breaking news
sakshi aniversary
-
విశ్వసనీయతే ‘సాక్షి’ పునాది..
సాక్షి, హైదరాబాద్: నాణేనికి మరో కోణాన్ని చూపించి, ‘సత్యమేవ జయతే’ నానుడిని సాకారం చేయాలనే లక్ష్యంతో విశ్వసనీయత పునాదిగా పుట్టిన ‘సాక్షి’.. అదే బాటలో తన ప్రస్థానం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో సాక్షి దినపత్రిక 15వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారతీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతాన్ని విశ్లేషించుకోవడానికి, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి వార్షి కోత్సవాలు వేదిక కావాలన్నారు. కచ్చితత్వంతో కూడిన సమాచారం ఆధారంగా కథనాలు అందించేటప్పుడు తప్పనిసరిగా అవతలి వ్యక్తుల వివరణ తీసుకోవడం వంటి స్వచ్ఛతతో కూడిన పాత్రికేయ ప్రమాణాలు పాటించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకంజ వేయనవసరం లేదన్నారు. పాఠకులకు సులభంగా చేరేలా, జనహితంగా కథనాలు సాగాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ వర్ధెల్లి మురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, సీఈఓ అనురాగ్ అగర్వాల్, డైరెక్టర్లు రాణిరెడ్డి, వైఈపీ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేన్సర్ బాధిత చిన్నారులతో.. ‘సాక్షి’ వార్షిక వేడుకల్లో భాగంగా వై.ఎస్.భారతీరెడ్డి కేన్సర్ బాధిత చిన్నారులను కలసి ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ బాధలను మరచిపోయిన చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. బంజారాహిల్స్లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్ ద్వారా కేన్సర్కు ఉచితంగా చికిత్స పొందుతున్న చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చదవండి: పూర్తి చేసేది మేమే వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. -
సాక్షి10వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన జగన్
-
సాక్షి10వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన జగన్
సాక్షి, గుంటూరు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ’సాక్షి’ 10వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కావూరు శివారులో కేక్ కట్ చేశారు. విలువలకు కట్టుబడి.. పాత్రికేయ ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తున్న సాక్షికి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాభినందనలు అని ఆయన తెలిపారు. ఇందులో పార్టీ కార్యకర్తలు, ఫొటోగ్రాఫర్లు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కావూరు శివారు నుంచి ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కోమిటినేనివారిపాలెం, గంగన్నపాలెం, ఐర్లపాడు, అమీనాషాహెబ్ పాలెం, బాసిక్ పురం, కేశానుపల్లి మీదగా నర్సరావుపేట వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. -
మీ ఆదరణే ఊపిరిగా...
మీ అందరి ఆదరాభిమానాలతో ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఎనిమిదేళ్ల వ్యవధి చాలా స్వల్ప సమయమే కావొచ్చు. కానీ ఇంత తక్కువ వ్యవధిలోనే ‘సాక్షి’ మీ అందరికీ చేరువయింది. మీలో, మీ కుటుంబసభ్యుల్లో ఒకటైంది. ‘సత్యమేవ జయతే’ మకుటాన్ని శిరోధార్యంగా స్వీకరించింది మొదలు ఆ అమృత వాక్కును ‘సాక్షి’ మనసా వాచా కర్మణా ఆచరిస్తోంది. ఒక వార్త వెనకా, ఒక కథనం వెనకా ఉండే అన్ని కోణాలనూ నిత్యం మీ ముందు పరుస్తోంది. సరైన సమాచారం అందిస్తే సముచితమైన నిర్ణయం తీసుకోగల మీ విచక్షణా శక్తినీ, వివేకాన్నీ గౌరవిస్తోంది. నాణేనికి మరోవైపు చూపించే ప్రయత్నం నిరంతరం చేస్తూ తెలుగువారి మనస్సాక్షిగా నిలిచింది. అంతర్జాతీయ డిజైన్తో, 23 ఎడిషన్లతో, అన్ని పేజీలూ రంగుల్లో సర్వాంగసుందరంగా ముస్తాబై మీ ముందుకొచ్చి పత్రికారంగ చరిత్రలో రికార్డు సృష్టించింది. బుడిబుడి నడకలప్పుడే సాక్షి పెనుసవాళ్లను ఎదుర్కొంది. రకరకాల ఇబ్బందుల్ని చవిచూసింది. ఒక దశలో పత్రిక గొంతు నొక్కేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా తన సంకల్పం నుంచి ‘సాక్షి’ అంగుళమైనా పక్కకు జరగలేదు. ధైర్యసాహసాలను ఇసుమంతైనా సడలనివ్వలేదు. వీటన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొనడంలో ‘సాక్షి’ పట్ల మీరు ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలు, అచం చల విశ్వాసం మాకు కొండంత అండగా నిలిచాయి. ‘సాక్షి’ ఆవిర్భావ సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న తెలుగు గడ్డ ఇప్పుడు రెండు రాష్ట్రాలైంది. అటు ఆంధ్రప్రదేశ్లోనైనా, ఇటు తెలంగాణలోనైనా ఉన్నదున్నట్టు నిజాయితీగా, నిర్భీతిగా, నిర్మొహమాటంగా నిజాలను నిగ్గుతేల్చుతున్నదీ, ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతున్నదీ ‘సాక్షి’ మాత్రమే. అదే సమయంలో అభివృద్ధికి అవసరమైన సూచనలనూ, క్షేత్రస్థాయిలో లోటుపాట్లనూ పాలకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాప్రయోజనాల పరిరక్షణకు అహరహం పాటుపడుతోంది సాక్షి. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంపికైన గ్రామాల్లో పాలక పార్టీ పెద్దలు బినామీల మాటున వేల ఎకరాలను కబ్జా చేసిన వైనంపై సాక్ష్యాధారాలతో సహా మూడు రోజులపాటు ధారావాహిక కథనాలను ‘సాక్షి’ వెలువరించింది. రాజధాని నిర్మించే ప్రాంతంపై వదంతులు సృష్టించి, స్థానిక రైతులను తప్పుదోవ పట్టించి చవగ్గా భూములు కొట్టేసిన తీరునూ... అసైన్డ్ భూములున్న నిరుపేద రైతులను భయాందోళనలకు గురిచేసి ఆ భూముల్ని అమ్ముకునేలా చేసిన వంచననూ వెలుగులోకి తెచ్చింది. అలా నాలుగైదు లక్షల రూపాయలకు భూములు కొన్నవారు కొన్ని నెలల్లోనే కోట్లకు పడగెత్తిన వైనాన్ని పక్కా ఆధారాలతో వెల్లడించింది. సంజాయిషీ ఇచ్చుకునేందుకు కూడా తోవ దొరకని భూ రాబందులు ‘డబ్బులున్నాయి... మేం కొనుక్కున్నాం, ఇందులో తప్పేముంది’ అంటూ చట్టసభల్లోనూ, వెలుపలా దబాయింపులకు దిగాయి. ‘సాక్షి’ పాత్రికేయ బృందాన్ని బెదిరించి, భయపెట్టి మరిన్ని కథనాలు రాకుండా చూసే కుట్రలకూ తెరతీశాయి. ఎన్నడూ లేనివిధంగా పాత్రికేయులను పోలీస్స్టేషన్లకు పిలిచి ప్రశ్నించే అప్రజాస్వామ్య సంస్కృతికీ దిగజారాయి. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీతో కుమ్మక్కయి ‘సాక్షి’ నోరు నొక్కాలనుకున్న టీడీపీ... ఇప్పుడు తమ చేతుల్లోనే అధికారం ఉన్నదన్న అహంకారంతో అవే ఎత్తుగడలను మరింత ఉధృతంగా ప్రయోగిస్తోంది. ఇటువంటి కుట్రలూ, కుహకాలకు ‘సాక్షి’ బెదిరిపోయే ప్రసక్తి లేదు. ఎంచుకున్న తోవ నుంచి కొంచెమైనా తప్పుకునే ప్రశ్న లేదు. గడిచిన 22 మాసాల్లో ఏపీ ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న తీరును ఎండగడుతూ వరస కథనాలు రావడానికి కారణం ఈ సంకల్పబలమే. అయితే, మాతో విభేదించినవారి అభిప్రాయాలకు కూడా పత్రికలో చోటివ్వకుండా పోలేదు. వాస్తవాలను వక్రీకరించిందన్న ఆరోపణలకు తావుండరాదన్న దృఢ నిశ్చయంతో సకల స్వరాలనూ వినిపిస్తున్నాం. ఏ కథనం ప్రచురించినప్పుడైనా సంబంధిత వర్గాల వివరణను సైతం తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సైతం జనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తున్నది. ఉన్న ఊళ్లో పనులు కరువై వలసపోతున్న అభాగ్యుల గురించీ, అడ్డా కూలీలుగా మారిన రైతన్నల దైన్య స్థితి గురించీ వివరించడమే కాదు... హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువుల్ని చెరబట్టిన జల మాఫియాల ఆగడాలనూ పతాక శీర్షికలకెక్కించాం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సవివరంగా ఇస్తూనే, అమలు చేయని కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తున్నాం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతున్నాం. జనజీవన ప్రమాణాలను పెంపొందించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాం. సమాజంలోని అన్ని వర్గాలవారికీ ఉపయుక్తమైన సమాచారాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు అదనపు శీర్షికలు ప్రారంభించి కొత్త పుంతలు తొక్కుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువతకూ అవసరమైన సమాచారం అందించే ప్రయత్నం విశేషంగా చేస్తున్నాం. సమాజ శ్రేయస్సే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణంలో అడుగడుగునా మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించి, అక్కున చేర్చుకున్న తెలుగు పాఠక మహాశయులకూ, ప్రకటనకర్తలకూ, ఏజెంట్లకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రారంభంనాడే చెప్పినట్టు సమాజహితమే మా లక్ష్యం. సత్యసంధతే మా మార్గం. మీ అందరి ఆదరాభిమానాలూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.... అభినందనలతో -కె. రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్