breaking news
Sankranti festivals program
-
తెలంగాణలో మొదలైన ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
సంక్రాంతి పందేనికి.. సై..
సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, పిండివంటలు, కోడిపందేలు గుర్తుకొస్తాయి. అయితే ఈ కోడిపందేల ఆటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. వేల మంది వీక్షించేలా ఏకంగా స్టేడియాల్లో పోటీలు నిర్వహించేందుకు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ అమ్మకానికి పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. దీనిని నగరంలోని కొందరు ఔత్సాహికులు ఉపాధి మార్గంగా ఎంచుకుని నగర శివారులోని ఫామ్హౌస్లలో భారీగా పందెం పుంజులను పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక శిక్షణ, హై క్లాస్ ఆహారాన్ని అందిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఔత్సాహికులు పెరగడంతో కోళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒక్కో పుంజు దాని జాతి, రంగును బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు సంక్రాంతి సంస్కృతిలో ఓ భాగం. దీంతో ఈ సారి భారీ ఎత్తున పందేల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి స్టేడియాలను తలపించే నిర్మాణాలు దీని కోసం చేస్తున్నారంటే పందేలకు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కుస్తీ పోటీల్లో ఉన్నట్లుగా రింగుల మధ్యలో ఇసుక పోసి.. గైడ్ ఆధ్వర్యంలో బరువులో సరితూగే పుంజులను పోటీకి ఎంపిక చేస్తుంటారు. వీటికి బ్లేడ్లు, చిరుకత్తులు కాళ్లకు కట్టి బరిలోకి దింపుతారు. బరిలో పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే.. రింగు బయట జనం ఈలలు, చప్పట్లతో హుషారుగా పందేలు కాస్తూ.. గెంతులేస్తుంటారు. శిక్షణ కోసం ఎంపిక.. పందేల్లో పాల్గొనే కోళ్లను చిన్న పిల్లగా ఉన్నప్పుడే పరిశీలించి, ఎంపిక చేసి వాటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. అయితే సిద్ధం చేసే ప్రక్రియ కూడా ఓ పెద్ద వ్యాపారంగా మారింది. చాలా మందికి ఇదొక ఉపాధి మార్గంలా కనిపిస్తోంది. జనవరిలో జరిగే పందేల కోసం సెపె్టంబర్ నుంచే సన్నాహాలు చేస్తుంటారు. కొన్ని రకాల కోడిపుంజులను బిహార్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని పందేలకు సన్నద్ధం చేస్తుండటం విశేషం. పుంజుల ఎంపిక నుంచి వాటిని పందేలకు సిద్ధం చేయడం వరకూ ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశమని, ప్రత్యర్థి కోడితో పోరు సాగించాలంటే తమ కోడికి అన్ని రకాల తరీ్ఫదులు అందిస్తామని పెంపకందారులు చెబుతున్నారు.హై క్లాస్ డైట్.. పందెం పుంజులకు నాణ్యమైన ఆహారం అందిస్తారు. గంట్లు, చోళ్ళు, జొన్నలు, బియ్యం, రాగులు, మినప, శనగపప్పు గోధుమ మిశ్రమాన్ని తినిపిస్తారు. దీంతోపాటు జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జురం, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. కొన్నిటికి బోన్లెస్ చికెన్, మటన్ కీమా కూడా ఆహారంగా ఇస్తారు. కొందరు మేకపాలు కూడా తాగిస్తుంటారు. తిన్నది ఒంటికి పట్టే విధంగా కసరత్తులు, మార్నింగ్ వాక్ చేయిస్తారు. పౌష్టికాహారంతో పాటుగా రోజూ ఎక్సర్సైజులు చేయిస్తారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసేందుకు ఏర్పాట్లుంటాయి. పందేలకు పుంజులను సిద్ధం చేయడానికి కొందరు నిపుణులు కూడా తయారయ్యారు. వీరు కోళ్లకు ఉదయాన్నే మౌత్ వాష్ చేయిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది.ఆన్లైన్లోనూ అమ్మకాలు.. సంక్రాంతి బరిలో నిలబడే ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందేం రాయుళ్లు కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు. దేశ, విదేశాల్లోని ప్రధాన నగరాల్లో స్థిరపడి సొంత ఊరికి కోడి పందేల కోసం వచ్చేవారు ఆన్లైన్లో పుంజులను కొనుగోలు చేస్తున్నారు. ఇందు కోసం పెంపకందారులకు అధిక మొత్తంలో అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. ఇక నగరాల్లో నివసించే వారూ పందేలపై ఉన్న ఆసక్తితో ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలోనూ పందెం కోళ్ల పెంపకం భారీ స్థాయిలో జరుగుతోంది.రకాలు.. ఎంపికలు.. కోడిపందేనికి కొన్ని రకాల జాతులు పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో కనీసంగా 25 రకాల కోడిపుంజులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో పందేలకు దింపుతుంటారు. ఇందులో ప్రధానంగా కాకి, నెమలి, సవళ, రసంగి, డేగ, తెల్లపర్ల, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరి, కగర్, డుమర్, యాకూద్, అబ్రాస్, పచ్చకాకి, సేత్వా, అసీల్ వంటివి ప్రధానంగా పోటీలో కనిపిస్తుంటాయి. దీంతోపాటు రంగులను బట్టి కోళ్లను రకాలుగా విభజిస్తారు. అంతేకాకుండా ఏ రకం కోడి ఏ కోడితో, ఏ సమయంలో పందేలకు దిగితే ఫలితాలొస్తాయో కూడా శాస్త్రబద్ధమేనని స్థానికులు చెబుతుంటారు. అన్ని రకాల శిక్షణలు పూర్తయిన తర్వాచ పెందేలకు సిద్ధం చేస్తారు. ఇలా పెరిగిన కోడి పుంజుల ధర లక్షల్లో ఉంటుంది. ఒక్కో పుంజు కనీసం రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతుంది. -
ముచ్చట గొలిపే ముత్యాల ముగ్గులు.. మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
-
విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
AP:సెలవులొచ్చాయి! స్కూళ్లలో మొదలైన సంక్రాంతి ‘సందడి’ మొదలు! (ఫొటోలు)
-
సంక్రాంతి సందడే సందడి త్వరలో...
-
గొబ్బియల్లో...గొబ్బియల్లో..అంటూ సంక్రాంతి సంబరాలు త్వరలో...
-
సంక్రాంతి సంబరాలు త్వరలో...
-
ఐకమత్యంతోనే తెలుగు ప్రజల ప్రగతి
దాదర్, న్యూస్లైన్: తెలుగు ప్రజలంతా ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఏకమై సమస్యలపై పోరాడినప్పుడే ప్రగతి సాధిస్తారని ‘తెలుగు కళా సమితి’ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి అన్నారు. నవీముంబై వాషిలోని కళాసమితి ప్రాంగణంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు కళా సమితిలో ప్రాంతీయబేధాలకు తావు లేదన్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన పండుగలను, సాంస్కతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు కళా సమితి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. ముంబైలో తెలుగువారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఒకే విధమైనవని అన్నారు. వాటి పరిష్కారానికి వారంతా సంఘీభావం తెలపాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు కళా సమితి అధ్యక్షుడు బండి నారాయణరెడ్డి, మాదిరెడ్డి కొండారెడ్డి, ఎం.సుబ్రహ్మణ్యం, కె.వరలక్ష్మి, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి రాధా మోహన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి సంబరాలను ప్రారంభించారు. కె.వరలక్ష్మి ఆలపించిన ..‘శ్రీ గణనాధం భజరే-సిద్ధ పరా శక్తి యుతం’ ప్రార్థనా గీతంతో సాంస్కతిక కార్యక్రమాలు ప్రారంభించారు. మహిళా సభ్యులు రజని, నీరజలు ‘నీరు జల్లిన ముంగిట్లో... పన్నీరు జల్లిన వాకిట్లో-- దారి పొడుగునా గొబ్బిళ్లో, ముత్యాల ముగ్గులా గొబ్బిళ్లో’ వంటి సంక్రాంతి పాటలను ఆల పించగా చిన్నారులు వాటికి అనుగుణంగా నృత్యం చేశారు. అభినయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్కు చెందిన డెరైక్టర్, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, గురు రాధామోహన్ బృందం ప్రదర్శించిన త్రిమూర్తులు, పుష్పాం జలి, మహారాష్ర్టకు చెందిన లావణి, ఇమేజస్ ఆఫ్ ఇండియా నృత్యాలు ఆహూతులను అలరించాయి. కాగా, ప్రముఖ తెలుగు కళాకారుడు కిషన్ జగ్లర్ ప్రదర్శించిన అద్భుత సాహస విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత విద్యా సంవత్సరంలో ఉన్నత శ్రేణిలో విజయం సాధించిన విద్యార్థులకూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ఈ సందర్భంగా బహుమతులు, సర్టిఫికెట్లు అందించి సత్కరించారు. సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి, వై.వి.నారాయణరెడ్డి, టి. మంజుల, మీర్జాల్లి షేక్, మీనాంబిక తదితరులు సహాయ సహకారాలు అందించారు.


