-
పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..
ఛత్తర్పూర్/సత్నా/నీముచ్(మధ్యప్రదేశ్): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్, సత్నా, నీముచ్లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు. ‘వాహనం మనల్ని రివర్స్గేర్లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్ పారీ్టకి సుపరిపాలనను రివర్స్గేర్లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్ఖండ్లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు. బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నకిలీలను తొలగించాం ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది. అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు. -
రివర్స్ గేర్లో 75 కి.మీ.లు
కర్ణాటక: ట్రాక్టర్ను రివర్స్లో నడుపుతూ ఓ యువకుడు తమ ఇలవేల్పు యల్లమ్మ దేవికి మొక్కుబడి తీర్చుకున్నాడు. హుబ్లీ తాలూకా మంటూరు గ్రామానికి చెందిన బాబుగౌడ(22) అనే ఈ భక్తుడు గత కొన్నేళ్లుగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. అయితే రివర్స్ గేర్లో ఇలా 75 కి.మీ. వెళ్లడం ఇదే మొదటిసారి అని, కోర్కె తీరడంతో మొక్కు తీర్చానన్నాడు. ఆ మేరకు ఉదయం 6.15 గంటలకు మంటూరు వలంబేశ్వర దేవస్థానం నుంచి రివర్స్ గేర్లో బయల్దేరాడు. కుసుగల్, బ్యాహట్టి, తిర్లాపుర, అళగవాడి, హంచనాళ, తిక్కుంబి, హిరేకుంబి, ఉగరగోళ, సౌదత్తికి వెళ్లి అక్కడి నుంచి యల్లమ్మన గుడ్డను మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకొన్నాడు. మొత్తం 75 కి.మీ.ల దూరాన్ని 7.30 గంటల్లో ప్రయాణించాడు. -
ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..
వృద్ధాప్యం! ఆ వయసులో ఎదుర్కొనే సమస్యలు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆ వయసు సమీపించే సమయంలో కూడా ఫిట్గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా ఏదో ఒకరకంగా మనలో ఆ వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. ఐతే దానికి చెక్పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. హర్వర్డ్ శాస్త్రవేత్తల బృందం వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ఓ సరికొత్త రసాయన కాక్టెయిల్ని కనిపెట్టింది. వారంతా ఈ కాక్టెయిల్ని మానవులు, ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్ని చాలా ఏళ్లు వెనక్కి నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను "రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్ టు రివర్స్ సెల్యులర్ ఏజింగ్" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్ పరిశోధకుడు డేవిడ్ సింక్లైర్ జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. "జన్యు చికిత్స ద్వారా రివర్సల్ ఏజింగ్ సాధ్యమవుతుందని భావించాం. ఇప్పుడూ ఈ కెమికల్ కాక్టెయిల్స్తో అది సాధ్యమని చూపించాం. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక ముందడగు అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ రసాయన కాక్టెయిల్లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునర్జ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేశారు. ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతులపై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని ధీమగా చెబతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్త సింక్లైర్. (చదవండి: ఇది చినుకు కాలం.. జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరంతో జాగ్రత్త!) -
వాహన అమ్మకాలు రివర్స్గేర్లోనే..
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం రివర్స్గేర్లోనే పయనిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ గతనెల్లో 13,888 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఇదే విధంగా మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ తగ్గుదలను ప్రకటించాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోగా.. వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్ లేలాండ్ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగిన కారణంగా ఆ నెల్లో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్ను ప్రకటించడం తెలిసిందే. -
‘హీరో’ రివర్స్ గేర్!
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో రూ. 6 వేల కోట్లతో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన హీరో మోటోకార్ప్ సంస్థ ఇప్పుడు రివర్స్ గేర్లో నడుస్తోందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడంతో పక్క చూపులు చూస్తోందా? అంటే అవునంటున్నాయి అధికారవర్గాలు. కేంద్రం ‘ప్రత్యేక హోదా’ ఇస్తే ఎలాంటి రాయితీలు వస్తాయో.. అలాంటి రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ తాజాగా ఆ సంస్థ షరతు పెట్టడం ఇందుకు బలం చేకూర్చుతోంది. పారిశ్రామికాభివృద్ధిపై రోజూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉన్నా.. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఏర్పాటుకాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం తన సొంత జిల్లాలో హీరో పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని పట్టుదలతో ఉన్నారు. కానీ, ఆ సంస్థ నుంచి ఉలుకూపలుకూ లేకపోవడం గమనార్హం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో చంద్రబాబు దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఆటోమొబైల్ హబ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హీరో పరిశ్రమ ఆటోమొబైల్ హబ్కు ఊతమిస్తుందంటూ ప్రభుత్వం పేర్కొంది. ఆటోమొబైల్ విధానం ప్రకటించినా.. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం దాసకుప్పం వద్ద హీరో సంస్థకు 650 ఎకరాల భూమిని గతేడాది సెప్టెంబరు 16న కేటాయించింది. ఈ పరిశ్రమకు రాయితీలు కల్పిం చాలన్న ప్రధాన లక్ష్యంతో ఆటోమొబైల్ విధానాన్ని డిసెంబర్ 1న ప్రభుత్వం విడుదల చేసింది. పరిశ్రమకు యూనిట్ విద్యుత్ను 75 పైసలు చొప్పున సరఫరా చేసేందుకు సర్కారు అంగీకరించింది. 20 ఏళ్ల పాటు పరిశ్రమకు వ్యాట్ నుంచి మినహాయింపును ఇచ్చింది. పదేళ్ల పాటు వంద శాతం సీఎస్టీని రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చింది. పది శాతం రాయితీపై భూమి, పెట్టుబడి రాయితీ పది శాతం, ఐదు శాతం వడ్డీ రాయితీ, ఉచితంగా డబులైన్ రోడ్డు, 50 శాతం రాయితీపై నీటిని సరఫరా చేస్తామని ఆటోమొబైల్ విధానంలో పేర్కొంది. అధికారం చేపట్టి ఏడాది పూర్తయ్యే జూన్ 8లోగా కనీసం హీరో పరిశ్రమకైనా శంకుస్థాపన చేయాలని సీఎం భావించారు. పక్క రాష్ట్రాల వైపు చూపు.. తొలి దశలో రూ. 2,200 కోట్లతో ఏడాదికి 1.8 మిలియన్ వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమకు శంకుస్థాపన చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు హీరో సంస్థ అంగీకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఆటోమొబైల్ విధానాలు మెరుగ్గా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాకనే పరిశ్రమ పనులను ప్రారంభిస్తామని, లేదంటే అలాంటి రాయితీలు ఇప్పుడిచ్చినా పరిశ్రమ స్థాపిస్తామని హీరో ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇదే అదనుగా తమిళనాడు ప్రభుత్వం హీరో సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా చేకూరే లబ్ధిని తామే కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనపై ‘హీరో’సానుకూలంగా ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement