breaking news
relay fastings
-
వికేంద్రీకరణ మద్దతుగా కడపలో రీలే నిరాహార దీక్షలు
-
రైల్వే ఓవర్బ్రిడ్జ్ దిగ్బంధం
సాక్షి, మంచిర్యాలరూరల్(హాజీపూర్) : న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సాక్షర భారత్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్బ్రిడ్జ్ను బుధవారం ది గ్బంధించారు. మండల, గ్రామ కో ఆర్డినేటర్లు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవా రం 16వ రోజుకు చేరాయి. దీక్షలో భాగంగా జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జ్ దిగ్భంధించారు. జిల్లాలోని 18 మండలా లకు చెందిన మండల, గ్రామ కో ఆర్డినేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోనాలు నెత్తిన పెట్టుకుని బతుకమ్మలతో తరలివచ్చారు. ఓవర్బ్రిడ్జ్ వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ నిరసన చేపట్టారు. పురుష ఉద్యోగులు అసైదులా ఆటలు ఆడుతూ రోడ్లపై శీర్షాసనాలు వేశారు. దిగ్భంధం దాదాపు గంటకు పైగా సాగింది. దీంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని సూచించారు. ఉద్యోగులు ససేమిరా అనడంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎంసీఓల సంఘం రాష్ట్ర సభ్యుడు మహేందర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా వీసీఓల అధ్యక్షుడు బోరె శ్రీనివాస్, ఎంసీఓలు, వీసీఓలు లత, సంధ్య, రాజేశం, శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు. -
పదో రోజుకు రిలే దీక్షలు
తుని : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే దాడిశెట్టి ఆధ్వర్యంలో స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం పదో రోజుకు చేరాయి. కోటనందూరు మండలం బొద్దవరం, తొండంగి మండలం దానవాయిపేట, ఎ.కొత్తపల్లి పంచాయతీల పరిధిలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. వారికి పార్టీ తుని పట్టణ శాఖ అ«ధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. రిలే దీక్షలో బొద్దవరానికి చెందిన దొడ్డి బాబ్జీ, సుర్ల నానాజీ, వేగి అప్పలనాయుడు, సుర్ల అప్పలనాయుడు, యల్లపు దొరబాబు, లగుడు వరహాలు, యల్లపు రామసూరి, మళ్ల శ్రీను, యల్లపు రాము, తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మేరుగు ఆనందహరి, యనమల నాగేశ్వరరావు, గరికిన రాజు, మొసా సత్తిబాబు, అంగుళూరి శ్రీను, మడదా శ్రీనివాసరావు, మారేటి లక్ష్మణరావు, కుక్కా నాగరాజు, పిరాది గోపి, పి.పోలారావు, నేమాల రామకృష్ణ, అంబుజాలపు అచ్చారావు, ఎ.కొత్తపల్లికి చెందిన వనపిర్త సూర్యనారాయణ, సాపిశెట్టి చిన్న, వడ్లమూరి కృష్ణ, బెక్కం చంద్రగిరి, గర్లంక బాబ్జీ, డి.నాగు, మెయ్యేటి సత్యానందం, వనపర్తి రాఘవ, శివకోటి శేషారావు, గణ్ణియ్య, వెలుగుల చిట్టిబాబు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దీక్షలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. అందరూ సమష్టిగా పోరాటం చేయకపోతే భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏకతాటిపై పోరాటం చేస్తే ఢిల్లీ పెద్దలు దిగివస్తారని నాయకులు స్పష్టం చేశారు. పదో రోజు దీక్ష చేస్తున్న వారికి పార్టీ నాయకులు షేక్ ఖ్వాజా, అనిశెట్టి నాగిరెడ్డి, కీర్తి రాఘవ, కుసనం దొరబాబు, నాగం గంగబాబు, గాబు రాజబాబు, బర్రే అప్పారావు, చోడిశెట్టి పెద్ద, వాసంశెట్టి శ్రీను, షేక్ బాబ్జి, కొప్పన రాజబాబు తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. -
నూజివీడులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు
నూజివీడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైయ్యాయి. నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలలో మున్సిపల్ చైర్పర్సన్ బసవ రేవతి, కౌన్సిలర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.