-
అత్త ముక్కు కొరికిన కోడలు
సాక్షి, మానవపాడు (అలంపూర్): గతంలో కోడలిని అత్త కొట్టిన సంఘటనలు చూశాం.. ఇప్పుడు అత్త ముక్కును కోడలు కొరి కింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని శారదమ్మ, జయ్యన్న దంపతు లకు ప్రసాద్, భాస్కర్, శేఖర్ సంతానం. పెద్ద కొడుకు ప్రసాద్ కర్నూలులోని అత్తగారి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమ వారం ఉదయం మరోసారి గొడవ పడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు.. ముక్కుకు ఏడు కుట్లు వేశారు. చదవండి: (ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నా..) -
ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
కెలమంగలం : పెళ్లయిన ఆరు నెలలకే భార్య ప్రియునితో కలిసి భర్తను గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘటన డెంకణీకోట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని అళేనత్తం గ్రామానికి చెందిన సోమశేఖర్(27)కు అదే ప్రాంతానికి చెందిన శారదమ్మ(22)తో ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. సోమశేఖర్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుండేవాడు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసింది. బంధువులు సోమశేఖర్ మృతదేహాన్ని పరిశీలించి మృతిలో సందేహం ఉన్నట్లు డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సోమశేఖర్ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షలో సోమశేఖర్ను దుప్పటితో గొంతునులిమి హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో సోమశేఖర్ భార్య శారదమ్మపై అనుమానం ఏర్పడిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తీవ్ర విచారణ చేపట్టారు. శారదమ్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సోమశేఖర్ తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో అతని మిత్రుడైన అదే గ్రామానికి చెందిన బేటరాయన్తో తనకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, సోమశేఖర్ ఇంట్లో లేని సమయంలో బేటరాయన్తో ఉల్లాస జీవితం కొనసాగించినట్లు, ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో గ్రామస్థులు తన భర్త సోమశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సోమశేఖర్ తనను తీవ్రంగా నిలదీశారు. దీంతో ప్రియుడు బేటరాయన్తో కలిసి సోమశేఖర్ను హత్య చేసేందుకు పథకం పన్నాను. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బేటరాయన్, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అప్పయ్యతో కలిసి సోమశేఖర్ను శారదమ్మ చుడీధార్ దుప్పటితో గొంతునులిమి హత్య చేశామని, ఈ సమయంలో బేటరాయన్ తనతో ఎవరైనా అడిగితే స్పృహకోల్పోయి మృతి చెందాడని చెప్పమని తెలిపి అక్కడి నుండి వెళ్లిపోయారని శారదమ్మ పోలీసులకు వివరించింది. శారదమ్మను పోలీసులు అరెస్టు చేసి పరారీలో ఉన్న బేటరాయన్, అప్పయ్యలను గాలించి పట్టుకొన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. -
రోడ్డుపైనే గిరిజన మహిళ ప్రసవం
కాన్పు కోసం వెళ్తే నీళ్లులేవని వెనక్కి పంపిన ఆస్పత్రి సిబ్బంది ► మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట పీహెచ్సీలో ఘటన నవాబుపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు సురక్షి తం, సుఖవంతం.. ఇదీ ప్రభుత్వం, అధికారులు పదేపదే చెబుతున్న మాట. కానీ ఆస్పత్రిలో నీళ్లు లేవని కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణిని వెనక్కి పం పించారు సిబ్బంది. పురిటినొప్పులతో బాధపడు తున్న ఆమె నడిరోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆదివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని నాగమ్మగడ్డ తండాకు చెందిన శారదమ్మ మూడో కాన్పు కోసం భర్త పున్యానాయక్, పక్కింటి మహిళ మల్లమ్మతో కలసి ఆదివారం రాత్రి నవాబుపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఆటో లో వచ్చింది. ప్రసవం చేయాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. ‘ఇక్కడ నీళ్లు లేవు.. మరో ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చి పంపించేశారు. దీంతో వారు స్థానిక బస్టాండ్ ప్రాంగణానికి చేరుకున్నారు. స్థానికు లు ఆమె ఇబ్బందిని గమనించి ‘108’ అంబులెన్స్ వాహనానికి సమాచారం ఇచ్చారు. నొప్పులు మరీ అధికమవడంతో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ తదితరు లు చీరను అడ్డుపెట్టగా కాన్పు చేశారు. శారదమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సిబ్బందిపై డీఎంహెచ్ఓ ఆగ్రహం ఆస్పత్రి సిబ్బంది తీరుపై డీఎంహెచ్ఓ శ్రీనివాస్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం నవాబు పేట పీహెచ్సీని సందర్శించి, నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన మండల వైద్యాధికారి మోహన్పై చర్యలు తీసుకుని, కలెక్టర్కు నివేదిక ఇస్తామన్నారు. -
మంచిపనికి రిటైర్మెంట్ ఉండదు
మనిషికి వ్యాపకం అవసరం. ఫ్రీ టైమ్ ఉంటే ఇంకా ఎక్కువ అవసరం. తోటపని చేస్కోవచ్చు... పూలతో మాట్లాడుకోవచ్చు... పుస్తకాల కాగితాలపై విహరించవచ్చు... లేదా మనంత అదృష్టం లేని వాళ్లను ఆదుకోవచ్చు. పిల్లలు సెటిలై బాధ్యతలు తీరాక జీవితాన్ని ఒక్కసారిగా శూన్యం ఆవరిస్తుంది. ఆ శూన్యంలో బతికే బదులు ‘కొత్త పిల్లల్ని’ వెతుక్కుంటే ఎలా ఉంటుంది? శారదమ్మ అదే చేసింది. వయసుమళ్లిన వాళ్లని చిన్న పిల్లల్లా చూసుకుంటోంది. నుదుటన అర్థరూపాయకాసంత బొట్టుతో చూడగానే ఆప్యాయంగా పలకరించే శారదమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేస్తున్న పని చిన్నదే అయినా సమాజంలో తనకంటూ ఓ ముద్ర వేసుకుంటున్నారీవిడ. వేకువజామునే లేచి, చేతిలో కర్ర పట్టుకొని, నిదానంగా ఆశ్రమంలోని ఒక్కొక్కరి బాగోగులను పలకరిస్తూ దైనందిన జీవనాన్ని మొదలుపెడతారు శారదమ్మ. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పదకొండేళ్ల క్రితం శారదమ్మ ఏర్పాటుచేసిన ఆ ఆశ్రమం పాతికమంది వృద్ధ మహిళలకు, బాలికలకు నీడనిస్తోంది. ప్రతిఫలాపేక్ష లేకుండా శేషజీవితాన్ని పరులకోసం ఉపయోగపడేలా మలుచుకోవాలన్న శారదమ్మ... వయసుపై బడిన వారికి ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లో... అమ్మను చూసుకుంటున్నా.... ‘‘చిన్నపుడే అమ్మను కోల్పోయి బంధువుల వద్ద పెరిగాను. తోబుట్టువులు లేరు. అయినవారు లేకుండా పరాయివారి మీద ఆధారపడే బతుకు ఎంత కష్టమైనదో ఆ బాధ నాకు తెలుసు. నా భర్త రాజన్న జిల్లా జడ్జిగా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలిద్దరు వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. మిగిలిన ఈ జీవితంలో ఇంకా చేయాల్సింది ఏముంది? అని ఆలోచించాను. నలుగురికి ఉపయోపడి పనిచేస్తే అంతే చాలు కదా అనుకునేదాన్ని. కానీ, ఆ పని ఏంటో, ఎలా మొదలుపెట్టాలో తెలిసేది కాదు. ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏంటి అని ఓ రోజు ఆలోచన వచ్చింది. నా చిన్ననాటి పరిస్థితులు గుర్తుకువచ్చి కళ్లలో నీళ్లు ఉబికాయి. అయినవారికి దూరమై ముదిమి వయసులో కష్టాలు పడుతున్నవారికి సేవ చేస్తే, మా అమ్మకు చేసినట్టే కదా అనిపించింది. ఇదే విషయం మా వారికి చెప్పినప్పుడు చాలా సంతోషించారు. ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి. వాళ్లు వారి జీవితంలో స్థిరపడ్డారు. పిల్లలూ నా ఆలోచన సరైనదన్నారు. తమ వంతూ సాయం చేస్తామన్నారు. ఆ విధంగా పదకొండేళ్ల క్రితం వృద్ధాశ్రమాన్ని స్థాపించాను. ఆ తర్వాత ఎవరూ లేని ఓ బాలిక మా నీడన చేరింది. అప్పటి నుంచి బాలికలకు కూడా ఆశ్రమంలో చోటు ఇవ్వాలని ఇంకాస్త మెరుగుపరిచాను. శివారులో... ఆశ్రమం స్థాపించాలంటే అందుకు పెద్ద స్థలం, ఇళ్లు కావాలి. కామారెడ్డి పట్టణ శివారులోని సామాజిక వేత్త, విశ్రాంత ఉప విద్యాధికారి భద్రయ్యను నేనూ, మా వారు సంప్రదించాం. ఆయన పెద్ద మనసుతో ఆశ్రమ నిర్వహణ కోసం తన పొలం వద్ద ఇంటిని నిర్మించారు. ఆ ఇంటిని ఎలాంటి అద్దె లేకుండా ఇచ్చారు. మంచి పని చేయాలని మనం ఓ అడుగు వేస్తే, మరో పది అడుగులైనా మనతో పాటు కలుస్తాయని పెద్దలు చెప్పిన మాటలు ఆ క్షణాన నాకు అక్షరాల నిజం అనిపించాయి. ముందుగా పాతికమంది ఆశ్రమంలో ఉండడానికి అవసరమైన మంచాలు, దుప్పట్లు, భోజనసామగ్రి... మొదలైన ఏర్పాట్లన్నీ చేశాను. ఇద్దరితో మొదలై పాతికమందికి, అక్కణ్ణుంచి ఈ పదేళ్లలో వంద మంది దాకా ఇక్కడ ఆశ్రయం పొందారు. వయసు పైబడిన వారు అనారోగ్యంతో మంచాన పడుతుంటారు. వారికి ఈ చేతులతో సేవలు చేస్తుంటాను. ఆఖరి క్షణంలో వారికి చేసే సేవ మా అమ్మకే అనిపిస్తుంటుంది. వారు మరణించాక కామారెడ్డి శివారులోనే అంత్యక్రియలు నిర్వహిస్తుంటాను. ఆరోగ్యం సహకరించడం లేదు... పిల్లలున్నా చూసుకునేవారు లేక రోడ్డున పడ్డ మస్తానమ్మ, ఎవరూ లేక అనాథగా మిగిలిన రాణెమ్మ.. ఇలా బంధాలు వదిలేస్తే వచ్చి చేరిన పాతికమంది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరమూ ఒకేసారి కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చే స్తాం. ఉదయం కాఫీ, టీ ల దగ్గర నుంచి రాత్రి భోజనాల వరకు సమాజంలో జరిగే మంచి చెడులు మా మధ్య దొర్లుతుంటాయి. నాకు కాళ్ల నొప్పులు. అందుకే చేతికర్రలేకుండా సరిగా నడవలేకపోతున్నాను. నాతో పాటు ఇంకొందరు ముసలివాళ్లకూ నడవడం చేతకాదు. కళ్లు కనిపించనివారూ ఉన్నారు. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారూ ఉన్నారు. కొందరు దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతో వారికి వైద్య సేవలు అందిస్తుంటాను. దాతల సహకారంతో... కొంతమంది దాతలు వచ్చి వృద్ధులకు అవసరమైన బట్టలు, దుప్పట్లు, పాత్రలు ఇచ్చి వెళ్తుంటారు. మరికొందరు ఉప్పు, పప్పు, బియ్యం, ఇతర వంటసామాగ్రి పట్టుకొస్తారు. ఇటీవలి కాలంలో కొందరు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలప్పుడు ఏదో ఒక సాయం అందిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు చనిపోయిన వారు వారి స్మారకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టి అవి వృద్ధులకు అందేలా చూస్తున్నారు. నా భర్త పెన్షన్ డబ్బులతో కొంత, నా పిల్లలు అందించే ప్రోత్సాహంతో మరికొంత, చుట్టూ ఉండే వారి సహృదయంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నాను. ప్రభుత్వం నుంచి నేటికీ ఎలాంటి సాయం అందుకోలేదు. ‘నలుగురికి ఈ సాయం చేస్తున్నాను మీరు దయతలచండి’ అని ఎన్నడూ ఎవరికీ చెప్పుకున్నదీ లేదు. నలుగురికి తలా ఓ పిడికెడు మెతుకులు పెట్టి, ఇంత నీడ కల్పించే భాగ్యం ఆ దేవుడు బతికినన్నాళ్లూ నాకు ఇలా కల్పిస్తే అంతే చాలు అని రోజూ దండం పెట్టుకుంటాను.’’ - వేణుగోపాల్చారి, సాక్షి, కామారెడ్డి, నిజామాబాద్ కన్నీళ్లను తుడవడం కనీస ధర్మం నెల్లూరు జిల్లా మాగుంట లేఅవుట్ వాస్తవ్యులైన తుమ్మల కృష్ణారెడ్డి ఉన్నంతలో నలుగురికి సాయం చేయాలనే నిబద్ధత కలిగిన వ్యక్తి. చేసిన సాయం సరిపోదు అనుకుంటే ఇతర దాతలనుంచి విరాళాలు సేకరించి అవసరంలో ఉన్నవారికి అందించడం ఆయన లక్ష్యం. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో కృష్ణారెడ్డి చేస్తున్న సేవలు ఈ ప్రాంతంలో ప్రతిఒక్కరికీ సుపరిచితమే. 76 ఏళ్ల వయసులో ఇతరులకు సేవ చేయడానికి నిత్యం యువకుడిలా పరుగులు తీస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... తోడుగా హెల్పింగ్ హ్యాండ్... ‘‘ఓ ప్రైవేట్ కంపెనీలో పి.ఆర్గా పనిచేసి రిటైరయ్యాను. నాలో ఈ సేవాబీజం వేసింది నా భార్య సుదర్శనమ్మ వృత్తిరీత్యా టీచర్. ఆమె నిరుపేద విద్యార్థ్ధుల సాధకబాధకాలను తెలుసుకుంటూ వారికి తగిన సాయం అందించేది. ఆరేళ్ల క్రితం తనే ఈ ‘హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించింది. రెండేళ్లక్రితం ఆవిడ చనిపోయింది. ముగ్గురు బిడ్డలు స్థిరపడ్డారు. మిగిలిన ఈ జీవితం నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకున్నాను. అర్హులైన వారికి ఎలా చేయూతనివ్వాలి అని ఆలోచనల్లో పడ్డ నాకు మీడియా ఒక దారి చూపింది. పత్రికల్లో, టీవీల్లో సాయం కోసం అర్థించేవారు, అభాగ్యులు.. వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి చేతనైనంతవరకు ఆదుకోవడం మొదలుపెట్టాను. పెన్షన్ల పంపిణీ... మొదట్లో గవర్నమెంట్ నుంచి వృద్ధులకు, వికలాంగులకు రూ.200 పెన్షన్ మాత్రమే వచ్చేది. మరో మూడు వందల రూపాయలు కలిపి ప్రతినెలా 120 మందికి ఇస్తూ వచ్చాను. ఇప్పుడు కారాగారాల్లో ఉంటున్న ఖైదీల కుటుంబాలకు నెలకు రూ.500 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నాం. వార్తా కథనాలకు స్పందిస్తూ... వార్తాపత్రికలు, టీవీల్లో వచ్చే అభాగ్యుల కథనాలకు చూసినప్పుడు వారికి ఎంతో కొంత సాయం అందించేవరకు మనసు కుదుట పడదు. సాక్షి టీవీలో బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.6 లక్షలు అవసరమని ఓ కథనం ప్రసారమైంది. నా వంతుగా పాతికవేలు అందజేశాను. కానీ, అవి ఏ మూలకు అనిపించింది. దాతలను సంప్రదించి, మరింత మొత్తాన్ని ఆ బాలికకు అందజేశాను. ఇటీవల సాక్షి దినపత్రిక ఫ్యామిలీపేజీలో అనంతపురానికి చెందిన వికలాంగులపై ప్రచురించిన ‘ప్రేమపాఠం’పై స్పందించి, వారి వివరాలను నెల్లూరు నుంచే కనుక్కున్నాను. నా సొంతంగానే కాకుండా దాతల నుంచి సేకరించి పాతికవేల రూపాయలు పంపించాను. మా దగ్గర మునిసిపల్ స్కూల్ ఉంది. ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడి విద్యార్థులు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నిల్చోడం చూసి చలించిపోయాను. అమెరికాలో ఉన్న నా చిన్నకూతురు సహకారంతో లక్షా పదివేల రూపాయలతో విద్యార్థులందరకీ షూస్ అందచేసాను. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇటీవల ఇండియన్ థియోలాజికల్ మినిస్ట్రీస్ -హైదరాబాద్ నాకు గౌరవ డాక్టరేట్ను అందజేసింది. కుల, మత, ప్రాంతీయ, వర్గాలకు అతీతంగా కన్నీళ్ళను తుడిచే చేతులుగా నిలవాలన్నదే మా ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ఆశయం. నిరుపేదలకు, అవసరం ఉన్నవారికి సాయం చేయడంలో ఉన్న ఆనందం ఇన్నేళ్లలో నాకెన్నడూ కలగలేదు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేందుకు స్పందించే హృదయం, వారి కన్నీళ్లను తుడిచే హస్తాలు అలసిపోవు. తుది శ్వాసవరకు నలుగురి జీవితాలకు చేయూతనిచ్చే ఈ సేవను వదులుకోను.’’ - గంటా థామస్ మౌంట్బాటన్, సాక్షి, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement