revocation
-
హార్వర్డ్కు ఆరు షరతులు
వాషింగ్టన్: హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ఆంక్షలకు ట్రంప్ సర్కారు మరింగా పదును పెడుతోంది. హార్వర్డ్లో విదేశీ విద్యార్థుల ప్రవేశానికి వీలు కల్పించే యూనివర్సిటీ స్టూడెంట్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) సర్టీఫికేషన్ను తాజాగా రద్దు చేయడం తెలిసిందే. దాన్ని పునరుద్ధరించాలంటే ఆరు కఠినమైన షరతులను పాటించాలంటూ వర్సిటీపై ఒత్తిడి తెస్తోంది. ‘‘గత ఐదేళ్లలో విదేశీ విద్యార్థులు క్యాంపస్లో లేదా వెలుపల పాల్పడ్డ చట్టవిరుద్ధ, ప్రమాదకర, హింసాత్మక కార్యకలాపాలు, ఇతర విద్యార్థులపై లేదా సిబ్బందిపై బెదిరింపులు, క్యాంపస్లో లేదా బయట ఇతర క్లాస్మేట్స్ లేదా వర్సిటీ సిబ్బంది హక్కులను హరించడం వంటివాటికి సంబంధించిన అన్ని రికార్డులనూ తక్షణం ప్రభుత్వానికి అందజేయాలి. గత ఐదేళ్లలో వలసేతర తదితర విద్యార్థులందరికి సంబంధించిన క్రమశిక్షణ రికార్డులు సమరి్పంచాలి. క్యాంపస్లో వలసేతర విద్యార్థులు నిరసన కార్యకలాపాల్లో పాల్గొని ఉంటే అందుకు సంబంధించిన అన్నిరకాల ఆడియో, వీడియో ఫుటేజ్లు, అధికారిక, అనధికారిక రికార్డులన్నీ సమరి్పంచాలి’’అని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఇందుకు 72 గంటల గడువు విధించింది. ‘‘హింస, యూదు వ్యతిరేకత, క్యాంపస్లో చైనా కమ్యూనిస్ట్ పారీ్టతో సమన్వయం వంటి వాటికి హార్వర్డ్ బాధ్యత వహిస్తోంది. అందుకే విదేశీ విద్యార్థులను చేర్చుకునే అర్హత కోల్పోయింది. చట్టాన్ని పాటించడంలో విఫలమైంది. వర్సిటీపై దర్యాప్తు కొనసాగుతోంది. అందుకే సర్టీఫికేషన్ రద్దు చేశాం’’ అని డీహెచ్ఎస్ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ అన్నారు. హార్వర్డ్కు ఎస్ఈవీపీ సర్టీఫికేషన్ రద్దుపై ఫెడరల్ కోర్టు తాజాగా స్టే విధించింది.వర్సిటీ మారాల్సిందే ట్రంప్ సర్కారు నిర్ణయం హార్వర్డ్లో చదువుతున్న 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. వీరిలో 788 మంది భారతీయులున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టీఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. కోర్సుల మధ్యలో ఉన్నవారు మాత్రం ఇతర వర్సిటీల్లోకి మారాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన హోదా కోల్పోయి దేశ బహిష్కరణకు గురవుతారని నోయెమ్ స్పష్టం చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి హార్వర్డ్లో ప్రవేశం దొరికిన 6,800 మంది విదేశీ విద్యార్థులకు కూడా నిరాశ తప్పనట్టే. చట్ట విరుద్ధం: హార్వర్డ్ ప్రభుత్వానికి ప్రతీకార చర్య అంటూ హార్వర్డ్ మండిపడింది. ‘‘ఇది చట్టవిరుద్ధం. వర్సిటీకి తీవ్ర హాని కలిగించే నిర్ణయం’’అని విమర్శించింది. వర్సిటీకి నిధులను స్తంభింపజేయడం, అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హ క్కును రద్దు చేయడంపై కోర్టులో దావా వేసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని, ప్రభుత్వ అధికార పరిధికి మించినదని ఆరోపించింది. ‘‘140 పై చిలుకు దేశాల నుంచి వచ్చే విద్యార్థులు, పండితులకు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం హార్వర్డ్ది. దాన్ని సజావుగా కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విదేశీ ప్రతిభావంతులు వర్సిటీని, దేశాన్ని సుసంపన్నం చేస్తా రు. ప్రభుత్వ ప్రతీకార చర్య వర్సిటీ హార్వర్డ్ విద్య, పరిశోధన లక్ష్యాలను దెబ్బతీస్తుంది. అమెరికాకు కూడా తీవ్ర హాని కలిగించే ప్ర మాదముంది’’అని హార్వర్డ్ ప్రతినిధి జాసన్ న్యూటన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత విద్యార్థులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నట్టు చెప్పారు.విమర్శల వెల్లువ హార్వర్డ్పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం (ఎస్ఏఏ)తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్నివిధాలా సాయమందిస్తామని ఎస్ఏఏ ప్రకటించింది.నష్టం అమెరికాకే: భుటోరియా ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విద్యా సలహాదారు అజయ్ భుటోరియా తీవ్రంగా తప్పుబట్టారు. భారత విద్యార్థుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా ఏకంగా 900 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతోందని ఆయన గుర్తు చేశారు. ‘‘ఇన్నొవేషన్, టెక్నాలజీ, వైద్య తదితర రంగాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండటం వెనక భారత విద్యార్థుల కృషి ఎనలేనిది. ఇలాంటి అణచివేత చర్యలను అమెరికన్లు కూడా హర్షించడం లేదు. వారు కోరుకుంటున్నది ఇలాంటి దేశాన్ని కాదు’’అని స్పష్టం చేశారు. ‘‘ప్రతిభావంతులైన భారత విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేదు. వారికి రెడ్కార్పెట్ పరిచేందుకు బ్రిటన్, కెనడా తదితర దేశాలు సిద్ధంగా ఉన్నాయి. వారిని ఇలా వెళ్లగొడితే అంతిమంగా తీవ్రంగా నష్టపోయేది అమెరికానే’’అని హెచ్చరించారు. విదేశీ విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్లో పోరాడాలని డెమొక్రాట్లకు పిలుపునిచ్చారు. -
111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?
సాక్షి, హైదరాబాద్: సుదూర ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు ఏటా వలస వచ్చే రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగు కానుందా? జీవో 111 ఎత్తివేతతో సుందర జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, కాంక్రీట్ మహారణ్యం పెరిగి.. శబ్ద, వాయు కాలుష్యం, పక్షుల సహజ ఆవాసాలైన జలాశయాలను కాలుష్య కాసారంగా మార్చేయనుందా? ఈ ప్రశ్నలకు పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు అవుననే సమాధానమిస్తున్నారు. ► సైబీరియా.. యూరప్.. ఆఫ్రికా.. మయన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి జంట జలాశయాలకు ఏటా అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి ప్రజాతులు తరలివస్తాయి. హిమాయత్సాగర్కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస రావడం పరిపాటే. మొత్తంగా ఈ జలాశయానికి 52 రకాలు, ఉస్మాన్సాగర్కు 92 రకాల పక్షి జాతులు వలస వస్తాయి. ► జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడిన పక్షంలో వలస పక్షులకు సమీప భవిష్యత్లో గడ్డు పరిస్థితులు తప్పవని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులకూ ఇక్కట్లేనని చెబుతున్నారు. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలసవచ్చే బార్హెడ్గూస్ (బాతు) జాడ కూడా కనిపించదని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి రాక ఉండదని చెబుతున్నారు. వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్టెయిల్డ్ డక్(బాతు), షౌలర్,గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్లింక్స్, భార్మెడోగూస్ బాతు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు తదితర జాతులున్నాయి. (క్లిక్: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..) నగరీకరణ, కాలుష్యం పెరిగితే కష్టమే జంటజలాశయాల చుట్టూ సమీప భవిష్యత్లో పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలకు అవకాశం ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే పక్షిజాతుల జాడ కనిపించదు. జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం -
నకిలీ విత్తనాలమ్మితే షాప్ లైసెన్స్ రద్దు
ఎరువుల దుకాణాల తనిఖీలో జేడీఏ మణిమాల గార్ల : నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎరువులు, పురుగులమందు దుకాణాల లైసెన్స్లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏ) పి.మణిమాల దుకాణాల డీలర్లను హెచ్చరించారు. ఇటీవల గార్ల మండలంలో నకిలీ విత్తనాలను వ్యాపారులు విక్రయించారని, వాటిని విత్తుకుంటే నారు మొలవలేదని పలువురు రైతులు సదరు విత్తన ప్యాకెట్లను జేసీ దివ్యకు చూయించి, న్యాయం చేయాలని వేడుకున్నారు. జేసీ ఆదేశాలతో జేడీఏ సోమవారం గార్లలోని ఎరువుల, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేసి.. స్టాక్ రికార్డులను పరిశీలించి, గోదాంలను సందర్శించారు. ఎరువుల ధరల పట్టిక లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం తగ్గించిన ధరలకే ఎరువులను అమ్మాలని, ఎవరైనా అధిక రేట్లకు అమ్మితే ఫోన్ద్వారా రైతులు ఫిర్యాదు చేయొచ్చని, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. ఆమె వెంట ఏఓ పి.నాగయ్య ఉన్నారు.