breaking news
Sharp
-
షార్ప్ ఇండియా చైర్మన్గా సుజయ్
న్యూఢిల్లీ: జపాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం షార్ప్ తమ భారత విభాగం చైర్మన్గా సుజయ్ కరమ్పురిని నియమించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచి్చందని సంస్థ తెలిపింది. డిస్ప్లే వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తూ భారత్లో షార్ప్ బ్రాండ్ను వృద్ధిలోకి తేవడం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. సొల్యూషన్స్ తయారీ, టెక్నాలజీ బదలాయింపునకు వ్యూహాత్మక భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడం తదితర బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సుజయ్ పలు కీలక హోదాల్లో పని చేశారు. -
నెలకో పార్టీ పెట్టి.. మెదడును సానబెట్టి..
నూతన సంవత్సరం వచ్చింది.. ‘ఇకపై రోజూ వ్యాయామం చేస్తా.. పొద్దున్నే లేచి బుక్స్ పట్టుకుంటా.. సిగరెట్ మానేస్తా.. మందు ముట్టుకోను..’ ఎవరికి వారు పెట్టుకునే ఇలాంటి టార్గెట్లెన్నో.. వీటిని కొద్దిరోజులు గట్టిగానే పాటించి.. ఆ తర్వాత వట్టిగానే వదిలేస్తుండటమూ కామనే. మరి ఇలా కొత్త సంవత్సరం కోసం కొత్త కొత్తగా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే బాగుంటుందని ‘కృత్రిమ మేధ (ఏఐ)’ ప్రోగ్రామ్లను అడిగితే ఏమేం సూచించాయో తెలుసా..? – సాక్షి సెంట్రల్ డెస్క్ కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని? ఇటీవల ఏఐ ప్రోగ్రామ్ల వినియోగం పెరిగిపోయింది. ఫొటోలను, వీడియోలను సృష్టించడం నుంచి కంప్యూటర్ కోడ్లను రాసిపెట్టడం, కెరీర్ సలహాల దాకా ఎన్నో పనులకు ఏఐని వాడేస్తున్నారు. ఈ క్రమంలో డెయిలీమెయిల్ వెబ్సైట్.. గూగుల్కు చెందిన ‘బార్డ్’, మైక్రోసాఫ్ట్ బింగ్కు అనుసంధానం చేసిన ‘చాట్జీపీటీ’, అమెజాన్ సహకారంతో అభివృద్ధి చేసిన ‘క్లాడ్’ఏఐ ప్రోగ్రామ్లను విభిన్నమైన ప్రశ్న అడిగింది. ఈ 2024 సంవత్సరంలో.. విభిన్నమైన లక్ష్యాలను సూచించాలని, అయితే అవి సులువుగా సాధించగలిగేలా ఉండాలని కోరింది. దీనికి ఏఐ ప్రోగ్రామ్లు నిజంగానే వినూత్న ఐడియాలు ఇచ్చాయి. కృత్రిమ మేధ అంటేనే డిజిటల్ ప్రోగ్రామ్లు. అయినా సాంకేతికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలంటూ సూచనలు చేయడం గమనార్హం. నెలకో డిన్నర్ థీమ్ పార్టీ ప్రతినెలా ఓ రోజు విభిన్నమైన థీమ్తో డిన్నర్ పార్టీ చేసుకోవాలని గూగుల్ బార్డ్ సూచించింది. ‘‘పురాతన విందుల నుంచి స్పేస్లో ప్రయాణం దాకా భిన్నమైన థీమ్లు పెట్టుకుని డిన్నర్ పార్టీ చేసుకోండి. ప్రతిసారి సరికొత్త వంటకాలను ప్రయత్నించండి. ఇలాంటి పారీ్టల వల్ల స్నేహం, బంధాలు బలపడతాయి. ఒత్తిళ్లు దూరమవుతాయి..’’అని పేర్కొంది. మీ కుటుంబ మూలాల్లోకి వెళ్లండి ‘‘మీ కుటుంబం మూలాల్లోకి వెళ్లండి. దూరపు బంధువులు, పెద్దలను కలసి కుటుంబ చరిత్రను, పూరీ్వకుల ఘనతను తెలుసుకోండి. ఫ్యామిలీ ట్రీని రూపొందించుకోండి. మీకు ఎన్నో ఉత్కంఠ భరిత అంశాలు తెలియవచ్చు. అంతా సరికొత్తగా ఉంటుంది..’’అని గూగుల్ బార్డ్ సూచించింది. వారానికోసారి చేతి రాతతో లెటర్ రాయండి ప్రతి వారం చేతిరాతతో కూడిన లేఖలు రాసే అలవాటు చేసుకోవాలని క్లాడ్ ఏఐ సూచించింది. ‘‘దూరంగా ఉన్న బంధువులు, స్నేహితులకు ఒకప్పటి తరహాలో చేతి రాతతో లెటర్లు రాయండి. మీ అనుభూతులను, ఆలోచనలను అందులో పంచుకోండి. ఈ అనుభవం ఎంతో బాగుంటుంది’’అని క్లాడ్ పేర్కొంది. ‘డిజిటల్ డిటాక్స్’ మొదలుపెట్టండి కొత్త సంవత్సరం సందర్భంగా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండే (డిజిటల్ డిటాక్స్) తీర్మానం చేసుకోవాలని చాట్జీపీటీ పేర్కొంది. ‘‘వారంలో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటల పాటు ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలాంటి డిజిటల్ పరికరాలు వాడొద్దన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, మెడిటేషన్, ప్రకృతిలో గడపడం వంటివి చేయండి..’’అని సూచించింది. వారానికో రోజు పూర్తి వెజ్.. మీ ఆహార అలవాట్లను నియంత్రించుకుని, వారానికి ఓ రోజు పూర్తిగా శాఖాహారమే తీసుకునేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని ‘చాట్జీపీటీ’సూచించింది. ‘‘వారానికి ఒక రోజు పూర్తిగా వెజ్. అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు, రుచులను ఆస్వాదించండి. ఇది మీకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుతుంది. పర్యావరణానికీ ఎంతో మంచిది..’’అని పేర్కొంది. కొత్త ఏడాది కోసం ‘ఏఐ’ చెప్పిన సరికొత్త లక్ష్యాలు మీకు నచ్చిన అంశంపై రోజుకో వాక్యం ‘‘మీకు నచ్చిన, బాగా ఆసక్తి ఉన్న అంశంపై డైరీ లాంటి ఓ జర్నల్ను మొదలుపెట్టండి. అందులో రోజుకు కనీసం ఒక్క వాక్యాన్ని తప్పనిసరిగా రాస్తూ వెళ్లండి. కొంతకాలానికి ఈ జర్నల్ ఎంతో ఆలోచనాత్మకంగా రూపుదిద్దుకుంటుంది..’’అని చాట్జీపీటీ సూచించింది. చిన్ననాటి భయాన్ని దూరం చేసుకోండి ప్రతి ఒక్కరికీ చిన్ననాటి భయాలు కొన్ని ఉంటాయి. నదులు, సముద్రాల్లోకి దిగడానికి.. రోలర్ కోస్టర్, జెయింట్ వీల్ వంటివి ఎక్కడానికి భయపడుతుంటారు. పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడటానికి మొహమాటపడతారు.. సాలె పురుగులు, బల్లులను చూస్తే దూరంగా పరుగెడతారు. ఇలాంటి వాటిని వదిలించుకునేలా కొత్త సంవత్సరం ప్రయత్నించాలని క్లాడ్ ఏఐ సూచించింది. ఖర్చులకు బడ్జెట్.. పొదుపుపై ఫోకస్ ఈ ఏడాది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని బింగ్–చాట్జీపీటీ పేర్కొంది. ‘‘ప్రతి ఖర్చును నమోదు చేస్తూ బడ్జెట్ రూపొందించుకోండి, కచ్చితంగా డబ్బును పొదుపు చేయండి, జాగ్రత్తపడుతూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి’’అని సూచించింది. మెదడును సానబెట్టండి కొత్త సంవత్సరంలో మీ మెదడుకు పనిచెప్పి, చురుగ్గా ఉండేలా ప్రయత్నించాలని గూగుల్ బార్డ్ సూచించింది. ఏదైనా ఒక తేదీ చెప్తే.. అది ఏ వారమో చెప్పగలిగేలా ప్రయత్నం చేయాలని.. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది. -
కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ!
