-
Fact Check: రైతుబజార్లపై ‘కుళ్లు’ కథ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూరగాయ రైతులు, వినియోగదారులకు నష్టం కలిగించేలా ఈనాడు రామోజీరావు మరో అభూతకల్పనల కథను అచ్చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పన, వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలు, ఇతర నిత్యావసరాలను మార్కెట్ ధరలకంటే తక్కువకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు బజార్ల లక్ష్యాన్ని దెబ్బతీసేలా ‘రైతు బజార్లలోనూ బాదుడే బాదుడు..’ అంటూ ఓ చెత్త కథనాన్ని అల్లారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా రైతుబజార్లను బలోపేతం చేసింది. వాటిని ఆధునీకరించింది. కొత్త రైతు బజార్లనూ నిర్మించింది. పైగా చంద్రబాబు హయాంలోలాగా దళారీలు లేకుండా, కేవలం రైతులే కూరగాయలు అమ్మేలా, వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకుంది. పైగా, రైతుబజార్లు ఆర్థిక అవసరాల కోసం మార్కెట్ కమిటీల మీద ఆధారపడకుండా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్ల వ్యవస్థలో ఇలాంటి మార్పులను రామోజీ ఎప్పుడూ చూసి ఉండరు. చంద్రబాబు హయాంలో ఈ వ్యవస్థ ఎంత దైన్యస్థితికి చేరిందో అందరికీ తెలిసిందే. ఒక్క రైతుబజారూ బాగుపడలేదు. బాబు హయాంలో రైతుబజార్లు దళారీల అడ్డాగా మారిపోయాయి. దళారులు వినియోగదారులను నిత్యం దోపిడీ చేసేవారు. కనీస వసతులు లేక రైతులు, వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతం. నేడు ఈ అవలక్షణాలన్నింటి నుంచి బయటపడి, వినియోగదారులకు మంచి సేవలందిస్తున్నాయన్నదే రామోజీ బాధ. ఈరోజు ఆధునికంగా రూపుదిద్దుకున్న రైతు బజార్లపై చెత్త రాతలు రాసి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ రైతుబజార్లకు రైతులు రాకూడదని, దళారీలు, వ్యాపారులే వీటిలో వ్యాపారం చేసుకోవాలని, వినియోగదారులను దోపిడీ చేయాలన్నదే రామోజీ లక్ష్యం. అందుకే ఈ అడ్డగోలు కథనం. ఈ కథనంలో వాస్తవాలేమిటో చూద్దాం.. బాబు హయాంలో రైతుబజార్ల దీనావస్థ చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 87 రైతుబజార్లుండేవి. పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త వాటి ప్రతిపాదనలను చంద్రబాబు ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. బాబు ఐదేళ్లలో మొక్కుబడిగా మార్కెట్యార్డు స్థలాల్లో 11 రైతుబజార్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో ఉన్న రైతుబజార్లలో మూడొంతులు శిథిలావస్థకు చేరుకోవడంతో వినియోగదారులు, రైతులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిత్యం అవస్థలు పడేవారు. అయినా ఆ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. రైతుబజార్లను ఆధునీకరించాలన్న ఆలోచనే చేయలేదు కొత్తగా 54 రైతుబజార్లు కన్పించడం లేదా? వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుబజార్ల విస్తరణ, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019 నుంచి 2023 వరకు రూ.40 కోట్లతో 54 రైతుబజార్లు కొత్తగా ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే 22 రైతుబజార్ల నిర్మాణాలు పూర్తికాగా, 17 వినియోగంలోకి వచ్చాయి. మరో 5 ఫిబ్రవరికల్లా అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 32 రైతుబజార్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ దశలో 11 ఉండగా, బేస్మెంట్ లెవల్లో 8, రూఫ్ లెవల్లో 8, రూఫ్లెవల్ విత్ సీలింగ్ దశలో మరో ఐదు ఉన్నాయి. వీటిని కూడా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఏటా పెరుగుతున్న రైతులు, వినియోగదారులు ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మించిన రైతుబజార్లతో కలిపి రాష్ట్రంలో 115 రైతుబజార్లున్నాయి. వీటి ద్వారా 10 వేల మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 15 వేల మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. రోజూ 150 నుంచి 200 టన్నుల కూరగాయలను గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారు. సగటున రోజుకు 6 లక్షల మంది వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్కో రైతు బజార్లో రోజూ రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే 10 నుంచి 15 శాతం తక్కువ ధరలకే తాజా కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతుబజార్లకు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి రైతుబజారులో అత్యాధునిక సౌకర్యాలు ప్రస్తుతం ఉన్న రైతుబజార్ల ఆధునికీకరణకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా రూ. 4.50 కోట్లతో ప్రతి రైతుబజారులో శిథిలమైన షెడ్ల పునరుద్ధరణ, రక్షిత తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్లు, రన్నింగ్ వాటర్ సదుపాయంతో మరుగుదొడ్లు, సోలార్ రూఫ్ ప్యానల్స్, డిజిటల్ డిస్ప్లే బోర్డులు వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో శిథిలమైన రైతుబజార్లన్నీ ఆధునీకరిస్తున్నారు. ధరలు పెరిగినా, తగ్గినా మార్కెట్లో జోక్యం సీఎం యాప్ ద్వారా రోజూ బహిరంగ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ ధరలు పతనమైనా, పెరిగినా మార్కెట్లో జోక్యం చేసుకుంటూ రైతులు, వినియోగదారులకు మేలు జరిగేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరలు పెరిగిన ప్రతిసారీ రైతులు, వ్యాపారుల నుంచి మార్కెటింగ్ శాఖ ద్వారా వస్తువులు కొని, వినియోగదారులకు తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా గిట్టుబాటు ధరకే కొంటోంది. టమాటా, ఉల్లిపాయలతోపాటు బత్తాయి, పైనాపిల్ వంటి ఉద్యాన ఉత్పత్తులను సైతం మద్దతు ధరకు కొని, రైతుబజార్లలో సబ్సిడీ రేట్లకే విక్రయించింది. ఇలా రూ.64.04 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లి, 1.28 కోట్ల విలువైన 1,425 టన్నుల టమాటా, రూ.5 కోట్ల విలువైన 4,109 టన్నుల బత్తాయి, రూ.కోటికి పైగా విలువైన పైనాపిల్ను రైతుబజార్లలో సబ్సిడీ ధరకే అందించింది. 75 రైతుబజార్లు స్వయం సమృద్ధి ఇప్పటివరకు రైతుబజార్లు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం పూర్తిగా మార్కెటింగ్ కమిటీలపై ఆధారపడేవి. కేంద్రం మార్కెట్ సెస్ను రద్దు చేయడంతో, రైతుబజార్ల నిర్వహణ, జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా ప్రతి రైతుబజారు స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతుబజార్ల స్టాల్స్ అద్దెలను సవరించడం, పార్కింగ్, సేంద్రీయ ఉత్పత్తులు, ఫిష్ ఆంధ్ర స్టాల్స్ ఏర్పాటు, ప్రకటన బోర్డుల ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకొంది. దీంతో 75 రైతుబజార్లు ఆర్ధిక పరిపుష్టి సాధించాయి. ఇప్పుడివి ఆర్థిక అవసరాల కోసం మార్కెట్ కమిటీలపై ఆధార పడాల్సిన అవసరం లేదు. కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ సమయంలో రైతులు నష్టపోకూడదని, వినియోగదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒక రైతుబజార్ను 3, 4 భాగాలుగా విభజించి, ప్రజలకు మరింత చేరువలో ఏర్పాటు చేసింది. మొబైల్ రైతుబజార్లను సైతం నెలకొల్పింది. వీటి వల్ల కూరగాయలు అందుబాటులో ఉండటంతోపాటు రైతులు, వినియోగదారులను వైరస్ వ్యాప్తి నుంచి కాపాడింది. విజయవాడ అజిత్సింగ్ నగర్ రైతుబజారులో కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే యంత్రం ఇంకా వినియోగంలోకే రాలేదు. అయినా ఈనాడు పనిగట్టుకొని అది మూలన పడిందని రాసింది. దాదాపు అన్ని రైతుబజార్లలో మరుగుదొడ్లు నిక్షేపంగా పనిచేస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన బాపట్ల, ఆరిలోవ రైతుబజార్లను ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. అయినా కళ్లుండీ కబోదిలా ఈనాడు అడ్డగోలుగా కథనం అచ్చేసింది. -
AP: రైతు బజార్ల సిబ్బందికి గుడ్న్యూస్.. భారీగా జీతాల పెంపు
సాక్షి, అమరావతి: రైతుబజార్ల సిబ్బంది వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రైతుబజార్లు ఉన్నాయి. ప్రతి రైతు బజారుకు ఓ ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఆదాయాన్ని బట్టి కొన్నింటిలో సూపర్వైజర్లు కూడా ఉన్నారు. ఎస్టేట్ ఆఫీసర్లు లేని చోట సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం 75 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 28 మంది సూపర్వైజర్లు, 212 మంది సెక్యూరిటీ గార్డులు, మరో ఐదుగురు హార్టికల్చర్ అసిస్టెంట్లు (సూపర్వైజర్లు) ఉన్నారు. వీరిలో 188 మంది కాంట్రాక్టు, 132 మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం ప్రతి నెలా రూ.57 లక్షలు, రైతు బజార్ల నిర్వహణకు మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. 2021వరకు స్థానిక మార్కెట్ కమిటీలే ఈ ఖర్చులు భరించేవి. ప్రభుత్వ చర్యల ఫలితంగా 76 రైతుబజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. ఏటా రూ.11.87 కోట్ల వార్షికాదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మిగిలిన రైతుబజార్లు కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాగా, రైతుబజార్లలో రైతులు, వినియోగదారుల మధ్య వారధిలా పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి రూ.26 వేలకు, సూపర్వైజర్లకు రూ.15 వేల నుంచి రూ.18,500కు వేతనాలు పెరగనున్నాయి. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి రూ.24 వేలకు, సూపర్వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెరగనున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపును డిసెంబర్ నెల నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్ కీలక ప్రకటన -
తక్కువ రేటుకే టమాటా...టమోటో ధరలకు ఏపీ ప్రభుత్వం కళ్లెం
-
సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని రైతు బజార్ల ప్రాంగణాల్లో సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్ అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర రైతు బజార్ల సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించి డీపీఆర్ను రూపొందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం విశాఖలో ఎంవీపీ కాలనీ రైతు బజార్ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ లుక్తో రైతు బజార్ ప్రాంగణాల్లో విక్రయాలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో 3 నుంచి 5, విజయనగరం జిల్లాలో 2 నుంచి 3 కంటైనర్ స్టోర్స్ను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కంటైనర్ స్టోర్స్ను విస్తరిస్తామని చెప్పారు. -
వంట నూనెలకు రైతు బజార్లలో అదనపు కౌంటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల ధరలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకు అమ్మాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వంట నూనెలపై సీఎస్ అధ్యక్షతన ప్రైస్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సన్ ఫ్లవర్, వేరుశనగ, పామాయిల్ నూనెలు ఎమ్మార్పీకే ప్రజలకు అందాలని చెప్పారు. ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద వివిధ రైతు బజార్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, చౌక ధరల దుకాణాల్లో కూడా నూనెలు విక్రయించాలని ఆదేశించారు. స్వయం సహాయక బృందాలు, మొబైల్ వాహనాల ద్వారా కూడా నూనెలు అమ్మాలని చెప్పారు. హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు, సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్, స్టాకిస్టులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్కు లోబడి స్టాకు పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అక్రమ స్టాకు గుర్తిస్తే దానిని స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్లోకి వెంటనే విడుదల చేసి తక్కువ ధరకు అమ్మాలని చెప్పారు. రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, డీఎస్వోల నేతృత్వంలో నిఘా పెట్టి అక్రమంగా నిల్వ చేసే వారిపై 6ఎ కేసులు నమోదు చేసి స్టాకును స్వాధీనం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఈవో కార్యదర్శి గిరిజా శంకర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వంట నూనెల ధరల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలో వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సివిల్ సప్లైస్ కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, వ్యవసాయ–మార్కెటింగ్ శాఖ కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, మార్క్ఫెడ్ డైరెక్టర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ ఎండీ, ఏపీ ఆయిల్ఫెడ్ ఎండీ, రైతు బజార్ల సీఈవో, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీ ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు వంట నూనెల ధరలను సమీక్షించి, సంబంధిత విభాగాల అధికారులకు సూచనలిస్తుందని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో స్థానిక మార్కెట్లలో ధరలను పెంచాల్సిన అవసరం లేదు. అయినా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. వ్యాపారులు, డీలర్ల వద్దనున్న పాత నిల్వలను పాత ధరలకే అమ్మాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement