breaking news
sharikh Khan
-
షారుక్ఖాన్ శిష్యుడు
గురువులకు శిష్యులు దొరకడం విశేషం కాదు. శిష్యులకు గురువు దొరకడమే విశేషం. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ చూసి చిన్నప్పుడు హీరో కావాలనుకున్నాడు సుశాంత్. షారుక్లా ఢిల్లీలో చదువుకున్నాడు. షారుక్లా థియేటర్ చేశాడు. షారుక్లా టీవీల్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి షారూక్లా హీరో అయ్యాడు. సినిమాలు కుర్రాళ్లను పాడు చేస్తాయని కొందరు అనొచ్చు. సినిమాలు సుశాంత్ సింగ్ రాజ్పుత్లను కూడా ఇస్తాయి. మహేంద్ర సింగ్ ధోని బయో పిక్ తీయాలి. కుర్రాడు చాకులా ఉండాలి. తెర మీద బ్యాట్ పట్టుకుని నిలుచుంటే ఖడ్గం పట్టుకున్న వీరుడిలా ఉండాలి. చూపు నిశితంగా ఉండాలి. దృష్టి లగ్నమై ఉండాలి. అతడు అచ్చు క్రీడాకారుడిలా ఉండాలి. అదే సమయంలో అందరికీ నచ్చే హీరోలా కూడా ఉండాలి. ఇన్ని అర్హతలు ఉన్నవాడు ఎవరు? అని వెతికితే వచ్చిన పేరు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని తేలింది. ‘నాకు ఇంకో అర్హత కూడా ఉంది’ అన్నాడు సుశాంత్. ‘ఏమిటది?’ అని అడిగితే ‘ధోని బిహారి. నేనూ బిహారి. మాది పాట్న’ అని జవాబు. ఒక ప్రాంతపు ఆత్మ ఆ ప్రాంతం వాడికే తెలుస్తుంది అన్నట్టుగా సుశాంత్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఆ హిట్ ఊరికే వచ్చి చేతుల్లో పడింది మాత్రం కాదు. తల్లి మరణం జీవితం ఒక దెబ్బ కొట్టడానికి ఎంచుకునే క్షణాలు అనూహ్యంగా ఉంటాయి. సుశాంత్ జూనియర్ ఇంటర్లో ఉండగా తల్లి చనిపోయింది. తండ్రి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు మంది సంతానం. మొదటి నలుగురు ఆడపిల్లలు. చివర పుట్టింది సుశాంత్. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కనుక సహజంగానే అమ్మ ముద్దునంతా ప్రేమనంతా పొందుతూ పెరిగాడు. తల్లిదండ్రులు ఐదుమందినీ సమానంగా పెంచారు. సుశాంత్ అక్క నీతు సింగ్ స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్గా ఎదిగింది. ఒక అక్క క్రిమినల్ లాయర్. సుశాంత్ కూడా ఏదైనా ప్రత్యేకమైనది సాధిస్తాడని తల్లి అనుకునేది. ఆమె ఆశించినట్టే సుశాంత్ చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్కి డాన్సులు చేయడం, సినిమా యాక్టర్లని ముఖ్యంగా షారుక్ఖాన్ని ఇమిటేట్ చేయడం చేసేవాడు. తాను భవిష్యత్తులో ఏం చేసినా తల్లి గర్వపడేలా చేస్తానని అనుకునేవాడు. అటువంటిది ఆమె మరణం అతనికి, కుటుంబానికి పెనుఘాతంలా మారింది. ఎంతగా అంటే ఆమె జ్ఞాపకాలు ఉన్న పాట్నా నగరాన్నే వాళ్లు విడిచిపెట్టి వెంటనే ఢిల్లీకి మారిపోయారు. సుశాంత్ సీనియర్ ఇంటర్ ఢిల్లీలో చదివాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో 7వ ర్యాంక్ సాధించి ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అన్నీ సరిగ్గా జరిగి ఉంటే అతడిప్పుడు ఏ అమెరికాలోనో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మిగిలి ఉండేవాడు. కాని విధి కొందరి నుదుటన లిఖించేది వేరు. డాన్స్ సుశాంత్ డాన్స్ సుశాంత్కు చిన్నప్పటి నుంచి డాన్స్ పిచ్చి. ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతూనే కొరియోగ్రాఫర్ షమిత్ దగ్గర డాన్స్ క్లాసులకు చేరాడు. చాలా వెంటనే డాన్స్ నేర్చుకున్నాడు. 2006లో ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో గ్రూప్ డాన్సర్లలో ఒకడిగా డాన్స్ చేశాడు. చాలా షోస్లో పాల్గొన్నాడు. షమిత్ ఇతణ్ణి గమనించి నీలో ఏదో టాలెంట్ ఉంది యాక్టింగ్లో ట్రయ్ చెయ్ అని చెప్పాడు. వెంటనే సుశాంత్ ఢిల్లీలో యాక్టింగ్ నేర్పించే బేరీ జోన్స్ దగ్గర యాక్టింగ్ క్లాసుల్లో చేరాడు. మెల్లగా ఇదే తన చోటని అతనికి అర్థమైపోయింది. థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉండగా తండ్రికి చెప్పేశాడు– నాన్నా ఇంక చదవను.. ముంబై వెళ్లిపోతాను అని. తండ్రి ఎస్ చెప్పలేదు. అలాగని నో కూడా చెప్పలేదు. సుశాంత్ ముంబై చేరుకున్నాడు. కొనసాగిన భిక్షాటన విద్యను అర్థించాలి. గురువు నుంచి భిక్షలా పొందాలి. సుశాంత్ ముంబై చేరగానే స్టుడియోల చుట్టూ తిరక్కుండా మళ్లీ అక్కడి థియేటర్ గ్రూప్ అయిన ‘ఏక్జుటా’లో చేరాడు. ఒకటిన్నర సంవత్సరం నాటకాలు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు అతడు టీవీవాళ్ల దృష్టిలో పడ్డాడు. అది కూడా బాలాజీ టెలిఫిల్మ్స్ వారి దృష్టిలో. తన హీరో షారుక్ ఖాన్లానే సుశాంత్ కూడా మొదట టీవీ హీరో అయ్యాడు. అతడు నటించిన ‘పవిత్ర రిష్టా’ పెద్ద హిట్. 300 ఎపిసోడ్స్లో నటించి ఇంటింటి హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండు డాన్స్ షోలలో పాల్గొన్నాడు. కాని ఆ అనుభవమంతా కెమెరాను అర్థం చేసుకోవడానికి అతనికి పనికొచ్చింది. ఒక్కసారి అది తెలిసిపోయాక ఇక అక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేదని గ్రహించి సినిమాల వైపు దృష్టి పెట్టాడు. అలా అతడికి వచ్చిన తొలి సినిమా ‘కాయ్ పొ చె’. భిన్నమైన ఎంపిక సుశాంత్ చేసిన భిన్నమైన ఆలోచన ఏమిటంటే ఆడే పాడే కమర్షియల్ హీరోలాగా కనిపించాలని అనుకోకపోవడం. అందుకే అతడు ‘కాయ్ పొ చె’లో అతడొక పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. క్రికెట్ రంగంలో రాజకీయాల వల్ల బలైన ఒక బ్యాట్స్మెన్లా అతడి నటన అందరికీ నచ్చింది. ఆ వెంటనే యువత ఒక ప్రయోగంగా చూస్తున్న లివ్ఇన్ రిలేషన్ను చర్చించే ‘సుద్ధ దేశీ రొమాన్స్’లో హీరోగా నటించాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. అప్పుడు అతనికి రాజ్ కుమార్ హిరాణి రూపంలో జాక్పాట్ తగిలింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ‘పికె’లో ముఖ్యపాత్రకు అంటే అనుష్కకు ప్రియుడిగా నటించాడు. ఆ సినిమా అతడి ప్రెజెన్స్ను బాలీవుడ్లో స్థిరపరిచింది. మిస్టర్ ధోని విజయం అతడికి పదేళ్ల కెరీర్ ఇచ్చింది. ఫ్లాపుల తర్వాత సుశాంత్ నటించిన ‘రాబ్తా’, ‘కేదార్నాథ్’, ‘సోంచరియా’ సరిగ్గా ఆడలేదు. కాని అతడు ధైర్యం చేసి ముసలిపాత్రలో కనిపించడానికి సిద్ధపడి నటించిన తాజా చిత్రం ‘చిచోరే’ సూపర్హిట్ అయ్యింది. వంద కోట్లు వసూలు చేసింది. అందులో అతడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన కుమారుడికి తాను జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడో చెప్పి ధైర్యం నింపుతాడు. అది ప్రేక్షకులకు నచ్చింది. సుశాంత్ సోలో హీరోగా నటించిన రెండు సినిమాలు ‘డ్రైవ్’, ‘దిల్ బేచారా’ 2020లో ప్రేక్షకులను పలకరించనున్నాయి. సుశాంత్ మితభాషి. ప్రొఫెషనల్ యాక్టర్. తన పని తాను చూసుకొనే స్వభావం ఉన్నవాడు. టీవీలో తనతో కలిసి నటించిన అంకితా లోఖండేతో ఆరేళ్లు సహజీవనం చేశాడు. అయితే వారు విడిపోయారు. బాలీవుడ్ యువసైన్యంలో సుశాంత్ ఒక ముఖ్యమైన యోధుడుగా ఉన్నాడు. ఇతడు మరిన్ని జైత్రయాత్రలు తప్పక చేస్తాడు. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
మిసెస్ షారుక్!
రిజల్ట్ గురించి పక్కన పెడితే ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో ఒకే ఫ్రేమ్లో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ను చూసి ఫుల్ ఖుషీ అయ్యారు సినీ ప్రియులు. ఇప్పుడు అమితాబ్, షారుక్ ఖాన్ కలిసి నటించనున్నారని బాలీవుడ్ టాక్. ‘పింక్’ మూవీ తర్వాత అమితాబ్ బచ్చన్, తాప్సీ కలిసి ‘బద్లా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజోయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారట షారుక్. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తాప్సీ భర్త పాత్రలో షారుక్ కనిపిస్తారట. షారుక్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర నిడివి పెంచారట ‘బద్లా’ టీమ్. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘జీరో’ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు షారుక్. ఈ నెల 21న ‘జీరో’ చిత్రం విడుదలైన తర్వాత ‘బద్లా’ షూటింగ్లో షారుక్ పాల్గొంటారట. ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ అనే స్పానిష్ చిత్రానికి రీమేక్ అయిన ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
జీరో ప్రమోషన్స్
...అని చదవగానే షారుక్ ఖాన్ ‘జీరో’ సినిమాకు అసలు ప్రమోషన్స్ లేవా? అని డిసైడ్ అయిపోకండి. ప్రమోషన్స్ విషయంలో షారుక్కు చాలా ప్లాన్స్ ఉన్నాయట. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో షారుక్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ నటిస్తున్న చిత్రం ‘జీరో’. ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కానుంది. జనరల్గా విడుదలకు పది పదిహేను రోజుల ముందు ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ షారుక్ మాత్రం ముందే మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటినుంచి డిసెంబర్ వరకూ వచ్చే ప్రతి పండగకు ‘జీరో’ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విశేషాన్ని మనం చూడొచ్చట. ఈ చిత్రంలో అనుష్కా శర్మ కథానాయిక. ఇది కాకుండా ఆమె కథానాయికగా నటించిన ‘పరీ’ హోలీకు విడుదల కానుంది. సో అప్పటికి ఆమె లుక్ రివీల్ చేయడంతో ‘జీరో’ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారట. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ ఈ రంజాన్కు రానుంది. ఎలాగూ సల్మాన్ ఖాన్ ‘జీరో’లో ఓ పాటలో తళుక్కున మెరిశారు కాబట్టి, రంజాన్కు ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ను ‘రేస్ 3’తో పాటుగా రిలీజ్ చేస్తారట. ఫైనల్గా 3 నిమిషాల నిడివి గల అఫీషియల్ ట్రైలర్ను దీపావళికి రాబోతున్న ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’తో జతపరచాలని భావిస్తున్నారట ‘జీరో‘ బృందం. ‘జీరో’ ఒక సెలబ్రేషన్లా ఉండాలని భావించారట షారుక్. అందుకని ఇలా ప్రతి పండగకు సినిమాకు సంబంధించిన ఏదో ఒక స్పెషల్ను రివీల్ చేయలనుకుంటున్నారని చిత్రబృందం అంటోంది. ఇంతకీ ఈ ‘జీరో’ షారుక్కి ఎందుకంత స్పెషల్ అంటే.. ఇందులో ఆయన చేస్తున్న క్యారెక్టర్ కూడా స్పెషలే. మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యేవరకూ షారుక్ వేరే సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యారట. -
ఫ్యాన్ కథపై ముదురుతున్న వివాదం
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ఫ్యాన్. షారూఖ్, స్టార్ హీరోగా, అతని వీరాభిమానిగా రెండు విభిన్న పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కథపై వివాదం రేగుతోంది. అభినేత అనే తన కథను ఫ్యాన్ సినిమాగా రూపొందించారంటూ చాలా రోజుల క్రితమే ఆరోపించారు తమిళ నిర్మాత మహేష్ థోయ్. ఆ కథను తమిళ రైటర్స్ అసోసియేషన్లో 1997లోనే రిజిస్టర్ చేసినట్టుగా చెపుతున్నారు. ఇప్పుడు అదే కథను తన అనుమతి లేకుండా షారూఖ్, మనీష్ శర్మలు ఫ్యాన్ సినిమాగా తెరకెక్కించారని. ఇందుకు గాను తనకు 25 కోట్లు చెల్లించాలంటూ కేసు వేశారు. అయితే మనీష్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ఫ్యాన్, తను షారూఖ్ కోసం స్వయంగా తయారు చేసిన కథ అని చెపుతున్నారు. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటి వివాదాలు కనిపించేవి ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇదే తరహా వివాదం రావటంతో ఫ్యాన్ సినిమా రిలీజ్పై సందిగ్థత ఏర్పాడింది.