-
నారా లోకేశ్ టీమ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, మంగళగిరి: టీడీపీ నేత నారా లోకేశ్కు బిగ్ షాక్ తగిలింది. లోకేశ్పై మంగళగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి తీవ్ర విమర్శలు చేశారు. ట్విటర్లో మార్ఫింగ్తో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్, అతని ఐటీ టీంపై చర్యలు తీసుకోవాలని ఆమె.. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
లోకేశ్పై మంగళగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి తీవ్ర విమర్శలు
-
అసభ్యకర ప్రవర్తన: యాదగిరిగుట్ట రూరల్ సీఐ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈనెల 21న అవినీతి ఆరోపణలపై సరూర్నగర్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. భువనగిరి డివిజన్ పరిధిలోని యాదగిరిగుట్ట రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) జీ నర్సయ్య సస్పెండ్ అయ్యారు. స్టేషన్లోని ఓ మహిళా పోలీస్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్ నర్సయ్య ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ పైఅధికారుల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిసింది. దీంతో విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నర్సయ్య స్థానంలో ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అటాచ్గా ఉన్న ఇన్స్పెక్టర్ బీ నవీన్ రెడ్డిని యాదగిరిగుట్ట రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు .. -
‘మంగళగిరి’లో లాకప్డెత్?
► గుండెపోటుతో మృతి చెందినట్లుగా సెటిల్మెంట్ ► పోస్ట్మార్టం నిర్వహించకుండానే మృతదేహం తరలింపు మంగళగిరి: మంగళగిరి పట్టణంలోని రూరల్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక యువకుడు అనుమానాద స్థితిలో మృతి చెందడం, పోలీసులు కొట్టడం కారణంగానే మృతి చెందినట్లు ఆరోపణలు రావడం, లాకప్డెత్ అంటూ జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది. మంగళగిరి మండలంలోని కురగల్లు గ్రామానికి చెందిన నల్లిబోయిన వెంకటేశ్వరరావు(36)కు గంగమ్మతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. పొలం పనులు చేసుకునే వెంకటేశ్వరరావుకు గంగమ్మకు ఈ నెల ఐదో తేదీ రాత్రి గొడవ జరిగింది. ఆవేశంలో వెంకటేశ్వరరావు భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో గంగమ్మ గాయాలపాలై ప్రాణాలతో బయటపడగా ఆమె సోదరుడు ఈ నెల 6వ తేదీ ఉదయం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 6వ తేదీ ఉదయం 11 గంటలకు వెంకటేశ్వరరావుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అదే రోజు రాత్రి స్టేషన్లో ఏం జరిగిందో తెలియదు కాని వెంకటేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చినకాకాని గ్రామంలోని ప్రైవేటు ఆసుపత్రి మార్చురీకి తరలించి కురగల్లు గ్రామ సర్పంచ్కు ఫోన్ చేసి వెంకటేశ్వరరావు గుండెపోటుతో రాత్రి మృతి చెందడంతో ఆసుపత్రికి తరలించామని సమాచారమిచ్చారు. సర్పంచ్ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారంతా ఆసుపత్రికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావు మృతి చెందిన సమాచారం గ్రామంలో అందరికి తెలియడంతో శుక్రవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు ఉపక్రమించారు. మృతుడు తల్లి మంగమ్మతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది. దీంతో ఆందోళన చెందిన పోలీసులు కొందరు టీడీపీ పెద్దలను రంగంలోకి దించి సెటెల్మెంట్ చేసి మృతుడు గుండెపోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులను, గ్రామస్తులను ఒప్పించి మృతదేహానికి పంచనామా కూడా లేకుండా తప్పించుకున్నారని సమాచారం. దీనిపై సీఐ రావూరి సురేష్బాబును వివరణ కోరగా గురువారం అరెస్ట్ చేశామని ఆరోగ్యం బాగాలేదని చెబితే ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందాడన్నారు. -
తోడికోడళ్ల మృతిపై వీడని మిస్టరీ..!
రాజంపేట: మండలంలోని సిద్దులపల్లె కొత్తరాచపల్లెలో శుక్రవారం మృతి చెందిన తోడికోడళ్ల కేసుకు సంబంధించి మిస్టరీ ముడివీడలేదు. పోలీసుల విచారణలో దివ్య, జ్యోష్న మృతులపై అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి. మృతుల సంబంధీకుల్లో పలు అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా మృతదేహాలకు శుక్రవారం రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం గది వద్దకు మృతిరాలి సంబంధీకులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. తమ బిడ్డల మృతికి అత్తింటివారే కారణమని దివ్య, జ్యోష్న తల్లిదండ్రులు విలపించారు. తమ బిడ్డలు అత్తగారింట్లో పడుతున్న కష్టాలు వివరించేవారని, ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ వచ్చామని వారు తెలిపారు. కాగా జ్యోష్న తల్లి అత్తింటిలోనే శవాన్ని పూడ్చిపెట్టాలని, మృతికి కారణమైన వారిని ఊరితీయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచే మృతుల సంబంధీకులు పెద్దఎత్తున రాజంపేట రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు తరలివచ్చారు. తోడికోడళ్ల సంబంధీకుల నుంచి ఫిర్యాదు తీసుకొని రూరల్ సీఐ హేమసుందరరావు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామన్నారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించామని తెలిపారు. అదుపులో దివ్య భర్త.. తోడికోడళ్ల మృతిలో దివ్య భర్త వెంకటేశ్వరరాజు వ్యవహరించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దివ్య భర్త కువైట్లో ఉంటున్నాడు. మృతి చెందిన సమాచారంతో కువైట్ నుంచి హుటాహుటిన రాజంపేటకు శుక్రవారం చేరుకున్నారు. స్ధానిక ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న వెంకటేశ్వరరాజు వైఖరిని మృతుల సంబంధీకులు జీర్ణించుకోలేకపోయారు. వారిలో ఆగ్రహావేశం కట్టలు తెంచుకుంది దీంతో అక్కడే ఉన్న పోలీసులు వెంకటేశ్వరరాజును అదుపులోకి తీసుకొని రూరల్ పోలీసుస్టేషన్కు తరలించారు. కువైట్ నుంచి వచ్చిన వెంకటేశ్వరరాజును తోడికోడళ్ల కేసుకు సంబంధించి ముద్దాయిగా అదుపులోకి తీసుకున్నామని రాజంపేటరూరల్ ఎస్ఐ నాగరాజు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement