-
ఇంజెక్షన్ వికటించి ఆరేళ్ల బాలుడు మృతి
ధర్పల్లి: ఇంజెక్షన్ వికటించి గురువారం ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ పరిధిలోని మరియాతండాకు చెందిన బదావత్ వర్ష్య, వనితల కుమారుడు అశోక్ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం గురువారం రాత్రి ధర్పల్లిలోని ఆర్ఎంపీ రజాక్ వద్దకు తీసుకొచ్చారు. ఆయన బాలుడికి జెంటామైసిన్ 40 ఎంజీ ఇంజెక్షన్ ఇచ్చారు. వారు ఇంటికి వెళ్లిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన చోట గడ్డ కట్టినట్లు గుర్తించారు. అక్కడి నుంచి నీరు కారుతుండడంతో మళ్లీ సదరు ఆర్ఎంపీ వద్దకే తీసుకొచ్చారు. అతను మందు ఇచ్చినా.. మరింత ఎక్కువ కావడంతో బాలుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. జిల్లా కేంద్రంలోని వైద్యుడు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్కు రిఫర్ చేశారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలివెళ్లుతుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. కాగా, బాలుడి మృతికి ఆర్ఎంపీ కారణమని ఆరోపిస్తూ మరియాతండావాసులు పెద్ద ఎత్తున ఆర్ఎంపీ ఇంటి వద్ద ఆందోళన చేశారు. -
మంచంపట్టిన పల్లెలు!
►జ్వరం, కీళ్ల నొప్పులతో ఆస్పత్రుల బాటపడుతున్న రోగులు ►సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు రాయికోడ్: నెల రోజుల నుంచి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచం పడుతున్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరికి తగ్గకముందే మరొకరు జ్వరం, కీళ్ల నొప్పులతో మంచాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఇం దూర్, కర్చల్, ఇటికేపల్లి, రాయికోడ్, పీపడ్పల్లి, రామోజిపల్లి, జమ్గి తదితర గ్రామాల్లో రోగాల భయంతో జనం బెం బెలెత్తుతున్నారు. అయితే నెల రోజులుగా జ్వరం, కీళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయో, అసలు ఏ రోగం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారో వై ద్యాధికారులు ఇప్పటివరకు నిర్ధారించ లేకపోయారు. స్థానిక ల్యాబ్లో మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేపట్టి వైద్యులు చేతులు దులుపుకున్నారు. ఇటికేపల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం రోగుల రక్త నమూనాలను హైదరాబాద్కు పంపిం చారు. ఆయా గ్రామాల్లో విజృంభిస్తున్న జ్వరం, కీళ్ల నొప్పులతో పేద రోగులు రాయికోడ్ పీహెచ్సీకి పరుగులు పెడుతున్నారు. అయితే డాక్టరు లేకపో వడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని డాక్టర్ షా మిలి ఇన్చార్జ్గా విధులు నిర్వహి స్తున్నారు. అయితే డాక్టర్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో తెలియని దుస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి పరీక్షలు చేయకుండా తోచిన మందులిచ్చి పంపుతున్నారని మండిపడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటి సరఫరా కాదని, పంచాయితీ అధికారులు, వ్యాధి నిర్ధారణ కాలేదని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతు న్నారు. దీంతో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండటంతో జ్వరం, కీళ్ల నొప్పులెందుకు వస్తున్నాయో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రజల అవసరాన్ని, ప్రభుత్వ వైద్య శాఖ నిర్లక్ష్యాన్ని మండలంలోని పలువురు ప్రైవేటు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రోగాన్ని నిర్ధారించకుండానే వివిధ రకాల మందులను రాసి, రూ.వందల్లో వసూలు చేస్తు నిరుపేదల జేబులను ఖాళీ చేస్తున్నారు. వారి వైద్యం వల్ల తాత్కాలికంగా జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గుతున్నా సంపూర్ణంగా కోలుకోవడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
- రుణమాఫీపై నేడు నిర్ణయం
- ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- వివాదాస్పదులైతే పక్కకే..
- Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
Advertisement