breaking news
sacrifices of the martyrs
-
వీరులారా వందనం...రాష్ట్ర సాధనకు అనేకమంది ఆత్మబలిదానం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎంతోమంది ఆత్మబలి దానాలతో నేటి స్వరాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు గురువారం అమరవీరుల సంస్మరణ దినో త్సవం నిర్వహించనున్నారు. అమరుల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతో మంది తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ ఆత్మబలి దానం చేశారు. వీరిలో కొందరికి మాత్రమే ప్రభుత్వం నుంచి సాయం అందింది. మరికొందరికి స్థాని క నాయకులు, రాజకీయ పార్టీల నుంచి సాయం అందింది. ఇప్పటికీ తమ కుటుంబాలకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారిలో 27మందికి రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొందరికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కొంతమంది అమరుల కుటుంబాలకు ఎటువంటి సాయం అందలేదు. బెల్లంపల్లిలో తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పిన్న రాజ్కుమార్ అనే వ్యక్తి భార్య పద్మకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తోంది. ప్రభుత్వ పరంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేశారు. ● 2012లో ఆదిలాబాద్కు చెందిన సంతోష్ హైదరాబాద్లోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతుండేవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఓయూ క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజీ ముందే ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణత్యాగం చేశాడు. ఆత్మహత్యతో ఓయూ అట్టుడికింది. అమరుని కుటుంబానికి రూ.పది లక్షల సాయం అందింది. ● 2013లో ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన పుంద్రువార్ నర్సింగ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పట్లో ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ఈయన కుటుంబంలో ఒకరి ఉద్యోగం, రూ.పది లక్షల సాయం అందింది. అమరుల కుటుంబాలకు te ● బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్, రాజు అనే ఇద్దరు యువకులు కూడా స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్య కేసు పోలీ సు రికార్డుల్లో నమోదు కాలేదు. అందువల్ల ఇరువురు బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందలేదు. ఉద్యోగ అవకాశం కల్పించలేదు. ● చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామానికి చెందిన ముత్యాల రాజగౌడ్, సుబ్బారాంపల్లి గ్రామానికి చెందిన బిల్కి మహేష్ ప్రాణత్యాగం చేశారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలే.. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతా యని అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే ఇప్పటికీ వారి ఆకాంక్షలు నెరవేరలే. కుటుంబ, గడీల పాలనలో సామాజిక న్యాయం జరగలేదు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదు. నేటికీ రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. – దుర్గం భాస్కర్, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి -
మీడియా పాయింట్: తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలి
సాక్షి,హైదరాబాద్: అమరవీరుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాకే దక్కుతుంది. అత్మబలిదానాలను ముగింపు పలికేందుకే కాంగ్రెస్కు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని తెలిసీ కూడా సోనియా నిర్ణయం తీసుకున్నారు. అమరుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలి. ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించి రాయితీలు కల్పించాలి. -డీకే ఆరుణ, మల్లు భట్టి విక్రమార్క, టి.జీవన్రెడ్డి, కోమటిరెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాగర్ వద్ద 100 అంతస్తుల భవనాలు వద్దు శాసనసభలో ఆమరవీరుల కుటుంబాలకు సాయం గురించి మాట్లాడితే ప్రభుత్వం దాటివేత ధోరణి కొనసాగిస్తోంది. అమరుల కుటుంబాలకు ఎలాంటి సాయం అందిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. అమరుల త్యాగఫలితమే రాష్ర్టం ఏర్పాటు. ఆయినా ఆ కుటుంబాలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. - ఎర్రబెల్లి దయాకర్రావు, టీడీపీ ఎమ్మెల్యే సిర్పూర్ పరిశ్రమను పునరుద్ధరించాలి సిర్పూర్ పరిశ్రమను తక్షణమే పునరుద్ధరించాలి. ఇప్పటికే కొందరు కార్మికులను తొలగించడంతో రోడ్డున పడ్డారు. మిగతా కార్మికుల్లో అ భద్రత భావం నెలకొంది. టీఆర్ఎస్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హమీ నిలబెట్టుకోవాలి. - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే అమరుల గురించి మాట్లాడే హక్కులేదు టీడీపీ సభ్యులు అమరవీరుల గురించి మాట్లాడడం దెయ్యలు వేదాలు వల్లించినట్లుంది. వాస్తవానికి అమరుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. శాసనసభలో సైతం కేసీఆర్ అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని ప్రకటించారు.టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడితే వారి ఆత్మలు ఘోషిస్తాయి. టీడీపీ-కాంగ్రెస్ దొందుదొందే. అమరులను ఆదుకునేందుకు ఉద్యోగులు ఒక్క రోజు వేతన ం ఇస్తే అప్పటి సీఎం పట్టించుకోలేదు. కేసీఆర్ దీక్ష సమయంలో తెలంగాణ ఇచ్చి ఉంటే ఇన్నీ ప్రాణ త్యాగాలు జరిగేవి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాల పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటికే బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించి 459 మందిని గుర్తించింది. మిగితా త్యాగధనులను గుర్తించమని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. -వి. శ్రీనివాస్ గౌడ్, చల్లాదర్మారెడ్డి, గుణేష్ గుప్తా, ఏ రమేష్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పొన్నాలను శిక్షించాలి దళితుల భూముల వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను చట్టపరంగా శిక్షించాలి. రాజ్యంగ బద్ధంగా చట్టాలు తెలిసి కూడా దళితులకు అసైన్డ్ చేసిన భూములను కొనుగోలు చేయడం నేరమే. 1970 చట్టం ప్రకారం అసైన్డ్ భూములను కొనుగోలు చేసినా.. అమ్మినా చట్టపరంగా నేరమే. పొన్నాల టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. - యాదగిరి రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే