-
చోరీ సొమ్ముతో.. మలేసియాలో హోటల్!
చెన్నై: దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై నుంచి వెళ్లే రైళ్లలో తన చేతివాటం చూపించిన ఓ గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన నగదుతో దుండగుడు మలేషియాలో హోటల్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. తమిళనాడులో ప్రయాణిస్తున్న రైళ్లల్లో రాత్రి సమయాల్లో నగలు, నగదు చోరీ సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నుంచి సేలం వెళ్లే రైళ్లలో ఒక ముఠా వరుసగా తమ చేతి వాటాన్ని ప్రదర్శించింది. డీలక్స్ బోగీల్లో ప్రయాణిస్తూ అర్ధరాత్రి సమయంలో ప్రయాణికుల లగేజీలను తీసుకుని పారిపోతున్నారు. దీనిపై బాధితుల నుంచి రైల్వే పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో దుండగులను పట్టుకోవడానికి రైల్వే డీజీపీ శైలేంద్రబాబు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డీఐజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పడింది. పోలీసులు మఫ్టీలో వెళ్లి నిఘా చేపట్టారు. గురువారం రాత్రి చెన్నై నుంచి వెళుతున్న ఓ రైలులో ప్రయాణికుడి వద్ద ఉన్న సంచిని తీసుకుని అర్ధరాత్రి సమయంలో పారిపోతున్న గుర్తు తెలియని వ్యక్తిని మఫ్టీలో ఉన్న పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి కేరళకు చెందిన సాహుల్హమీద్గా తెలిసింది. సాహుల్హమీద్ మలేషియాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి విమానం ద్వారా చెన్నైకి వచ్చి రైళ్లలో రాత్రి సమయాల్లో తన చేతి వాటం ప్రదర్శిస్తున్నట్టు తెలిసింది. ఏసీ, ఫస్ట్క్లాస్, స్లీపర్క్లాస్ బోగీలలో ప్రయాణికులు నిద్రిస్తుండగా మహిళలను లక్ష్యంగా చేసుకుని నగలు చోరీ చేస్తున్నట్టుగా తెలిసింది. 2016లో చోరీలు చేయగా వచ్చిన రూ.కోటి నగదుతో మలేషియాలో హోటల్ కొన్నట్టు వెలుగుచూసింది. దుండగుడు సాహుల్హమీద్కు ఆరు భాషలు మాట్లాడగలడు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. మహిళపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయినట్టు తెలిసింది. సాహుల్హమీద్ 30 మంది ప్రయాణికుల నుంచి సుమారు 110 సవర్ల నగలు చోరీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: విదేశాల్లో చాక్లెట్ వ్యాపారం నిర్వహిస్తున్న చెన్నై మన్నాడి అంగప్పనాయకన్ వీధికి చెందిన షాహుల్ హమీద్ (40) ఈనెల 2వ తేదీన పోరూరు పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. వడపళనికి చెందిన రాజేంద్రన్ (27) ద్వారా ఖాజా షరీఫ్ చెన్నైలోని ప్యారీస్లో పరిచయమయ్యారు. తమ వద్ద విదేశీ ఫోన్లు ఉన్నాయని, రూ.9 లక్షలు చెల్లించి పొందవచ్చని తెలిపారు. దీంతో రూ.4 లక్షలు తీసుకుని తాను, తన స్నేహితుడు అబ్బాస్తో కలిసి పోరూరులోని ఒక లాడ్జీలో ఉన్న ఖాజా షరీఫ్ను కలిశాం. షరీఫ్ మా ముఖంపై అకస్మాత్తుగా ఏదో స్ప్రే చేయడంతో స్పృహ తప్పిపోయాము. స్పృహవచ్చి చూసే సరికి మా నగదు తీసుకుని పారిపోయాడు. అతనిని అరెస్ట్ చేసి తమ నగదు ఇప్పించాలని షాహుల్ హమీద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోరూరు సహాయ కమిషనర్ కుళందైవేలు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నగర శివార్లలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోరూరు-ఆర్కాడు రోడ్డులో ప్రెస్ అనే స్టిక్కర్ ఉన్న లగ్జరీ కారు నిలపకుండా దూసుకెళ్లింది. పోలీసులు సినిమా ఫక్కీలో ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. ఆ కారులోఉన్న ఐదుగురిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా, వారిలో ఒకడు ఇప్పటికే తమకు ఫిర్యాదు చేసిన షాహుల్ హమీద్గా తేలడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. షాహుల్ హమీద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, ఈనెల 2న నకిలీ నోట్లు చలామణి చేసే ముఠాకు చెందిన ఖాజాషరీఫ్ తనకు ఫోన్ చేసి ఒక లక్ష రూపాయలు ఇస్తే మూడు లక్షల రూపాయల విలువైన దొంగనోట్లు ఇస్తాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ లెక్కన తన నుంచి రూ.4 లక్షలు తీసుకుని రూ.10లక్షల నకిలీనోట్లు ఇస్తానని ఖాజా షరీఫ్ నమ్మించాడని పోలీసులకు తెలిపాడు. తన స్నేహితుడు అబ్బాస్ను తీసుకుని ఖాజా షరీఫ్ వద్దకు వెళ్లినపుడు తనపై మత్తు స్ప్రే చేసి ఉడాయించాడని చెప్పాడు. ఖాజా షరీఫ్ తనను మోసం చేశాడని తెలుసుకుని, అతనిని పోలీసులకు పట్టించేందుకే రూ.9.40 లక్షలు తీసుకుని పారిపోయినట్లు తప్పుడు ఫిర్యాదు చేశానని షాహుల్ హమీద్ అంగీకరించాడు. ఈ ఫిర్యాదును పత్రికల్లో చూసి తెలుసుకున్న ఖాజాషరీఫ్ తనకు మళ్లీ ఫోన్ చేసి, మరో రూ.4లక్షలు తీసుకుని వస్తే ఖచ్చితంగా రూ.10 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని చెప్పాడని తెలిపాడు. ఖాజాషరీఫ్ ముఠాకు చెందిన రాజేంద్రన్, మహమ్మద్ ఆషిక్, సిద్దిక్ నబీ, ముత్తుతో కలిసి నగదుతో కారులో ప్రయాణిస్తుండగా పట్టుబడినట్లు హమీద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వీరిచ్చిన సమాచారంతో రూ.15వేల నకిలీ నోట్లు, రూ.4లక్షల అసలు నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రన్, మహమ్మద్ ఆషిక్, సిద్దిక్ నబీ, ముత్తుతోపాటూ హమీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం సంఘటనలో ప్రధాన నిందితుడైన ఖాజా షరీఫ్, పరంగిమలైకి చెందిన మవుంట్ కార్తికేయన్ కోసం గాలింపు చేపట్టారు. మొత్తం ఈ ముఠా నాయకుడిగా భావిస్తున్న తూత్తుకూడికి చెందిన కోల్కతా రాజా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నకిలీ నోట్లను పాకిస్తాన్ నుంచి కోల్కతాకు చేరవేసి అక్కడి నుంచి ఈ ముఠా ద్వారా తమిళనాడులో చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ నోట్ల ముఠా సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement