breaking news
Shivakumar reddy
-
చదువు చెప్పిస్తూ.. భరోసా కల్పిస్తూ .. అంధుల జీవితాల్లో ‘వెలుగు’ రేఖ
ఈ పోటీ ప్రపంచంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా ఏదో తెలియని భయం వెనక్కు లాగుతూనే ఉంటుంది. ఆర్థిక స్థోమత.. కుటుంబ నేపథ్యం.. పరిస్థితులు.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవాంతరం ఉండనే ఉంటుంది. అన్నీ అవయవాలు బాగున్న వాళ్ల పరిస్థితే విజయం, అపజయం మధ్య ఊగిసలాడుతుంటుంది. అలాంటిది అసలు కళ్లే కనిపించకపోతే. అందునా ఎవరి ప్రోత్సాహం లేకపోతే.. లోకులు కాకులైతే.. ఆ జీవితం ‘అంధకారమే’. అదే చీకటి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా వేసిన అడుగు.. ఓ అంధుని బంగారు భవితకు బాటగా మారింది. అలాంటి ఎన్నో జీవితాల్లో ‘వెలుగు’లు నింపుతోంది. గూడూరు(తిరుపతి జిల్లా): ఓజిలి మండలం, కురుగొండకు చెందిన బచ్చల సుబ్బారెడ్డి, సుదర్శనమ్మల రెండో సంతానం శివకుమార్రెడ్డి. ఐదేళ్ల వయసులోనే చూపు మందగించింది. క్రమంగా అంధత్వానికి దారితీసింది. విధి ఆ చిన్నారికి చూపు లేకుండా చేసిందే కానీ.. ఆ వయస్సులోనే విద్యపై చిగురించిన ఆసక్తిని తుడిచేయలేకపోయింది. కళ్లే కనిపించని పిల్లాడికి చదువు ఎందుకన్నారు.. ఇంట్లో వాళ్ల మెదళ్లలోనూ ఆ విషబీజం నాటుకుంది. ఆ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం అండగా నిలిచింది. చదువుకుంటేనే తాను సమాజంలో నిలదొక్కుకోగలననే విషయం అర్థమైంది. అలా మొక్కవోని దీక్ష తోడు కావడంతో పదో తరగతి వరకు వెంకటగిరిలో.. ఆ తర్వాత ఇంటర్మీడియెట్, డిగ్రీ తిరుపతి ఎస్వీ ఆర్ట్ కళాశాలలో పూర్తయింది. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్లో ఎంఏ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ మాస్కమ్యూనికేషన్ చేసి విమర్శలకు నోళ్లు మూయించాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, ఎంఫిల్, పీహెచ్డీలతో పాటు డిప్లొమో ఇన్ కమ్యూనికేట్ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమో ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పూర్తిచేసి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నారు. యూజీసీ ప్రతి ఏటా నిర్వహించే మాస్ కమ్యూనికేషన్ పరీక్షను మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేసి ఏఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా దేశంలోనే ఆ ఖ్యాతి దక్కించుకున్న తొలి అంధ విద్యార్థిగా నిలవడం విశేషం. పది మందికి సహాయపడాలని.. చదువుకుంటున్న రోజుల్లోనే తనలాంటి వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. ఈ కోవలోనే తల్లిదండ్రులు.. సోదరుడు నారాయణరెడ్డి, వదిన లీలావతి సహకారంతో నెల్లూరులోని బాలాజీనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొందరు అంధులను చేరదీశాడు. వాళ్లకు చదువు చెప్పిస్తూ బాగోగులు చూసుకున్నాడు. ఇదంతా ఉద్యోగం రాకముందు వచ్చిన ఫెలోషిప్ డబ్బుతోనే సాధించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం వరించడంతో ఆయన చేరదీసిన అంధుల సంఖ్య కూడా పెరిగింది. అలా ఓ అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి సుమారు 40 మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో.. ఉద్యోగం వచ్చే వరకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇంట్లో, బయటా వీడేం చదువుతాడు.. దండగన్న వాళ్లే. ఎంతో కుంగిపోయేవాన్ని. విద్యలో రాణిస్తున్న కొద్దీ నా పట్ల అందరి దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ప్రోత్సాహం