breaking news
snore
-
క్లాస్రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వీడియో వైరల్
జాల్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ టీచర్ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు.మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలో ఉన్న మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. "మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గురకపెట్టే వారికి కరోనా ముప్పు ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో గురక పెట్టి పడుకునే వాళ్లు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ముప్పు ఎక్కువని పరిశోధకులు తేల్చారు. కరోనా వైరస్, నిద్రకున్న సంబంధంపై ఇప్పటి వరకు జరిపిన 18 అధ్యయనాలను వార్విక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చారు. గుర్రు పెడుతూ నిద్రపోయే వారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా వారికి ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. గుర్రు పెట్టేవాళ్లకు కరోనా సోకడం ఒక రిస్క్ ఫ్యాక్టరేకానీ, అదనపు రిస్క్ ఫ్యాక్టర్ కాదని పరిశోధకులు చెప్పారు. అంటే స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం ఉన్నట్లయితే ఆ మూడే వారికి రిస్క్ ఫ్యాక్టర్లని, వారిలో గురుకపెట్టే వారున్నట్లయితే వారికి అది అదనపు రిస్క్ ఫ్యాక్టర్ కాబోదని కూడా పరిశోధకలు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అనారోగ్య సమస్యలున్న వారందరికి గురకపెట్టే అలవాటు వస్తుందని వారు చెప్పారు. ఇంగ్లండ్లో 15 లక్షల మంది, అమెరికాలో 2.20 కోట్ల మంది గురక సమస్యతో బాధ పడుతున్నారు. (చదవండి: నిద్రపట్టడం లేదని..) -
విద్యార్థి గురకపెడుతున్నాడని..
బీజింగ్: పక్కవారు గురకపెడుతుంటే నిద్రపట్టడం కొంచెం కష్టమే. గురక ఆపించడానికి గురకపెట్టేవారిని కొంచెం కదిలించడం లాంటి పనులు చేస్తుంటారు. అయితే చైనాలో మాత్రం ఓ విద్యార్థి గురకపెడుతున్నాడన్న కారణంతో తోటి విద్యార్థులు చావబాదారు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో పాటు వినికిడి సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడు సదరు విద్యార్థి. వివరాల్లోకి వెళ్తే.. షాంగ్జీ ప్రావిన్సులోని మిడిల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదువుతున్న మా గురుయ్(15)కి నిద్రలో గురకపెట్టే అలవాటు. అతడి రూమ్మేట్స్ 12 మందికి ఇది నచ్చకపోవటంతో చాలా సార్లు గురుయ్ను గురకపెట్టొద్దని హెచ్చరించారు. అయితే ఇటీవల గురుయ్ నిద్రపోతున్న సమయంలో మళ్లీ గురకపెట్టడంతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు గురుయ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తలకు తీవ్రగాయం కావటంతో ఆసుపత్రికి తరలించగా.. గురుయ్ పుర్రెలో పెద్ద పగులు రావడంతో పాటు వినికిడి సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడని వైద్యులు తేల్చారు. దీనిపై గురుయ్ తండ్రి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అకారణంగా తన కుమారుడిపై దాడి చేశారని వాపోయాడు. చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు కూడా స్కూల్ యాజమాన్యం నిరాకరించిందని తెలిపాడు. స్కూల్ యాజమాన్యం, దాడికి పాల్పడిన తోటి విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
గురకతో ఆ ముప్పు పెరుగుతోంది!
మ్యూనిచ్: నిద్రలో గురక పెడుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పరిశోధకులు. గురక పెట్టేవారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. మరీ ముఖ్యంగా గురకపెట్టే పురుషులు జాగ్రత్తగా ఉండాలని చెబుతునారు. గురక పెట్టే సమయంలో గాలి తీసుకోవడంలో ఏర్పడే అవరోధం వల్ల శరీరంలోని ముఖ్యమైన కణజాలాలాకు అందే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుందని, ఈ స్థితి క్యాన్సర్కు కారణం కావడమే కాకుండా వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తుందని మ్యూనిచ్లో జరిగిన యురోపియన్ అసోసియేషన్ ఆరోగ్య సదస్సులో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడం వల్ల క్యాన్సర్ కణాలు గ్రహించే ప్రొటీన్ల శాతం పెరుగుతుందని, తద్వారా అవి వేగంగా వృద్ధి చెందుతాయని డాక్టర్ ఆంటోని విలాసికా తెలిపారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం అనేది వాటి మూత్రపిండాల్లోని కణాల అసహజ పెరుగుదలకు కారణం అయినట్లు రుజువైందని, మనుషుల్లో సైతం మూత్రపిండాల కణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ అర్ముఫ్ స్టెంజల్ వెల్లడించారు. -
గురక పెడితే.. ఊరుకోదు
పిల్లి అరుపులా.. నక్క కూతలా.. ఇంజిన్ స్టార్ట్ చేసినట్లు.. ఇలా గురక పెట్టడంలో ఎవరి స్టైల్ వారిది. వారి సంగతెలా ఉన్నా.. పక్కన పడుకునేవారికి మాత్రం అది నరకమే. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతుంది ఈ వినూత్న తలగడ. ఇందులో ఉండే మైక్రోఫోన్లు గురక తాలూకు కంపనాలను గ్రహిస్తాయి. వెంటనే.. ఇందులోని ఎయిర్పాకెట్ నెమ్మదిగా ఉబ్బడం ప్రారంభిస్తుంది. అది గురక పెడుతున్నవారి తల లేదా శరీరం కదిలేలా చేస్తుంది. దీని వల్ల వారి గురక ఆగుతుంది. అప్పటికీ ఆగకుంటే.. ఇది బాగా ఉబ్బుతుంది.. లేదా చిన్నగా తట్టినట్లు చేసి.. వారిని నిద్రలేపుతుంది. ఏ స్థాయి గురక పెడితే.. ఎయిర్ పాకెట్ ఉబ్బాలి అన్నదాన్ని మనం ఇందులో ఉండే బటన్ల ద్వారా సెట్ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఆన్లైన్ రీటైలర్ హెమాకర్ ష్లెమర్ ఈ తలగడను విక్రయిస్తోంది. ధర రూ.9 వేలకు పైనే.. -
మీ నిద్రే... మీకు ఒక మెడికల్ టెస్ట్!
మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన. మన ఆరోగ్యం సక్రమంగా ఉందంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఒకవేళ మన నిద్రలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయనుకోండి... అవి మన ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయనుకోవచ్చు. ఉదాహరణకు మనకు నిద్రాభంగం కలిగిస్తూ, కనిపించే అనేక సమస్యలు నిజానికి మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా పరిగణించాలి. మీ నిద్రే ఒక వైద్యపరీక్షగా మారి మిమ్మల్ని డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందిగా నిశ్శబ్దంగా ఆదేశిస్తుందేమో పరిశీలించుకోండి. ప్ర: నిద్రలో గుండెల్లో మంటగా ఉందా?... జ: అది జీఈఆర్డీ లేదా బ్యారెట్స్ సిండ్రోమ్ కావచ్చు. నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేసిందా? గుండెలో మంటగా, ఛాతీలో ఇబ్బందిగా ఉంటే అది బ్యారెట్స్ సిండ్రోమ్ అయ్యే అవకాశం ఉంది. మన సమాజంలో దాదాపు 45 శాతం మందిలో ఈ లక్షణం ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది. అయితే నిద్రలో కనిపించినప్పుడు వాళ్ల ఆందోళన అధికమవుతుంది. ఛాతీలో మంటతో పాటు చెమట పట్టడం, ఎడమ భుజం/చేతిలో నొప్పి వంటి లక్షణాలు లేకపోతే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ లక్షణం దీర్ఘకాలం కనిపిస్తుంటే డాక్టర్ను తప్పక సంప్రదించాలి. చాలామంది దీన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. తొలిదశల్లో అయితే ఇది కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఉండే దశగా భావించవచ్చు. అయితే కొన్నిసార్లు ఈసోఫేగస్లో కింద ఉండే కణాలు మార్పు చెందడం వల్ల వచ్చే కాలమ్నార్ ఎపిథీలియమ్ లైన్డ్ లోయర్ ఈసోఫేగస్ అనే కండిషన్ వల్ల కావచ్చు. సాధారణంగా అక్కడ ఉండే కణ నిర్మాణానికి బదులు పైన పేర్కొన్న కాలమ్నార్ కణాలుగా కణాలు మార్పులు చెందితే దాన్ని బ్యారట్స్ సిండ్రోమ్గా పేర్కొనవచ్చు. అది గ్యాస్ను పైకి ఎగజిమ్మే సాధారణ జీఈఆర్డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సిండ్రోమ్) అయితే పర్వాలేదు. ఒకవేళ అది బ్యారెట్స్ సిండ్రోమ్గా మార్పు చెందుతుంటే మాత్రం తక్షణం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అది క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. గ్యాస్ ఎక్కువగా కనిపిస్తుంటే మాత్రం తొలి దశలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గ్యాస్/జీఈఆర్డీ సమస్యను అధిగమించవచ్చు. ప్ర: నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? జ: అది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు. త నిద్రలో పళ్లు కొరకడమనే ఈ లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సవుస్య ఉండవచ్చు. దీన్నే బ్రక్సిజం అంటారు. పిల్లల్లో ఇది సర్వసాధారణం. పిల్లల్లోనైతే ఇది మొదటి ఐదేళ్లలో మొదలయ్యే సమస్య. పిల్లల్లో సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వం ఉన్నప్పుడు ఇలా పళ్లు కొరకడం ద్వారా వ్యక్తమయ్యే బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక పెద్దలలోనైతే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఇది కనిపిస్తుంది. పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతూ ఉంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే వుుందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయుత్నించాలి. వారి వునసుల్లో ఉన్న భయూలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, చాక్లెట్లు వంటివి వారికి పెట్టకూడదు. సవుస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే వత్ గార్డ్స్, వత్పీసెస్ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సవుస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్) సవుస్యలు - వూల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు పడిపోవడం, దడవ ఎవుుక జారుుంట్ (టెంపోరో వూండిబులార్ జారుుంట్) సవుస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో డెంటల్ సర్జన్ను కలవాల్సి ఉంటుంది. ఇక పెద్దల్లోనైతే మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు అవసరమైన ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ల వంటివి చేయడం మంచిది. ప్ర: నిద్రలో గురక ఎక్కువగా వినిపిస్తోందా? జ: స్లీప్ ఆప్నియా కావచ్చు. అదలా కొనసాగడం ప్రమాదకరమూ కావచ్చు. మనకు కొద్దిసేపు శ్వాస ఆడకపోయినా, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. శ్వాసకు అంతరాయం కలిగించే ఈ సమస్యను వైద్యపరిభాషలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అంటారు. గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. మనం నిద్రపోయినప్పుడు మన గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలామందిలో శ్వాసకు అవరోధం కాదు. కొందరిలో వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) అయి, శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక. శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిని మెదడు పసిగట్టి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మేల్కొని తగినంత శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. శ్వాస అందని ఆప్నియా స్థితి నిద్రలో అనేకసార్లు వస్తుంది. దాంతో రాత్రివేళల్లో అనేకసార్లు నిద్రాభంగం కలుగుతుంది. అందువల్ల పగటి వేళ మందకొడిగా ఉంటుంది. రాత్రుళ్లు గురకపెడుతూ, పగటివేళల్లో మాటిమాటికీ నిద్రలోకి జారిపోతూ ఉంటే ఆప్నియా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా ఎంతో ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావడం, రక్తపోటు పెరగడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. గుండెజబ్బులు ఉన్నవారికైతే ఇలా రక్తపోటు పెరగడం గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నిద్రకు ముందు ఆల్కహాల్ను తీసుకోకూడదు. ధూమపానాన్ని, నిద్రమాత్రలు వాడే అలవాటును మానేయాలి. ప్ర: రాత్రుళ్లు నిద్రలో తీవ్రంగా చెమటలు పడుతున్నాయా? జ: అది క్షయ (ట్యూబర్క్యులోసిస్) కావచ్చు. సాధారణంగా క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్) ఉన్నవారి శరీర ఉష్ణోగ్రత ఉదయం వేళలతో పోలిస్తే... సాయంత్రం నుంచి రాత్రివేళల్లో మరింతగా పెరుగుతుంటుంది. ఒక్కోసారి శరీర ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతుందంటే, రాత్రివేళల్లో తీవ్రంగా చెమటలు పట్టి, పక్కబట్టలు కూడా తడిసి, వాటిని మార్చాల్సినంత ఎక్కువగా ఉండవచ్చు. క్షయవ్యాధి మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్, పేగులు, కాలేయం వంటి కీలక అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. కొన్నిరోజులు మందులు వాడగానే రోగ లక్షణాలు తగ్గడంతో మందులు మానేస్తుంటారు. దాంతో మందులకు లొంగని ‘డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ’ కేసులు ఎక్కువ. టీబీని పూర్తిగా నయం చేయడానికి క్రమం తప్పకుండా పూర్తిగా వైద్యపర్యవేక్షణలో మందులు వాడటం అత్యవసరం. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో డాట్స్ (డెరైక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ షార్ట్ కోర్స్) చికిత్స కార్యక్రమం కింద కార్యకర్తల ఆధ్వర్యంలో రోగి క్రమం తప్పకుండా మందులు తీసుకునేలా చూస్తున్నారు. అలాగే మందుల వల్ల వస్తున్న దుష్ర్పభావాలు (సైడ్ఎఫెక్ట్స్) వంటి వాటిని (ఉదాహరణకు... చర్మంపై ర్యాషెస్, అసిడిటీ, కాలేయం స్రవించే ఎంజైముల పెరుగుదల, చూపుతగ్గడం, వినికిడి శక్తిలో మార్పులు, మూత్రపిండాల పనితీరులో మార్పుల వంటివి) కూడా పరీక్షించి దానికి అనుగుణంగా మందులను, వాటి మోతాదులను నిర్ణయించాల్సి ఉంటుంది. ప్ర: నిద్రలో కాళ్లకండరాలు అకస్మాత్తుగా పట్టేసి నొప్పితో విలవిలలాడుతుంటే? జ: సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తగుపాళ్లలో ద్రవాలు (హైడ్రేషన్) సమకూరకపోవడం కారణాలు కావచ్చు. రాత్రి నిద్రలో కాళ్ల కండరాలు, పిక్కలు పట్టేసి, ఒకపట్టాన వదలకుండా చాలాసేపు బాధిస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారంలో పొటాషియమ్, మెగ్నీషియమ్ మరియు విటమిన్ల లోపం వల్ల, లవణాలు, తగినంత ద్రవాలు లేకుండా ఉన్నాయని అర్థం. అంటే మనం అన్ని పోషకాలు లభించేలా సమతులాహారం తీసుకోవడం లేదని పరిగణించాల్సి ఉంటుంది. ఇదేమీ ప్రమాదకరమైన పరిణామం కాదు. దీనివల్ల కండరాలు పనిచేయడానికి అవసరమైన పాళ్లలో మెగ్నీషియమ్ లభించడం లేదని భావించి, అది పుష్కలంగా లభించే గుమ్మడి గింజలు, చేపలు, ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక పొటాషియమ్ అన్నది అరటిపండ్లలో, కొబ్బరినీళ్లలో ఎక్కువ. దీనికి తోడు తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లతో పాటు ద్రవాహారం లేదా కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటుంటే ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. -నిర్వహణ: యాసీన్ రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోందా? డయాబెటిస్... లేదా పురుషుల్లోనైతే ప్రోస్టేట్ సమస్య కావచ్చు. రాత్రివేళల్లో చాలాసార్లు నిద్రలేచి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే బహుశా అది చక్కెర వ్యాధి /డయాబెటిస్ లక్షణం కావచ్చేమోనని అనుమానించాలి. చక్కెర వ్యాధిలో రక్తంలోని చక్కెర పాళ్లు పెరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. దాంతో రక్తంలోని ఈ ఎక్కువైన చక్కెరను బయటకు పంపించేందుకు మూత్రపిండాలు ఎక్కువగా మూత్రవిసర్జన చేసి, ఎక్కువైన చక్కెరను మూత్రం ద్వారా విసర్జించడానికి ప్రయత్నిస్తాయి. అందుకే అలా ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇక కొందరిలోనైతే ఇలా మూత్రం వచ్చినట్లు అనిపిస్తూ, అది ధారగా కాకుండా చుక్కలు చుక్కలుగా పడుతుండటం, వారి వయసు యాభై దాటి ఉండటం తటస్థిస్తే వారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు కూడా అయి ఉండవచ్చు. ఈ లక్షణం పిల్లల్లో ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అంతకుముందు చాలా రోజులు పక్క తడపకుండా ఉండి, ఆ తర్వాత పక్క తడుపుతుంటే, అది టైప్-1 డయాబెటిస్కు గాని లేదా తీవ్రమైన మానసిక వేదనకు గాని చిహ్నం అయ్యేందుకు అవకాశం ఉంది. పెద్దల్లో సమస్య టైప్-2 డయాబెటిస్ అయితే క్రమం తప్పకుండా చక్కెరపాళ్లను పరీక్షించుకుంటూ... నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ వారు సూచించిన... చక్కెర నియంత్రణ మందులు క్రమం తప్పక వాడుతుండాలి. ఒకవేళ ప్రోస్టేట్ గ్రంథి వాపు అయితే డాక్టర్ సలహా మేరకు మొదట వుందులు వాడి, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయుూఆర్పీ అనే శస్త్రచికిత్స చికిత్స చేయించాల్సి వస్తుంది. ఒకవేళ పిల్లల్లోనైతే తప్పక డాక్టర్కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. -డాక్టర్ సి.హేమంత్ సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.