంగా రూ.1000కు పెంచేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగే రుద్ర, చండీహోమం టికెట్ ధరలు రూ.750గా ఉండేవి. వాటిని ఏకంగా రెట్టింపు చేసి రూ.1500కు పెంచేశారు. కొన్నేళ్ల క్రితం వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పించే వారు. ఇప్పుడు రూ.500 వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ తీసుకున్న వారికి మాత్రమే గర్భాలయంలోకి అనుమతించి స్పర్శ దర్శనం చేయిస్తున్నారు. ఆ టిక్కెట్ల్లను కూడా పరిమితి సంఖ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయం కూడా కేవలం ఉదయం 6.30 గంటలకు, మధ్యాహ్నం 12.30కు, సాయంత్రం 6.30 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే దేవుడు దర్శనానికి క్షేత్రానికి వచ్చే భక్తులు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవా టికెట్లతో పాటు టోల్ గేట్ నుంచి టెంకాయల వరకు అధిక రేట్లు ఉండటంతో భక్తులు మండి పడుతున్నారు. కొత్త ఈఓ పాలనలో భక్తుల కష్టాలు తొలిగేనా.. ఇటీవల శ్రీశైలం ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామచంద్రమూర్తి సాధారణ భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రద్దీ లేని రోజుల్లోనైనా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం అందరికీ కల్పించాలని, రూ.5000 అభిషేకం టికెట్టు తీసుకున్న దంపతులతో పాటూ వారి వెంట ఉన్న పిలలు, వృద్ధులకు అవకాశం ఇవ్వా లని భక్తులు కోరు తున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలను అభిషేక సమయంలో తల్లిదండ్రులతో పాటూ అనుమతించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శని, ఆది, సోమవారాలు, ప్రముఖ పర్వదినాలను మినహాయించి మిగిలిన రోజుల్లో స్పర్శ దర్శ నంపై ఈఓ దృష్టి సారించాలని కోరుతున్నారు. రద్దీ రోజుల్లో వసతి గదుల కొరతతో ఇబ్బం దులు పడుతున్నారు. తక్కువ ధరతో గదులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. కొబ్బరి కాయ రూ. 20 భక్తులు స్వామిఅమ్మవార్లకు సమర్పించే కొబ్బరకాయల ధరలను కూడా శ్రీశైలదేవస్థానం వారు ఇటీవలే రెండు మార్లు పెంచేశారు. కొంతకాలం వరకు రూ.10గా ఉన్న ధర, రూ. 15, ప్రస్తుతం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు కుటుంబసమేతంగా వచ్చినా ఒక్క కొబ్బరికాయ మాత్రమే సమర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందులు కొనాల్సిందే.. శ్రీశైలదేవస్థానం ఎన్నో ఏళ్లుగా భక్తులు, స్థానికుల సౌకర్యం కోసం ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసింది. కొంతకాలం క్రితం వరకు అందులో ఉచిత వైద్యంతో పాటూ మందులు కూడా దాతల సహకారంతో ఉచితంగానే అందజేసేవారు. ప్రస్తుతం మందులు లేక పోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. టోల్ బాదుడు.. శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించడానికి నిత్యం వేల సంఖ్యలో వివిధ వాహనాల ద్వారా చేరుకుంటున్నారు. అయితే టోల్ గేట్ టిక్కెట్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. కారు, జీపు మొదలైన వాటికి రూ.100, టెంపో, ట్రాక్టర్, బస్ మొదలైన వాటికి రూ. 200, లోడ్ బండ్లకు రూ.500 వరకు టోల్గేట్ రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ టోల్గేట్ ద్వారా దేవస్థానానికి నెలకు రూ.50 లక్షలకుపై గా ఆదాయం సమకూరుతున్నా వాహనదారులకు పార్కింగ్, తదితర విషయాల్లో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. -
నియమిత వేళల్లో స్పర్శదర్శనం
శ్రీశైలం: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల్లో నియమిత వేళల్లో భక్తులందరికీ స్పర్శదర్శన అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాధారణ భక్తులకు స్పర్శదర్శనం నిలుపుదల చే యలేదని స్పష్టం చేశారు. గతంలో గర్భాలయంలో జరిగే అభిషేకాలను కేవలం 3 నుంచి 5 నిమిషాల్లోపే పూర్తి చేసేవారన్నారు. చాలా మంది భక్తులు అభిషేకాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, వీటన్నింటిని దష్టిలో పెట్టుకుని సామూహిక అర్జిత అభిషేకాలను ప్రవేశ పెట్టామన్నారు. రూ.5వేలు నిర్ణయించిన ఈ అభిషేక సేవలో రోజుకు కేవలం 24 టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచామని, 20 నిమిషాల పాటు శాస్త్రోక్తంగా అభిషేకాన్ని సేవాకర్తలు నిర్వహించుకోవచ్చునన్నారు. గతంలో శ్రీ స్వామివార్ల బిల్వార్చన రుసుం రూ. 3,116 ఉండగా.. నేడు బిల్వార్చన టికెట్ను రూ. 5వేలకు పెంచామన్నారు. గతంలో దంపతులు లేదా ఒక్కరికి కూడా అభిషేక రుసుం రూ. 1500లుగా ఉండగా, ప్రస్తుతం దంపతులకు రూ. 1500లను కొనసాగిస్తూ, ఒక్కరు అభిషేకం చేయాలనుకుంటే రూ. 750లుగా నిర్ణయించినట్లు చెప్పారు.