కలపను కట్ చేసే కత్తులను చూసి ఉంటారు.. కానీ, కత్తినే కట్ చేసే కలపకత్తిని చూశారా? కూరగాయలు, పండ్లతోపాటు మాంసం ముక్కలను కూడా ఈజీగా కట్ చేయగలదు ఈ కత్తి. సాధారణ లోహపు కత్తి కంటే ఇది 23 రెట్లు బలమైనది, మూడు రెట్లు పదునైనది. కూరగాయలు కట్ చేసే కత్తుల్లో ఎక్కువగా స్టీల్, ఇనుము వంటి లోహాలనే ఎందుకు వాడటం.. విరివిగా దొరికే కలపను ఎందుకు ఉపయోగించ కూడదు అని ఓ విద్యార్థికి వచ్చిన అద్భుతమైన ఆలోచనే ఈ రూపకల్పనకు దారితీసింది. ఇందుకు అమెరికాలోని మేరిల్యాండ్ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా సహాయం చేయడంతో చక్కటి ఈ కలపకత్తి తయారైంది. సాధారణ కత్తిలాగే.. సెల్యులోజ్, ఇతర రసాయనాలను ఓ ప్రత్యేకమైన కలపతో చేర్చి, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ టెంగ్ లీ తెలిపారు. ఏదిఏమైనా.. కలపకత్తి ‘కత్తి’లా ఉంది కదూ! చదవండి: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..! -
రోహిత్తో జతకట్టిన జపాన్ నెం.1 బ్రాండ్
దేశీయ టీవీ మార్కెట్లో మరో దిగ్గజ కంపెనీ ప్రవేశించబోతుంది. జపాన్కు చెందిన నెంబర్ 1 బ్రాండ్ ‘షార్ప్ టీవీ’ భారత్లో గ్రాండ్ లాంచ్కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారత ఓపెనర్ రోహిత్ శర్మతో ఆ బ్రాండ్ అసోసియేట్ అయింది. భారత్లో క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని, రోహిత్ శర్మను తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. రోహిత్ శర్మతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా గర్వంగా ఉందని, భారత క్రికెట్ టీమ్లో ఆయన టాప్ ప్లేయర్ అని, స్థిరంగా తన ప్రతిభను కనబరుస్తాడని పేర్కొంది. రోహిత్ భాగస్వామ్యం, భారత్లో తమ బ్రాండ్ను గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ఎంతో సహకరిస్తుందని షార్ప్ టీవీ ఇండియా సేల్స్ డైరెక్ట్రర్ జేమ్స్ యాంగ్ చెప్పారు. రోహిత్కు ఎక్కువ సంఖ్యలో అభిమానులున్నారన్నారు. ఆక్వాస్ ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేస్తూ.. ఈ కంపెనీ భారత టీవీ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. షార్ప్తో భాగస్వామ్యంపై మాట్లాడిన రోహిత్.. షార్ప్ లాంటి బ్రాండులతో భాగస్వామ్యం అవడం ఎంతో ఆనందదాయమని, టెక్ ఔత్సాహికుడిగా.. బ్రాండ్ను తాను ప్రేమిస్తున్నానని చెప్పారు. తాను చూసే ఏ కంటెంటైనా స్పోర్ట్స్ లేదా మూవీలు ఇలా వేటినైనాన షార్ప్లో చూడటమే బెస్ట్ అని తనకు తెలుసన్నారు. -
'షార్ప్' తొలి ఆండ్రాయిడ్ వన్ ఇదేనట..
జపనీస్ కంపెనీ షార్ప్ తన మొదటి ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. అక్వోస్ 507ఎస్ హెచ్ పేరుతో ఈ ఫోన్ ను, తన దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. షార్ప్ విడుదల చేసిన ఈ ఫోన్, గూగుల్ సహకారంతో రూపొందిన మొదటి జపాన్ ఆండ్రాయిడ్ వన్. అయితే ఈ ఫోన్ ధరలను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. ఈ నెల నుంచి జపాన్ లో ఈ ఫోన్ అమ్మకాలు నిర్వనించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్ అప్ డేట్స్ కోసం 18 నెలల గ్యారెంటీతో షార్ప్ అక్వోస్ 507ఎస్ హెచ్ వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. అక్వోస్ 507ఎస్ హెచ్ ఫీచర్లు... 5 అంగుళాల హెచ్ డీ ఐజీజడ్వో ఎల్ సీడీ 2.5డీ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4(వెనుక, ముందు ప్యానెల్స్ కి) ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 200 జీబీ విస్తరణ మెమరీ 3010 ఎంఏహెచ్ బ్యాటరీ 13 ఎంపీ వెనుక కెమెరా 5 ఎంపీ ముందు కెమెరా 135 గ్రాముల బరువు వాటర్, డస్ట్ రెసిస్టెంట్