breaking news
sadiq
-
ఐఎంగా ఏఆర్సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్లో డెస్క్టాప్ ఇంజనీర్గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్ను చితాక్యాంప్లోని ఓ సైబర్కేఫ్కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్తో కలిసి పని చేయడం ప్రారంభించాడు ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్లో 11 గుజరాత్లోని రాజ్కోట్లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్కోట్ పోలీసులు ఆసిఫ్ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్సీఏఫ్ కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్సీఎఫ్ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని గోకుల్చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం. -
పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్గా సాదిక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్)(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)మరికొన్ని పారీ్టలతో ఏర్పడిన సంకీర్ణ కూటమిలో పదవుల పంపిణీ కొలిక్కి వస్తోంది. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవికి శుక్రవారం జరిగిన ఓటింగ్లో పీఎంఎల్–ఎన్ సీనియర్ నేత సర్దార్ అయాజ్ సాదిక్, డిప్యూటీ స్పీకర్గా పీపీపీ నేత గులాం ముస్తాఫాషా ఎన్నికయ్యారు. అయాజ్ సాదిక్కు 291 ఓట్లకు గాను 199 ఓట్లు రాగా, తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ బలపరిచిన అమిర్ డోగార్కు 91ఓట్లు దక్కాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పారీ్టకి చెందిన ప్రజాప్రతినిధులు సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్లో చేరిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్–ఎన్ బలపరిచిన అభ్యర్థి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. -
‘వన్ డే కొత్వాల్’ సాదిఖ్ ఇకలేడు
సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల వయసులో హైదరాబాద్ నగరానికి ఒక రోజు పోలీసు కమిషనర్గా పని చేసిన బాలుడు సాదిఖ్ బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో కన్నుమూశాడు. సుదీర్ఘ కాలంగా రక్త కేన్సర్తో (లుకేమియా) బాధపడుతున్న బాలుడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లని తండ్రి జావేద్ బాషా తెలిపారు. సాదిఖ్కు పోలీసు ఉద్యోగం అంటే మక్కువ. ఈ నేపథ్యంలోనే మేక్ ఏ విష్ ఫౌండేషన్ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఈ సంస్థ 2014 అక్టోబర్ 15న సాదిఖ్ను హైదరాబాద్ నగరానికి ఒక రోజు కమిషనర్గా చేసింది. అప్పట్లో నగర కొత్వాల్గా ఉన్న ఎం.మహేందర్రెడ్డి నుంచి సాదిఖ్ ఈ బాధ్యతలు స్వీకరించారు. సాదిఖ్ ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన కుమారుడి కోరిక తీర్చిన పోలీసు విభాగానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జావేద్ బాషా అన్నారు. -
సాదిక్ను నగరానికి తీసుకొస్తాం
► ఆయన తండ్రికి విదేశాంగ శాఖ లేఖ ► ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో యువకుడి నరకయాతన ► ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ఉపాధి నిమిత్తం కానరాని దేశం వెళ్లి నరకయాతన అనుభవిస్తున్న ఓ యువకుడిని రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఏజెంట్ల మోసానికి బలై సౌదీ ఎడారిలో అష్టకష్టాలు పడుతున్న సాదిక్ అనే హైదరాబాద్ యువకుడిని నగరానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ‘అలా ఉన్నాడు...ఇలా అయ్యాడు’ అనే శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు స్పందించారు. సాదిక్ను నగరానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని అతడి తండ్రి అలీయోద్దీన్కు విదేశాంగ కార్యాలయం అధికారులు లేఖ రాశారు. సాదిక్ ఉపాధి నిమిత్తం స్థానిక ఏజెంట్ అర్షద్, ముంబైలోని రాజు అనే ఏజెంట్ సాయంతో గత ఏడాది జూన్ 23న సౌదీకి వెళ్లాడు. తీరా వెళ్లాక ఏజెంట్లు హామీ ఇచ్చిన తోటమాలి పని కాకుండా అబా నగరంలో ఒంటెలు, మేకలకు కాపలా కాసే పనిలో పెట్టారు. అయితే, ఖఫీల్(యజమాని) అన్నపానీయాలు కూడా సరిగా ఇవ్వడంలేదు. 11 నెలలపాటు జీతం ఇవ్వలే దు. సౌదీ ఎడారిలో నరకం అనుభవించాడు. అతని దీనస్థితిని చూసిన అక్కడి హైదరాబాద్ యువకులు యజమాని చెర నుంచి పారిపోవడానికి సహకరించారు. ప్రస్తుతం సాదిక్ రియాద్ సమీపంలోని ఉన్నట్లు అలీయోద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని రెయిన్బజార్ పోలీసులను, ముంబైలోని అంధేరీ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరకు ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తన కొడుకును సౌదీ ఖఫీల్ బంధీఖానా నుంచి రక్షించాలని భారత విదేశాంగ వ్యవహారాలశాఖకు ఉత్తరం రాశారు. ‘సాదిక్ సౌదీ నుంచి నగరానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటాం’ అంటూ సాదిక్ తండ్రికి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. మరోవైపు రియాద్లో ఉన్న హైదరాబాద్ యువకులు భారత కాన్సులేట్కు సాదిక్ వ్యవహారం తెలియజేశారు. దీంతో సౌదీ కాన్సులేట్ వారు సాదిక్ ఖఫీల్కు ఫోన్ చేసి రియాద్కు రావాలని కోరగా వారం రోజుల్లో వస్తానని చెప్పినట్లు తెలిసింది. -
రుణదాతల నుంచి తప్పించుకోబోయి..
రుణదాతలు వెంటపడడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ప్రమాదానికి దారి తీసింది. అచ్చం సినీ ఫక్కీలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పాతబస్తీకి చెందిన అసద్, సాదిక్ బార్కాస్ నుంచి మెహదీపట్నవైపు వెళ్తున్నారు. దుర్గానగర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే వారిని చూసిన ఇద్దరు రుణదాతలు బైక్పై వెంబడించారు. దీంతో బైక్ వేగాన్ని పెంచిన యువకులు బాబుల్రెడ్డినగర్ గ్రాండ్ ఫంక్షన్హాల్ ముందు యూటర్న్ చేయబోతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ లారి కింద కు వెళ్లింది. కాగా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. -
'సాధిక్ హత్యతో మాకు సంబంధం లేదు'
హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ సాధిక్ హత్య కేసుతో తమకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ జిల్లా ఎస్పీని కలసి ఈ మేరకు విన్నవించారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్పీని కోరారు. గురువారం గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో సాధిక్ను నరికారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన సాధిక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.


