breaking news
rubber
-
'రబ్బరు' విప్లవం
మన్యం కొండల్లో ప్రకృతి ప్రసాదించిన చల్లని వాతావరణం ఇప్పుడు గిరిజన రైతుల పాలిట వరంగా మారుతోంది. మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు అనుకూలంగా ఉన్నందున ఇక్కడ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు రంపచోడవరం ఐటీడీఏ కసరత్తు మొదలుపెట్టింది. మూడు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన ఈ రబ్బరు సాగు ప్రస్థానం, ఇప్పుడు వేల ఎకరాలకు విస్తరించడమే కాకుండా.. స్థానికంగానే వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పడే స్థాయికి చేరింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. రంపచోడవరం: అల్లూరి జిల్లాలో సముద్ర మట్టానికి ఎత్తులో ఉండి, చల్లని వాతావరణం కలిగిన మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు రబ్బరు ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ఐటీడీఏ అధికారులు ఈ ప్రాంతంలో రబ్బరు పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1994లో మొదలైన ప్రస్థానం.. రబ్బరు బోర్డు పర్యవేక్షణలో 1994లోనే ఇక్కడ సాగుకు పునాదులు పడ్డాయి. ఐటీడీఏ – రబ్బరు బోర్డు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి. బ్లాక్ ప్లాంటేషన్–1: దేవరపల్లి గ్రామంలో 1994లో 50 హెక్టార్లలో తొలిసారిగా రబ్బరు మొక్కలు నాటారు. బ్లాక్ ప్లాంటేషన్–2 : పుజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 1998 – 2003 మధ్య 35 మంది రైతులకు చెందిన 45 హెక్టార్లలో సాగు చేపట్టారు. బ్లాక్ ప్లాంటేషన్–3 : పందిరిమామిడి కోటలో 2009–2013 మధ్య వంద హెక్టార్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన మూడేళ్ల వరకు రైతులకు సాంకేతిక సహకారం అందించగా, ఆ తర్వాత రెండేళ్లకు పాల ఉత్పత్తి ప్రారంభమై రైతులకు ఆదాయం మొదలైంది. ఐటీడీఏ సహకారంతో విస్తరిస్తున్న సాగు గతంలో సాంకేతిక లోపాలతో కొన్ని మొక్కలు దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం గిరిజనులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది: » రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం (అప్పర్ పార్ట్) పరిధిలో 3 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులను సిద్ధం చేస్తోంది. » మిగిలిన రెండేళ్లలో మరో 2వేల ఎకరాల్లో సాగు విస్తరించనున్నారు. ఈ ప్రాంతంలో రబ్బరు బోర్డు ద్వారా 2024లో 370 ఎకరాలు, 2025లో 501 ఎకరాల్లో సాగు చేపట్టారు.» ఎకరానికి 450 కిలోల వరకు రబ్బరు షీట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ. 170 వరకు ఉంది రూ. 5 కోట్లతో పరిశ్రమ మారేడుమిల్లిలో పండుతున్న రబ్బరుకు స్థానికంగానే విలువల జోడింపునకు రూ. 5 కోట్ల వ్యయంతో వస్తువుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ. 2.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. స్థల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రబ్బరు బోర్డు నుంచి డీపీఆర్ అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రబ్బరు సాగుచేసే రైతులకు గిట్టుబాటు ధర లభించనుంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం పందిరిమామిడి కోటలో ఆరు ఎకరాల్లో 1200 రబ్బరు మొక్కలు ఉన్నాయి. ఏడాదికి రూ. 8లక్షలు వరకు ఆదాయం వస్తుంది. రబ్బరు పాల సేకరణ కోసం గ్రామంలో కొంత మందికి ఉపాధి కూడా కలి్పస్తున్నా. రబ్బరు సాగుకు మరింత ప్రోత్సాహం ఇస్తే ఇంకా రైతులు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. – కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడి కోట స్మోక్ రూమ్లకు ప్రతిపాదనలు రబ్బరు సాగు చేసే రైతుల సంఖ్య పెరగడంతో రబ్బరు షీట్ల తయారీకి స్మోక్ రూమ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఐదు స్మోక్ రూమ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. మూడు వేల ఎకరాల్లో రబ్బరు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – దేవనందం, పీహెచ్వో, రంపచోడవరంఆదాయం పెరుగుతుంది రబ్బరు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుతో సాగు రైతులకు ఆదాయం పెరుగుతుంది. రబ్బరు ఆధారిత పరిశ్రమలో రైతులను భాగస్వాములను చేస్తే బాగుంటుంది. ఈ దిశగా రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలి. – కత్తుల రామిరెడ్డి, వేటుకూరు, మారేడుమిల్లి మండలంఆన్లైన్లో మార్కెటింగ్ రబ్బరు సాగు తొలుత దేవరపల్లిలో ప్రారంభమైంది. ఉత్పత్తి చేసిన రబ్బరును ఆన్లైన్ మార్కెట్లో ధరల వివరాలు తెలుసుకుని అమ్ముకుంటున్నాం. ఎటువంటి మోసాలకు అవకాశం లేదు. రబ్బరు బోర్డు, ఐటీడీఏ సహకారంతో మెరుగైన ఆదాయం పొందగలుగుతున్నాం. – పల్లాల సూర్యవతి, దేవరపల్లి -
'కలుపు'గోలు వ్యాపారం
గార: అదో కలుపు మొక్క.. రబ్బరు మొక్కలని, కంపు మొక్కలని రైతులు పిలుచుకుంటూ ఉంటారు. చెరువులో విపరీతంగా పెరిగే ఈ మొక్కలతో ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. పైగా చేపలు పెంచేవారికి, రైతులకు దీని వల్ల ఇబ్బంది కూడా. కానీ ఇప్పుడు అదే మొక్కతో భలే వ్యాపారం సాగుతోంది. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘ఐపోమియా కార్నియా’. ఉదయాన్నే పుషి్పంచే ఈ మొక్కను మారి్నంగ్ గ్లోరీ అని కూడా పిలుస్తారు. తేమ ఉన్న ప్రాంతాలు, నీరు ఉన్న చెరువులు, జలాశయాల్లో విరివిగా పెరుగుతుంది. వంశధార, నాగావళి నదీ ప్రాంత సాగునీటి చెరువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చేపలు పెంచే వారితో పాటు ఉపాధి వేతనదారులు ఈ చెరువుల్లో పనులు చేయాలంటే ముందు వీటిని తొలగించాల్సి ఉంటుంది. వీటిని తొలగించేందుకు ఎలాంటి డబ్బులివ్వరు. కానీ ఈ మొక్కలను ఇటీవల కొందరు తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. రబ్బరు వంటి కాడలు ఉండటం వల్ల వీటిని పొలాల్లో ట్రాక్టర్లు దిగిపోయే సమయాలు, వరి కుప్పలు ఇంటికి తరలించే సమయాల్లో గతంలో వాడేవారు. ప్రస్తుతం ఆధునిక యంత్రాలు రావడంతో అవి బురదలో కూరుకుపోకుండా వీటి ని వాడుతున్నారు. ముఖ్యంగా నదుల నుంచి ఇసుకను తరలించేందుకు వీలుగా బాటలు వేస్తుంటారు. వీటిని ఇసుకపై వేసి మళ్లీ కొద్దిగా ఇసుక వేసి, మరోసారి ఈ రబ్బరు మొక్కలను బాటలు నిండా పరుస్తారు. 40 టన్నుల ఇసుక వాహనమైనా ఈ కంపు మొక్కలు వేసిన బాటలో దిగిపోకుండా సేఫ్గా నదిలోంచి ఒడ్డుకు ఉపయోగిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇసుక వ్యాపారం చేస్తున్న వారికి ఇది చక్కగా ఉపకరిస్తోంది. ఎండిపోకుండా, రబ్బరులా సాగే గుణం ఉండటంతో ఇసుక వ్యాపారస్తులు వాడుతుంటారు. వీటిని జిల్లాలో ఎచ్చెర్ల మండలం వాసులు చెరువుల నీటిలో దిగి కోత కోసి వెంటనే లోడుల ద్వారా అమ్ముతున్నారు. ట్రాక్టర్ లోడు రూ.15 వేలు వరకు గిట్టుబాటు అవుతోందని చెబుతున్నారు. కంపు మొక్కలతో చెరువులకు ఇబ్బందే చెరువుల్లో కంపు మొక్కలు ఏడాదికేడాది పెరిగి మొత్తం నిండిపోతాయి. దీని వల్ల చెరువంతా కప్పేసినట్టు ఉంటుంది. ఆవు లేదా ఎద్దులు వెళితే పట్టుకోవడానికి ఇబ్బందే. అదేవిధంగా చేపలు పట్టేందుకు వెళ్లే వారికి అడ్డుగా ఉంటాయి. – శీర ఎర్రప్పడు, రైతు, వాడాడ ఫోన్ ద్వారా ఆర్డర్చెరువుల్లో నీటిలో ఉండే మొక్కలను కోసేందుకు మాత్రమే మనుషులను పెడతాను. ఎక్కువగా ఇసుక ర్యాంపు పాటదారులు జిల్లాలో ఎక్కడైనా నాకు ఫోన్ ద్వారా ఆర్డర్ పెడతారు. అక్కడికి వెళ్లి అమ్మేస్తుంటాను. – కూర్మారావు, మేస్త్రీ, ఎచ్చెర్ల మండలం -
దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్గా మార్చి..
అవమానిస్తే కుంగిపోయి కూర్చొండిపోతాం. మన బతుకు ఇంతే అనే స్థితికి వచ్చేస్తాం. కానీ కొందరే ఆ అవమానానికి సరైన సమాధానం చెబుతారు. మరోసారి అలా దూషించే సాహసమే చెయ్యనీకుండా చేసి..తప్పు గ్రహించుకునేలా చేస్తారు. బాధపెట్టిన నోళ్ల చేతే గౌరవం పొందేలా చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ డిజైనర్ సుధీర్ రాజ్భర్. ఏ మాటతో అవమానించి దూషించేవారు. ఆ మాటతోనే గౌరవం పొందడమే గాక..దూషణాలనే ఎలా అలంకారప్రాయంగా మార్చుకోవాలో చూపి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయగాథ వింటే..బతుకు విసిరే సవాళ్లకు చావుదెబ్బ కొట్టేలా సమాధానం చెప్పడం ఎలాగో తెలుస్తుంది. మరీ సుధీర్ స్టోరీ ఏంటో చూద్దామా..!భారతీయ కుల వ్యవస్థలో, 'చమర్' అనే పదాన్ని అణగారిన కులాలను దూషించడానికి ఉపయోగించే వారు. పూర్వం దళితులకు కులవృత్తి తోలుపని. వాళ్లని చర్మకారులు అని కూడా పిలుస్తారు. మన ఇప్పుడు చెప్పుకుంటున్న డిజైనర్ సుధీర్ రాజ్ భర్(Sudheer Rajbhar(36)) కూడా ఆ కులానికి చెందినవాడే. అతడు ఉత్తరప్రదేశ్లోని తన సొంతూరుకి వెళ్లినప్పుడల్లా "భర్", "చమర్" వటి కులదూషణ పదాలతో అవమానాలపాలయ్యేవాడు. అయితే అక్కడ అది సర్వసాధారణం. అక్కడి ప్రజలకు అదొక ఊతపదంలా ఆ పదాలు నోళల్లో దొర్లేవి. ఇక ఆ మాటలు పడుతున్న దళితులకు కూడా అవి అలవాటైపోయాయి. అందువల్ల వాళ్లెవ్వరూ దీన్ని వ్యతిరేకించే సాహసం కానీ, అలా పిలవొద్దని తెగేసి చెప్పడం గానీ చేసేవారు కాదు. అలాంటి స్థితిలో పెరిగిన సుధీర్ వాటన్నింటిని ఆకళింపు చేసుకునే బతికాడు. అతడి బాల్యం ముంబై(Mumbai)లోని చౌల్లో జరిగింది. అక్కడ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. కొందరూ బాగా స్థిరపడిన కళాకారుల వద్ద పనిచేసే అవకాశం లభించింది కానీ, కేవలం తన కులం కారణంగా తన పనికి ఎలాంటి క్రెడిట్ రాకపోవడం అనేది కాస్త కష్టంగా ఉండేది సుధీర్కి. ముందు తనలాంటి వెనుబడిన కులాల నుంచి వచ్చిన ప్రజలు గౌరవంగా ఉండేలా ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో 2015లో బీఫ్పై నిషేధం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ బలహీన వర్గాలకు ఉపాధి దొరకక కష్టాలు మొదలయ్యాయి. చాలామంది నిరుద్యోగులుగా మారిపోయారు. అప్పుడే ఈ తోలు కళాకారులకు సహాయపడే ఒక మాధ్యమాన్ని తయారు చేయడానికి సుధీర్ ముందుకు వచ్చారు. ఏ పదంతో తన కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఆ పేరుతోనే ఒక ప్రాజెక్టు చేపట్టి మార్పు తీసుకురావాలని భావించాడు. అలా సుధీర్ 2017లో ఆ తోలు కళాకారులకు ఉపాధి కల్పించేలా "చమర్" అనే స్టూడియో(Chamar Studio)ని ప్రారంభించారు. ఇక్కడ చమర్ అని పదం ఉపయోగించడానికి వివరణ ఇస్తూ..తన కమ్యూనిటీ వాళ్లను ఏ పదంతో అవమానించే ప్రయత్నం చేసేవారో ఆ పదంతోనే స్టూడియోకి నామకరణం చేసినట్లు తెలిపారు. దీనిలో తోలు ఉత్పత్తులకు బదులుగా రీసైకిల్ చేసిన రబ్బరు(recycled waste rubber)తో భర్తీ చేయడం ద్వారా చేతివృత్తులవారి జీవనోపాధిని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చమర్ స్టూడియో అత్యంత అందంగా రూపొందించిన మినిమలిస్ట్ బ్యాగులు, వాలెట్లు, బెల్టులు, ఇతర ఉత్పత్తులను విక్రయిస్తుంది. అంతేగాదు డిజైనర్ ఉత్పత్తులను సరమైన ధరలోనే తయారు చేస్తుంది. కాబట్టి అత్యంత ఖరీదైన ధర రూ. 39,000 వరకు ఉండగా, అత్యల్ప ధర రూ. 1,500 నుంచి ప్రారంభమవుతుంది. అలా ఈ స్టూడియో ఉత్పత్తులు ప్రముఖ లగ్జరీ బ్రాండ్(Luxury Brand)గా అనతికాలంలోనే పేరుగాంచాయి. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 50% కళాకారులకు, రాజ్భర్ ఫౌండేషన్, ది చమర్ ఫౌండేషన్కు తిరిగి వెళ్తుంది.సారూప్య బ్రాండ్లతో పోటీని స్థాపించడం కంటే, మార్పు, సాధికారతకు ఒక సాధనంగా కులతత్వ నిందను ఉపయోగించడం ఈ స్టూడియో ఆలోచన అని చెబుతారు సుధీర్. ఈ బ్రాండ్ పేరుతో తయారైన వస్తువుల కారణంగా ప్రజలకు తమను అవమానించే పదం గురించి తెలియడమేగాక, ఆలోచించడం వంటివి చేస్తారు. తద్వారా ఇలాంటి అవమానాలు, దూషణలకు తెరపడుతుందనేది ఆయన ఆశ. భారత ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగం తమ కమ్యూనిటికి చెందిన వారు తయారు చేసే ఉత్పత్తులు. అలాంటప్పడు వారెందుకు ఇంతలా వివక్షకు గురవ్వుతున్నారనే బాధలోంచి పుట్టుకొచ్చిందే ఈ స్టూడియో అని గర్వంగా చెబుతారు సుధీర్. ఆయన తను నేర్చుకున్న కళతో పదిమందికి ఉపయోగపడేలా ముఖ్యంగా తన కమ్యూనిటీకి చెందిన వారు తలెత్తుకుని గౌరవంగా బతికేలా చేస్తున్నాడు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు అంటూ సానుభూతి, ధన సాయం కాదు..వాళ్లు కూడా మనలాంటి మనుషులే అని గుర్తింపు, గౌరవం అని అంటారు సుధీర్. కళతో మానసిక ఆరోగ్యం నయం చేయడమే కాదు సమాజం తీరుని, దృకపథాన్ని మార్చి బాగు చెయ్యొచ్చని డిజైనర్ సుధీర్ తన చేతలతో చేసి చూపించాడు. అంతేగాదు అవమానానికి ప్రతిఘటించడం బదులు కాదు, అవతలి వాడు చేసిన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా బతికి చూపాలి అని వెలుగెత్తి చెప్పారు. View this post on Instagram A post shared by CHAMAR (@chamarstudio) (చదవండి: జేఈఈ మెయిన్లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్మెంట్స్కి వెళ్లలేదు..) -
టీమ్ ఇండియా రబ్బరు బంతులతో ప్రాక్టీస్... ఎందుకంటే?
-
వారెవ్వా! రబ్బర్ ఫ్లోరింగ్.. ఇంటీరియర్లో నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: ఇంటీరియర్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆధునిక పోకడలు, అభిరుచుల మేరకు వైవిధ్యభరితమైన ఇంటీరియర్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా రబ్బర్ ఫ్లోరింగ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది ఇంటీరియర్ ప్రియులు గ్రానైట్, మార్బుల్స్, టైల్స్ బదులుగా రబ్బర్ ఫ్లోరింగ్ను ఎంపిక చేసుకుంటున్నారు. గదికో రకంగా డిజైనింగ్ చేయిస్తున్నారు. సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ అనేవి జిమ్లు, క్రీడా మైదానాలలో వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలోనూ ఈ తరహా ఫ్లోరింగ్ను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి పిల్లల గదులలో రబ్బర్ ఫ్లోరింగ్ను వేయిస్తున్నాయి. పై అంతస్తులో పిల్లలు ఆడుకుంటే కిందికి శబ్దాలు వినిపించకుండా, కిందపడినా దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఈ రబ్బర్ ఫ్లోరింగ్ను ఎంపిక చేస్తున్నారు. తడిగా ఉంచే కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాంతాలలో కూడా వీటిని వేసుకోవచ్చు. రబ్బర్ ఫ్లోరింగ్ ఉత్పత్తులు మ్యాట్స్, టైల్స్, రోల్స్ రూపంలో, విభిన్న శైలి రంగులలో, డిజైన్లలో లభ్యమవుతాయి. వీటికి దీర్ఘకాలం మన్నిక ఉంటుంది. సరిగ్గా నిర్వహణ చేస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఇతర ఫ్లోరింగ్లతో పోలిస్తే చిరిగిపోవటం, పాడైపోవటం వంటివి చాలా తక్కువ. ఫంగస్ కూడా పట్టదు. ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్లు.. పెద్ద లాభాలు! -
రబ్బర్ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్ హాజరు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వ వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యే విధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దొడ్డిదారులు వెతుక్కుంటూ డుమ్మా కొడుతున్నారు. హాజరు పట్టీలో సంతకాలు పెట్టడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని బయోమెట్రిక్ విధానం తీసుకువస్తే దానికి కూడా కొందరు వైద్యులు అడ్డదారులు వెతికారు. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని 12 మంది వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ఇతరులచే బయోమెట్రిక్ వేయించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వేలిముద్రలతో రబ్బర్ తొడుగులను తయారు చేయించి విధులకు హాజరు కాకుండా ఇతరులచే బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించినట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. దొడ్డి దారిన హాజరు వేసిన 12 మంది వైద్యులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. వీరిపై శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: (ప్రధానితో పవన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారంటే..!) -
ప్రోత్సహిస్తే సిరులే!
ఏజెన్సీలో రబ్బరు సాగుకు ప్రోత్సాహం కరువైంది. గతంలో ఈ పంటను పరిచయం చేసిన రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డుల నుంచి గత కొన్నేళ్లుగా సహకారం అందడం లేదని గిరి రైతులు వాపోతున్నారు. అనుకూలమైన వాతావరణం, అందుబాటులో మార్కెటింగ్ ఉన్నందున సాగు చేపట్టేందుకు చాలా మంది గిరి రైతులు ముందుకు వస్తున్నారు. సాగుకు సహకారం అందిస్తే నిలకడగా ఆదాయం పొందే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. రంపచోడవరం: రబ్బరు సాగుపై ఏజెన్సీ ప్రాంత గిరి రైతులు ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డు సంయుక్తంగా ఇప్పటికే మన్యంలో రబ్బరు సాగు చేపట్టాయి. రబ్బరు సాగుకు మారేడుమిల్లి, వై.రామవరం మండలాల వాతావరణం అనుకూలం. గతంలో రబ్బరు సాగును ఐటీడీఏ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. తరువాత కాలంలో రబ్బరు సాగుకు ఐటీడీఏ నుంచి సహకారం అందడం లేదని గిరి రైతులు వాపోతున్నారు. మొట్టమొదటిగా దేవరపల్లిలో.. మారేడుమిల్లి మండలంలోని దేవరపల్లి గ్రామం రబ్బరు సాగుకు అనుకూలమని గుర్తించిన రబ్బరు బోర్డు 1994లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో రబ్బరు మొక్కలు నాటించింది. ఆ గ్రామంలో 35 గిరిజన కుటుంబాలను భాగస్వామ్యులను చేసి మొక్కలను పెంచింది. రెండో దశలో 1998లో మారేడుమిల్లి మండలంలోని పూజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 45 హెక్టార్లలో రబ్బరు సాగు చేపట్టింది. గిరిజన రైతులు తమ భూముల్లో రబ్బరు మొక్కలను సంరక్షణ చేసుకునేందుకు రబ్బరు బోర్డు రోజు వారి కూలి చెల్లించి ప్రోత్సహించేది. మూడో దశలో పందిరిమామిడికోట గ్రామంలో 2009–2015 మధ్య 75 కుటుంబాలకు చెందిన100 హెక్టార్ల భూమిలో రబ్బరు మొక్కలు నాటింది. మంచి ఫలితాలు రావడంతో రంపచోడవరం ఐటీడీఏ రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. 2009 నుంచి 2010 వరకు దఫదఫాలుగా 10 వేల ఎకరాల విస్తీర్ణంలో రబ్బరు మొక్కలు నాటించింది. సాంకేతిక సలహాలు అందక.. భారీ విస్తీర్ణంలో రబ్బరు సాగు చేపట్టడం, వీటి మొక్కల పెంపకంలో గిరిజనులకు సరైన సాంకేతిక సలహాలు అందకపోవడంతో అనేక చోట్ల నాటిన రబ్బరు మొక్కలు చనిపోయాయి. చివరకు 2500 ఎకరాల్లో మాత్రమే రబ్బరు తోటలు ఉన్నాయి. రబ్బరు సాగు ద్వారా ఆర్థికంగా బలపడిన గిరిజన రైతులు రబ్బరు మొక్కలు పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. గత పదేళ్ల కాలం నుంచి గిరిజన రైతులు సొంతంగా రబ్బరు షీట్లు తయారు చేసి మార్కెట్ చేసుకుంటున్నారు. మారేడుమిల్లి రబ్బరు మంచి గిరాకీ.. మారేడుమిల్లి ప్రాంతంలో తయారు చేస్తున్న రబ్బరుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రబ్బరు షీట్ల అమ్మకంలో గిరిజన రైతులు మోసపోయే పరిస్థితి లేదు. రబ్బరు షీట్ల మార్కెట్ రేటును రబ్బరు బోర్డు అధికారులు రోజు ఆన్లైన్లో తెలియజేస్తారు. అదే రేటుకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. రబ్బరు సాగుకు చల్లని వాతారణం అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం ఎగువ ప్రాంతాలు సముద్రమట్టానికి ఎత్తుగా ఉండడంతో ఇక్కడ వాతావరణం అన్ని పంటలకు అనుకూలం. ఎకరాలో 200 వరకు రబ్బరు మొక్కలు నాటుకోవచ్చు. ఏటా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు రబ్బరు ట్యాపింగ్ (రబ్బరు పాలు సేకరణ)అనుకూలం. ఉదయం రెండు గంటల పాటు ఒకరు కష్టపడితే ఎకరా విస్తీర్ణంలో ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. రబ్బరు బోర్డు ఎత్తివేసే దిశగా..? ఏజెన్సీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నాటిన రబ్బరు మొక్కలు ప్రస్తుతం పాల సేకరణకు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రంపచోడవరంలోని రబ్బరు బోర్డు కార్యాలయాన్ని ఎత్తివేసే దిశగా కేంద్ర రబ్బరు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ పనిచేసే ఏడీ, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసింది. రంపచోడవరం రబ్బరు కార్యాలయంలో ప్రస్తుతం ఒక్క రికార్డ్ అసిస్టెంట్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఐటీడీఏ సహకారం అందించాలి పొలంలో రబ్బరు మొక్కలను నాటుకోవాలని ఉంది. అనేక సార్లు ఐటీడీఏ అధికారులను మొక్కలు అడిగాం. ఐటీడీఏ మొక్క లు సరఫరా చేస్తే రబ్బరు తోట వేసుకుంటాం. గ్రామంలో అనేక మంది రబ్బరు మొక్కలు పెంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఐటీడీఏ సహకారం అందించాలి. గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసుకుంటాం. అందుకు సహకారం అందించాలి. – కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడికోట రబ్బరు సాగును ప్రోత్సహించాలి ఏజెన్సీలో రబ్బరు సాగుకు అనుకూలమైన మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో రబ్బరు సాగుకు అధికారులు చర్యలు చేపట్టాలి. గిరిజనులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎంతో అవకాశం ఉన్న రబ్బరు సాగుపై మారేడుమిల్లి ప్రాంత గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. – దూడ స్మిత్ , మారేడుమిల్లి 40 ఏళ్లపాటు ఆదాయం రబ్బరుమొక్క నాటిన ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో పాల సేకరణ చేసుకోవచ్చు. రబ్బరు మొక్క 40 ఏళ్ల పాటు ఆదాయం ఇస్తుంది. మొక్కలను జాగ్రత్తగా పెంచుకుంటే ఎకరానికి రూ. లక్ష వరకు పొందవచ్చు. మణిపూర్ లాంటి చల్లని ప్రాంతంలో కొండల్లో కూడా రబ్బరు సాగు చేస్తున్నారు. పాడేరు , అరకులో వాతావరణ పరిస్థితులు రబ్బరు సాగుకు అనుకూలం. రంపచోడవరం ఐటీడీఏ నాటిన రబ్బరు మొక్కలు పాల సేకరణకు వచ్చాయి. ఇలాంటి సమయంలో రైతులకు రబ్బరు బోర్డు టెక్నీషియన్ల సహకారం అవసరం ఉంది. – సరిపల్లి సాల్మన్రాజు, ఫాం ఆఫీసర్, మణిపూర్ -
రబ్బరు రోడ్లు..
అనంతపురం విద్య: సహజ రబ్బరుతో రహదారుల నిర్మాణానికి సంబంధించి విస్తృత పరిశోధనలకు జేఎన్టీయూ(ఏ) వేదిక కానుంది. ఈ క్రమంలో వర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రహదారులు, రోడ్ల నిర్మాణాల్లో నూతన అంశాలపై పరిశోధనల ప్రక్రియ మొదలైంది. రబ్బరును వినియోగించే అంశంపై పరిశోధనలకు జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ కళాశాలలో ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు భారత రహదారుల మంత్రిత్వశాఖ అండగా నిలుస్తూ వచ్చే నాలుగేళ్ల కాలానికి రూ.1,75,23,000 మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రాజెక్ట్కు మెంటార్గా జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పీఆర్ భానుమూర్తి వ్యవహరించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ దక్కడంపై వర్సిటీ వీసీ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్ సి.శశిధర్ హర్షం వ్యక్తం చేశారు. -
ఇదో చిత్రమైన అలర్జీ
మీకు తెలుసా? కొందరిలో కొన్ని పదార్థాలతో వచ్చే అలర్జీలు మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఇందుకు ఓ ఉదాహరణ అరటి, కీవీ పండ్ల వల్ల వచ్చే అలర్జీ. మనకు చిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. సాధారణంగా కొందరిలో రబ్బర్ ఉత్పాదనలనుంచి అలర్జీ వస్తుంటుంది. ఉదాహరణకు చేతికి వేసుకునే రబ్బర్ గ్లౌవ్స్, షూస్, మాస్కులు, స్లిప్పర్ల వంటి ఎన్నెన్నో వస్తువులతో ఈ తరహా అలర్జీ కనిపిస్తుంది. దీని కారణంగా చర్మం ఎర్రబారడం, మేనిపై చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ రావడం మొదలుకొని, అవి చాలా తీవ్రంగానూ చర్మంపై పగుళ్ల రూపంలో కనిపించేలా ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. మరికొందరిలో రబ్బర్తో వచ్చే అలర్జీ రియాక్షన్ కనిపించగానే చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం జరుగుతుంది. ఈ రియాక్షన్ను అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్’ లేదా ‘బ్లాక్ రబ్బర్ ఫీట్’ అని అంటుంటారు. ఇలా రబ్బర్తో అలర్జీ ఉన్న కొంతమందిలో కాస్తంత అరుదుగానైనా అరటి, కీవీ పండ్ల వల్ల కూడా అలర్జీ కనిపించవచ్చు. అరటి, కివీ పండ్ల చెట్లు కూడా ఇంచుమించుగా రబ్బర్ మొక్క కుటుంబానికి చాలా దగ్గరి జాతివి కావడమే ఇందుకు కారణం. ఇలా అటు రబ్బర్కూ... ఇటు ఈ అరటి, కీవీ పండ్లకూ అలర్జీ కలిగి ఉండటాన్ని ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అని వ్యవహరిస్తారు. కేవలం ఆ కుటుంబానికి చెందిన పండ్లకు మాత్రమే కాకుండా... మరికొందరికి అవకాడో, చెస్ట్నట్, పీచ్, టొమాటో, ఆలూ, బెల్పెప్పర్, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లూ కూరగాయలతో కూడా అలర్జీ వస్తుంటుంది. వీటిల్లో లాటెక్స్ పాళ్లు లేనప్పటికీ కనిపించే ఈ రుగ్మతను కూడా ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అనే వ్యవహరిస్తారు. ఆయా పదార్థాలు వారికి సరిపడకపోవడమే ఇందుకు కారణం. -
చెత్తతో రబ్బరుకు మెరుగైన లక్షణాలు!
ఆహార వ్యర్థాలను ఎరువులుగా మార్చడం గురించి మనకు చాలాకాలంగా తెలుసు. చెత్త నుంచి ఇంతకంటే మేలైన ప్రయోజనాలు చేకూరితే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇదే పని చేస్తోంది ఓ సంస్థ. ఆహార వ్యర్థాలు కుళ్లిపోయే క్రమంలో వెలువడే వాయువులను ఉపయోగించుకుని మెరుగైన ఎలక్ట్రానిక్ సీలెంట్లు, సెన్సర్లను తయారుచేయవచ్చునని కంపెనీ గుర్తించింది. హెవియా బ్రాసిలినిసిస్ అనే చెట్టు కాండానికి గాట్లు పెట్టి సేకరించే పాలను శుద్ధి చేయడం ద్వారా రబ్బరు తయారవుతుందని మనకు తెలుసు. కార్బన్ బ్లాక్ను కలిపి రబ్బరును కాళ్లకు తొడుక్కునే బూట్ల నుంచి అనేక ఇతర వస్తువులను తయారుచేస్తారు. ఇలా కలపడం వల్ల దాని లక్షణాలు పెరుగుతాయని అంచనా. కానీ పర్యావరణానికి కొంత నష్టం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆహార వ్యర్థాల నుంచి వెలువడే మిథేన్ను వాడవచ్చునని అలైన్ ప్నికాడ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. మిథేన్ సాయంతో ఉత్పత్తి చేసే నానోగ్రాఫైట్ రేణువులను రబ్బరుతో కలిపినప్పుడు అది విద్యుత్తును బాగా నిరోధిస్తుందని తెలిసింది. అందువల్ల దీన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీలెంట్గా వాడవచ్చునని చెబుతున్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాల్చొద్దు..
కొచ్చిః కేరళ హైకోర్టు స్థానిక ప్రజలకు ప్రత్యేక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వంటి వస్తువులను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా, పౌర సంబంధిత సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ హెచ్చరించింది. బ్రీత్ ఈజీ కార్యక్రమంలో భాగంగా కేరళ హైకోర్టు ప్రత్యేక నిర్ణయం తీసుకొంది. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వస్తువులను తగులబెట్టడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక, అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అటువంటి పనులను నిషేధిస్తూ నిబంధనలను విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, అటువంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు సైతం సుమోటో కేసులను ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ బి. రాధాకృష్ణన్, అను శివరామన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడాన్ని నిషేధిస్తూ కోర్టు ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది. -
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
-
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. దొంగగా అనుమానించి ఓ యువకుడిని గొడ్డునిబాదినట్లు బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఫలితంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేయడంతోపాటు మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి ఓ యువకుడిని ఎత్వాహ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణ గదికి తీసుకెళ్లి టేబుల్ పై పడుకోబెట్టి ఆ యువకుడి తలను కదలకుండా ఓ పోలీసు మొకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చుని ఉంచగా.. మరోపోలీసు అతడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఓ దండనాయకుడి మాదిరిగా సివిల్ డ్రస్ లోఉండి బారెడు పొట్ట వేసుకున్న ఓ పోలీసు వచ్చాడు. చేతిలో బ్యాటులాంటిదానిని తీసుకున్నాడు. దానికి ఒక మందమైన రబ్బరు కూడా ఉంది. ఇక ఆ కుర్రాడు లబోదిబోమంటు కేకలు వేస్తున్నా దెబ్బమీదదెబ్బలతో ఫటాఫటా వాయించారు. ఆ వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనడం మాత్రం ఖాయం.


