-
హాక్.. నేరాలకు చెక్!
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు శాఖకు మరో అత్యాధునిక వాహనాన్ని కేటాయించింది. నేరస్తులు, ఆందోళనకారులపై నిఘా ఉంచేందుకు ఫాల్కన్ వాహనం తరహాలో హాక్ మొబైల్ వాహనాన్ని కేటాయించింది. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో వాహన పనితీరును ఎస్పీ గోపీనాథ్ జట్టి పరిశీలించారు. ఈ వాహన సేవలను ఉపయోగించుకుని జిల్లాలో నేరాల శాతాన్ని పూర్తిగా తగ్గించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హాక్ మొబైల్ వాహనం విశేష సేవలు అందించనున్నది. ఇరుకైన ప్రాంతాల్లో కూడా వేగంగా వెళ్లి అనుమానితులను పసిగట్టగలదు. ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఈ వాహనం యొక్క ప్రత్యేకత (పాత నేరస్తులను గుర్తించగలదు). అత్యాధునిక నిఘా వ్యవస్థ కల్గిన ఈ హాక్ మొబైల్ వాహనంలో 180 డిగ్రీలు, 360 డిగ్రీల అత్యాధునిక కెమెరాలు, సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసేందుకు 4 అత్యాధునిక కంప్యూటర్లు ఉన్నాయి. 16 టెరా బైట్స్, 8 టెరా బైట్స్ సామర్థ్యం గల రెండు సర్వర్లను అమర్చారు. రెండు హెచ్డీ పీటీజడ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆందోళనకారుల కదలికలను ఫిక్స్డ్ పీటీజడ్ కెమెరాలు కవర్ చేస్తాయి. పోర్టబుల్ పీటీజడ్ కెమెరాను ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఒక డ్రోన్ కెమెరా, రెండు బాడీ వార్న్ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు వెళ్లేందుకు వీలుకాని పరిసర ప్రాంతాల్లోకి బాడీ వార్న్ కెమెరాలు తీసుకెళ్లి రెండు వైపుల నుంచి రికార్డు చేయవచ్చు. జాయ్స్టిక్తో కెమెరాలను కంట్రోల్ చేసే వెసులుబాటు ఉంది. రిమోట్ ఆపరేటింగ్ కూడా చేయవచ్చు. కమ్యూనికేషన్ ఉ పయోగం కోసం అత్యాధునిక అల్ట్రా ఫ్రీక్వెన్సీ మొబైల్ సెట్స్ను ఇందులో ఏర్పాటు చేశారు. దీనివల్ల అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులను గుర్తించవచ్చు. డిటెక్షన్ పీపుల్, యాంటినా సెట్లో ట్రాన్స్మిటర్, రిసీవర్ ఏర్పరిచారు. దీని నెట్వర్క్ యాంటినా రేంజ్ 300 మీటర్ల వరకు ఉంటుంది. ఒక జనరేటర్, యూపీఎస్, ఏపీ ఫ్రిడ్జ్, ఓవెస్, నాలుగు వైర్లెస్ కెమెరాలు, వీడియో వాల్ తదితర వాటిని ఇందులో ఏర్పాటు చేశారు. వీవీఐపీ బందోబస్తులు, ఉత్సవాలు, భారీ జన సమీకరణ సభలు, ధర్నాలు, ప్రదర్శనల్లో హాక్ మొబైల్ వాహనంతో ఇకపై నిఘా ఉంచనున్నారు. ధర్నాలలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఈ వాహన సేవలను ఇకపై పోలీసులు పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు. ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి, సీఐ నాగరాజు యాదవ్తో పాటు నెక్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ వై.శ్రీనివాసరావు, హాక్ వాహన టీమ్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చూసొద్దాం చలో..చలో..
హైదరాబాద్కు 100 కి మీ పరిధిలోనే పర్యాటక కేంద్రాలు సందర్శకులకు టి-టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు అందుబాటులో అత్యాధునిక వాహనాలు శామీర్పేట్ హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల మధ్య ఉన్న అందమైన ప్రాంతం.. శామీర్పేట్. సికింద్రాబాద్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న శామీర్ పేట సహజ సిద్ధమైన అందాలకు నెలవు. ఇక్కడ ఉన్న సరస్సు, జింకల పార్కు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. ఇక్కడ బస చేసేందుకు టూరిజం శాఖ హరిత రెస్టారెంట్ ఏర్పాటు చేసింది. బోటింగ్ సౌకర్యం, స్పా, జిమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. జూబ్లీ బస్స్టేషన్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ.19 చిలుకూరు.. చిలుకూరులోని బాలాజీ టెంపుల్ మహిమ గల ఆలయంగా గుర్తింపు పొందింది. నగరం నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు హిమాయత్ సాగర్, గండిపేట్ ప్రాంతాలను కూడా చూడవచ్చు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుని ప్రతిరూపంగా ఇక్కడ బాలాజీ పూజలందుకుంటున్నారు. జేబీఎస్, మెహదీపట్నం ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25 పెంబర్తి.. నాణ్యమైన కంచు పాత్రలకు పెట్టింది పేరు పెంబర్తి. నగరానికి 100 కి.మీ దూరంలో ఉన్న ఈ మారుమూల గ్రామం కాకతీయుల కాలం నుంచి ఇత్తడి, కంచు వస్తువుల తయారీకి ప్రత్యేక గుర్తింపు పొందింది. దీపారాధన, దేవతామూర్తుల విగ్రహాలు, లోహపు వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ. 50 మెదక్ చర్చి కాకతీయుల కాలంలో నిర్మించిన బలమైన కోటల్లో మెదక్ పోర్టు ఒకటి. ఈ కోటకు ఉన్న మూడు ద్వారాలు, వాటి ముందు ఉండే ఏనుగుల బొమ్మలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయి. దీనికి సమీపంలోనే పురాతనమైన మెదక్ చర్జి ఉంది. ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన తెల్లగ్రానైట్ రాళ్లతో ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. ఈ చర్చిపై 175 మీటర్ల ఎత్తులో ఉన్న గంట ఇక్కడ ప్రత్యేకం. సుమారు 5 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డినరి బస్సు రూ.54. ఏసీ బస్సుకు రూ. 73 ప్రజ్ఞాపూర్ నగరానికి 65 కీమీ దూరంలో మెదక్ జిల్లాలో కరీంనగర్ హైవేలో ఉంది. భువనగిరి, జనగామ, సిద్ధిపేట్, వెళ్లే వారు ప్రజ్ఞాపూర్ వద్ద విశ్రాంతి తీసుకొని వెళ్తారు. ఈ ప్రాంతంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హోటళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి సమీపంలోని కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం ప్రఖ్యాతి పొందింది. సింగూరు నగరానికి 90 కిమీ దూరంలో మెదక్ జిల్లా సింగూరులో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు డ్యాం చూడదగినది. జంటనగరాలకు ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోంది. ఇందులో మొసళ్లు కూడా ఉన్నాయి. వేసవి సెలవుల్లో సేద తీరేందుకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లొద్దామనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక, దర్శనీయ స్థలాలపై ప్రత్యేకంగా రూపొందించిన కష్టమైజ్డ్ ప్యాకేజీలను ఇప్పుడు టూర్ ఆపరేటింగ్ సంస్థలు, తెలంగాణ టూరిజం శాఖ అందిస్తున్నాయి. వాటిలో కొన్ని... ట్యాంక్బండ్ నగర నడిబొడ్డున ఉండే అందమైన ప్రాంతం. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ తర్వాత హుస్సేన్ సాగర్ పై ఉన్న ట్యాంక్బండ్ గుర్తుకు వస్తుంది. ఈ సరస్సు మధ్యలో ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన బుద్ధుని విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. ఇందులో విహరించేందుకు బోటింగ్, పడవలు, క్రూజర్ సౌకర్యం ఉంది. సాయంత్రం వేళల్లో మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఈ ప్రాంతంలో విహరిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. బస్సు సౌకర్యం... నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్బండ్ ప్రాంతానికి బస్సులు ఉన్నాయి. చార్జి రూ.25 లోపే. యాదగిరిగుట్ట... తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. నరసింహస్వామి కొలువైన ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని పంచ నరసింహ క్షేత్రంగా పిలుస్తారు. పర్యాటకులకు హరిత హోటల్స్, ఇతర వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఆర్డిన రి బస్సుకు రూ.44. శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. చార్జి 101. భువనగిరి కోట... క్రీస్తు శకం 1200 సంవత్సరంలో నిర్మించిన చాళుక్య కాలం నాటి కోట ఇక్కడ ప్రత్యేకం. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట 40 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో రెండు సరస్సులు ఉన్నాయి. కోటలోని భూ గృహాలు నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పట్టేలా ఉంటాయి. ఈ ప్రాంతం నల్గొండ నుంచి 53 కి.మీ దూరంలో ఉంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఏసీ బస్సుకు రూ. 80, ఆర్డ్డినరి రూ. 35 అనంతగిరి హిల్స్ నగరానికి 75 కిమీ దూరంలో వికారాబాద్కు సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ ప్రత్యేకంగా వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. టూరిజం శాఖ ఇక్కడ హరిత రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ.73 కీసరగుట్ట నగర శివార్లలోని కీసర గుట్ట ప్రముఖ శైవక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలో 101 శివలింగాలు ఉన్నాయి. నగరానికి చేరువలో ఉండటంతో నిత్యం యాత్రికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జ్జి రూ. 20 గంగాపూర్ మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లకు 8 కి.మీ దూరంలో ఉన్న గంగాపూర్ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని రుణ బాధలు ఉన్నవారు ఎక్కువగా దర్శించుకుంటారు. జేబీఎస్ నుంచి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంది. రూ. 85 నాచారం.. మెదక్ జిల్లాలో చూడదగ్గ ప్రాంతంలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలోని అసఫ్జాహీ జమామసీద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ యాత్రికులకు చక్కటి వసతులు ఉన్నాయి. పర్యాటకులు దీనితోపాటు నాచారం గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ.65 వర్గల్ సరస్వతి ఆలయం.. సికింద్రాబాద్ నుంచి 47 కి.మీ దూరంలో ఉంది. మెదక్ జిల్లా కంచి శంకర మఠం ప్రాంతంలోని ఈ ఆలయ సముదాయంలో విద్యా సరస్వతి, లక్ష్మీగణపతి, శనిచ్ఛంద్ర, వైష్ణవాలయాలు ఉన్నాయి. వర్గల్ సరస్వతి అమ్మవారి వద్ద చాలా మంది తమ పిల్లలకు అక్షరభాస్యం చేయిస్తుంటారు. జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. చార్జి రూ. 32 అందుబాటులో అత్యాధునిక వాహనాలు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు యాత్రికులు వెళ్లేందుకు సౌకర్యవంతమైన ఆధునాతన లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఒకటైన ‘కారవాన్’ ఏసీ వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఏడు సీట్లు ఉంటాయి. పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సోఫా, బెడ్ కూడా ఉన్నాయి. వాహనంలోనే అటాచ్డ్ టాయిలెట్, రెండు ఎల్సీడీ టీవీలు, ఫ్రిజ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనానికి కనీస చార్జిగా కి.మీకు రూ. 25, రోజుకు 300 కి.మీ. వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు 300 అదనపు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఇన్నోవా కూడా అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు తెలంగాణ టూరిజం కార్యాలయంలో గాని, 9848125720,9848306435,9666578880, 9848540374, 9848126947 నంబర్లలో గాని సంప్రదించాలని జనరల్ మేనేజర్ మనోహర్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement