breaking news
servers not working
-
న్యూయార్క్ సెల్ నెట్వర్క్పై కుట్ర
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం ప్రపంచదేశాల అగ్రనేతలు న్యూయార్క్ నగరానికి విచ్చేసిన వేళ ఐరాస ప్రధాన కార్యాలయం చుట్టుపక్కల సెల్ నెట్వర్క్ను స్తంభింపజేసేందుకు చేసిన కుట్రను నగర పోలీసులు విజయవంతంగా భగ్నంచేశారు. న్యూయార్క్ నగరవ్యాప్తంగా సెల్ఫోన్ టవర్ల కార్యకలాపాలను స్తంభింపజేసి, ఎమర్జెన్సీ ‘911’ నంబర్ సైతం పనిచేయకుండా చేయగలిగేంతటి భారీ అక్రమ ఎలక్ట్రానిక్ ఉపకరణాల నెట్వర్క్ గుట్టును నగర పోలీసులు రట్టుచేశారు. 300కుపైగా కో–లొకేటెడ్ సిమ్ సర్వర్లు, ఏకంగా 1,00,000 సిమ్ కార్డులను స్వాధీనంచేసుకున్నారు. ఇవన్నీ ఐరాస ప్రధానకా ర్యాలయ భవనానికి చుట్టూతా 35 మైళ్లదూరంలో ఉండటం గమనార్హం. ఐరాస సమావేశాల కోసం ప్రధానకార్యాలయానికి విచ్చేసిన ప్రపంచనేతలను ఒకేసారి భయపెట్టి, బెదిరించే ఎత్తుగడలో భాగంగా ఆగంతకులు ఈ సెల్ నెట్వర్క్ను ఏర్పాటుచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మన టెలీకమ్యూనికేషన్ వ్యవస్థను సవాల్ విసిరేలా ఈ సెల్ నెట్వర్క్ను ఆగంతకులు సిద్ధంచేశారని అమెరికా నిఘా విభా గమైన సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కర్రన్ వెల్లడించారు. నిమిషానికి 3 కోట్ల టెక్స్ మెసేజ్లు..ఈ భారీ అక్రమ నెట్వర్క్ సామర్థ్యం చాలా పెద్దది. నిమిషానికి ఏకంగా 3 కోట్ల టెక్సŠట్ మెసేజ్లను దీని ద్వారా పంపొచ్చు. ఇంతటి భారీ స్థాయిలో నెట్వర్క్ రద్దీతో వ్యవస్థ హఠాత్తుగా క్రాష్ అవుతుంది. దీంతో సెల్ఫోన్ టవర్లు సామర్థ్యానికి మించి మెసేజ్ల రాకపోకలను తట్టుకోలేక చేతులెత్తేస్తాయి. అప్పుడు ఏమౌతుందో ఊహించుకోండి. సెల్ నెట్వర్క్ నిలిచిపోతుంది. కనీసం మీ సెల్ఫోన్ను ఉపయోగించలేరు. ఐరాస సర్వసభ్య సమావేశాల మీదా దీని ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. యావత్ నగరంలో సెల్ ప్రపంచం ఆగిపోతుంది. ఇది మొత్తం గందరగోళానికి, ఒక కొత్త భయభ్రాంతులకు దారితీస్తుంది’’ అని సీక్రెట్ సర్వీస్ న్యూయార్క్ ఫీల్డ్ ఆఫీస్లో స్పెషల్ ఏజెంట్ మ్యాట్ మెక్కూల్ వివరించారు. ‘‘ దీని విస్తృతి, తీవ్ర ప్రభావం, లొకేషన్పై మాకు సరైన సమయానికి ఉప్పందింది. దాంతో వెంటనే పలు చోట్ల ఆకస్మిక దాడులు చేసి వందల కొద్దీ ఉపకరణాలను షట్డౌన్ చేశాం’’ అని ఆయన వెల్లడించారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ ఉన్నతాధికారులపై టెలికమ్యూనికేషన్స్ ద్వారా బెదిరింపులు ఎక్కువవడంతో ఈ తరహా నేరాలపై నిఘాను పెంచారు. దీంతో తాజాగా ఈ సెల్ టవర్ నెట్వర్క్ రాకెట్ బయటపడింది. ఇప్పటికే 1,00,000 సిమ్కార్డులను క్రియాశీలంచేశారని, మరి కొన్నింటినీ యాక్టివేషన్ కోసం ఆగంతకులు సిద్ధంచేశారని పోలీసులు పేర్కొన్నారు.కుట్ర కారకులు ఎవరు?కుట్రదారులు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. నేర ముఠాలు, డ్రగ్ కార్టెల్స్ ముఠాలు, ఉగ్రసంస్థలను పెంచి పోషించే దేశాలకు ఈ సెల్ నెట్వర్క్తో సంబంధం ఉండి ఉంటుందని న్యూయార్క్ పోలీసులు భావిస్తున్నారు. ఇంతటి భారీ నెట్వర్క్ను నెలకొల్పాలంటే ఈ రంగంలో నిష్ణాతులైన వాళ్లకు సాధ్యం. అందుకే ఆ కోణంలోనూ దర్యాప్తు మొదలెట్టామని పోలీసులు తెలిపారు. కుట్రదారులు ఎవరనేది కనిపెట్టడం ఇప్పుడే కష్టమని, దీనికి చాలా సమయం పడు తుందని అంచనావేశారు. ‘‘మేం దీని కోసం భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కనీసం 1,00,000 సెల్ఫోన్లను ఫోరెన్సిక్ బృందంతో తనిఖీచేయించి వాటిల్లోని సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉంది. ఈ సెల్ఫోన్ల నుంచి వెళ్లిన టెక్సŠట్ మెసేజ్లు, ఫోన్ సంభాషణలు అన్నింటినీ చెక్ చేయాలి. చివరకు ఏ పెద్ద తలకాయ బయటపడుతుందో చూడాలి మరి’’ అని స్పెషల్ ఏజెంట్ మ్యాట్ మెక్కూల్ అన్నారు. ‘‘ ఖరీదైన ఇలాంటి పరికరాలను ఇన్నేసి చొప్పున అమర్చా లంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ నైపుణ్యం చిన్న దేశాలకు అస్సలు ఉండదు. రష్యా, చైనా, ఇజ్రా యెల్ లాంటి సాంకేతికతో రాటుదేలిన దేశాలకే ఇది సాధ్యం’’ అని సెంటర్ ఫర్ యురోపియన్ పాలసీ అనాలసిస్ సంస్థలో సీనియర్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేమ్స్ ఎ.లేవిస్ వ్యాఖ్యానించారు. -
'భయో'మెట్రిక్
- సక్రమంగా పని చేయని సర్వుర్లు - డీబీటీ ద్వారా ఎరువుల పంపిణీకి అవస్థలు - కొత్తపద్ధతి తప్పనిసరి అంటున్న వ్యవసాయశాఖ - ఆందోళనలో వ్యవసాయశాఖ సిబ్బంది ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికార్యక్రమానికీ ‘యాప్’ అంటూ ప్రభుత్వశాఖల్లో వందల కొద్దీ అందుబాటులోకి తెచ్చారు. కానీ అందుకు తగ్గట్టు సాంకేతిక పరిజ్ఞానం కల్పించక, సామర్థ్యం పెంచకపోవడంతో పథకాలు సక్రమంగా అమలుకాలేదు. తరచూ సర్వర్లు సతాయిస్తున్నాయి. స్వైపింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. ఎరువుల పంపిణీలో డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం అమలులోకి తేవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక ఎరువుల పంపిణీకి ఆటంకంగా మారింది. మరోవైపు వ్యవసాయాధికారులు తప్పనిసరిగా డీబీటీ విధానం పాటించాలని ఒత్తిడి చేస్తుండడంతో దుకాణదారులు దిక్కులు చూస్తున్నారు. - అనంతపురం అగ్రికల్చర్ జిల్లాలో విత్తన, పురుగుముందులు, ఎరువుల దుకాణాలు : 890 ఎరువులు లైసెన్సు కలిగినవి : 680 కావాల్సిన బయోమెట్రిక్, స్వైపింగ్ మిషన్లు : 680 వ్యవసాయశాఖ పంపిణీ చేసింది : 301 సక్రమంగా పనిచేస్తున్నవి : 60 జిల్లాకు ఈ ఖరీఫ్లో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు కేటాయించారు. ప్రస్తుతానికి జిల్లా అంతటా 43 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా లైసెన్సులు కలిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి ఎరువుల పంపిణీకి డీబీటీ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం ఎరువులు లైసెన్సులు కలిగిన దుకాణాలు 680 వరకు ఉన్నాయి. అందరికీ బయోమెట్రిక్, స్వైపింగ్ మిషన్లు ఇవ్వాల్సిన వ్యవసాయశాఖ కేవలం 301 మందికి మాత్రమే ఇచ్చి జిల్లా అంతటా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఇచ్చిన 301 మిషన్లు పనిచేస్తున్నాయా అంటే అదీ లేదు. అందులో పని చేస్తున్నవి 60కి మించి లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 680 షాపులకు గానూ 60 షాపుల్లో డీబీటీ విధానం అమలు చేస్తున్నా అక్కడ కూడా సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో చాలా మంది వాటిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. సర్వర్లు, సాంకేతిక పరిజ్ఞానం సమస్యలు చెప్పకుండా ఎలాగోలా పనిచేసేలా చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు దుకాణదారులు వాపోతున్నారు. ఆధార్ అనుసంధానం లేకుండా ఎరువులు పంపిణీ చేయొద్దని ఆదేశాలు ఉండటంతో చాలా మంది రైతులకు సకాలంలో ఎరువులు అందే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఎరువులకు అంతగా గిరాకీ లేనందున సమస్య పెద్దగా కనిపించని పరిస్థితి. జేడీఏ కార్యాలయ అధికారులేమంటున్నారంటే... త్వరలోనే అందరికీ బయోమెట్రిక్ పరికరాలు అందజేస్తామని, 4–జీ సామర్థ్యం కలిగిన సిమ్, స్వైపింగ్ మిషన్లు అందుబాటులో పెట్టాలని ఆదేశించాం. ఇంకా పూర్తి స్థాయిలో డీబీటీ విధానం అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని బదులిచ్చారు.