లభించింది. జీవితంలో స్థిరపడాలనే దృఢ సంకల్పం నన్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పుడు నేను మరికొందరికి సహాయం చేసే స్థితిలో ఉండడం గర్వంగా ఉంది. అప్పటి కష్టాలను ఈ జీవితం మరిపిస్తోంది. – శివకుమార్రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్, నెల్లూరు రోడ్డు దాటేందుకే గంట.. నేను 2001లో హైదరాబాద్లో డిగ్రీ చదివే రోజుల్లో షాపింగ్కు వెళ్లా. అక్కడ రోడ్డు దాటేందుకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సుమారు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులే.. చదువుతో పాటు చదరంగంలోనూ పట్టు సాధించే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో పర్యటించా. మూడు పర్యాయాలు జాతీయ స్థాయిలో రాణించా. ఆయా రాష్ట్రాల్లో అంధులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉండటాన్ని గమనించా. అయితే మన రాష్ట్రంలో అంధులు అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులుగానే ఉండిపోతున్నారు. .. ఈ రెండు ఘటనలు నాలో కసిపెంచాయి. ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మంచి స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నాలాంటి వాళ్లకు ఉన్నంతలో అండగా నిలవాలనుకున్నా. ఇలాంటి చీకటి జీవితాలకుశివకుమార్ దిక్సూచి ఆయన చలువతోనే.. శివన్న సహకారంతో 9వ తరగతి నుంచి బీకాం వరకు చదువుకున్నా. ఆయనను కలిశాక జీవితంపై నాలో పట్టుదల పెరిగింది. ఆ కసితోనే ఎల్ఐసీలో ఏఓగా(అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) ఉద్యోగం సాధించా. ఇప్పుడు నా జీతం రూ.80వేలు. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇదంతా ఆయన చలువే. – బి.సురేష్, గుడినరవ, ఉదయగిరి మండలం కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో.. నాకు ఐదేళ్ల వయసు నుంచి శివన్నే చదివిస్తున్నారు. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం. మొదటి సంవత్సరంలో 9.3 గ్రేడ్ వచ్చింది. బాగా చదవి అన్నకు మంచి పేరు తీసుకొస్తా. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. – యనమల జీవిత, ముత్యాలపాడు, చిల్లకూరు మండలం భుజం తట్టండి.. చూపు లేకపోవడం మా తప్పు కాదు. అంత మాత్రాన సమాజం మమ్మల్ని చులకనగా చూడటం సరికాదు. ఇలా చేయడం మమ్మల్ని ఎంతగానో కుంగదీస్తుంది. శివన్నలా భుజం తట్టి ప్రోత్సహిస్తే మేము కూడా అద్భుతాలు సృష్టిస్తాం. – ఎస్.తరుణ్, కొణిదెల, కర్నూల్ జిల్లా -
‘నీకు పెళ్లయింది కదా’.. ‘నా భార్య మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’
పంజగుట్ట: ‘నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి తన భార్య త్వరలో చనిపోతుందని నన్ను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు తెలియకుండా ఫొటోలు తీసి వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు’అని బాధిత కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆవేదన చెందింది. శివకుమార్రెడ్డి అకృత్యాలపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏼 ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్ రెడ్డికి అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు 2020లో పరిచయమైంది. పార్టీ కార్యకలాపాల కోసం ఆయన్ను కలిసేందుకు తరచూ సదరు మహిళ రాగా ఆమెపై కన్నేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రేమిస్తున్నానన్నాడు. ‘నీకు పెళ్లయింది కదా’ అని ఆమె ప్రశ్నించగా ‘నా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’అని నమ్మబలికాడు. తనకో తోడు కావాలంటూ ఆమె మెడలో పసుపు తాడు కట్టి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయిందని చెప్పాడు. మాట్లాడుకుందామని పంజగుట్టలోని ఓ హోటల్కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని నెట్లో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇప్పుడు దూరంగా ఉండటమే కాకుండా అనుచరులతో బెదిరింపులకు దిగుతున్నాడని ఆ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏾 వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
బుచ్చిరెడ్డిపాళెం : అడంగల్లో పేరు మార్చేందుకు నాలుగువేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో పట్టుబడిన సంఘటన మండలంలోని రేబాల సాయిబాబాగుడి వద్ద గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ కథనం మేరకు... రేబాలకు చెందిన కోరికల ఆదిలక్ష్మమ్మ తన తల్లి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని తహశీల్దార్కు వినతిపత్రం ద్వారా సంప్రదించింది. ఈ మేరకు విచారణ చేయాల్సిందిగా వీఆర్వో మల్లికార్జునను ఆదేశించారు. దీంతో వీఆర్వో విచారణకు వెళ్లి అడంగల్లో పేరు మార్చేందుకు రూ.4వేలు లంచం అడిగాడు. దీంతో రూ.3వేలు ఇచ్చింది. అయితే మళ్లీ మరో నాలుగువేలు తీసుకురమ్మని అడగడంతో ఆమె ఏసీబీని ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. శుక్రవారం రేబాలలో సత్యసాయిబాబా మందిరం వద్ద ఆదిలక్ష్మమ్మ రూ.4వేలు ఇస్తుండగా తాము రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శివకుమార్రెడ్డి, కృపానందం పాల్గొన్నారు. రెండు సార్లు నగదు అడిగారు మా అమ్మ మరణించిన తరువాత ఆ భూమిని నా పేరుమీదకు మార్చాలని అడిగాను. దీంతో నాలుగువేలు ఇవ్వమన్నాడు. మూడు వేలు ఇచ్చారు. మళ్లీ నాలుగువేలు అడిగాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నాకు స్థోమత లేదన్నా,వినలేదు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఆదిలక్ష్మమ్మ -
అమ్మ, తమ్ముడు చనిపోయారు
బంధువులకు సమాచారమిచ్చిన నాలుగేళ్ల చిన్నారి సాక్షి, తిరుమల: విధి వక్రించింది. అప్పటివరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబం పాలిట విద్యుదాఘాతం శాపంగా పరిణమించింది. ‘‘అమ్మా.. తంబీ ఎరందిటాంగ.. (అమ్మా, తమ్ముడు చనిపోయారు)’’ అంటూ నాలుగేళ్ల చిన్నారి రాజా వెక్కివెక్కి ఏడుస్తూ సెల్ఫోన్లో బంధువులకు చెబుతుంటే తండ్రి వెంకటేష్తో పాటు బంధువులకు కన్నీళ్లాగలేదు. భార్య, బిడ్డ మృతదేహాలను చూసిన కుటుంబ పెద్ద వెంకటేష్ కుప్పకూలిపోయాడు. ‘‘అమ్మ.. తంబీ ఎరందిటాంగ.. (అమ్మ, తమ్ముడు చనిపోయారు)’’ అంటూ సెల్ఫోన్లో నాలుగేళ్ల రాజా బంధువులకు చెబుతుంటే ఏడుస్తున్న తండ్రి వెంకటేష్ తమిళనాడుకు చెందిన తల్లి లక్ష్మి(24), ఏడాది బిడ్డ మహేశ్ సోమవారం తిరుమలలో క్యూ లైన్లో మరణించడం తెలిసిందే. ఇందుకు విద్యుదాఘాతమే కారణమని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలకు మంగళవారం రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. టీటీడీ అంబులెన్స్లో మృతదేహాలను సొంతూరుకు తరలించారు. తక్షణ ఖర్చుల కోసం టీటీడీ అదనపు సీవీఎస్వో శివకుమార్రెడ్డి రూ. 10వేలు ఇచ్చారు. మృతుల కుటుంబానికి టీటీడీ రూ. 8 లక్షల ఎక్స్గ్రేషియా టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించాక మీడియాతో మాట్లాడారు. యాక్సిడెంట్ నిబంధన కింద రూ. 4 లక్షలతో పాటు టీటీడీ వంతుగా మరో రూ. 4 లక్షలు చెల్లిస్తామన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.