breaking news
Sandeep Chakravarthy
-
ఢిల్లీ పేలుడు..చిన్న పోస్టర్తో.. జైషే కుట్రపై గర్జించిన తెలుగు సింహం!
న్యూఢిల్లీ: భారత్లో భారీ ఉగ్రహింసకు స్కెచ్ వేసిన జైషే మహ్మద్ ఉగ్రకుట్రను ఓ చిన్న పోస్టర్ ద్వారా భగ్నం చేయడం విశేషం. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన జైషే మహ్మద్ పోస్టర్లను నెల క్రితమే ఓ పోలీసు అధికారి గుర్తించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఫలితంగా దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడగలిగారు. ఈ ఘనత సాధించిన అధికారి మన తెలుగువారే కావడం గర్వకారణం.తెలుగు ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి, జైషే మహ్మద్ కుట్రను ఛేదించి తన శౌర్యాన్ని చాటారు. ఇప్పటికే ఆరు సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్న ఆయన, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. ఇది ఆయనకు ఆరో అవార్డు కావడం విశేషం.పోస్టర్తో బండారం బట్టబయలు 2019 వరకు కాశ్మీర్లో ఉగ్రసంస్థలు సైనిక అధికారులను బెదిరిస్తూ పోస్టర్లు వేయడం సాధారణంగా జరిగేది. కానీ ఆర్మీ అప్రమత్తతతో ఆ కార్యకలాపాలు తగ్గాయి. అయితే, గత నెలలో శ్రీనగర్లో రహస్యంగా తరలిస్తున్న జైషే మహ్మద్ పోస్టర్లను ఐపీఎస్ సందీప్ గమనించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ తెప్పించి, ముగ్గురు యువకులు పోస్టర్లు తరలిస్తున్న దృశ్యాలను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా, షోపియాన్కు చెందిన మత గురువు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో జైషే కుట్ర జరుగుతున్నట్లు వెల్లడైంది.ఉగ్రవాదుల అరెస్టు..పేలుడు పదార్థాల స్వాధీనం విచారణలో జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తున్న ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్, లక్నోకు చెందిన షాహీన్ సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్, అలాగే రెండు AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మరో డాక్టర్ ఉమర్ పరారీలో ఉండగా, అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.సందీప్ చక్రవర్తి ప్రస్థానం కర్నూలులో జన్మించిన సందీప్ చక్రవర్తి, మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించి, మెడిసిన్ పట్టభద్రులయ్యారు. అనంతరం సివిల్స్లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గా సేవలందిస్తున్నారు. పూంచ్ ఏఎస్పీగా తన సర్వీసు ప్రారంభించిన ఆయన, హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలుసందీప్ ఇప్పటివరకు ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు, నాలుగు జమ్మూ అండ్ కశ్మీర్ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. -
జైషే కుట్రను బట్టబయలు చేసింది మన కర్నూల్ అధికారి
-
సివిల్స్లో కర్నూలు తేజం
యూపీఎస్సీ ఫలితాల్లో 786వ ర్యాంక్ సాధించిన సందీప్ చక్రవర్తి కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరానికి చెందిన వైద్య విద్యార్థి సివిల్స్లో మెరిశాడు. గురువారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 786వ ర్యాంకు సాధించాడు. ఎస్సీ కేటరిగీలో ఇతనికి ఐపీఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు నగరం సి.క్యాంపు సెంటర్లో ప్రభుత్వ క్వార్టర్లో నివాసముంటున్న డాక్టర్ జీవీ రాంగోపాల్ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సీఎస్ఆర్ఎంవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన భార్య పీసీ రంగమ్మ ప్రస్తుతం ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. విద్యావంతులైన ఈ దంపతులు తమ పిల్లలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. కన్నవారి ఆశయాల మేరకు పెద్ద కుమారుడు జీవీ ప్రమోద్ చక్రవర్తి ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. కుమార్తె జీవీ సౌజన్య ఏజీ ఎంఎస్సీ పూర్తి చేశారు. చిన్నకుమారుడు సందీప్ చక్రవర్తి ప్రస్తుతం సివిల్స్లో 786వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు మార్గం సుగమం చేసుకున్నాడు. పాఠశాల నుంచే ప్రతిభ చాటిన సందీప్ చక్రవర్తి గజ్జల వెంకట సందీప్ చక్రవర్తి స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి హైస్కూల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు అభ్యసించాడు. 2003లో ఎస్ఎస్సీ ఫలితాల్లో 555 మార్కులు సాధించి ఆ యేడాది రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిభ అవార్డు కైవసం చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ బైపీసీలో చేరి 940 మార్కులు సాధించాడు. అదే సంవత్సరం ఎంసెట్లో మెడికల్ విభాగంలో 1600 ర్యాంకుతో కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్(2005 బ్యాచ్) సీటు దక్కించుకున్నాడు. డాక్టర్గా కేవలం కొద్ది మందికే సేవ చేయగలుగుతావని, సివిల్స్ సాధిస్తే నీ సేవలను విస్తృతం చేయవచ్చని కుమారునికి తండ్రి సూచించాడు. దీంతో సందీప్ చక్రవర్తి తండ్రి కోరికను నెరవేర్చేందుకు హౌస్సర్జన్ దశ నుంచే కష్టపడ్డాడు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లి సివిల్స్కు కోచింగ్ తీసుకున్నాడు. గత యేడాది ఇంటర్వ్యూ దాకా వెళ్లి 20 మార్కుల తేడాతో విఫలమయ్యాడు. అయినా మొక్కవోని పట్టుదలతో చదివి ప్రస్తుతం ఎస్సీ కేటగిరిలో 786వ ర్యాంకు సాధించాడు. అమ్మా నాన్నల ప్రోత్సాహంతోనే.. పాఠశాల విద్య నుంచే అమ్మా నాన్నలు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వైద్య విద్యను చదువుతున్నప్పుడు నాన్న సివిల్స్పై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆయన సూచన మేరకు అహర్నిశలు కష్టపడ్డాను. హైదరాబాద్లో ఓ రూంలో ఉంటూ ప్రతి రోజూ 10 నుంచి 12 గంటల పాటు చదివాను. రోజూ నాలుగు ఇంగ్లిష్ పేపర్లతో పాటు తెలుగు పేపర్లనూ పూర్తిగా చదివే వాన్ని. మొదటిసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లి ఫెయిలైన తర్వాత నాలో ఇంకా కసి పెరిగింది. మొదటిసారి లోపం ఎక్కడుందో తెలుసుకుని రెండోసారి మరింత పట్టుదలతో కష్టపడి ఫలితం సాధించాను. ఈ విజయం పూర్తిగా నా కుటుంబ సభ్యులకే అంకితం.


