breaking news
real sector
-
లబ్ధిదారులకు SBI శుభవార్త
-
ఇంకా స్తబ్ధతే!
► కుదుట పడని రియల్ రంగం ► పది శాతం పడిపోయిన పురోగతి ► ఆదాయంలో రూ.కోట్లలో వెనకంజ ► కొత్త జిల్లాల్లో పెరగని దస్తావేజులు ► నోట్ల రద్దు, నగదు పరిమితే కారణం సాక్షి, నిర్మల్ : పెద్ద నోట్ల రద్దు కారణంగా గతేడాది నవంబర్ నుంచి రియల్ రంగం పై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే కొత్త నోట్ల రాక, మార్కెట్లో వాటి చలామణి సాధారణ స్థాయికి వస్తున్నప్పటికీ రియల్ రంగంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా రూ.2 లక్షలకు పైబడిన వ్యవహారాల్లో నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండడంతో రియల్ రంగం కుదుటపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొనుగోలుదారులు అంతకుమించిన నగదు వ్యవహారాలు సాగిస్తే దానికి సంబంధించి పక్క ఆధారాలు చూపించాల్సి పరిస్థితి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు పడటం లేదని, తద్వారా దస్తావేజులు, ఆదాయం పరంగా రిజిస్ట్రేషన్ల శాఖకు తిరోగమనం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పురోగతిలో తిరోగమనం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలలో ఉన్నాయి. 2015 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా మొత్తంగా 41,495 దస్తావేజులు కాగా, రూ.65.68 కోట్ల ఆదాయం లభించింది. అదే 2016లో ఆ 12 నెలల కాలంలో 40,861 దస్తావేజులు కాగా, రూ.59.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండేళ్ల పరంగా పురోగతిని చూస్తే 2015 కంటే 2016లో పురోగతి 10 శాతం తిరోగమనంలో ఉండగా ఆదాయం పరంగా రూ.5.69 కోట్ల వెనకంజలో ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ పరంగా వార్షిక ఆదాయం ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలై మార్చితో ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరంలో మరో నెల మార్చి మిగిలి ఉండగా వార్షిక ఆదాయం పరంగా సుమారు రూ.15 కోట్ల వెనకంజలో ఉంది. ఈ ఆదాయాన్ని ఈ ఒక్క నెలలో అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది. జనవరి నెలలో ఉమ్మడి జిల్లా మొత్తంగా రూ.2.70 కోట్ల ఆదాయం లభించింది. మార్చిలో మరో మూడు కోట్ల ఆదాయం వస్తుందని అనుకున్న వార్షిక లక్ష్యాన్ని అందుకోవడం నష్టంగానే కనిపిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడినా... కొత్త జిల్లా ఏర్పడక ముందు మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో రియల్ రంగం జోరుగా సాగింది. మంచిర్యాల ప్రాంతంలో ప్రతీ రోజు 60 దస్తావేజులు, నిర్మల్ ప్రాంతంలో 40 దస్తావేజుల వరకు జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంచిర్యాల జిల్లా ఏర్పాటు జరుగడం ఖాయంగా ఉండడం, ఆ ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు, జైపూర్ పవర్ప్లాంట్ కింద భూ నిర్వాసితులకు ముంపు కింద భారీగా పరిహారం రావడం అక్కడ గత మూడు, నాలుగేళ్లుగా రియల్ రంగం జోరుగా సాగింది. అయితే కొత్త జిల్లా ఏర్పాటు తరువాత క్రమంగా ఇక్కడ దస్తావేజుల సంఖ్య తగ్గుతూ రోజుకు 40 వరకు వచ్చింది. నోట్ల రద్దు తరువాత ఈ సంఖ్య మరింత తగ్గింది. గత సెప్టెంబర్ ముందు నుంచి నిర్మల్ జిల్లా ఏర్పాటు మీద ఉద్యమం సాగగా, అక్టోబర్లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్మల్ జిల్లాను కూడా ప్రకటించారు. ఆ సమయంలో నిర్మల్ జిల్లాలో భూముల రేటు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా క్రయవిక్రయాలు సంఖ్య పెరిగి దస్తావేజులు రోజుకు 40 వరకు జరిగాయి. అయితే ఇక్కడ భూముల రేట్లను రెండు, మూడు ఇంతలు, అంతకంటే ఎక్కువ పెంచడంతో ఆ తరువాత క్రమంలో కొనుగోలులో స్తబ్ధత నెలకొంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 15కు పడిపోయింది. ఆదిలాబాద్ నాలుగేళ్లుగా రియల్ పరంగా సబ్ధత నెలకొంది. ఒక్కప్పుడు రోజుకు 40 దస్తావేజులు కాగా ప్రస్తుతం 20 నుంచి 30 వరకు అవుతున్నాయి. ఆసిఫాబాద్లో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇదిలా ఉంటే మరో ఏడాది వరకు రియల్ రంగంలో పురోగతి ఉండకపోవచ్చునని అధికారులతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో నోట్ల చెలామణిపై పరిమితుల నేపథ్యంలో మునపటి పరిస్థితిని అందుకోవడం ఆశామాషీకాదని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో దస్తావేజులు, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజుల ఆదాయం (ఏప్రిల్–మార్చి) సంఖ్య రూ.కోట్లలో) 2014–15 30,104 55.71 2015–16 45,870 60.42 2016–17(జనవరి వరకు) 31,527 45.43 -
తూర్పు వర్సెస్ పశ్చిమం!
‘‘హైదరాబాద్లో రియల్ రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే.. పట్టాలపై మెట్రో పరుగులు తీయాలి. లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి. ఈ రెండు ప్రాజెక్ట్లతో తూర్పు, పశ్చిమ హైదరాబాద్లో రియల్ పరుగులు పెడుతుందని’’ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎండీ నర్సయ్య చెప్పారు. నిర్మాణ రంగంలో రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. - సాక్షి, హైదరాబాద్ హాట్ స్పాట్స్ ఉప్పల్, నాగోల్, పోచారం, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, సాగర్ రోడ్డు, హయత్నగర్, వరంగల్ హైవే, ఆదిభట్ల. గచ్చిబౌలి, మణికొండ, నానక్రాంగూడ, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, నలగండ్ల, తెల్లాపూర్, కూకట్పల్లి, హైదర్నగర్, మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి. స్థిరాస్తి రంగంలో ఉప్పల్, గచ్చిబౌలి మధ్య పోటాపోటీ ఈస్ట్జోన్కు మెట్రో.. వెస్ట్ జోన్కు ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ల దన్ను తూర్పు హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మెట్రో రైలు తొలిసారిగా పరుగులు పెట్టేది తూర్పు హైదరాబాద్ నుంచే. ఇప్పటికే ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది కూడా. మరోవైపు పరిశ్రమల నుంచి పరిశోధన సంస్థల వరకు, ఆసుపత్రుల నుంచి వినోద కేంద్రాల వరకు అన్ని రంగాలకూ వేదిక తూర్పు హైదరాబాద్. ప్రత్యేకించి ఎన్జీఆర్ఐ, సీసీఎంబీ, ఐఐసీటీ, సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరెటరీ వం టి కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలకు చిరునామాగా నిలుస్తుంది. జెన్ప్యాక్ట్, ఇన్ఫోసిస్, మైండ్స్పేస్ వంటి ఐటీ కంపెనీలూ ఉన్నాయిక్కడ. పశ్చిమ హైదరాబాద్ ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, కేపీవో ఆర్థిక సంస్థలకు చిరునామా. లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులతో నిత్యం కిటకిటలాడే ప్రాంతం నగరాభివృద్ధిలో కీలకంగా మారింది. గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ మీదుగా సులువుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు కూడా. అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలకిక్కడ కొదవేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కళ్లు మిరుమిట్లుగొలిపే కొత్త ప్రపంచమిది. పాశ్చాత్య, మెట్రో నగరాలను తలదన్నేలా పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. ఐటీఐఆర్: నగరం చుట్టూ 50 వేల ఎకరాల్లో మొత్తం 202 చ.కి.మీ పరిధిలో హైదరాబాద్ ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ కింద ఐటీ ఆధారిత సర్వీసులు, హార్డ్వేర్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నారు. క్లస్టర్-3లో భాగంగా ఉప్పల్, పోచా రం ప్రాంతాల్లో 10.3 చ.కి.మీ. పరిధి లో ఐటీఐఆర్ రానుంది. ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి.మీ., గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి.మీ. పరిధిలో కూడా ఐటీఐఆర్ రానుంది. కారిడార్-3లో నాగోల్-శిల్పారామం మధ్య 28 కి.మీ మేర మెట్రో రైలు రానుంది. మొత్తం 23 స్టేషన్లుంటాయి. ఇప్పటికే నాగోల్ నుంచి మెట్టుగూడ.. 8 కి.మీ. దూరం మెట్రో ట్రయల్ రన్ పెడుతోంది. ఈ మార్గంలో హబ్సిగూడ, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియాల్లో మెట్రో స్టేషన్లుంటాయి. మిగతా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ఇటు సికింద్రాబాద్కు, అటు హైటెక్సిటీకి ప్రయాణ సమయం తగ్గుతుంది. కారిడార్-1లో మియాపూర్- ఎల్బీనగర్ మధ్య 29 కి.మీ మెట్రో రైలు రానుంది. మొత్తం 27 స్టేషన్లుంటాయి. ప్రస్తుతమున్న మెట్రో రైలును శిల్పారామం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకూ, మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా పొడిగించే విషయమై మెట్రో అధికారులు ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే పశ్చిమ హైదరాబాద్ రూపురేఖలు మారుతాయనడంలో సందేహం లేదు. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ఘట్కేసర్ పాయింట్) 6 కి.మీ. దూరం మాత్రమే ఉండటంతో శంషాబాద్ విమానాశ్రయానికి, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే సరైంది. అలాగే హబ్సిగూడ నుంచి బోగారం జంక్షన్ 19 కి.మీ. భూ సేకరణ, రోడ్డు విస్తరణ పనులు, సర్వే ఆఫ్ ఇండియా నుంచి మేడిపల్లి 12 కి.మీ. పరిధిలో భూ సేకరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నగరం మొత్తాన్ని కలుపుతూ నిర్మించిన ఔటర్ రింగ్రోడ్డు. 22 కి.మీ. గల గచ్బిబౌలి-శంషాబాద్ రోడ్డు, 23.7 కి.మీ. గల నార్సింగి-పటాన్చెరు రోడ్డు పశ్చిమ హైదరాబాద్ మీదుగానే వెళుతుంది. గచ్చిబౌలిలో ఓఆర్ఆర్ నుంచి నగరం చుట్టూ 125 కి.మీ. వరకూ సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ధరల్లో తేడా.. రియల్ రంగంలో తూర్పు, పశ్చిమ హైదరాబాద్ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నా.. ధరల్లో మాత్రం పశ్చిమ హైదరాబాద్ ముందుంది. ఎందుకంటే ఐటీ, ఫైనాన్షియల్ హబ్ల కారణంగా ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం. పశ్చిమ హైదరాబాద్లో విల్లాలకు, లగ్జరీ ఫ్లాట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. చ.అ.కు సుమారు రూ.3,800 నుంచి చెబుతున్నారు. ప్రాంతం, బిల్డరు, సౌకర్యాలు, నిర్మాణ ప్రత్యేకతలను బట్టి అంతిమ ధర మారుతుంటుంది. తూర్పు హైదరాబాద్: ఇది మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ప్రాంతం. మాళ్లు, మల్టీప్లెక్స్లతో ఇప్పుడిప్పుడే ఇది ఉన్నత శ్రేణి ప్రాంతంగా వృద్ధి చెందుతోంది. ఇక్కడ చ.అ. రూ.2,300 నుంచి చెబుతున్నారు.