breaking news
sambayya
-
డబ్బుల కోసం తల్లికి నిప్పంటించి..
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
గోడ కూలి ముగ్గురు మృతి
శాయంపేట: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి ముగ్గురు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలోశుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథ నం ప్రకారం మండల కేంద్రానికి చెందిన ముష్కే భాగ్య లక్ష్మికి చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరుకొని పైకప్పు కూలిపోయింది. దీంతో దాని పక్కనే ఆమె చిన్న రేకుల షెడ్డు వేసుకొని కిరా ణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ ఇంటి పక్కనే జోగమ్మ (60) ఇల్లు ఉంది. శుక్ర వారం మధ్యాహ్నం జోగమ్మ తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఆమెపై మట్టిపెళ్లలు పడ్డాయి. అదే సమయంలో గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మోర సాంబయ్య (65), లోకలబోయిన సారలక్ష్మి (55)లపై గోడ పూర్తిగా పడింది. స్థాని కులు మట్టిపెళ్లలు తొలగించి చూడగా అప్పటికే సాంబయ్య, సారలక్ష్మి విగతజీవులపై కనిపించా రు. జోగమ్మ నడుం, కాళ్లు విరిగిపోయాయి. అంబులెన్స్ ఆలస్యంతో పోయిన ప్రాణం జోగమ్మను ఆసుపత్రికి తరలించడానికి స్థానికులు వెంటనే 108 నంబర్కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపాలని కోరగా గంటా 15 నిమిషాల తర్వాత అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటనలో మృతిచెందిన మోరె సాంబయ్య స్థానికంగా పనిలేక సిరిసిల్లలో చేనేత పనిచేస్తూ జీవిస్తున్నాడు. వినాయక చవితి పండగ కోసం శాయంపేటకు వచ్చిన సాంబయ్య... బీడీలు కొనుక్కోవడం కోసం రోడ్డుపైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఎస్సై దేవేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దాన వీర శూర కర్ణ
మా ఊరోళ్లకు వేడివేడిగా ఆరోజే విడుదలైన సినిమాలు బోర్ కొట్టేశాయి. విడుదల కాకముందే లీకైన సినిమాలు సెల్ఫోన్లో చూసీచూసీ బొర్ కొట్టేశాయి. పనీపాటలేని అప్లోడింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ట్రెండింగ్ వీడియోలు బోర్ కొట్టేశాయి.ఇలాంటి మహాబోర్ సమయంలో...‘‘మన గ్రామ సర్పంచి పుట్టిన రోజు సందర్భంగా రేపు రాత్రి మన ఊళ్లో దానవీరశూరకర్ణ నాటకం ఉంటుందహో’’ అనే చాటింపు విని ఊళ్లో ఆబాలగోపాలం ఆనందించారు.‘నాటకం చూడక ఎన్నాళ్లయిందో...ఆరోజులే వేరు’ అనే నాస్టాల్జియాతో వయసు మళ్లిన వాళ్లు...‘నాటకమటా...ఎలా ఉంటుందో చూద్దాం’ అని సోషల్ మీడియా జమానాలో పుట్టిన లేలేత కుర్రోళ్లు...చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆరోజు సర్పంచి పుట్టిన రోజు. ఆయన ఇంటెనకాల పెద్ద గ్రౌండ్లో పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరింటికే ప్రేక్షకదేవుళ్లతో నాటకప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకల తరువాత నాటకం మొదలైంది....నాటుసార సారయ్య శకుని వేషం కట్టాడు. బాగా కుదిరాడు.‘‘దుర్యోధన... నాకే ఓ కూతురు ఉండి ఉంటే....నీ తలపు, వలపు, నీ కులుకు వేరే వన్నెలాడివైపు పొనిచ్చేవాడినాఏంచేయనూ...మేనమామనై ఉండి కూడా మామను కాలేని దురదృష్టవంతుడిని’’ అని విషాదంగా డైలాగు కొట్టాడు ఇంతలో ప్రేక్షకుల్లో నుంచి ఒక తాగబోతు గట్టిగా అరుస్తూ పైకి లేచాడు. ఇతడు సారయ్యకు స్వయానాబావమరిది. పేరు సారా సాంబయ్య.‘‘ఒరేయ్ సారిగా...నీకు కూతుళ్లు లేకపోవడం ఏందిరా! పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలున్నరు. ఒక్కరి పెళ్లి అయినా చేసినవా? పొద్దున లేసుడు....కల్లుతాగుడు....సాయంత్రం గుడంబ తాగుడు...నీ ముఖానికో నాటకం...’’సాంబయ్య తిట్లు విని ప్రేక్షకులు ఒకటే నవ్వడం! పాపం కళాకారుడు సారయ్య ముఖం మాడిపోయిన పెసరట్టయింది.‘‘ఒరేయ్ సాంబా కూకో....’’ అని సర్పంచి అరిచేసరికి సైలెంట్ అయిపోయాడు సాంబయ్య. ఆతరువాత భీష్మ పాత్రధారి కాషయ్య డైలాగు:‘‘నాయనా...వంశం కోసం బ్రతికున్నంత వరకు వయసంతా ధారబోసిన ఘోటక బ్రహ్మచారిని. నేను మాట ఇవ్వను. ఇచ్చాను అంటే దానికి చచ్చినా తిరుగుండదు. నేను ప్రతిజ్ఞ చేసినానుఅంటే, అంతే...తిరుగుండదు. అందుకే భీష్మప్రతిజ్ఞ అంటారు’’ఈలోపే ప్రేక్షకుల మధ్యలో నుంచి కాషయ్య క్లాస్మేట్ ఒకడు లేచి....‘‘ఒరే కాశీ....వంశం కోసం వయసంతా ధారపోసావా?! పదిహేడేళ్లకే మూడు కాపురాలు పెట్టావు....నువ్వు వయసు ధారపోయడం ఏమిట్రా బెవకూఫ్. పెళ్లి చేసుకుని వదిలేయడమేనా? వాళ్ల బాగోగుల గురించి పట్టించుకునేదిలేదా! మూడో భార్య ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి పిల్లను సాకుతోంది. రెండో భార్య ఎండల్లో కూలీనాలికీ పోతూ కష్టపడుతోంది. మొదటి భార్యను పట్టించుకునే దిక్కేలేదు....భార్యలు కష్టపడుతుంటే నాటకాలంటూ తిరుగుతున్నవేందిరా మొద్దునాయాలా....గబ్బు నాయాలా...’’ అని నాన్స్టాప్గా తిట్లు మొదలు పెట్టాడు.ఈలోపు లచ్చయ్య అనే వార్డు మెంబరు లేచాడు... ‘‘ఆడిన మాటను తప్పను...అని ఎంత సిగ్గులేకుండా అంటున్నావురా కాశీగా! నన్ను ఉపసర్పంచి చేస్తానని మాటిచ్చావు. చేశావా? చేయకపోతే చెయ్యకపోతివి...నా దగ్గర తీసుకున్న డబ్బైనా ఇచ్చినవా? నీకేమాత్రం సిగ్గున్నా నా డబ్బు నాకు ఇచ్చేయాలి లేదా నన్ను ఉపసర్పంచి చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను’’ అని అవేశంగా అరిచాడు.ఉపసర్పంచి రాజయ్య ఆగ్రహంగా లేచి...‘‘దైవం మీద ఆన. నన్ను పదవీచ్యుతుడిని చేస్తే ఊరుకునేది లేదు. ఫస్ట్టైమ్ వార్డ్మెంబర్గా గెలిచాను. భగవంతుని దయతో ఫస్ట్టైమ్ ఉపసర్పంచి అయ్యాను. పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే మీ కళ్లు మండిపోయాయి. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండాలా? ఇదేనా డెమోక్రసీ? అని ఈ సందర్భంగా అడుగుతూ, ఓటరు మహాశయులకు నమస్తేచెబుతూ...నా సీట్లో నేను కూసుంటున్నాను’’ అంటూ కూర్చున్నాడు.ఫ్రెండ్స్ మాటలతో భీష్మ పాత్రధారి కాశయ్య హర్ట్ అయ్యాడు....‘‘రేయ్ దొంగనాయల్లారా...టేజీ(స్టేజీ) మీదున్నంత వరకే నేను భీష్ముడిని. టేజీ దిగానా....మాస్....పక్కా మాస్. నా డైలాగులు అయిపోయేంతవరకు గమ్మునుండండి. ఆ తరువాత...మీరు మా ఇంటికొచ్చినా సరే. నన్ను మీ ఇంటికి రమ్మన్నా సరే...ఎక్కడైనాసరే...ఎప్పుడైనా సరే...మొకాలి చిప్పలు పగిలిపోవాలా....ఏం అనుకున్నారో ఏమో....’’ అన్నాడు ఆవేశంగా.సర్పంచి మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నాటకం వేస్తరా? నకరాలు చేస్తరా?’’చిన్నబ్రేక్ తరువాత నాటకం మళ్లీ మొదలైంది.దుర్యోధన సార్వభౌముడు రేకుల కైలాసం ఆవేశంగా తన డైలాగు స్టార్ట్ చేశాడు...‘‘ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి?ఎంత మాట ఎంత మాటా!మట్టికుండలో పుట్టిన నీదే కులం?(ఆ తరువాత డైలాగు మరిచిపోయాడు కైలాసం. ఈ మతిమరుపు వల్లే పదవతరగతి పరీక్ష మూడుసార్లు తప్పాడు. ఇంకా తప్పుతూనే ఉన్నాడు. ఏదో ఒక సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసై తనను తాను ప్రూవ్ చేసుకోవాలనేది కైలాసం ఆశయం. ఎంత పెద్ద మొనగాడైనా స్టేజీ మీద డైలాగులు మరిచిపోవడం కామన్ విషయమని, అలాంటప్పుడు ప్రేక్షకులకు అనుమానం రాకుండా ఫ్లోలో నోటికొచ్చింది దంచుకుంటూ పోవాలని సీనియర్ నటుడు, నటరత్న కల్లు నాగమల్లు చెప్పిన విషయం కైలాసానికి గుర్తుకు వచ్చింది. ఇక చూస్కోండి. ఇలా అందుకున్నాడు...)‘ఆచార్యదేవాఏమంటివి ఏమంటివి?ఇది క్షేత్రపరీక్ష కాని క్షత్రియపరీక్ష కాదు... టెన్త్క్లాస్ పరీక్ష కానేకాదు.ఆచార్యదేవా...ఏమంటివి?టెన్త్క్లాస్పరీక్ష పాసు కావడమంటే మామూలనుకుంటివా?పొద్దున లేచి పండ్లు తోముకున్నంత ఈజీ అనుకుంటివా?ఆచార్యాదేవా...క్షేత్రపరీక్ష, క్షత్రియపరీక్షైనా పాస్కావచ్చుగానీ... టెన్త్క్లాసుపరీక్ష పాస్ కావడం అల్లాటప్పా వ్యవహారం అనుకుంటివా...’ఇంకేముంది....ఒన్స్మోర్ అంటూ ఒకటే లీలలు! – యాకుబ్ పాషా -
ఘనంగా తీజ్ సంబురం
-
నిజంగానే రియల్ స్టార్
1999... శ్రీహరి హీరోగా ‘పోలీస్’ సినిమా ప్రకటించగానే చిత్రసీమలోని చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానించుకున్నారు. బాడీ బిల్డర్లా ఉంటూ విలన్ వేషాలేసుకునే శ్రీహరి హీరో రోల్లో ఫిట్ అవుతాడా? ఇన్ని సందేహాల మధ్యలోనే ‘పోలీస్’ సినిమా చకచకా పూర్తి కావడం, విడుదల కావడం, నిర్మాతకు ఆర్థికంగా లాభాలు రావడం... ఇవన్నీ జరిగిపోయాయి. ఏదో ఫ్లూక్ హిట్ అనుకున్నారు మొదట. తర్వాత వచ్చిన ‘దేవా’, ‘సాంబయ్య’ హిట్లతో శ్రీహరి హీరోగా హ్యాట్రిక్ సాధించారు. దాంతో శ్రీహరి స్టామినా ఏంటో అటు బాక్సాఫీస్కి, ఇటు పరిశ్రమకీ అవగతమైంది. కంఫర్టబుల్ బడ్జెట్లో శ్రీహరితో సినిమా చేస్తే, ఆ నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే బ్రాండ్ తెచ్చుకున్నారాయన. హీరోగా తనకొచ్చిన బూమ్ని సద్వినియోగం చేసుకోవడానికి శ్రీహరి ప్రతి క్షణం తపించారు. దాదాపుగా సినిమాలు తీయడం మానుకున్న నిర్మాత జయకృష్ణను పిలిచి మరీ డేట్లు ఇచ్చారు. ఒకప్పుడు స్టార్ ఫైనాన్షియర్గా వెలుగొంది, తెరమరుగైన వాళ్లకి అడక్కుండానే కాల్షీట్లు కేటాయించారు. అలాగే బాగా చితికిపోయిన నిర్మాతలను పిలిచి మరీ అవకాశాలిచ్చారు. తనను నమ్ముకున్న స్నేహితులను, ప్రొడక్షన్ మేనేజర్లను కూడా నిర్మాతలను చేసిన ఘనత శ్రీహరిదే. ఇప్పుడు పరిశ్రమలో అగ్రనిర్మాతగా వెలుగొందుతున్న బెల్లంకొండ సురేష్కి ‘సాంబయ్య’ సినిమాతో లైఫ్ ఇచ్చింది శ్రీహరే. ఒక్క నిర్మాతలనే కాదు ఎందరో కొత్త దర్శకులకు, సాంకేతిక నిపుణులకు బంగారు భవిష్యత్తుని ప్రసాదించారు. అయిదారేళ్ల పాటు హీరోగా ఆయన హవా సాగింది. తను ఎదుగుతూ, తనను నమ్ముకున్న వారిని కూడా ఎదిగేలా చేయడం శ్రీహరి గొప్పతనం. అందుకే శ్రీహరిని రియల్ స్టార్ అనేది. ఫైటింగ్ స్పిరిట్: అసలు శ్రీహరి కెరీర్ ఓ చిన్న ఫైటర్గా మొదలైంది. ఆ ఫైటింగ్ స్పిరిట్తోనే తన కెరీర్ని శక్తివంతంగా నిర్మించుకున్నారాయన. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మనాయుడు’ సినిమాతో శ్రీహరి నటప్రస్థానం మొదలైంది. తన వైవిధ్యమైన నటనతో, వ్యక్తిత్వంతో, స్నేహంతో అందరితో మంచి అనిపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. తనకొచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని శ్రీహరి సద్వినియోగం చేసుకున్నారు. సైడ్ విలన్ పాత్ర అయినా, మెయిన్ విలన్ అయినా తనదైన డిక్షన్ ఆఫ్ డైలాగ్స్తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకుల్ని చాలా తొందరగానే ఆకట్టుకోగలిగారు. ఆయనలో మంచి కామెడీ టింజ్ ఉందని హలో బ్రదర్, అల్లరి ప్రేమికుడు, బావగారు బాగున్నారా లాంటి సినిమాలు నిరూపించాయి. ‘అల్లరి ప్రేమికుడు’లో ‘ఈ హరి బీరు కొట్టి బరిలోకి దిగాడూ అంటే... ఎవడైనాసరే హరీ అనాల్సిందే’ అనే డైలాగ్ని ఆయన చెప్పిన విధానం బాగా ఆకట్టుకుంది. హయ్యెస్ట్ పెయిడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్: ‘పోలీస్’ (1999) చిత్రంతో హీరోగా మారిన శ్రీహరి, మొత్తం 28 సినిమాల్లో హీరోగా చేశారు. 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’తో కేరెక్టర్ ఆర్టిస్టుగా మారి, ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్రీహరి అన్న పాత్ర పోషిస్తే, ఆ సినిమా విజయం తథ్యమనే సెంటిమెంట్ కూడా పరిశ్రమలో ఏర్పడింది. ఆయన కీలకపాత్ర పోషించిన ఢీ, మగధీర, బృందావనం లాంటి చిత్రాలు ఘనవిజయాల్ని సాధించాయి. దాంతో హయ్యెస్ట్ పెయిడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్గా వెలుగొందారు. మధ్య మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశారు. ఏదో రొడ్డ కొట్టుడు తరహా పాత్రలకు కాకుండా వైవిధ్యానికే పెద్దపీట వేసేవారాయన. ఏం చేసినా తనదైన మార్కు చూపడానికి ప్రయత్నించేవారు. హీరోగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సమయంలోనే కేరెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ కావడమనేది నిజంగా సాహసమే. హీరో అంటే ఆరు పాటలు, ఐదు ఫైట్లు అన్న ధోరణిలో కాకుండా శక్తివంతమైన పాత్రలతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చని శ్రీహరి చాలామందికి ఓ కొత్త మార్గం చూపించారు. హీరోగా చేస్తున్న సమయంలో హీరోయిన్కి అన్నగా చేయాలనుకోవడం శ్రీహరి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. అదే ఆయన కెరీర్ని మరోవైపు టర్న్ చేసింది. ‘మగధీర’లో షేర్ఖాన్గా ఆయన చూపించిన అభినయం ఆ సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పోలీస్ అంటే ప్రేమ: పోలీస్ పాత్రల్లో కూడా శ్రీహరి బాగా రాణించారు. ఆయన చేసిన పోలీసు పాత్రలన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. నిజానికి ఆయన ఒకప్పుడు పోలీస్ కావాలనుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎస్.ఐ. పోస్టింగ్ కూడా సాధించి, చివరకు వద్దనుకున్నారు. సమాజానికి పోలీసు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఓ గొప్ప సినిమా చేయాలని కలలు కన్నారు. అందుకోసం ఓ రచయితతో స్క్రిప్టు కూడా సిద్ధం చేయిస్తున్నారు. ఆదర్శ దాంపత్యం: సినిమాల్లో నటునిగా ఎదుగుతున్న సమయంలోనే నృత్యతార డిస్కో శాంతితో పరిచయం ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. శాంతితో ఆయన దాంపత్యం ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండేవారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. 27 ఏళ్లు... 97 సినిమాలు: 27 ఏళ్ల కెరీర్లో మొత్తం 97 సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ చిత్రాల్లో కూడా యాక్ట్ చేశారు. యమధర్మరాజు లాంటి పౌరాణిక పాత్రల్లో కూడా రాణించారు. ఇటీవల విడుదలైన ‘ఆది శంకర’లో గోవింద భగవత్పాదగా శ్రీహరి తన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా, ప్రేయసి రావే, సముద్రం, శ్రీరాములయ్య, ప్రేమంటే ఇదేరా, సూర్యుడు, అల్లుడా మజాకా, తాజ్మహల్, హలో బ్రదర్, భద్రాచలం, అయోధ్య రామయ్య, విజయరామరాజు, హనుమంతు, కుబుసం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర, ఢీ, కింగ్, బృందావనం... తదితర చిత్రాలు శ్రీహరి అభినయ సామర్థ్యానికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి. నిర్మాతగా ‘హనుమంతు’లాంటి సినిమాలు కూడా చేశారు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రాలు శివకేశవ్, వీకెండ్లవ్. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రస్తుతం హిందీలో తయారవుతున్న ‘రాంబో రాజ్కుమార్’లో మెయిన్ విలన్గా నటిస్తున్నారు. ఇదే ఆయనకు తొలి హిందీ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ కోసం ముంబైలో ఉన్నప్పుడే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎప్పుడూ పర్ఫెక్ట్ బాడీతో ఫిట్గా కనిపించే శ్రీహరి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైనట్టుగా, బాగా చిక్కి కనిపిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా శ్రీహరి మరణం చిత్ర పరిశ్రమకు రియల్గా లాసే. కొన్ని పాత్రల్లో ఆయనకు రీప్లేస్మెంటే లేదు. ఇది సత్యం. ప్రముఖుల నివాళి మా సంస్థలో శివయ్య, తాజ్మహల్... ఇలా పలు చిత్రాల్లో నటించాడు శ్రీహరి. వెంకటేష్ కాంబినేషన్లో కూడా పలు చిత్రాలు చేశాడు. నాయుడుగారూ అంటూ ఎంతో అభిమానంగా పిలుస్తాడు. నన్ను ‘గాడ్ఫాదర్’ అంటుంటాడు. కొత్త నటీనటులను ప్రోత్సహించే మీలాంటి నిర్మాతలు అరుదని అనేవాడు. ఓ మంచి ఆత్మీయుణ్ణి కోల్పోయాను. - డా. డి.రామానాయుడు శ్రీహరితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ముఠా మేస్త్రీ, బావగారు బాగున్నారా తదితర చిత్రాల్లో కలిసి నటించాం. నేను చెన్నయ్లో ఉన్నప్పుడు.. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే శ్రీహరి నాతోనే ఉండేవాడు. మొదట్లో తను చిన్న చిన్న పాత్రలు చేసినా, ఆ తర్వాత స్వశక్తితో ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. శ్రీహరి ప్రతిభకు అద్దం పట్టే చిత్రాల్లో ‘మగధీర’ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన మృతి నాకు తీరని లోటే. - డా. చిరంజీవి శ్రీహరిని దాసరిగారి దగ్గరికి తీసుకెళ్లింది నేనే. కష్ట సుఖాలను చెప్పుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. నా కుటుంబ సభ్యుడు లాంటివాడు. స్వశక్తితో పైకొచ్చిన సహజ నటుడు. చిత్రపరిశ్రమకు ఓ గొప్ప నటుడు దూరమయ్యాడు. తన మరణవార్త చాలా కలచివేసింది. - డా. మోహన్బాబు శ్రీహరిగారి కాంబినేషన్లో ‘ఢీ’ చిత్రం చేశాను. ఆ టైంలో యాక్టింగ్ గురించి ఆయన ఎన్నో సలహాలిచ్చేవారు. ఆయన్ను అన్నా అని పిలవడం అలవాటు. ఓ మంచి సోదరుణ్ణి కోల్పోయాను. - మంచు విష్ణు శ్రీహరి కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను. మంచి నటుడు మాత్రమే కాదు... మంచి వ్యక్తి కూడా. నాకున్న ఆత్యంత ఆప్తమిత్రుల్లో ఆయన ఒకరు. శ్రీహరి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. - సుమన్ నాలుగు రోజుల క్రితం శ్రీహరికి ఫోన్ చేస్తే, ‘ముంబైలో ఉన్నాను. వచ్చిన తరువాత కలుద్దాం’ అన్నాడు. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు’. మా అనుబంధం 22 ఏళ్లుగా కొనసాగుతోంది. హీరోగా రాణించేందుకు తను, దర్శకుడిగా ఎదిగేందుకు నేను ఇద్దరం చాలా కష్టపడ్డాం. జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ప్రతి క్షణం ఆ లక్ష్యం దిశగా నడిచిన మనిషి శ్రీహరి. ‘శ్రీరాములయ్య’ సినిమాలో శ్రీహరికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు లభించింది. ‘భద్రాచలం’ సినిమాను ఒక సవాల్గా తీసుకొని చేశాము. శ్రీహరి చాలా అరుదైన మనిషి, అరుదైన నటుడు కూడా. ఎవరైనా బాధలో ఉన్నారంటే వెంటనే చలించిపోతాడు. వీలైనంత వరకు సహాయం చేస్తాడు. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయాను. - ఎన్. శంకర్